Laxmi parvathi
-
కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారు: లక్ష్మీ పార్వతి
విశాఖపట్నం: చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోతున్నారని వైఎస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి అన్నారు. చంద్రబాబు అండ్ కొ సంఘ విద్రోహులని మండిపడ్డారామె.బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఎన్టీఆర్ వెన్నుపోటులో పురందేశ్వరి ప్రధాన పాత్ర పోషించింది. నేతి బీరకాయలో నెయ్యి లాంటిది పురందేశ్వరి మంచితనం. పురందేశ్వరి కూడా చంద్రబాబు లాంటి మనిషే. ఎఫ్ఐఆర్లో వైఎస్సార్ పేరును చేర్చిన కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడం ఏమిటి..?. వీరందరినీ చంద్రబాబు ఆడిస్తున్నారు. రాజకీయ నీచుడు చంద్రబాబు. చంద్రబాబు కంటే సీఎం జగన్ అధిక పెట్టుబడులు తీసుకొచ్చారు. ఏపీ అభివృద్ధిలో విశాఖ కీలకం. ఏం మాట్లాడాలో అర్ధంకాక బాబు ఇచ్చిన స్క్రిప్ట్ మోదీ చదివారు. సీఎం జగన్ను గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలి అంటే సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి రావాలి. నేను రాష్ట్రం మొత్తం తిరిగాను. గీతం మూర్తి ఎన్టీఆర్ వెన్నుపోటులో కీలక పాత్ర పోషించిన దుర్మార్గుడు. గీతం భరత్ను ఓడించాలి. గీతం అంటేనే భూ కబ్జాలు. ఏయూను నాశనం చెయ్యాలనే ఉద్దేశంతోనే గీతంను అభివృద్ధి చేశారు’ అని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. -
‘టీడీపీ నుంచి చంద్రబాబును కార్యకర్తలే తరిమేయాలి’
సాక్షి, విజయవాడ: రెండు ఎకరాలున్న చంద్రబాబు రూ. 6 లక్షల కోట్లకు అధిపతి ఎలా అయ్యారు? అని వైఎస్సార్సీపీ నేత నందమూరి లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు. విజయవాడలో శుక్రవారం లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయటం మనం చూశామని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా స్థాపించిన టీడీపీని ఆ పార్టీకే తాకట్టుపెట్టాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఎందుకు ఓట్లు వేయాలి? అని లక్ష్మీ పార్వతి నిలదీశారు. అధికారం కోసం ఎవరి కుటుంబంలోనైనా చిచ్చుపెట్టే వ్యక్తి చంద్రబాబు అని ఆమె ధ్వజమెత్తారు. చంద్రబాబది నీచమైన వ్యక్తిత్వమని ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు వలన రాష్ట్ర ప్రజలకు ఏ ప్రయోజనమైనా చేకూరిందా?. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఇప్పుడు ఎలా ఉంది?. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆనాడు ఎన్టీఆర్ టీడీపీని పెట్టారు. చంద్రబాబు దుర్మార్గాలను టీడీపీ కార్యకర్తలు గ్రహంచాలి. చంద్రబాబు లాంటి వ్యక్తి ఏ కుటుంబంలోనూ ఉండకూడదని ఎన్టీఆర్ అన్నారు. టీడీపీలో నుండి కార్యకర్తలే చంద్రబాబును తరిమేయాలి. ఎల్లోమీడియాని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కోర్టుల్లోని కేసులను కూడా చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయటంలో చంద్రబాబు దిట్ట. అలాంటి వ్యక్తి వలన ప్రజలకు ఉపయోగం లేదు. బీజేపీ అధికారంలోకి వస్తుందని మోదీ పార్లమెంటులో చెప్పగానే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. గంటసేపు ఢిల్లీలో చంద్రబాబు కనపడలేదు, వెంటనే ఒక ఫేక్ సర్వే బయటకు వచ్చింది. అలాంటి వ్యవహారాలు చేయటంలో చంద్రబాబు దిట్ట. ఎన్నికలు వస్తుండటంతో రకరకాల వేషాలతో వస్తున్నారు. వారందరికీ నాయకుడే చంద్రబాబే. ఎన్టీఆర్కీ, పిల్లలకీ మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తి చంద్రబాబు’ అని లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. ‘ఇప్పుడు జగన్ కుటుంబంలో చంద్రబాబు చిచ్చు పెట్టాడు. పేదల అభివృద్ధి కోసం జగన్ ఎంత చేస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. చంద్రబాబు ఏనాడైనా పేదలను పట్టించుకున్నారా?. విద్య, వైద్యరంగంలో ఎన్ని మార్పులు వచ్చాయో చూశాం. జగన్ లాంటి వ్యక్తిని మళ్ళీ సీఎం చేసుకోవాలి. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుని అమిత్ షాతో కలవలేదు. కలిస్తే ఆ ఫోటో చూపించాలి. చంద్రబాబు అందరికీ ఒంగిఒంగి నమస్కారాలు పెడుతున్నారు. ..చంద్రబాబుకు గెలుపు మీద ఆశలు లేవు. అందికే అన్నిసీట్లనూ కూడా బీజేపీకి ఇచ్చేందుకు కూడా సిద్దపడ్డారు. కేసుల నుంచి తప్పించుకోవటానికి చంద్రబాబు బీజేపీతో కలవబోతున్నారు. టీడీపీకి ఈ ఎన్నికలతో ఎండ్ కార్డు పడుతుంది. షర్మిళ దారి తప్పిన బాణం. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు చదవటమే షర్మిళ పని. చంద్రబాబు, జనసేన మధ్య ఇప్పటికీ సయోధ్య లేదు’ అని లక్ష్మీ పార్వతి ధ్వజమెత్తారు. -
చంద్రబాబు అవినీతి ప్రస్థానం
‘‘ఎక్కడి నీచు లెక్కడి హీనులెంతటి తులువలు / ఎంతటి భ్రష్టు లెచ్చటి దుష్టు లెక్కడి నష్టజాతకులీ నాయకులు / నా తెలుగు జాతికి శాపంగా దాపురించారో’’ అంటారు మహారథి. ఈ మాట అక్షరాలా మన నారా చంద్రబాబు నాయుడికి వర్తిస్తుంది. మధిర సుబ్బన్న దీక్షితులు రాసిన కాశీమజిలీ కథల్లో పాఠకులను భయపెట్టే ఒక మహావట వృక్షం ఉంటుంది. అంతకంటే భయంకరమైన అవినీతి వృక్షం తెలుగు జాతికి సంక్రమించింది. ఒకే పెరడులో పెరిగి శాఖోపశాఖలుగా విస్తరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ఎదగనీయకుండా వ్యవస్థల్ని కూడా భయపెడుతున్న ఈ ‘నారా’ అవినీతి వృక్షం మూలాల్లోకి వెళ్లి ఒక్కసారి పరిశీలిద్దాం. చంద్రబాబుకు నారావారి పల్లెలో ఒక చిన్న పూరిల్లు, రెండెకరాల పొలం మాత్రమే ఉంది. అనుకోకుండా 1978లో కాంగ్రెస్ పార్టీ చీలిపోయి ‘ఇందిరా కాంగ్రెస్’ ఏర్పడింది. అప్పుడున్న పరిస్థితుల్లో ఇందిరాగాంధీ ఎవ్వరడిగినా టిక్కెట్ ఇచ్చింది. ఆ విధంగా ‘నారా’వారు టిక్కెట్ సంపాదించి ఆమె ప్రభంజనంలో ఎమ్మెల్యేగా గెలిచాడు. అప్పుడతని నెల జీతం 350 రూపాయలు. పాకాల నారాయణస్వామి, గల్లా రాజగోపాల్ నాయుడు ఆర్థిక సాయం అందించడంతో ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అయితే రాజకీయాల్లో సీనియారిటీ, సిన్సియారిటీ పనికి రాదనుకున్నాడు. మంత్రి కావా లనే ఆశతో అన్ని అడ్డదారులు తొక్కటం ప్రారంభించాడు. అమాయకుడైన అంజయ్యగారి అల్లుణ్ణి, పట్టు కొని, అతనిని ప్రలోభపెట్టి చేసి 1980లో మంత్రి పదవి కొట్టేశాడని ఆ రోజుల్లోనే ఒక కాంగ్రెస్ నాయ కుడు ఆక్షేపించాడు. మంత్రిగా అతని జీతం 2,500 రూపాయలు. అదే విధానంలో సంజయ్ గాంధీతో పరిచయం పెంచుకున్నాడు. ఇక మంత్రి పదవి చేపట్టిన దగ్గర్నుండి అతని అవినీతి యాత్ర ప్రారంభమైంది. తిరుపతిలో 1970– 80లలోనే విష్ణుప్రియ హోటల్ కొన్నాడు. ఆ తరువాత భువనేశ్వరి కార్బైడ్ ఫ్యాక్టరీని ప్రారంభించాడు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ అవ్వడంతో ఆ రోజుల్లో సినిమావాళ్ళ దగ్గర కూడా డబ్బులు కాజేసేవాడని స్వయంగా దాసరి నారాయణ రావుగారు నాతో చెప్పారు. ఆ పరిచ యాలతోనే 1981లో ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరితో అతని వివాహం జరిగింది. ‘ఇంత డబ్బు నీకెక్కడిది?’ 1982 ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినపుడు ఇతడు కాంగ్రెస్లోనే ఉండి ఎన్టీఆర్ను ఓడిస్తానని ప్రగల్భాలు పలికాడు. తెలుగుదేశం పార్టీ 200 సీట్లతో గెలవటంతో అప్పటికప్పుడు పార్టీలో చేరతానని వచ్చేశాడు. అప్పటికే అతని మీద అనేక కథలు ప్రచారంలో ఉన్నందువల్ల ఎన్టీఆర్ తిరస్కరించారు. అప్పుడు గర్భిణిగా ఉన్న భువనేశ్వరిని ముందుపెట్టి ఎన్టీఆర్ మీద ఒత్తిడి తెచ్చి పార్టీలో చొర బడ్డాడు. కార్యకర్తగా చేరిన చంద్రబాబు నంబర్ 2 పొజిషన్ కోసం అప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న నాయకులందరినీ ఏదో ఒక వంకతో బయ టకు పంపేశాడు. నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జానారెడ్డి, ఉపేంద్ర, కె.ఇ. కృష్ణ మూర్తి, వసంత నాగేశ్వరరావు... వీరంతా ఎన్టీఆర్కు అత్యంత విశ్వాసపాత్రులుగా మెలిగినవారు. బయటకు వెళ్లాక చంద్ర బాబు నీచ రాజకీయాన్ని గురించి తీవ్రంగా విమర్శ చేయటం గమనించదగిన అంశం. అప్పటినుండి పార్టీలో ‘ఏకులా వచ్చి మేకులా’ తయార య్యాడు. ఎన్టీఆర్కు రాజకీయ అవగాహన లేకపోవటంతో పార్టీ బాధ్యతనంతా అతనికి అప్పజెప్పటంతో పార్టీ వ్యవహారాలే కాక ప్రభుత్వంలో కూడా రాజ్యాంగేతర శక్తిగా తయారయ్యాడు. దానికి తోడు ఎన్టీఆర్ అతనిమీద ఉంచిన అపారమైన విశ్వాసంతో ఎవరు తనను కలిసినా ‘బాబును కలవండి’ అని చెప్పటంతో పార్టీలో, ప్రభు త్వంలో అతనికి హద్దు లేకుండా పోయింది. జూబ్లీహిల్స్లో 1,200 గజాలు కొని మంచి భవనం కట్టించాడు. ఆ గృహ ప్రవేశానికి ఎన్టీఆర్ గారిని కూడా ఆహ్వానించాడు. ఆ భవనం చూసి ఆశ్చర్యపోయిన ఎన్టీఆర్ ‘ఇంత డబ్బు నీకెక్కడిది? ఎలా కట్టించావు?’ అని అడిగితే దానికి సమాధానం చెప్పకుండా తప్పించుకున్నాడు. ఇంటా బయటా చర్చ చంద్రబాబు అవినీతి మీద ‘ఈనాడు’ పేపరు ప్రభుత్వాన్ని అనేకసార్లు హెచ్చరించింది. బ్లాటింగ్ పురుషోత్తం (మద్రాసు) వద్ద రెండున్నర కోట్లు ముడుపులు తీసుకున్న విషయం పార్టీలో, బయటా పెద్ద చర్చనీయాంశమైంది. అప్పటికి నష్టాల్లో నడుస్తున్న ‘విష్ణుప్రియ’ హోటల్ను సి.ఎం. బలరామిరెడ్డికి బలవంతంగా అంటకట్టి, కుదుర్చు కున్న ఒప్పందం ప్రకారం అతనిని కడప జడ్పీ ఛైర్మన్ గా చేశాడు. అదే విధంగా మూతపడివున్న భువనేశ్వరి కార్బైడ్ ఫ్యాక్టరీని రేణుకా చౌదరికి అంటగట్టి ఎన్టీఆర్ను బలవంతంగా ఒప్పించి రెండవసారి రాజ్యసభకు పంపించాడు. 1988లో హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం సాలీనా వ్యవసాయంపై వచ్చే ఆదాయం 36,000 రూపాయలుగా చూపించాడు. వ్యవసాయ భూమి తప్ప తనకు వేరే ఆస్తిపాస్తులుగానీ, ఆదాయ మార్గాలుగానీ లేవని వెల్లడించాడు. అప్పుడు భార్య భువ నేశ్వరి ఆస్తి సుమారు 400 గ్రాముల బంగారం, 50,000 రూపాయల నగదు. తరువాత ఏ పదవిలో లేడు గనుక సంపాదించే అవకాశమే లేదు. 1989 ఎన్నికల్లో తన ఆదాయం 2,16,000, అగ్రికల్చర్ ఆదాయం 36,000గా చూపించాడు. 1992లో 14 కోట్ల 75 లక్షల పెట్టుబడి అంచనాలతో ‘హెరిటేజ్ గ్రూపు’ సంస్థను స్థాపించటం జరిగింది. దాని పెట్టుబడులకు కూడా పార్టీలో అసెంబ్లీ టిక్కెట్లు ఇప్పిస్తానని పార్టీ మనుషుల చేత లక్షల రూపాయల షేర్లు కొనిపించాడు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు లక్షల రూపాయల ముడుపులు తీసుకొని కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు అప్పజెప్పా డని నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి బహిరంగంగానే విమర్శించాడు. నెల్లూరు జిల్లా బాలాయపల్లెలో 600 ఎకరాల్లో టేకు మొక్కలు నాటి వాటిని సొంతం చేసుకోవటమే కాకుండా, యానాం చుట్టుపక్కల బినామీ పేర్లతో కొన్ని వందల ఎకరాలు కొన్నాడని పార్టీ వాళ్ళే ఒకరికొకరు చెప్పుకున్న విషయం. ఇక హెరిటేజ్ పబ్లిక్ ఇష్యూలలో ఆరున్నర కోట్ల రూపాయలు సమీకరించాడు. ఈ పరిశ్రమలో తనకు 76 లక్షల 15 వేల రూపాయల విలువ గల వాటాలున్నట్టు, భార్య భువనేశ్వరికి ఒక కోటి 21 లక్షల 31 వేల రూపాయల విలువైన వాటాలున్నట్టు, లోకేష్ పేర 3 లక్షల 15 వేల రూపాయల వాటాలు న్నట్టు 1994లో ప్రకటించాడు. అప్పటికే జూబ్లీహిల్స్లో ఒక భవనం, పంజాగుట్టలో ఒక భవనం ఉన్న విషయం గమనించాలి. ఏ పదవీ లేకుండా 1992 నాటికే అతని కుటుంబ ఆస్తులు పెరిగాయన్నది స్పష్టంగా తెలుస్తున్నది. వెన్నుపోటు తర్వాత లేని హద్దు 1995 ఆగస్టు నెలలో ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి పదవి నుండి దించేసి సెప్టెంబర్ 1వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి అతని ఆస్తులు ఆకాశమే హద్దుగా పెరిగి పోవటం, దేశంలోనే నంబర్వన్ స్థాయి అవినీతి పరునిగా విమర్శలు రావడం జరిగింది. తెహల్కా డాట్కామ్ మొదలు అనేకమంది రాజకీయ నాయకులు, మీడియా అతని అవినీతిని ప్రశ్నించటం జరిగింది. 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యిన దగ్గర్నుండి పారదర్శకత, నిజాయితీ గురించి ఎక్కువగా ఉపన్యాసాలివ్వడం ప్రారంభించాడు. శాసనసభలో ఎథిక్స్ కమిటీ ఏర్పాటుకు దోహద కారులైన తోటి శాసన సభ్యుల వలే తను కూడా తన ఆస్తిపాస్తుల వివరాలు, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు ప్రతి సంవత్సరం ప్రకటించడం మొదలు పెట్టాడు. అతని ప్రకటన ప్రకారం చంద్ర బాబు కుటుంబ ఆస్తుల విలువ 30 కోట్ల వరకు చేరింది. ఆ ప్రకటనలో నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం ‘నిందలి గ్రామం’లో తన పేర 26.43 ఎకరాలు, భార్యకు 10.23 ఎకరాలు, కుమారునికి 9.32 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు ప్రకటించాడు. వివిధ కంపెనీలలో కుమారుడికి ఒక కోటి 67 లక్షల 15 వేల రూపాయల విలువగల వాటాలు, భార్య భువనేశ్వరి పేరున మొత్తం 3 కోట్ల 4 లక్షల 1 వేయి రూపాయల విలువ గలిగిన వాటాలు, తనకు ఒక కోటి 40 లక్షల 15 వేల 65 రూపాయల విలువ కలిగిన వాటాలు ఉన్నట్లు చెప్పాడు. భవనాలు, వాహనాలు, బ్యాంక్ బ్యాలెన్స్లు మొదలైన వివరాలు కూడా వెల్లడి చేశాడు. వాటి విలువను తక్కువగా చూపించడం గమనార్హం. 1994లో ప్రకటించిన హెరిటేజ్ డైరీ ప్రాస్పెక్టస్లో కూడా తనకు వేరే కంపెనీలతో లావాదేవీలు గానీ ఇత రత్రా ఆదాయ వనరులు గానీ లేనట్లు ప్రకటించి, కంపెనీల రిజి స్ట్రార్ సమక్షంలో అంతకుముందు తాను ఆర్థికపర, క్రిమినల్ నేరారోపణ లను ఎదుర్కొనలేదని పేర్కొన్నాడు. మరి 1988లో సాలీనా తన గరిష్ఠ ఆదాయం లక్షన్నర రూపాయలే అని చెప్పిన పెద్ద మనిషికి ఒక్క సారిగా ఇన్ని ఆస్తులు అకస్మాత్తుగా ఎలా పెరిగాయి? ఆనాటి ప్రశ్నకు ఈరోజు సీఐడీ కేసుల ద్వారా సమాధానం లభించింది. ఆస్తులు ఎలా పెరిగాయో సంజాయిషీ ఇవ్వాలి! చంద్రబాబు పేర్కొన్న ఆస్తిపాస్తులు ఎలా వచ్చాయో ప్రజలకు సంజాయిషీ ఇవ్వాల్సిందిగా అప్పటి పీసీసీ అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర రెడ్డిగారు డిమాండ్ చేయటం జరిగింది. అతడిని ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతించాల్సిందిగా 1999 జూన్ 5న రాజశేఖర రెడ్డి నాయకత్వంలో పలువురు కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర గవర్నర్కు ఒక విజ్ఞాపన పత్రం సమర్పించారు. నిజానికి 90 మంది శాసన సభ్యులకు నాయకుడైన రాజశేఖర రెడ్డి గారి విజ్ఞాపనకు గవర్నరు ప్రతిస్పందించటం కనీస ధర్మం. అప్పటికే ప్రతి వ్యవస్థను తనకు అనుకూలంగా మార్చుకోవటంలో చంద్రబాబు సిద్ధహస్తుడ య్యాడు. గవర్నర్ మారు మాట్లాడలేదు. గత్యంతరం లేని పరిస్థితిలో 1999 జూలై 12వ తేదీన హైకోర్టును ఆశ్రయించి ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేసేందుకు చట్టప్రకారం అవసరమైన అనుమతి ఇవ్వాల్సిందిగా గవర్నర్ను ఆదేశించాలని కోరారు. అందుకు హైకోర్టు 1999 నవంబర్ 2వ తేదీన ఒక సుదీర్ఘ తీర్పులో తన నిస్సహాయతను వ్యక్తం చేస్తూ దర ఖాస్తును కొట్టేసింది. గవర్నర్ గారి పదవీ బాధ్యతల నిర్వహణ మీద సమీక్ష జరిపే అధికారం రాజ్యాంగం ప్రకారం కోర్టులకు ఉండదని ఆ జడ్జిమెంట్ సారాంశం. హైకోర్టు తీర్పు మీద (నేడు టీడీపీ పార్టీలో ఉన్న) కన్నా లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ సీనియర్ లీడర్ ‘ఆమోస్’ గార్లు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేశారు. అయినప్పటికీ సుప్రీంకోర్టు హైకోర్టులోనే తేల్చుకోమని ఆ కేసు కొట్టేసింది. దాని మీద వారు హైకోర్టులో ఏ కేసు వేసినప్పటికీ తమకు న్యాయం జరగట్లేదనీ, చంద్రబాబుకు అనుకూలంగా తీర్పులొస్తున్నాయనీ నివేదించినప్పటికీ అత్యున్నత న్యాయస్థానం వినిపించుకోలేదు. అడ్వకేట్ జనరల్ రామచంద్ర రావు ఈ కేసును వాదిస్తూ, రాష్ట్ర హైకోర్టు మీద చంద్రబాబు నాయుడి ప్రభావం పనిచేస్తున్నదంటూ బ్రిటన్లోని ‘ససెక్స్’ విశ్వ విద్యాలయం ప్రొఫెసర్ జేమ్స్ మైనర్ ఇచ్చిన రిపోర్టును ప్రస్తావించినా బెంచ్ తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి వ్యాసకర్త ఆంధ్రపదేశ్ తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ -
టీడీపీ, ఎల్లో మీడియాకు నిద్రపట్టడం లేదు: దేవినేని అవినాష్
సాక్షి, విజయవాడ: దివంగత ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు విజయవాడలో నిర్వహిస్తాం. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి పాల్గొంటారని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. కాగా, దేవినేని అవినాష్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు రేపు ఘనంగా నిర్వహిస్తున్నాం. మేమూ ఎన్టీఆర్ అభిమానులమే. ఎన్టీఆర్కు బ్యానర్లు కట్టే హక్కు మాకుంది. ఎన్టీఆర్ సర్కిల్ టీడీపీకి ఎవరూ రాసివ్వలేదు. టీడీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ పేరు కూడా ప్రస్తావన రాకుండా చేసేవారు. ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టిన మనసున్న నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఎన్టీఆర్ పేరును చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయేలా చేశారు సీఎం జగన్. కనీవినీ ఎరుగని రీతిలో నిన్న అమరావతిలో జరిగిన ఇళ్ల పట్టాల పండుగకు లబ్ధిదారులు తరలివచ్చారు. చంద్రబాబు సభలకు జనం రావాలంటే డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వాలి. కానీ, సీఎం జగన్ మీటింగ్కు సంతోషంతో లబ్ధిదారులు తరలివచ్చారు. టీడీపీ నేతలు మూడేళ్లు పేదలకు ఇళ్లు రాకుండా వ్యవస్థల ద్వారా అడ్డుకున్నారు. అమరావతిలో తన పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ వ్యక్తులు మాత్రమే ఉండాలని చంద్రబాబు అనుకున్నాడు. దమ్మున్న నాయకుడిగా సీఎం జగన్ పేదల తరపున పోరాడారు. ఇళ్ల పట్టాల పండుగను చూసి టీడీపీ నేతలకు, ఎల్లో మీడియాకు నిద్రపట్టడం లేదు. పేదల సొంతింటి కల నెరవేరుతుంటే చూసిఓర్వలేకపోతున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఇళ్ల పట్టాలను రద్దుచేస్తామంటున్న టీడీపీ నేతలకు సిగ్గుందా?. సెంటు స్థలంపై విమర్శలు చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు తలలెక్కడ పెట్టుకుంటారు. సీఎం జగన్ సభను చూసిన తర్వాత టీడీపీ నేతలకు దిమ్మతిరిగింది. ఇది కూడా చదవండి: వివేకా కేసు: చంద్రబాబు దుర్మార్గం ఏ స్థాయికి చేరిందంటే.. -
‘తారకరత్నకు సీరియస్గా ఉంటే ఒక్కరోజు కూడా పాదయాత్ర ఆపలేరా?’
సాక్షి, పల్నాడు: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్పై తెలుగు అకాడమీ ఛైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక కమెడీయన్ పాదయాత్ర చేస్తే కామెడీ తప్ప మరేమీ ఉండదని నారా లోకేష్ను ఉద్దేశించి సెటైరికల్ పంచ్ వేశారు. కాగా, లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. పాదయాత్రలో లోకేష్ కామెడీ చూసి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. లోకేష్ పాదయాత్రను ఐరన్ లెగ్గా అభివర్ణిస్తున్నారు. పాదయాత్రకు హాజరైన తారకరత్నకు గుండెపోటు రావడం బాధాకరం. ఎన్టీఆర్ మనవడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి సీరియస్గా ఉన్నప్పటికీ ఒక్కరోజు కూడా పాదయాత్ర ఆపలేందటే వారి మానవత్వం ఎలాంటిదో ప్రజలకు తెలిసిపోయింది. ఈ ఘటనను పెద్ద అపశృతిగా ప్రజలు భావిస్తున్నారు. మానవత్వం లేని చంద్రబాబు, లోకేష్ స్వభావం చూస్తుంటే అసహ్యంగా ఉంది. లోకేష్ ఈ జన్మలో నాయకుడు కాలేదు. చంద్రబాబు, లోకేష్ మీటింగ్ల కారణంగా ఎందరో చనిపోతున్నారు. మీరు మనుషులను చంపడానికే వచ్చారా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు వ్యాఖ్యలు చేశారు. -
లోకేశ్, జూనియర్ ఎన్టీఆర్పై లక్ష్మీపార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు
తిరుమల: లోకేశ్ నాయకత్వాన్ని జూనియర్ ఎన్టీఆర్ సమర్థించడం లేదని తెలుగు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి చెప్పారు. ఆమె ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆమె విలేకరులతో లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు టీడీపీ వాళ్లు అబద్ధాలు సృష్టిస్తున్నారని, తనకు తెలిసినంతవరకు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రావడం లేదని చెప్పారు. లోకేశ్ నాయకత్వాన్ని సమర్థించేందుకు జూనియర్ ఎన్టీఆర్ సిద్ధంగా లేరన్నారు. ఎవరు ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని కుట్రలు చేసినా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆపలేరని స్పష్టంచేశారు. -
తెలుగుదేశం విలాపం
నారా చంద్రబాబు నాయుడు గార్కి– ‘విధిరహో బలవానితి మేమతిః’ ఎంతటివారయినా విధిచేతికి చిక్కి అనుభవించాల్సిందే. మొన్న మీ ఏడుపు చూశాక ఈ ఉత్తరం రాయాల నిపించింది. ఆరోజు మా వ్యవస్థాపక అధ్యక్షుడు నీవల్ల దుఃఖించిన సంఘటన గుర్తుకు వచ్చింది. నాతో పాటు యావదాంధ్ర జాతికీ గుర్తొచ్చి వుంటుంది. ‘సుకృతం దుష్కృతం చైవ గచ్ఛంత్యను గచ్ఛంతి.’ ఇది కూడా భర్తృహరి లాంటి పెద్దలే చెప్పారు. చేసిన పాపాలు వెంట తరుముతూ ఉంటే, మీడియా సాయంతో కట్టుకున్న అబద్ధాల కోట కూలిపోయే దృశ్యం ఆనందంగా చూశాను. నువ్వు చేసిన కర్మలే నిన్ను వెన్నంటి వస్తాయి అని భగవద్గీత కూడా చెప్పింది. ఎటువంటి పార్టీని నేను, ఎలాంటి స్థితికి చేరుకున్నాను! చెడ్డవాడి చేతి ధనంలాగా నీ చేతిలో పడి ఎంత పతన మయ్యాను! ఎన్టీఆర్ దగ్గర నా వైభవం ఆకాశానికి ఎగసింది. హరివిల్లు సప్తరంగులను ఒకే పసుపురంగుగా మార్చుకుంది. దేశమంతా తిరిగాను. ఎక్కడికెళ్ళినా జేజేలు అందుకున్నాను. 1982 మార్చి 29న నా జననం జరిగింది. నాకు రూప మిచ్చిన నా తండ్రి, గురువు ఎన్టీఆర్ 35 సంవత్సరాలు సినిమా నటుడిగా అఖండ ప్రజాభిమానాన్ని పొంది, పురాణ పురు షుడిగా తెలుగువారి గుండెల్లో గుడికట్టుకున్న మహానటుడు. రాజకీయాలు తెలియకపోయినా పేదప్రజల ఆకలి ఆర్తనా దాలు, అసమానతలు తెలుసు కనుక రెండు రూపాయలకే కిలోబియ్యం, పది రూపాయలకే చీర– ధోవతి, బడుగు వర్గాలకు పక్కా ఇళ్ల పథకం వంటివి అందించి అందరికీ అన్నగా నిలబడిపోయారు. పేదవాని ముంగిట అన్నంగిన్నెగా మారిపోయారు. 35 సంవత్సరాల కాంగ్రెస్ కోటను బీటలు పర్చి, 9 నెలల్లోనే అధికారాన్ని అందిపుచ్చుకున్నారు. ఆంధ్రదేశమే కాదు, భారతావనిలో, ప్రపంచంలో ఉన్న తెలుగువాళ్లంతా నాపేరు విని పులకరించారు. ఈ జాతికో దిక్సూచి దొరికిందని, రాష్ట్రంలోనే కాక కాంగ్రెసుకు వ్యతిరేకంగా దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకమయ్యాయి. నేషనల్ ఫ్రంటుగా ఏర్పడి మా నాయకుడి ఆధ్వర్యంలో నన్ను ముందుపెట్టుకుని పోరాటం సాగించాయి. అబ్బో ఆనాటి వైభవం ఏం చెప్పను. ఒక నోరు సరిపోతుందా? వీపీ సింగ్, లాలూప్రసాద్ యాదవ్, రామకృష్ణ హెగ్డే, బొమ్మయ్, బిజూ పట్నాయక్, దేవీలాల్, కమ్యూనిస్టు కురువృద్ధుడు సూర్జీత్ సింగ్, ప్రఫుల్లకుమార్ మహంతా, కరుణానిధి లాంటి అతిరథ మహారథులందరూ మా నాయ కుడికి నమస్కారాలు పెడుతుంటే ఈ కళ్ళతోనే చూసి ఆనంద బాష్పాలు రాల్చాను. ఈ నాయకులంతా ఎందుకు ఎన్టీఆర్ వెనకే నడిచారు? అది ఆయన వ్యక్తిత్వం, ఇచ్చినమాట మీద నిలబడే గుణం, విశ్వసనీయత, అవినీతి రాహిత్యం, నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత దూరమైనా వెళ్లగల గుండె ధైర్యం, ఇవే ఆయన్ని జాతీయ నాయకుడిని చేశాయి. అవన్నీ కళ్ళముందే కరిగిపోయి ‘ఈన గాసి నక్కల పాలయినట్లు’ వెన్నుపోటుదారుడు, కుట్రదారుడు, విలువలు లేనివ్యక్తి, అవినీతి స్వార్థ పరత్వమే అడ్రసుగా కలిగిన నీ చేతుల్లో పడి దుష్టుడికి చిక్కి భ్రష్టత చెందిన సాధ్విలా ఎటువంటి పతనావస్థకు చేరుకున్నాను! నా రాజ్యాంగంలో శాశ్వత అధ్యక్షుడిగా చెక్కబడిన ఆ శిలాక్షరాలపై దాడి చేశావు, కత్తులతో పొడిచి వాటిని లాగేశావు, అవమానాల అగ్నిలో వేసి కాల్చావు. 74 ఏళ్ళ వయసులో, అనారోగ్యంతో ఉండికూడా రాష్ట్రమంతా తిరిగి సాధించుకున్న ముఖ్యమంత్రి పదవిని చెప్పులేసి రోడ్డు పాల్జేశావు. బ్యాంకు ఖాతాను కూడా స్తంభిం పజేసి చివరకు ప్రాణాలు తీశావు. ఆనాడు ఆయన మరణాన్ని కన్నీళ్ళతో చూస్తుండిపోయాను. అక్రమంగా బలవంతంగా నా మెళ్ళో తాళి కట్టి నీకు బానిసగా మార్చుకున్నావు. నన్ను అడ్డం పెట్టుకుని నువ్వు సాగించిన అరాచకాలు ఎన్నని చెప్పగలను. ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. నా శరీరాన్ని, మనస్సును, ఆత్మను దిగజారుస్తూ నువ్వు ఎదిగావు. నేను మాత్రం రోజురోజుకు పాతాళానికి జారిపోతూనే ఉన్నా. 1982లో జరిగిన ఎన్నికల్లో 200 సీట్లు, 43 శాతం ఓట్లు; 1984లో జరిగిన ఎన్నికల్లో 202 సీట్లు, అంతే ఓట్ల శాతం. ఇంకా పెరిగినయ్యేమో గుర్తులేదు. 1989లో నీవల్లనే ఓడి పోయినా ఏ మాత్రం తగ్గని ఓటింగు. వెంటనే 1991లో వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో రాజీవ్గాంధీ మరణం ముందు వరకు జరిగిన పోల్ నేనే సొంతం చేసుకున్నా. తరువాత సాను భూతితో కాంగ్రెసుకు పోయాయి. 1994 ఎన్నికల్లో 222 సీట్లు, 36 మిత్రపక్షాలకు వెరసి 258 సీట్లతో 51 శాతం ఓట్లతో రికార్డు తిరగరాశాను. అజేయమైన శక్తిగా నిలబడ్డాను. అదీ మా నాయకుడి సత్తా. మరి ఇప్పుడో! ఒక్కసారి కొన్ని నా చరిత్ర పుటలు తిరగేయ్. నువ్వేంటో, నీ బతుకేంటో తెలుస్తుంది. 40 సంవత్సరాల పుట్టుక నాది. ఎంతోమంది నాయకుల్ని తయారు చేశాను. దేశంలోని మిగిలిన ప్రాంతీయ పార్టీలకు పెద్దన్నగా నిలిచాను. లక్షలాది మంది సభ్యులు కలిగినదాన్ని. కోట్లాది రూపాయల ఫండ్. నెలకు దానిమీద వచ్చే వడ్డీయే 3 కోట్ల రూపాయలు ఉంటుందంటే ఎంత ఆర్థిక పరిపుష్టి ఉన్నదాన్ని! ప్రతి జిల్లాలో సొంత భవనాలు– కొన్ని మండలాల్లో కూడా. నువ్వేమైనా తక్కువ వాడివా. 1978లోనే మంత్రిగా చేశావు. 8 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, మూడుసార్లు ముఖ్యమంత్రిగా వెలగ బెట్టావు కదా. ప్రధానమంత్రుల్ని నువ్వే పెట్టానన్నావు. దేశ రాజకీయాలు నీ కనుసన్నల్లో నడిచాయని చెప్పావు. నువ్వు చెప్పుకునే సొంత డబ్బాలో ప్రపంచ మేధావివి. అపర చాణక్యుడివి. హైటెక్ నిర్మాతవు. అబ్బో చాలా చెప్పుకుంటావులే. ఇక సింబలా? సామాన్యుడి చేతి చక్రాయుధం లాంటి సైకిలు. ఓటర్లా – రాష్ట్రంలోనే 60 శాతానికి మించి ఉన్న బీసీ గణాలు. సొంత కులం అండ. ఒక పది దాకా కుల మీడియా వ్యవస్థలు నిన్నెప్పుడూ పొగుడుతూనే ఉంటాయి. మరోపక్క న్యాయ వ్యవస్థ. ఇన్ని కొమ్ముకాస్తుంటే ఇంత స్థాయిలో ఎలా ఓడి పోయావు? అసలు 2014 ఎన్నికల్లోనే ఓడిపోవాల్సింది. మోదీ జోడుతో పవన్ కల్యాణ్ గాలితో ఎలాగో చావుతప్పి కన్ను లొట్టబోయి బయటపడ్డావు. ఇక 2019 ఎన్నికల్లో నీ ఐదు సంవత్సరాల ముదనష్టపు పాలనకు విసిగిపోయిన జనం నిన్ను ఫుట్బాల్ను తన్నినట్టు తన్నారు. వైకాపాకు 49.95 శాతం ఓట్లు, 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు. మరి నాకో 39.18 శాతం ఓట్లు అంటే 10 శాతం తక్కువతో ఓడిపోయాను. 2014లోనే పోయుంటే బాగుండేది. ఈ ప్రజలకు నీ కష్టాలు తప్పేవి. పోనీ రెండున్నర సంవత్సరాల తర్వాతైనా నువ్వు పుంజు కుంటావనుకుంటే మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో వైకాపాకు 52.6 శాతం. నాకేమో 30.7 శాతం. ఇదీ నా దురవస్థ. చివరకు 40 ఏళ్ల నుండి దొంగ ఓట్లతో గెలుస్తున్న నీ సొంత నియోజక వర్గం కుప్పం జనాలు కూడా తరిమేశారు. ఈనాటికి కదా నా నాయకుడికి ఆత్మశాంతి. ఒకనాడు పేద వర్గాలకు అమ్మలాగా, అక్కలాగా అండగా నిలబడ్డాను. ఈరోజు నా పార్టీలోకి ఎవరెవరో సూట్లుబూట్లు వేసుకుని వస్తున్నారు. అసలు కార్యకర్తలు కనుచూపు దూరంలో లేరు. విలువలు, సిద్ధాంతాలు, సంక్షేమ పథకాలు ఎప్పుడో అటకెక్కాయి. ఇప్పుడంతా కార్పొరేట్ వ్యక్తులు, అవినీతి సొమ్ముకు బినామీలు, బ్యాంకుల లూటీదార్లు, సారా కాంట్రాక్టర్లు, కాల్మనీవాళ్లు... ఛీ..ఛీ.. నా బ్రతుకిలా అయి పోయింది. నావాళ్లనుకున్న వాళ్లను దూరం చేశావు. ఇంకా ఏం మిగిలిందని? చివరకు నా పతనానికి పరాకాష్టగా– ఏ కాంగ్రెస్కు వ్యతిరేకంగా నా తండ్రి నన్ను పుట్టించాడో ఆ కాంగ్రెస్ వాళ్ల కాళ్ల దగ్గర పడేశావు కదా. ఆ రోజే నేను కూడా పూర్తిగా చచ్చిపోయాను. పవిత్ర గంగలాంటి నన్ను మురికిగుంటగా మార్చావు. ఇక ఈ బాధలు నాకొద్దు. ఈ హీన జీవితం గడపలేను. నన్ను ప్రేమతో సృష్టించి, గౌరవించి, దేశ స్థాయిలోనే ఉన్న తంగా నిలబెట్టిన నా తండ్రి దగ్గరకే పోతున్నా. ఇంకా నన్నేదో ఉద్ధరిద్ధామనుకోకు. ఈ శరీరంలో రక్తమాంసాలు ఇంకిపోయి నాయి. ఆత్మ, మనస్సు చచ్చిపోయాయి. శరీరం చిక్కి శల్యా వస్థకు చేరుకుంది. ఇక రాసే ఓపిక కూడా లేదు. సెలవు. జన్మలో నీ ముఖం చూడను. ఇట్లు తెలుగుదేశం పార్టీ -
తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తాం
సాక్షి, ఏఎన్యూ: తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో శనివారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన గిడుగు రామ్మూర్తి భాషా పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో తెలుగు అకాడమీ ఏర్పాటుకు ఆ పాలకులు ఎందుకు చొరవ తీసుకోలేదో చెప్పాలన్నారు. మాతృభాషా వికాసానికి సీఎం జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని చెప్పారు. చదవండి: సీఎం జగన్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు: ఏపీ గవర్నర్ ప్రస్తుతం ఉన్న ప్రపంచీకరణ పరిస్థితుల్లో విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అదే తరుణంలో తెలుగు సబ్జెక్టును కార్పొరేట్ పాఠశాలల్లో కూడా తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. తెలుగు భాషపై లోతైన అధ్యయనం జరిపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ మాట్లాడుతూ.. తెలుగు కవుల గొప్పతనాన్ని తెలియజేస్తూ నెల్లూరు విక్రమ సింహపురి యూనివర్సిటీకి తిక్కన విక్రమ సింహపురి యూనివర్సిటీగా పేరు మార్చుతూ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నామని తెలిపారు. గిడుగు రామ్మూర్తి జీవిత చరిత్ర చిత్రాలతో పోస్టల్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన పోస్టల్ కవర్ను మంత్రి ఆవిష్కరించారు. తెలుగు, సంస్కృత భాష వికాసానికి కృషి చేస్తున్న 13 మందికి మంత్రి చేతులమీదుగా పురస్కారాలు అందజేశారు. తెలుగు, సంస్కృత భాషా అకాడమీ చైర్పర్సన్ డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి, ఏఎన్యూ వీసీ ఆచార్య పి.రాజశేఖర్, రెక్టార్ ఆచార్య పి.వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్ డాక్టర్ బి.కరుణ తదితరులు పాల్గొన్నారు. చదవండి: Polavaram Project: పోలవరం పనులు భేష్ -
సీఎం జగన్ నాయకత్వంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు
-
శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి శనివారం దర్శించుకున్నారు. అనంతరం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడారు. కులమత వ్యత్యాసాలు లేకుండా.. పార్టీల విద్వేషాలు లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారని ఆయన అన్నారు. పేదవాడి ఆర్థిక పరిస్థితి మెరుగు పడాలని, విద్యావంతులు కావాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష అని చెప్పారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఎన్ని దేవాలయాలు పునరుద్దరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, పచ్చ మీడియా కలిసి సీఎం వైఎస్ జగన్ను మతాన్ని ఆపాదించడం చాలా తప్పు అని ఆయన పేర్కొన్నారు. టీడీపీ, బీజేపీ పనిగట్టుకొని సీఎం జగన్ పై ఆరోపణలు చేయడం తగదని ఆయన హెచ్చరించారు. పేదలపై ప్రేమ, ఆప్యాయత లేని వ్యక్తి చంద్రబాబు అని.. ఒక్క పేద కుటుంబానికైనా ఇంటి స్థలాన్ని చంద్రబాబు ఇచ్చాడా అని నారాయణ స్వామి ప్రశ్నించారు. ఒక్క ఏడాదిలో తెలుగు అకాడమీ ఎన్నో విజయాలు సాధించింది: లక్ష్మీ పార్వతి తెలుగు బాషా చైతన్య సదస్సులు తిరుపతిలో నిర్వహించామని.. ఈ కార్యక్రమాల్లో సంస్కృత బాషా కవులు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారని తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి చెప్పారు. తెలుగు అకాడమీ పనితీరు చూసి తెలంగాణ ప్రభుత్వం కూడా ఫండ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఒక్క ఏడాదిలో తెలుగు అకాడమీ ఎన్నో విజయాలు సాధించిందని ఆమె తెలిపారు. పుస్తకాల ప్రింటింగ్ పూర్తి అయిందిని.. మరో పదిరోజుల్లో పుస్తకాలను విద్యార్థులకు అందిస్తామని వెల్లడించారు. తిరుపతి కేంద్రంగా తెలుగు సంస్కృతి అకాడమీ బాధ్యతలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు అప్పగించారని ఆమె గుర్తు చేసుకున్నారు. లోయర్ క్లాస్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు తెలుగు తప్పనిసరి చేశామని స్పష్టం చేశారు. టీడిపీ ప్రభుత్వం వదిలేసిన తెలుగు అకాడమీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తిరిగి తీసుకొచ్చిందని ఆమె పేర్కొన్నారు. టీటీడీ చైర్మన్గా మరోసారి వైవీ సుబ్బారెడ్డిని నియమించడం పట్ల లక్ష్మీపార్వతి ఆనందం వ్యక్తం చేశారు. -
తెలుగు-సంస్కృత అకాడమీ ఏర్పాటులో తప్పేంటి?
అమరావతి: తెలుగు అకాడమీ పేరును తెలుగు-సంస్కృత అకాడమీగా మారుస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై వస్తున్న విమర్శలపై ఆదివారం ఏపీ తెలుగు-సంస్కృత అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి స్పందించారు. తెలుగు-సంస్కృత అకాడమీ ఏర్పాటులో తప్పేంటి? అని ఆమె ప్రశ్నించారు. తెలుగు అకాడమీ పేరును తెలుగు-సంస్కృత అకాడమీగా.. విస్తరించడం వల్ల నష్టం ఏంటో విమర్శకులు వివరించాలి అని ఆమె నిలదీశారు.తెలుగు భాషాభివృద్ధికి, దానితో పాటు సంస్కృత భాషాభివృద్ధికి కూడా సీఎం జగన్ ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించాలని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. అకారణమైన, నిర్హేతుకమైన విమర్శలను చేయవద్దని సవినియంగా మనవి చేస్తున్నానన్నారు. -
నా భర్తకు చేసిన అవమానమే ఇప్పుడు వాళ్లకు: లక్ష్మీ పార్వతి
-
నా భర్తకు చేసిన అవమానమే ఇప్పుడు వాళ్లకు: లక్ష్మీ పార్వతి
సాక్షి, తాడేపల్లి: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు టీడీపీకి చెంప పెట్టు అని ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుకు తన కొడుకును వారసుడిగా చేయాలన్న ఆశయం పోయిందని, లాక్కున్న పార్టీని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించుకున్నాడని మండిపడ్డారు. ఇప్పుడు టీడీపీ పార్టీని భూస్థాపితం చేశాడని, ఇక తండ్రీ కొడుకులు పాలు, కూరగాయలు అమ్ముకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. తన భర్తకు చేసిన అవమానం ఇప్పుడు వాళ్లకు వచ్చిందని తెలిపారు. సీఎం జగన్ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాడని లక్ష్మీపార్వతి తెలిపారు. నిజమైన ఎన్టీఆర్ అభిమానులైతే ఇకనైనా చంద్రబాబును వదిలేయండని చెప్పారు. టీడీపీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించడం కష్టమని తెలిపారు. మరో 30 ఏళ్లు సీఎం జగన్ ప్రజలకు సేవ చేస్తారని తెలిపారు. తన భర్తను అవమానించిన పార్టీ ఉంటే ఏమిటి ఊడితే ఏమిటని ఆమె మండిపడ్డారు. చంద్రబాబు పని అయిపోయిందని, ఆత్మ విమర్శ చేసుకోవడానికి తన మైండ్ కూడా చెడిపోయిందని ధ్వజమెత్తారు. బాబు చేసిన పాపాలు తన కొడుకు రూపంలో శాపంగా మారాయని ఆమె విమర్శించారు. చదవండి: ‘ఇక టీడీపీ లేదు, దాని తోక పార్టీలు లేవు’ -
‘రాధాకృష్ణ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు..
-
‘రాధాకృష్ణ’ మూవీ స్టిల్స్
-
‘బీసీల అభ్యున్నతికి బాబు మోకాలు అడ్డుపెట్టారు’
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదని తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి విమర్శించారు. చంద్రబాబుకు స్వలాభం తప్ప మరో ఆలోచన లేదని, బీసీల రిజర్వేషన్లను బాబు అడ్డుకున్నారని, ప్రతాప్రెడ్డితో చంద్రబాబే కోర్టులో పిటిషన్ వేయించారని తెలిపారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నారని, మహిళలను అడ్డం పెట్టుకుని రాజధానిపై రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. బినామీ భూముల కోసం అమాయకులను బలి పశువులు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని, బాబుకు రాజకీయ విలువలు లేవని లక్ష్మీపార్వతి దుయ్యబట్టారు. (స్థానిక ఎన్నికల్లో పోటీ చేయం) స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను అడ్డుకున్నది చంద్రబాబేనని మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు. ప్రతాప్రెడ్డి బాబు అనుచరుడు కాదా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలతో ప్రతాప్రెడ్డికి సంబంధాలు ఉన్నాయన్నారు. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగా వాడుకున్నారని, బీసీల అభ్యున్నతికి చంద్రబాబు మోకాలు అడ్డుపెట్టారని విమర్శించారు. చంద్రబాబు బీసీల ద్రోహి అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారథి మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉద్యోగాలు కల్పించామని, బడుగు, బలహీన వర్గాలకు సీఎం జగన్ అండగా నిలిచారని ఆయన తెలిపారు. -
‘చంద్రబాబు అక్రమాస్తుల’ కేసు 26కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టడంపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని కోరుతూ వైఎస్సార్సీపీ నాయకురాలు, ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి చేసిన ఫిర్యాదుపై ఏసీబీ కోర్టు విచారణ ఈ నెల 26కు వాయిదా పడింది. ఫిర్యాదు దశ లో చంద్రబాబు తరఫు వాదనలు వినరాదని లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాది గతంలో చేసిన వినతిని కోర్టు ఆమోదించింది. ఫిర్యాదుపై 26న తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని శుక్రవారం జడ్జి తెలిపారు. చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టడంపై 2005లో లక్ష్మీపార్వతి ఫిర్యాదు చేశారు. అప్పట్లో టీడీపీ అధినేత హైకోర్టు నుంచి స్టే ఉత్తర్వులు పొంది ఈ ఫిర్యాదుపై విచారణ జరగకుండా అడ్డుకుంటూ వచ్చారు. అయితే సుప్రీంకోర్టు గతేడాది జారీ చేసిన మార్గదర్శకాల్లో మధ్యంతర స్టే ఉత్తర్వుల గడువు ఆరు నెలలేనని తేల్చిచెప్పింది. తిరిగి స్టే ఆదేశాలు కొనసాగింపు ఉత్తర్వులు లేకపోతే గతంలోనే స్టే రద్దయినట్లేనని పేర్కొంది. దీనికనుగుణంగా తన ఫిర్యా దుపై ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు జారీ చేసిన స్టే ఉత్తర్వులను తెప్పించుకుని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఏసీబీ కోర్టు గత విచారణలో చెప్పింది. దీనిపై లక్ష్మీపా ర్వతి తరఫు న్యాయవాది జోక్యం చేసుకుని.. హైకోర్టు స్టే తర్వాత సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయని, వాటినీ పరిశీలించాకే ఫిర్యాదుపై నిర్ణయాన్ని వెల్లడించాలని కోరారు. దీంతో ఎలాంటి వాదనలు లేకుండానే ఈ నెల 26కు వాయిదా పడింది. -
‘ఈ రోజు నా జీవితంలో ఎంతో విషాదాన్ని నింపింది’
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, సినీ నటుడు ఎన్టీఆర్ 24వ వర్ధంతి కార్యక్రమం ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం జరిగింది. రవీంద్ర భారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ లలిత కళా పురస్కారాన్ని హాస్యనటుడు బ్రహ్మానందం అందుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతీ మాట్లాడుతూ.. ఈ రోజు తన జీవితంలో ఎంతో విషాదాన్ని నిపిందని.. అది తలుచుకుంటేనే మాటలు రావడం లేదన్నారు. ఎన్టీఆర్ ఓ మహానుభావుడని ఆమె అన్నారు. ఎన్టీఆర్పై అభిమానంతో ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ లలిత కళా పురస్కారం అందుకుంటున్న బ్రహ్మానందానికి లక్ష్మీ పార్వతీ అభినందనలు తెలియజేశారు. ఎన్టీఆర్ లలిత కళా పురస్కారాన్ని అందుకున్న అనంతరం బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఓ మహానుభావుడని, ఎన్టీఆర్ లలిత కళా పురస్కారానికి తనను ఎంపిక చేశారని తెలిసినప్పుడు భయం వేసిందన్నారు. ఎన్టీఆర్తో కలిసి మేజర్ చంద్రకాంత్ సినిమా చేయడం తన పూర్వ జన్మ సుకృతమని ఆనందం వ్యక్తం చేశారు. తనకు ఈ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన లక్ష్మీ పార్వతికి ధన్యవాదాలు తెలిపారు. సీనియర్నటీ జమున మాట్లాడుతూ.. ఎన్టీఆర్కు సంతానం ఉన్నా వారు చేయాల్సిన కార్యక్రమాన్ని లక్ష్మీ పార్వతి నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఎన్టీఆర్ లలితకళా పురస్కారం అందుకున్న బ్రహ్మానందంకు ఆమె అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ కష్టకాలంలో ఉన్న సమయంలో అండగా ఉండి.. ఎన్టీఆర్పై తనకున్న పతిభక్తిని చాటుకున్న లక్ష్మీ పార్వతి అంటే తనకు ఎంతో అభిమానమని అన్నారు. ఎన్టీఆర్ ఓ నటచక్రవర్తి అని, ఆయన పక్కన నటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఎన్టీఆర్ అంటే ఓ మహానుభావుడని.. కృష్ణుడు సత్యభామ అంటే ఎన్టీఆర్, తానే గుర్తుకు వచ్చేలా నటించామన్నారు. ఎన్టీఆర్ సీఎం అయ్యాక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారన్నారు. బ్రహ్మానందంకు ఈ అవార్డు ఇవ్వడం తామందరికి గర్వకారణమని అన్నారు. కేవీ రమణాచారి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నటుడిగా ఎంత గొప్పవారో సీఎంగా కూడా అంతే గొప్పవారని గుర్తు చేశారు. ఎంతో మంది నటుల్ని ఎన్టీఆర్ ప్రోత్సహించారని తెలిపారు. మనుషులు ఎంతో మంది ఉంటారు కానీ, తోటివారి బాగుకోరుకునే కొద్దిమంది మంచివారిలో ఎన్టీఆర్ ఒకరని రమణాచారి అన్నారు. ఎన్టీఆర్ ఓ దైవాంశ సంభూతుడని.. ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే ఇవాళ ఈ అవార్డును బ్రహ్మానందం అందుకున్నారని పేర్కొన్నారు. తెలుగు భాష పట్ల ఎంతో అభిమానం ఉన్న వ్యక్తి బ్రహ్మానందమని చెప్పారు. లక్ష్మీ పార్వతి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్న ఏకైక వ్యక్తి లక్ష్మీ పార్వతి అని ఆర్టీఏ మాజీ కమీషనర్ విజయబాబు అన్నారు. పార్వతికి ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్గా బాధ్యతలు అప్పగించినందకు ఏపీ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలుగులో నేడు ఎంత పెద్ద హీరో సినిమా అయినా బ్రహ్మానందం ఉండాల్సిందేనని.. ఏ పాత్రనైనా అలవోకగా నటించే సత్తా ఉన్న వ్యక్తి బ్రహ్మానందమని విజయబాబు కొనియాడారు. -
ఈ హత్యకు 24 యేళ్లు
ముప్పైఅయిదు సంవత్సరాలు సినిమా రంగాన్ని.. ఆపైన దేశవ్యాప్తంగా రాజకీయ రంగాన్ని శాసించిన రారాజు, తెలుగుజాతికి, పౌరుషానికి నిలువెత్తు రూపం, తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న నందమూరి తారక రామారావుగారి మరణం ఇప్పటికీ మర్చిపోలేని ఒక విషాదం. రోమ్ చక్రవర్తి ‘సీజర్’కు జరిగినట్లే విషాద తిరోగమనం అల్లుడి రూపంలో ఆయనకు జరగటం అత్యంత విషాదం. చరిత్రను ఎంత తొక్కిపెట్టినా దాగని సత్యాలు, ఆగని కాలంలో ఏదో ఒకనాడు బయటపడి వాళ్ల నిజ స్వరూపాన్ని బయటపెడతాయని చంద్రబాబును ఘోరంగా ఓడించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు రుజువు చేశారు. మొదటి నుండి స్వార్థం, సంకుచితత్వం, కుట్రలు, అడ్డదారి రాజకీయం, పదవీలాలస, ధనాశలను డిగ్రీలుగా పొంది చంద్రబాబు చేసిన నేరాలకు అంతే లేదు. ఎంతమందినో తొక్కుకుంటూ రాజకీయ నాయకుడిగా ఎదిగి ఎన్టీఆర్ అల్లుడిగా ఆ ఇంట్లో అడుగుపెట్టి చివరకు ఆ ఇంటి పెద్దనే కూల్చేశాడు. The Camel and Desert అనే కథ అతనికి పూర్తిగా వర్తిస్తుంది. అయినా సిగ్గులేదు, మార్పురాదు. ఎన్టీఆర్ చివరి దశను అత్యంత అవమానంగా, పెను విషాదంగా మార్చి ఒక రకంగా హత్యకు సమానమైన స్థితిని కల్పించిన ఈ ఘట్టాన్ని తెలుగువాళ్లు ఎప్పటికీ మర్చిపోకూడదనే మళ్లీ గుర్తు చేస్తున్నాను. మొదటినుండి పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు దగ్గుబాటి, నాదెండ్ల, నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఉపేంద్ర లాంటి వారిని తెలివిగా పక్కనపెట్టించి ప్రధాన కార్యదర్శి పదవితోపాటు సర్వాధికారాలతో 1986లో కర్షక పరిషత్తును తీసుకున్నాడు. ఈ చర్యను న్యాయస్థానం, ప్రజలు హర్షించలేకపోయారు. పర్యవసానం 1989లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రభుత్వ పతనం, రాజ్యాంగేతర శక్తిగా, అవినీతిపరుడిగా ఎన్టీఆర్ ప్రభుత్వానికి తీవ్ర కళంకం తెచ్చాడు. ఏడుపదుల వయస్సులో చూసుకునేవారు లేక, అనారోగ్యంతో అల్లాడుతూ 1993లో ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని వివాహం చేసుకుంటే నానారభస చేసి పెళ్లికి ముందూ, వెనుకా అతడు జరిపిన కుట్రలకు లెక్కేలేదు. పైకి వినయం నటిస్తూ 1994 ఎన్నికల్లో 60 మంది సభ్యులకు స్వయంగా డబ్బుపంచి తనతో ఉండాలని మాట తీసుకున్నాడు. అతని రాజగురువు రామోజీ లెక్కల ప్రకారం తెలుగుదేశం పార్టీ గెలవదని, వచ్చిన సీట్లలో తన 60మందిని వేరు చేసుకుని కాంగ్రెస్తో చేతులు కలపాలనే నిర్ణయంతో దుష్ట రాజకీయాలకు శ్రీకారం చుట్టాడు. ఈరోజు జగన్మోహన్రెడ్డి గారిమీద, ఆయన ప్రభుత్వంమీద ఎలాంటి నిందలు వేస్తున్నారో ఆరోజూ అలాగే జరిగింది. అందుకే ఎన్టీఆర్ ఈనాడు పత్రికను చెత్తబుట్టగా వర్ణించారు.1994 ఎన్నికల్లో వాళ్ల అంచనాలకు మించి ఎన్టీఆర్కు 222 సీట్లు... మిత్ర పక్షాలకు 36 సీట్లు రావటంతో అయోమయంలో పడ్డ గురుశిష్యులిద్దరూ ప్లాన్–2కు పన్నాగం పన్నారు. దానిలో భాగంగానే ఆయన ప్రజలకిచ్చిన హామీలు నెరవేరుస్తున్నప్పటికీ ఆయనమీద, ఆయన భార్యమీద విమర్శల దాడి మొదలయ్యింది. ఆమెనొక రాజ్యాంగేతర శక్తిగా, ఎన్టీఆర్ భార్యా లోలుడిగా, అసమర్థుడిగా వీళ్ల పేపర్లో అసహ్యమైన కార్టూన్లు వేయించి ప్రజలను తప్పుదారి పట్టించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద వర్గాలకు నవరత్నాల ద్వారా ఎన్నో మంచి పనులు చేస్తుంటే వాటిని ప్రజల మనస్సుల్లోకి వెళ్లకుండా రోజుకో గందరగోళం, మతపరంగా, ఇసుకపరంగా, అయినవాళ్లకే ఉద్యోగాలనీ, మూడు ప్రాంతాల అభివృద్ధిని అరాచకపు పాలనగా ఒకటా, రెండా ప్రభుత్వం ప్రారంభమై వారం తిరక్కుండానే వీళ్ల దుష్ట పన్నాగం మొదలయ్యింది. చంద్రబాబు చేసిన వెధవ పనులన్నిటినీ ఈ ప్రభుత్వానికి ఆపాదిస్తూ ఈ విష పత్రికల కూటమి ఎలా దండయాత్ర చేస్తున్నదో చూస్తూనే ఉన్నాం. 1994 నాటి పరిస్థితి పునరావృతమౌతున్నది. అదే సామాజిక వర్గం. అదే పెత్తందారీ వ్యవస్థ. అదే మీడియా. అదే గురుశిష్యులు. సామాజిక అభివృద్ధితో వీళ్లకు పనిలేదు. పేదవర్గాలంటే జాలి లేదు. మంచి పనులు చేసే నాయకులంటే అసలు పడదు. విస్తరించుకున్న అవినీతి సామ్రాజ్యాన్ని కాపాడుకోవటానికి ఎన్ని అల్లర్లయినా సృష్టిస్తారు. ఎన్ని హత్యలయినా చేస్తారు. వీళ్లను ఈ మీడియా కాపాడుతూనే ఉంటుంది. చెప్పాలంటే అష్టగ్రహ కూటమి అనే పదం సరిపోతుంది. అందుకే ఎన్టీఆర్ గవర్నమెంటును కూల్చటానికి వీళ్ల తాబేదారు యనమల రామక్రిష్ణుడు (ఈరోజు వేలకోట్లకు అధిపతి)కు స్పీకర్ పదవి ఇప్పించుకోవటంలో కృతకృత్యులయ్యారు. వీరి కుట్రల కోణాన్ని ఎన్టీఆర్ గుర్తించలేక అమాయకంగా నమ్మి మోసపోయారు. అత్యధిక మెజారిటీతో ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన ముఖ్యమంత్రిని 8 నెలల కాలం తిరక్కుండానే ఆయన భార్యను సాకుగా చూపించి 1995 ఆగస్టు 20న బహిరంగంగానే యుద్ధం ప్రకటించారు. ఆ సమయంలోనే ‘ఈటీవీ’ని ప్రారంభించారు. కుటుంబ సభ్యులకు విషం నూరిపోసి పార్టీ పగ్గాలు వారికే ఇస్తామని నమ్మబలికి చివరకు అధ్యక్ష పదవితోపాటు ముఖ్యమంత్రి పదవి కూడా కొట్టేశాడు. ఉప ముఖ్యమంత్రి పదవి మీద ఆశతో 40 మంది ఎమ్మెల్యేలతో వెళ్లిన దగ్గుబాటి చంద్రబాబు మోసానికి గురై వారం తిరక్కుండానే 14 మందితో తిరిగొచ్చి ఎన్టీఆర్ గూట్లో చేరాడు. ఆగస్టు 25న చంద్రబాబు హరిక్రిష్ణను వెంట బెట్టుకుని ఎన్టీఆర్ని కలిసి కొన్ని షరతులు పెట్టాడు. పార్వతిని వంటింట్లో ఉంచటం, ముద్దుక్రిష్ణను, బుచ్చయ్యచౌదరిని, నర్సింహుల్ని మంత్రి పదవుల్నుండి తొలగించటం లాంటి షరతుల్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించటంతో అనేక రంగులద్ది వీళ్ల పత్రికల్లో అభూతకల్పనలు రాయించారు. వైస్రాయ్కి క్యాంపును మార్చి ఎన్టీఆర్ను అధ్యక్ష పదవినుండి తొలగించి ఇటు ఢిల్లీ కాంగ్రెస్వారిని, అటు శాసన సభ్యులను మచ్చిక చేసుకున్నాడు. గవర్నరుకు రాష్ట్రపతి పదవి ఆశ చూపించి ఫోర్జరీ సంతకాలను ఒప్పించుకున్నాడు. దానికంటే ముందే ఆగస్టు 25వ తేదీన ఎన్టీఆర్ చంద్రబాబుతో సహా 5గురు మంత్రుల్ని పార్టీ నుండి సస్పెండ్ చేసిన లెటరు గవర్నరుకు పంపినా ఆయన దానిని బేఖాతరు చేసి చంద్రబాబుకే ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తర్వాత రోజుల్లో ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇప్పించుకున్నాడు. 1995 ఆగస్టు 26న ఎన్టీఆర్ చైతన్యరథం మీద ముఖ్యమంత్రి హోదాలో శాసన సభ్యులతో మాట్లాడటానికి వైస్రాయ్ హోటల్కు వెళ్తే ఆయనకు రక్షణగా ఒక్క పోలీసు కూడా లేడు. పైగా చంద్రబాబు ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ వ్యక్తులు పరిటాల రవి మీద, నెహ్రూ మీద దాడి చేసారు. ఎన్టీఆర్ వచ్చారని తెలిసి భయంతో చంద్రబాబు తన తోకలు ఎమ్మెల్యేలను ఉసిగొల్పితే వారు ఆయనమీద రాళ్లు, చెప్పులు వేసి అవమానం చేశారు. అవమానంతో కుంగిపోయిన ఎన్టీఆర్ కళ్లనీళ్లు పెట్టుకుంటూ ‘అల్లుడని గౌరవించినందుకు నాకింత ద్రోహం చేశాడు. దేశమంతా గౌరవించిన వ్యక్తిని చెప్పులతో అవమానించాడు. ఇదంతా వాడికి పట్టిన అధికార దాహం– తెలుగు పౌరుషాన్ని చాటిన మీ అన్న దుస్థితి చూడండి. ఎన్టీఆర్ ఎప్పుడో చావటం కాదు. చంద్రబాబు దుర్మార్గానికి ఇప్పుడే మరణించాడు’అని విలపించటంతో అక్కడకు వచ్చిన వాళ్లంతా కళ్లనీళ్లు పెట్టుకున్నారు. దానికి కూడా సానుభూతి రానివ్వకుండా లక్ష్మీపార్వతిమీద తోసేసారు. ఆగస్టు 31న ఎన్టీఆర్ తీవ్ర అనారోగ్యంతో మెడిసిటీ హాస్పిటల్లో చేరారు. గవర్నరును పంపి బలవంతపు రాజీనామా తెప్పించుకున్నారు. ఇక్కడ ఎన్టీఆర్ తీవ్రమైన బాధల్లో ఉంటే కుటుంబ సభ్యులందరూ చంద్రబాబుతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొన్నారు. పార్టీ పెట్టిన పెద్దకు కన్నీరు– చంద్రబాబుకు అధికారపు పన్నీరు. ఇక్కడ గుండెల్లో మంటలు– అక్కడ ఆనందోత్సవపు భోగిమంటలు. నమ్మిన విశ్వాసం నట్టేట ముంచింది, అన్నం పెట్టిన చెయ్యినే నరికింది. అయినవారే పరాయిగా మారి గుండె లోతుల్లో గునపాలు గుచ్చితే తట్టుకోలేని రోషం, అభిమానం ఆ మంటల్లో ఆహుతి అయ్యింది. మళ్లీ గెలిచి చంద్రబాబును అండమాన్ జైలుకు పంపుతానన్న తన ప్రతీకారాన్ని నెరవేర్చుకోకుండానే ఆ గుండె ఆగిపోయింది. తట్టుకోలేని అవమానం ఆ గుండెను ఆపేసింది. ‘ఇదిగో వీడే హంతకుడు. ప్రజలారా మీ అన్నను చెబుతున్నాను వినండి’ అంటూ ‘జామాతా దశమగ్రహం’ అనే ఆడియో రూపంలో, ‘ధర్మపీఠం’లో వీడియో రూపంలో తనను ఎంతో అభిమానంతో ఎన్నుకున్న తన తెలుగు ప్రజలకు ‘చివరి వీలునామా’గా అందించి 1996 జనవరి 18వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆ మహానుభావుడు అందరినీ దుఃఖంలో ముంచి వెళ్లిపోయాడు. మద్యపాన నిషేధం ద్వారా మహిళల కళ్లల్లో ఆనందం నింపిన ఆయన కళ్లు శాశ్వతంగా మూతపడ్డాయి. ఎవరు దేనికి కారకులు? తన అధికారం కోసం మామ చావుకు కారకుడైన ఈ వ్యక్తిమీద ఆయన ఆత్మ ప్రతీకారంతో రగులుతూనే ఉంది. జగన్మోహన్రెడ్డిగారు అతడిని చావుదెబ్బ కొట్టి 23 సీట్లకే పరిమితం చెయ్యడంతో బహుశా స్వర్గంలోని ఆయన ఆత్మ సంతో షిస్తూ ఉంటుంది. చంద్రబాబువంటి వ్యక్తుల్ని రాజకీయ రంగం నుండి పూర్తిగా తొలగిస్తే సమాజంలో శాంతి భద్రతలు వెల్లివిరుస్తాయి అని నమ్ముతూ... ఆశ్రువేదనతో... లక్ష్మీపార్వతి. (నేడు నందమూరి తారకరామారావు వర్ధంతి) నందమూరిలక్ష్మీపార్వతి వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ అధ్యక్షులు -
చంద్రబాబు ఆస్తుల కేసు విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హైదరాబాద్లోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక న్యాయస్థానంలో కేసు విచారణ ఈ నెల 20కి వాయిదా పడింది. చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో ఫిర్యాదు చేసిన నందమూరి లక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని శుక్రవారం నమోదు చేయాల్సివుంది. అయితే తన తరఫున సీనియర్ న్యాయవాది హాజరవుతారని, అప్పటి వరకూ కేసు విచారణను వాయిదా వేయాలని కోర్టును లక్ష్మీపార్వతి కోరారు. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని, దీనిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ లక్ష్మీపార్వతి 2005లో ఏసీబీ ప్రత్యేక కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. ఏసీబీ కోర్టు దీనిపై పూర్తిస్థాయిలో విచారణ ప్రారంభించ క ముందే చంద్రబాబు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసి తన వాదనలను కూడా వినా లని కోరారు. అందుకు కోర్టు అంగీకరించకపోవడంతో 2005లో హైకోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు పొందారు. స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ లక్ష్మీపార్వతి హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, సీనియర్ న్యాయవాది హాజరు నిమిత్తం విచారణను వాయిదా వేయాలని లక్ష్మీపార్వతి రెండోసారి చేసిన అభ్యర్థన మేరకు మళ్లీ విచారణ వాయిదా పడింది. -
వచ్చే జన్మలో అమెరికాలో పుడతామని చెప్పలేదా?
సాక్షి, తాడేపల్లి : పాదయాత్రలో హామీ ఇచ్చినట్టుగా నిరక్షరాస్యతను రూపుమాపేందుకు, పేద ప్రజలను లక్షలాది రూపాయల దోపిడీ నుంచి కాపాడేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నారని తెలుగు అకాడమి చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. శుక్రవారం తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడిన ఆమె ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుకు వ్యతిరేకంగా మాట్లాడేవారిపై విరుచుకుపడ్డారు. తెలుగు గురించి మాట్లాడే వాళ్లు తమ పిల్లలను ఎందుకు ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు తన కుమారుడిని, మనవడిని ఇంగ్లీష్ మీడియంలో చదివించలేదా? ఏబీఎన్ రాధాకృష్ణ తన కుమారుడిని తెలుగు మీడియంలో చదివించారా? అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇంకా ‘తెలుగు అంటూ గొంతు చించుకుంటున్న చంద్రబాబు తెలుగు అభివృద్ధికి చేసిందేమిటి? తెలుగు జాతి గౌరవాన్ని కాపాడిన ఎన్టీఆర్కు భారతరత్న అవార్డు కోసం ఎందుకు కృషి చేయలేదు? తెలుగుకు ప్రాచీన హోదా కోసం ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఎన్టీఆర్ మానసపుత్రిక తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఎందుకు రాష్ట్రానికి తేలేకపోయారు? ఉమ్మడి రాష్ట్రంలోనూ, ఇప్పటి ఆంధ్రప్రదేశ్లోనూ నారాయణ, చైతన్య స్కూళ్ల కోసం ఆరువేల పాఠశాలలను చంద్రబాబు మూయించారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా జరపలేదు. కనీసం పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించలేదు. భాషాప్రయుక్త రాష్ట్రాన్ని విడగొట్టమని పొలిట్బ్యూరోలో తీర్మానం చేసిన చంద్రబాబుకు తెలుగు గురించి మాట్లాడే అర్హత లేదు. వచ్చే జన్మంటూ ఉంటే తాను, వెంకయ్యనాయుడు అమెరికాలో పుడతామని చెప్పలేదా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీన్ని బట్టి తెలుగంటే చంద్రబాబుకు ఎంత ఇష్టం ఉందో తెలుసుకోవచ్చని లక్ష్మీపార్వతి విమర్శించారు. మరోవైపు తెలుగు రాని లోకేష్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించినా ఆ భాష కూడా సరిగా రాదని ఎద్దేవా చేశారు. ఇదికాక, ఇంగ్లీష్ మీడియంలో పట్టులేక అనేక మంది ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారని, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హిందీ, ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్లే ఉన్నత స్థానానికి ఎదిగారని ఆమె వ్యాఖ్యానించారు. -
లక్ష్మీపార్వతికి కీలక పదవి
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతికి కీలక పదవి దక్కింది. ఆమెను తెలుగు అకాడమీ చైర్పర్సన్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. లక్ష్మీ పార్వతి తెలుగు విశ్వవిద్యాలయంలో పీజీ చేశారు. 2000 సంవత్సరంలో ఆమె తెలుగు సాహిత్యంలో ఎమ్. ఎ పూర్తి చేశారు. -
బాబుకు తగిన శాస్తి జరిగింది
పంజగుట్ట: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని, ఆయనకు తగిన శాస్తి జరిగిందని వైఎస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని మంగళవారం నెక్లెస్రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఘాట్ వద్ద ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఏపీలో గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ జగన్ సరిదిద్దుతారని ఆమె తెలిపారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ..బాబు చేసిన ద్రోహంవల్లే ఎన్టీఆర్ చనిపోయారన్నారు. బాబు నమ్మకద్రోహి, ప్రజాద్రోహి అని అర్థం చేసుకున్నారని తెలిపారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని, ఆ పార్టీ నీది కాదన్న విషయం గ్రహించాలన్నారు. జగన్ ఫ్యాన్ గాలికి బాబు కొట్టుకుపోయారని, ఈ రోజు ఎన్టీఆర్ ఆత్మశాంతించిందని, ఆయన కోరిక నెరవేరిందన్నారు. తెలంగాణలో పార్టీ అంతరించింది, ఆంధ్రాలో కూడా అంతరించి పోతుందన్నారు. జగన్ నాయకత్వంలో ఎస్సీ, దళితులు, బడుగు, బలహీనులు బాగుపడతారని, ఎన్టీఆర్ ఆత్మ జగన్కు అండగా ఉంటుందన్నారు. నివాళులర్పిస్తున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రాం పలువురు ప్రముఖుల నివాళి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్, తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షులు ఎల్.రమణ, బ్రాహ్మణి, నందమూరి సుహాసిని, నందమూరి రామకృష్ణ, మాజీ కేంద్రమంత్రి దగ్గుపాటి పురందేశ్వరి తదితరులు ఎన్టీఆర్కు నివాళులర్పించారు. నారా బ్రాహ్మణి, టీడీపీ నాయకులు -
‘నేను మంగళగిరి అని స్పష్టంగా పలుకుతున్నా’
గుంటూరు: తాను మంగళగిరి అని స్పష్టంగా పలుకుతున్నా కానీ తన మనవడు నారా లోకేష్కి మంగళగిరి పలకడం ఇప్పటికీ రావడం లేదని వైఎస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. బుధవారం మంగళగిరి మండలం యర్రబాలెంలో వైఎస్సార్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి తరపున లక్ష్మీపార్వతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. మంగళగిరి ఆళ్ల రామకృష్ణా రెడ్డి అంటే తనకు చాలా అభిమానమని తెలిపారు. చంద్రబాబు గురించి చెప్పాలంటే అత్తే చెప్పాలన్నారు. స్వయంగా పిల్లను ఇచ్చి పెళ్లి చేస్తే, మామ ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి పదవి నుంచి దింపేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు. చంద్రబాబు ఒంటిపై ఎన్ని మచ్చలు ఉన్నాయో అన్ని నీచమైన రాజకీయాలు చేశాడని ఆరోపించారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చంద్రబాబు రాజధాని పేరుతో సింగపూర్ కంపెనీలకు భూమి అమ్మేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. రైతు సమస్యలపై నిరంతరం పోరాడిన, పోరాడుతున్న వ్యక్తి ఆళ్ల రామకృష్ణా రెడ్డి అని కొనియాడారు. చంద్రబాబుకి, జగన్కు చాలా తేడాలున్నాయన్నారు. జగన్ ప్రజల కోసం సొంత పార్టీ పెట్టి నడుపుతుంటే.. చంద్రబాబు మాత్రం మామయ్యను వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ పార్టీని తన సొంత పార్టీ అని చెప్పుకుంటున్నాడని ఆరోపించారు. జగన్పై అనేక కేసులు పెట్టినా ప్రజల కోసం పోరాడాడని, చివరికి జగన్పై హత్యాయత్నం కూడా చేయించిన నీచుడు చంద్రబాబు అని విమర్శనాస్త్రాలు సంధించారు. బాబుకి మతిమరుపు రోగం చంద్రబాబు నాయుడికి మతిమరుపు వ్యాధి వచ్చిందని, అందుకే కాసేపు ప్యాకేజీ కావాలంటాడు, కాసేపు ప్రత్యేక హోదా అంటాడని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ మతిమరుపుతో ఎన్నికలు అయిపోగానే మరిచిపోతాడని వ్యాఖ్యానించారు. తన కొడుకు మీద ప్రేమతో రూ.60 కోట్లు ఖర్చు పెట్టి స్టాన్ఫోర్డ్ గ్యాడ్యుయేట్ యూనివర్సిటీ నుంచి దొంగ సర్టిఫికేట్ తెప్పించాడని ఆరోపించారు. కనీస జ్ఞానం లేని వ్యక్తి తన మనవడు నారా లోకేష్ అని, ఏపీకి ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఎమ్మెల్యే అభ్యర్థిగా లోకేష్ని నిలబెట్టాడని ఆరోపించారు. లోకేష్ని ఎక్కడ నిలబెట్టాలో అర్ధం కాక చివరికి సింహం లాంటి ఆర్కేకు ప్రత్యర్థిగా నిలబెట్టారని అన్నారు. ఆర్కేకి సింహంలా పోరాడడమే వచ్చు కానీ గుంటనక్కల్లా రాజకీయం చేయడం తెలియదన్నారు. మరో నంద్యాలలా చేయాలని చూస్తున్నారు చంద్రబాబు నాయుడిలా నాలుగు పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం వైఎస్ జగన్కు తెలియదన్నారు. ప్రజల కోసం ఒంటరిగా పోరాడే వ్యక్తి జగన్ అని చెప్పారు. మంగళగిరి అన్ని నియోజకవర్గాల కంటే ప్రత్యేకమైనదన్నారు. మంగళగిరిలో ఆర్కే గెలిస్తే చరిత్ర సృష్టించినట్లేనని అభిప్రాయపడ్డారు. లోకేష్ని మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిపించాలని డబ్బును నీరులా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. మరో నంద్యాల ఉప ఎన్నికలా చేయాలని చూస్తున్నారని అన్నారు. అడ్డగోలుగా కుమారుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని డబ్బును విపరీతంగా పంచుతున్నారని అన్నారు. మంగళగిరి ప్రజలు నీతి నిజాయతీ గల వ్యక్తులు అని, ఎవరికి ఓటువేయాలో వారికి తెలుసునన్నారు. సింగపూర్ పారిపావాల్సిందే ఆర్కే లాంటి వ్యక్తి అన్ని నియోజకవర్గాల్లో ఉంటే ప్రజల సమస్యలు తీరతాయని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కాకుండా ఎవరూ ఆపలేరని, అలాగే ఆర్కే మంగళగిరి ఎమ్మెల్యే కాకుండా ఎవరూ ఆపలేరని జోస్యం చెప్పారు. ఎన్నికలు ముగిసిన తర్వాత తండ్రీకొడుకులు(నారా చంద్రబాబు, నారా లోకేష్) ఇద్దరూ సింగపూర్ పారిపోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడే ఆర్కే గెలిస్తే మంగళగిరి ప్రజలు గెలిచినట్టేనని అభిప్రాయపడ్డారు. -
పాతపట్నం.. కొత్తరూటు
సాక్షి, ఎల్ ఎన్ పేట, (శ్రీకాకుళం): పాతపట్నం.. జిల్లాలో అత్యంత చైతన్యవంతులైన ఓటర్లు ఉన్న ప్రాంతం. వరాహ వెంకట గిరిని జాతికి అందించిన గడ్డ ఇది. ఇరవై ఏళ్ల పాటు కాంగ్రెస్లో చక్రం తిప్పిన లుకలాపు లక్ష్మ ణదాస్ రాజకీయ ఓనమాలు దిద్దిందీ ఇక్కడే. చంద్రబాబు తన అనుచర గణాన్ని అంతా దింపినా లక్ష్మీపార్వతిని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించిన ప్రాంతమిది. ఈ సారి ఎన్నికల్లో టీడీపీ, వైఎస్సార్సీపీ హోరాహోరీ తలపడుతున్నాయి. ఇతర పార్టీలూ ఉన్నా ప్రధాన పోటీ ఈ రెండు పార్టీల మధ్యనే. గత ఎన్నికల్లో స్థానిక ఓటర్లు వైఎస్సార్సీపీకి పట్టం కడితే.. వారి అభిప్రాయాన్ని తుంగలో తొక్కేస్తూ కలమట వెంకటరమణ టీడీపీకి ఫిరాయించారు. ఈ అంశమే ప్రస్తుత ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేయబోతోందని స్థానికులంటున్నారు. అపురూప చరిత్ర.. పాతపట్నం నియోజకవర్గం 1952 నుంచి యాక్టివ్గా ఉంది. అప్పట్లో ద్విసభ్య శాసనసభగా ఉండేది. లుకలాపు లక్ష్మణదాస్, వీవీ గిరి నుంచి నేటి కలమట వెంకటరమణ వరకు దాదాపు పద్దెనిమిది మంది ఇక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేశారు. మొదట్లో కాంగ్రెస్పై అభిమానం చూపిన నియోజకవర్గ ప్రజలు అనంతరం ఎన్టీఆర్పై అపార ప్రేమ చూపించారు. వెన్నుపోటు ఎపిసోడ్ తర్వాత కూడా ఇక్కడి ప్రజలు ఎన్టీఆర్వైపే నిలబడ్డారు. అందుకు నందమూరి లక్ష్మీపార్వతి గెలుపే నిదర్శనం. ఎన్టీఆర్ తర్వాత వైఎస్సార్పైనే ఇక్కడి వారు మళ్లీ అంతటి ప్రేమ చూపించారు. 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన శత్రుచర్ల విజయరామరాజు గెలుపొందగా, 2014లో కలమట వెంకటరమణ వైఎస్సార్ జెండా పట్టుకుని గెలుపొందారు. అయితే ఆయన ఆ జెండాను దింపేసి టీడీపీ జెండాను నెత్తినెత్తుకున్నారు. రాజీనామా చేయకుండానే టీడీపీలోకి ఫిరాయించి జనాభిప్రాయాన్ని కించపరిచారు. మొత్తం ఓటర్లు: 2,16,221 పురుషులు: 1,08,606 మహిళలు: 1,07,594 ఇతరులు: 17 మొత్తం పోలింగ్ కేంద్రాలు : 316 ప్రధాన సమస్యలు.. అభివృద్ధికి నోచుకోని వంశధార నిర్వాసితుల పునరావాస కాలనీ వంశధార నిర్వాసితులదే ఇక్కడి ప్రధాన సమస్య. వైఎస్ హయాంలో ప్రాజెక్టు పనులు సజావుగా జరిగి, ప్యాకేజీలు, పునరావాలు కూడా ఎలాం టి గొడవలు లేకుండా జరిగాయి. కానీ టీడీపీ అధికారం చేపట్టాక ఈ పనుల్లో గందరగోళం మొదలైంది. పునరావాస ప్రాంతాల్లో ఇప్పటికీ తాగునీరు లేదు. ఇళ్లు లేవు. వారికి రేషన్లు, పింఛన్లు, ఓట్లు చాలా సదుపాయాలు మృగ్యమైపోయాయి. వీటిపై ప్రశ్నించాల్సిన స్థానిక ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అధికార పార్టీ పంచన చేరారు. దీంతో పాటు గిరిజన ప్రాంతం కూడా ఉన్న ఈ నియోజకవర్గంలో గిరిజనుల సమస్యలు చాలా వరకు అపరిష్కృతంగా ఉన్నాయి. విశిష్టతలు ♦ పాతపట్నం నుంచే రాజకీయ ఓనమాలు దిద్దిన వి.వి.గిరి (వరాహ వెంకట గిరి) కేంద్ర కార్మిక మంత్రి, భారత రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించారు. ♦ పాతపట్నం నుంచి గెలిచిన లుకలాపు లక్ష్మణదాస్ జిల్లా రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా వెలుగొందారు. ♦ 1989లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎన్టీఆర్ కృష్ణుడి వేషధారణలో ఉన్న కటౌట్ను ఏర్పాటు చేసి ప్రచారం చేసుకున్నందున టీడీపీ నుంచి గెలిచిన కలమట మోహనరావు ఎన్నికల చెల్లదంటూ అప్పటి ప్రత్యర్థి ధర్మాన నారాయణరావు (కాంగ్రెస్) కోర్టుకు వెళ్లడంతో 1996లో కలమట ఎన్నిక చెల్లదంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. ♦ 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో కలమట మోహనరావు సతీమణి వేణమ్మపై ఎన్టీఆర్ టీడీపీ తరఫున పోటీ చేసిన నందమూరి లక్ష్మీపార్వతి ఘన విజయం సాధించారు. లక్ష్మీపార్వతి విజయాన్ని అడ్డుకునేందుకు అప్ప టి ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి వర్గాన్ని అంతా దించినా నియోజకవర్గం చరిత్రలో అత్యధిక మెజార్టీని సాధించి లక్ష్మీపార్వతి ఎన్నికయ్యారు. కలమట కోటకు బీటలు 1978 నుంచి కలమట కుటుంబానికి కంచుకోటగా మారిన పాతపట్నం నియోజకవర్గంలో కలమట మోహనరావు ఐదు సార్లు, ఆయన కొడుకు కలమట వెంకటరమణమూర్తి ఒకసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. కానీ ఈ సారి ఆ కోటకు బీటలు పడనున్నట్లు తార్కాణాలు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి 2016లో అధికార టీడీపీలోకి ఫిరాయించిన కలమట వెంకటరమణను ఓడించాలనే ధ్యేయంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి రెడ్డి శాంతి 2016 నుంచి రాత్రి పగలు, కొండలు, నదులు అనే తేడా లేకుండా పల్లెపల్లెకు, గడప గడపకూ తిరిగారు. అన్ని వర్గాల వారితో కష్టసుఖాలు పంచుకున్నారు. దీనికి తోడు ఇసుక అక్రమ రవాణాలో కలమట అక్రమాలు జనాలకు తెలిసిపోయాయి. ఇవే ప్రస్తుత ఎలక్షన్లను ప్రభావితం చేయనున్నాయి. -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కి స్ఫూర్తి బాలకృష్ణ
‘‘ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ ఉంటుందని మనం చాలాసార్లు విన్నాం. అలాగే ప్రతి సినిమా వెనకాల ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి ఓ మనిషి ఎప్పుడైనా ఉంటాడు. అది స్టోరీ కాదు.. స్టోరీ ఐడియా కాదు.. స్క్రీన్ప్లే కూడా కాదు. ఒక వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లోంచి స్టార్ట్ అయిన ఒక ఐడియా ఫైనల్గా ఒక సినిమా అవుతుంది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వెనకాల నాకు ఆ స్ఫూర్తి ఇచ్చిన వ్యక్తి నందమూరి బాలకృష్ణ. ఆ వ్యక్తికి నేను ఈ సినిమా అంకితం ఇస్తున్నా’’ అని దర్శకుడు రామ్గోపాల్ వర్మ అన్నారు. అగస్త్య మంజు, రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఏ జీవీ ఆర్జీవీ ఫిల్మ్స్ సమర్పణలో రాకేష్ రెడ్డి–దీప్తి బాలగిరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో శుక్రవారం ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేశారు. రామ్గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఈ కథపై నాకు అంత అవగాహన లేదు. ‘వైశ్రాయ్ హాటల్’ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ‘రంగీలా’ సినిమా తీస్తూ బొంబాయిలో ఉన్నా. అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి హైదరాబాద్లో ఏం జరుగుతోంది అన్నది వాస్తవంగా నాకు తెలియదు. కానీ, బయోపిక్లు స్టార్ట్ అయ్యాక నేను కొంతమందిని కలిశాను. వాస్తవాల్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాలి కాబట్టి వాళ్లు ఇచ్చిన సమాచారంతో పాటు పరిశోధించా. బయోపిక్ తీయడానికి ముఖ్యంగా కావాల్సింది నిజాయతీ. ఎన్టీఆర్గారి జీవితంలోకి లక్ష్మీపార్వతిగారు వచ్చాక వారి బంధం నాలుగైదేళ్లు ఉంటే దాన్ని 2:30 గంటల సినిమాలో అన్ని విషయాలు చెప్పడం సినిమాటిక్గా సాధ్యం కాదు. అందుకే ఆ సోల్ అనేది మిస్ అవకుండా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించాం. అప్పటి సన్నివేశాలను కళ్లకు కట్టినట్టు చూపించాం. అందుకే ఈ సినిమా నా కెరీర్లో చాలా చాలా ప్రత్యేకం’’ అన్నారు. లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ– ‘‘ఆర్జీవీగారికి ఎంత రుణపడి ఉన్నానో నాకే అర్థం కావడం లేదు. 23 సంవత్సరాలుగా ఒక స్త్రీ నిరంతర వేదన, అవమానాలు గుండెల్లో పెట్టుకుని తన భర్తకు జరిగిన అవమానాన్ని గురించి బాధపడుతూ, కుమిలిపోతూ ఎవరు న్యాయం చేస్తారా? అని ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితుల్లో.. ఇక అలిసిపోయి ఇంతే ఈ జీవితానికి ఆ ఫలితం దక్కదు అనుకున్న సమయంలో.. ఆర్జీవీగారి రూపంలో న్యాయదేవత నా ముందు ప్రత్యక్షమైంది. నాకు సినిమా ప్రపంచం అస్సలు తెలీదు. ఇంతకుముందు ఆర్జీవీగారి ‘క్షణం క్షణం’ సినిమా చూశాను. ఆయన వ్యక్తిత్వం గురించి వింటున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసేది. తమదైన మార్గంలో తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ వెళ్లే ఇలాంటివాళ్లు సమాజాన్నే శాసించగలరు అనిపిస్తుంది. ఈ రోజు ఈ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా కూడా.. ఏ పాత్ర అయితే పనికిరాదు అని వాళ్లు అన్నారో.. ఏ పేజీలైతే చింపేయాలని కుటుంబం అంతా భావించిందో .. ఏ చివరి చరిత్ర అయితే ఎన్టీఆర్గారికి లేదు అని చెప్పి ఒక ముద్రవేయడానికి వాళ్ల మీడియా ద్వారా ఒక ప్రచారం చేశారో... ఆ పేజీలను తీసుకుని, ఆ చరిత్రను తీసుకుని నేను న్యాయం చేస్తానని ముందుకువచ్చిన ఆర్జీవీగారికి థ్యాంక్స్. ఈ రోజు ఎన్ఆర్ఐ రేడియో ఇంటర్వ్యూకి వెళ్లాను. ఫారిన్ నుంచి ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. ఆర్జీవీగారిలో ఓ హీరోను చూస్తున్నాం అన్నారు వారందరూ. ఈ సమాజంలో ఏ ఒక్కరూ చేయలేని న్యాయం ఆయన చేస్తున్నారు. ఇది ఒక లక్ష్మీపార్వతికే కాదు.. మహిళలందరికీ న్యాయం జరిగినట్లే అని వారు మాట్లాడుతుంటే ...æ గ్రేట్ ఆర్జీవీగారు. థ్యాంక్ఫుల్ టు యు’’ అన్నారు. ‘థర్టీ ఇయర్స్’ పృథ్వీ మాట్లాడుతూ– ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ చూడగానే నేను మాట్లాడాను. అతను వైసీపీ మనిషి అందుకే ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు అంటున్నారు. అలా మాట్లాడే వెధవలకు నేను ఒకటే చెబుతున్నాను. తప్పు జరిగింది కాబట్టే దర్శకుడు ఈ సినిమా తీశారు. దానికీ వైఎస్సార్సీపీ పార్టీకి సంబంధం ఏంటి? ఏదడిగినా ‘నేను చక్రం తిప్పాను, నేను అక్కడికి వెళ్లాను.. ఇక్కడికి వెళ్లాను’ అంటారు. 36 సంవత్సరాల క్రితం కాంగ్రెస్కు వ్యతిరేకంగా పార్టీ పెట్టి, కాంగ్రెస్ను ఓడించిన ఘనత ఎన్టీఆర్గారిది. ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ మడం తిప్పని నైజం, సంస్కృతికి చిహ్నం అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావుగారు, స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డిగారు. ఈ ఫేస్ను ఎవరు చూస్తారండి? ఎప్పుడు మాట్లాడినా మీరు నిజాలు మాట్లాడరు. రాజశేఖరరెడ్డిగారు అసెంబ్లీలో ఏం మాట్లాడారు. ‘అయ్యా చంద్రబాబు.. నువ్వు ఏ రోజూ నిజం మాట్లాడవు. ఒక మునీశ్వరుడి శాపం ఉంది నీ తలపై. నిజం మాట్లాడితే వెయ్యి ముక్కలు అవుతుందని’. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం అసలు కథ. ‘వైశ్రాయ్ సంఘటనకు’ నేనే సాక్ష్యం. అది చూసి నాకు కన్నీళ్లు వచ్చాయి. ఇంత నిబద్ధతగా డైరెక్టర్గారు చూపించిన వాస్తవాలు గొప్పా? మీరు మాట్లాడే అబద్ధాలు గొప్పా? అప్పట్లో సీడీలు లేవు. వీహెచ్ఎస్ క్యాసెట్లు ఉండేవి. ఈ సినిమా రిలీజ్ అయ్యేలోపు ఒరిజినల్ సీడీలు తీసుకొచ్చి చూపిస్తాను’’ అన్నారు. పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ– ‘‘భారతదేశంలో సినిమా పట్ల పరిపూర్ణ అవగాహన, కమాండ్ ఉన్న ఒకే ఒక వ్యక్తి రామ్గోపాల్ వర్మ. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాని బయటికి రానివ్వరు, ఫలానా పార్టీవాళ్లు ఆపేస్తారు.. సెన్సార్ వద్ద ఆపేస్తారు అని చాలామంది అంటున్నారు. ఇలాంటి వెధవ వేషాలు ఎందుకు. నువ్వు నిజాయతీగా ఉండొచ్చు కదా? నిజాయతీగా ఉండని, నీతిమంతమైన రాజకీయాలు చేయనివాడికి ఇలాంటి సమస్యలొస్తాయి. వాజ్పాయి, అద్వానీ, పుచ్చలపల్లి సుందరయ్య... ఇలా చాలామంది నిజాయతీపరులకు సమస్యలు రాలేదు కదా? బాధలు, కన్నీళ్లు అన్నవి అవినీతి పనులు చేసినవాడికి, వెధవ వేషాలు వేసినవాడికి, వెన్నుపోటు పొడిచినవాడికి వస్తాయి.. వాడే బాధపడుతుంటాడు. నవ్వు ఆ పనులు ఆ రోజు చేయకపోతే రాము ఈరోజు ఈ సినిమా తీయడు కదా? ఏ రామాయణమో, మహాభారతమో తీసుకుంటాడు కదా? నవ్వు వెధవ వేషాలు వేస్తే సినిమా తీయడానికి రాము రెడీగా ఉంటాడు. రాము తప్పు చేసినా తనపై తానే సెటైర్ వేసుకుంటాడు. తప్పు చేసినప్పుడు అంగీకరిస్తాడు. నువ్వు ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో ఉండి తప్పుడు పనులు చేస్తుంటే రాము ఎందుకు వదిలి పెడతాడు? నేను రాజకీయాల్లోకి వచ్చి సన్నాసి పనులు చేసినా రాముకి నన్ను తిట్టే హక్కు ఉంది. ఎందుకంటే అతను పౌరుడు. ఓటరు.. అడిగే హక్కు, ప్రశ్నించే హక్కు 100 శాతం ఉంటుంది. ఈ సినిమా జరిగిన కథ. సెన్సార్ నుంచి ఎటువంటి కట్స్ లేకుండా బయటికొస్తే ప్రజలు రియలైజ్ అవుతారు’’ అన్నారు.‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా కోసం ప్రపంచంలోని తెలుగు ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని అంతే విజయవంతం చేయాలి’’ అన్నారు నిర్మాత రాకేష్ రెడ్డి. ఈ వేడుకలో ‘‘ఆర్టీవీ గన్షాట్ ఫిల్మ్స్’ లోగోని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు కళ్యాణీ మాలిక్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, డైరెక్టర్ అజయ్ భూపతి తదితరులు పాల్గొన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు వర్మ బదులిస్తూ... ► ఎన్టీఆర్గారి బయోపిక్ చేద్దామని బాలకృష్ణ అన్నారు. లక్ష్మీపార్వతిగారి ఎపిసోడ్ లేకుంటే నేను చేయనన్నాను. ఆ సినిమా ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ ఉండాలన్న విషయంలో మా మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయి కానీ, కథ విషయంలో కాదు. ఒక విధంగా చెప్పాలంటే బాలకృష్ణ నన్ను సంప్రదించకపోయి ఉంటే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఐడియా నాకు వచ్చేది కాదు. ► నేను ఏ పార్టీ వ్యక్తిని కాదు. రాజకీయాలను పట్టించుకోను. అయితే ఈ స్టోరీలో రాజకీయాలున్నాయి కాబట్టి ఎవరికి నచ్చింది వారు మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా చేయొద్దని కొందరు బెదిరించారు. అలాంటి వారికి భయపడితే సినిమా తీయలేం. ఇప్పుడు సినిమా రిలీజ్ చేయొద్దని నన్ను బెదిరిస్తే మాత్రం నేను కూడా వాళ్లను బెదిరిస్తా. ► ఈ కథలోని విషయాలు అందరికీ తెలుసు. తెలియని విషయాలు నేను చెప్పడం లేదు. జనాలకు నిజం చెప్పడమే నా లక్ష్యంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీశా. నేను ఎన్టీఆర్గారికి వీరాభిమానిని. ఆయన జీవితంలో ‘వైశ్రాయ్’ సంఘటన ఎగై్జట్మెంట్ ఇచ్చింది కాబట్టే ఈ చిత్రం చేశా. ఇందులో ఎన్టీఆర్గారి ఔన్నత్యాన్ని ఎక్కడా తగ్గించలేదు. కొత్తవారికి ఏ ఇమేజ్ ఉండదు కాబట్టి పాత్రలు ఎలివేట్ అవుతాయి. అందుకే కొత్తవారిని తీసుకున్నాం. -
బాబును విలన్గా చూపించడం బాలకృష్ణ వల్ల కాదు
సాక్షి, తిరుమల: సీఎం చంద్రబాబునాయుడును ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమాలో విలన్గా చూపించడం బాలకృష్ణ వల్ల కాదని దివంగతనేత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి తెలిపారు. బుధవారం తిరుమల శ్రీవారిని విరామ సమయంలో ఆమె దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి ఆమెకు తీర్థ ప్రసాదాలను అందించారు. ఆలయం వెలుపల ఆమె మాట్లాడుతూ బాలకృష్ణ రెండు, మూడు పార్టులుగా సినిమా తీసినా ఎన్టీఆర్ జీవిత చరిత్ర సగమే ఉంటుందన్నారు. నిర్భయంగా ఎన్టీఆర్ అనుభవించిన ఆత్మక్షోభ రాంగోపాల్వర్మ తీస్తారన్నారు. 23 సంవత్సరాలుగా ఎన్టీఆర్కు జరిగిన అవమానంపై పోరాడుతున్నానన్నారు. చంద్రబాబు వెన్నుపోటు చర్యవల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని, నా కుటుంబం మొత్తాన్ని తనవైపు తిప్పుకుని నన్ను దూరం చేశాడన్నారు. ఎన్టీఆర్ కుటుంబం నన్ను ఒప్పుకోలేదని విమర్శించారని, కానీ ప్రభుత్వం వచ్చినప్పుడు నన్ను అందరూ అంగీకరించారన్నారు. ఆనాడు ఎన్టీ రామారావు కాంగ్రెస్కు వ్యతిరేకంగా టీడీపీ స్థాపించారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్కు వ్యతిరేకంగా జగన్ ఉన్నారు కాబట్టే ఆయనతో పాటు పోరాటం చేస్తున్నానని పేర్కొన్నారు. శ్రీవారి ఆశీస్సులతో ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా ముగిసిందన్నారు. సంకల్పయాత్ర అనంతరం గురువారం తిరుమలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తారన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజా ఆశీస్సులతో వైఎస్ జగన్ అఖండ విజయాన్ని సాధించాలని ఆకాంక్షించానన్నారు. ప్రజలకు అన్యాయం చేస్తున్నవారిని, అవినీతికి పాల్పడుతున్న వారిని ప్రజావ్యవస్థ నుంచే తొలగివెళ్లేలా చేయాలని స్వామివారిని కోరానన్నారు. రాష్ట్రానికి నూతన నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడాలన్నారు. 2 రోజుల క్రితం విడుదల చేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్లోని పాట తనను విమర్శించే విధంగా ఉందన్నారు. -
‘త్వరలోనే వెలుగులోకి లోకేష్ బండారం’
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై మరోసారి వైఎస్సార్సీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. నెల్లూరులో లక్ష్మీపార్వతి విలేకరులతో మాట్లాడుతూ..చంద్రబాబు వల్ల నందమూరి కుటుంబం మరోసారి మోసపోయిందని అన్నారు. ఓడిపోతామని తెలిసే కూకట్పల్లిలో నందమూరి సుహాసినిని టీడీపీ తరపున చంద్రబాబు పోటీలో నిలబెట్టారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో భారీగా దోపిడీ జరగుతోందన్నారు. రాజధాని, నీటి ప్రాజెక్టులలో అవినీతి ఏరులై పారుతోందన్నారు. ప్రతి పథకంలోనూ టీడీపీ నేతలు, కార్యకర్తలు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేల అవినీతికి హద్దే లేకుండా పోతోందని దుయ్యబట్టారు. అవినీతి సొమ్ముతో తెలంగాణాలో ప్రజలను కొనాలకున్నారు.. కానీ ఓటర్లు మాత్రం దిమ్మతిరిగేలా తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఓటర్లు చంద్రబాబును ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం వెల్లడించిన వివరాలతో ప్రజలు విస్తు పోతున్నారని అన్నారు. సోనియా గాంధీని ఇటలీ దెయ్యంగా వర్ణించిన చంద్రబాబు.. ఇప్పుడు ఆమెను దేవతగా భావిస్తున్నారని చెప్పి చంద్రబాబు తీరును ఎండగట్టారు. టీడీపీ నేతల అవినీతి బట్టబయలవుతోందని, సీఎం రమేష్, సుజానా చౌదరీల భాగోతం ద్వారా అది తెలిసిందన్నారు. త్వరలోనే లోకేష్ బాబు బండారం వెలుగులోకి వస్తుందన్నారు. చంద్రబాబు మీద చర్యలు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తోందన్నారు. -
ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతి నిరసన
-
‘కాంగ్రెస్తో దోస్తీ.. ఎన్టీఆర్ ఫొటో, పేరు వాడుకోవద్దు’
సాక్షి, హైదరాబాద్: ‘తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఎన్టీఆర్ టీడీపీని నెలకొల్పారు. కానీ, నీచ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నేడు కేంద్ర నాయకుల వద్ద వంగివంగి దండాలు పెడుతున్నాడు’ అని స్వర్గీయ నందమూరి తారక రామారావు భార్య లక్ష్మీపార్వతి అన్నారు. ‘ఎన్టీఆర్ భార్యగానే వచ్చాను. రాజకీయాలు చేయడానికి కాదు’ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్తో టీడీపీ పొత్తుపొట్టుకోవడాన్ని లక్ష్మీపార్వతి ఖండించారు. ఎన్టీఆర్కు చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచాడని నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని ఆమె నిరసన తెలిపారు. చంద్రబాబు దుష్టరాజకీయాలపై లక్ష్మీపార్వతి ఒక లేఖ రాసి ఎన్టీ రామారావు సమాధి వద్ద ఉంచారు. ఏనాడూ కేంద్రానికి దాసోహం అవకుండా, ఎవరికీ తలవంచకుండా ఎన్టీఆర్ పరిపాలన చేశారని గుర్తుచేశారు. నేడు కేవలం తన స్వార్ధం కోసం చంద్రబాబు కాంగ్రెస్తో జతకట్టారనీ, మహనీయుడయిన ఎన్టీఆర్ పేరుని కూడా ఉచ్ఛరించే అర్హత చంద్రబాబుకు లేదని లక్ష్మిపార్వతి ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఎన్టీఆర్ పేరు గానీ, ఫోటో గాని పెట్టుకొనే హక్కు టీడీపీ కోల్పోయిందని వ్యాఖ్యానించారు. -
హత్యా రాజకీయాలకు బాబు ట్రేడ్మార్కు
సాక్షి, హైదరాబాద్: హత్యా రాజకీయాలకు సీఎం చంద్రబాబు ట్రేడ్మార్క్ అని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. తన కుమారుడు నారా లోకేశ్ భవిష్యత్ కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను అంత మొందించేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని ఆమె ఆరోపించారు. ఆపరేషన్ గరుడ కూడా చంద్రబాబు పథకమేనని దుయ్యబట్టారు. లక్ష్మీపార్వతి సోమవారం హైదరాబాద్లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వెన్నుపోట్లు, హత్యా రాజకీయాలు, అవినీతి, అన్యాయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులను ప్రత్యక్షంగా ఎదుర్కోవడం చంద్రబాబుకు చేతకాదన్నారు. ఎన్టీఆర్ను టీడీపీ నుంచి సస్పెండ్ చేసి ఆయన్ని మానసిక క్షోభకు గురి చేశాడని గుర్తు చేశారు. ఆ తర్వాత ఆయన మరణానికి కారణమైన చంద్రబాబు.. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు చెప్పుకుని బతుకుతున్నాడని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ బతికే ఉండి ఉంటే చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలు చూసి ఆత్మహత్య చేసుకునేవారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబువన్నీ దగుల్బాజీ రాజకీయాలని.. వంగవీటి రంగా, దశరథరామ్తో పాటు అనేక మంది హత్యలతో చంద్రబాబుకు సంబంధాలున్నట్లు అప్పట్లో పత్రికలు కూడా చెప్పాయన్నారు. ప్లాన్ బెడిసి కొట్టిందనే ఢిల్లీ వెళ్లావా?: చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీకి చెందిన అనేక మంది నేతలను హత్య చేశారని.. చివరకు ఆయన చెంతకు చేరిన అరకు ఎమ్మెల్యే కిడారి కూడా హతమయ్యారంటే రాష్ట్రంలో పాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. ప్రజా సంకల్పయాత్రలో జగన్కు లభిస్తున్న జనాదరణను చూసి భరించలేక ఆపరేషన్ గరుడ అంటూ స్కెచ్ వేసి మట్టు బెట్టాలనుకున్నారని దుయ్యబట్టారు. దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ చంద్రబాబేనన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని అన్ని సర్వేలూ స్పష్టంగా చెబుతుండటంతో.. చంద్రబాబు ఈ ఆపరేషన్ గరుడను తెరపైకి తెచ్చాడని మండిపడ్డారు. జగన్పై హత్యాయత్నం జరిగిన గంటలోపే వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రకటన చేసిన డీజీపీ అసలు ఆ పదవికి అర్హుడేనా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతపై వేసిన ప్లాన్ బెడిసి కొట్టిందని ఢిల్లీకి వెళ్లావా? లేక రక్షణ కోసం వెళ్లావా? అని చంద్రబాబును ప్రశ్నించారు. -
దగాకోరు చంద్రబాబును నమ్మొద్దు
తూర్పుగోదావరి, పెద్దాపురం: నమ్మిన మామను వెన్నుపోటు పొడిచి నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావును మోసం చేసి, మొన్నటి ఎన్నికల్లో ప్రజలకు అబద్ధపు హామీలతో అందలమెక్కిన దగాకోరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని నమ్మవద్దని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టి ప్రజా సంకల్ప యాత్ర మూడు వేల మైలురాయి దాటిన సందర్భంగా జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గంలో కో–ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన జగనన్నకు తోడుగా పాదయాత్ర అనంతరం మండలంలోని చంద్రమాంపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజా సంకల్ప సభలో ప్రభుత్వ విధివిధానాలపై నిప్పులు చెరిగారు. దగాకోరు చంద్రబాబు వల్లే రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. అటు మామ, ఇటు స్నేహితుడైన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిల ఉసురు చంద్రబాబుకు తగలకపోదన్నారు. కో–ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు మాట్లాడుతూ అబద్ధపు హామీలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని, రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం త«థ్యమన్నారు. పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కర్రి వెంకటరమణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఆవాల లక్ష్మీనారాయణ, కంటే వీర్రాఘవరావు, గోపు నారాయణమూర్తిలు మాట్లాడుతూ రాజన్న రాజ్యం రావాలంటే జగన్ సీఎం కావాలన్నారు. -
చంద్రబాబుపై లక్ష్మీపార్వతి ఫైర్
పెద్దాపురం: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. పెద్దాపురంలో విలేకరులతో మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్లో అవినీతికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ బాబులేనని విమర్శించారు. అభివృద్ధి ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి హయాంలోనే జరిగిందని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనుల్లో రూ.37 వేల కోట్లు దారి మళ్లాయని కాగ్ నివేదిక ఇచ్చిందని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో 45 లక్షల హెక్టార్లలో పంట సంవృద్ధిగా సాగితే..చంద్రబాబు హయాంలో 30 లక్షల హెక్టార్లకు వ్యవసాయం పడిపోయిందని వెల్లడించారు. చంద్రబాబు ఇస్తానన్న కాపు రిజర్వేషన్లు అనేవి కంటి తుడుపు చర్యలేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలోనే హత్యా రాజకీయాలు జరిగాయని అన్నారు. 19 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను హత్య చేయించడం, అక్రమ కేసులు బనాయించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి అమరావతికి పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు, ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొని వ్యవసాయం గురించి మాట్లాడతాననటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులలో రూ.12 వేల 350 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అరకు మావోయిస్టుల కాల్పుల ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని వ్యాక్యానించారు. ఆంధ్రలో ఉన్న ఇంటెలిజెన్స్ను హైదరాబాద్లో వాడుకోవడం వల్లే ఇక్కడ మావోయిస్టుల సమాచారం తెలుసుకోవడంలో పోలీసులు విఫలం అయ్యారని విమర్శించారు. రాజధాని నిర్మాణంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. -
నాటా సభలకు లక్ష్మీపార్వతి
సాక్షి,హైదరాబాద్ : నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్(నాటా) ఉమెన్స్ ఫోరం ఆహాన్వం మేరకు అమెరికాలో ఈ నెల 6 నుంచి 8 వరకు జరిగే నాటా సభలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి గౌరవ అతిథిగా హాజరు కానున్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం ఫిలడెల్ఫియా వేదికగా నాటా మహాసభల్లో నిర్వహించే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమానికి హాజరవుతారు. ఈ నెల 10న డెట్రాయిడ్ చేరుకుని అక్కడ ట్రాయి అసోసియేషన్ వారిని కలుస్తారు. 15న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వారు ఏర్పాటు చేసే ఓ కార్యక్రమం లో పాల్గొంటారు. అక్కడ ఎన్టీఆర్ బయోగ్రఫీ ఫస్ట్పార్ట్ పుస్తకాన్ని విడుదల చేస్తారు. అక్కడ నిర్వాహకులు ఆమెకు సన్మానం చేయనున్నారు. తర్వాత వాషింగ్టన్ డీసీలో వైఎస్సార్సీపీ నేత రమేశ్ రెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. 25న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. -
పిల్ల కాంగ్రెస్ టీడీపీయే అని స్పష్టమైంది
-
హాస్యానికి చిరునామా బ్రహ్మానందం
నాంపల్లి : శ్రీ ప్రఖ్య ఆర్ట్స్ (సంగీత సుధా వేదిక), అభినయ కూచిపూడి కళాక్షేత్రం సంస్థ 18వ వార్షికోత్సవాలను బుధవారం రవీంద్ర భారతి ప్రధాన వేదికపై నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ప్రఖ్య ఆర్ట్స్ లలిత కళా పురస్కారాన్ని ప్రఖ్యాత హాస్యనటుడు డాక్టర్ బ్రహ్మానందంకు అందజేశారు. ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్య అతిథిగా నటి జమున హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బ్రహ్మానందాన్ని పురస్కారంతో సత్కరించి ప్రసంగిం చారు. బ్రహ్మానందం హాస్యం.. బ్రహ్మాండంగా ఉంటుందని కొనియాడారు. కార్యక్రమంలో సినీ పరిశోధకులు, సంగమం సంస్థ వ్యవస్థాపకులు సంజయ్ కిషోర్, ప్రఖ్య ఆర్ట్స్ కార్యదర్శి జయశ్రీ పాల్గొన్నారు. సభా ప్రారంభంలో జయశ్రీ శిష్య బృందం నిర్వహించిన స్వర మాధురి అలరించింది. -
స్వర్ణయుగం నుంచి నేటి దాకా!
రాయల స్వర్ణయుగాన్ని దాటి చక్రవర్తుల కోటల మీదుగా, జమీందార్ల సంస్థానాలను స్పృశిస్తూ పురోగమించినది తెలుగు భాష. వందల ఏళ్ల బానిసత్వాన్ని ఎదిరించి కవుల కలాల్నే ఖడ్గంగా మార్చుకుని పోరాడింది మన భాష. ఈ నెలలో తెలంగాణ రాష్ట్రంలో వైభవంగా జరుగుతున్న ప్రపంచ తెలుగు సభలకు విచ్చేస్తున్న దేశ విదేశ తెలుగు ప్రముఖులందరికీ సాదర స్వాగతం. తెలుగు భాషకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు. పాశ్చాత్య భాషా పండితులు కూడా తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా ఎందుకు ప్రశంసించారంటే, ఏ భాషలో లేని అందం చందం, కమనీయత, రమణీయత మన తెలుగు భాషకే సొంతం. అన్ని భాషలను అవలీలగా కలుపుకు పోగల గొప్ప సాంప్రదాయిక సౌగంధం, విశ్వజనీనమైన విశాలభావం మన భాషకు సహజంగా అబ్బిన లక్షణం. ఏ భాషా పదమైనా మన తెలుగు భాషలో హాయిగా ఒదిగించుకోగలిగిన సంస్కారం దీని సొంతం. మనకు తెలియకుండానే మనం ప్రతిరోజూ మాట్లాడే తెలుగు భాష ద్వారా.. ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ, పారశీక, సంస్కృత, ప్రాకృత పదాలను అలవోకగా ఉచ్చరిస్తుంటాం. తెలుగు, హిందీ, సంస్కృత భాషలు మొత్తం 56 అక్షరాలను ఉపయోగించడం వల్లనే భాషకు అంత పరిపుష్టి కలిగిందని పండితుల వాదం. దానికి కారణం సమగ్రత్వమే. 2,500 సంవత్సరాల నాటి ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్ర ప్రసక్తి ఉండటం వల్ల దీని ఆధారంగానే తెలుగుభాష మొన్ననే ప్రాచీనహోదాను దక్కించుకున్నది. మొదట్లో గాలిపాటగా, మాటగా పుట్టిన తెలుగు భాష ఎప్పటికప్పుడు గాలిలో కలిసిపోతుండేది. అయితే హాలుడు ప్రాకృత భాషలో రాసిన గాథాసప్తశతిలో తెలుగు పదాలు వాడినందువల్ల అప్పటికి కొంత జానపదుల వ్యవహారంలో ఉన్నట్లు అర్థమౌతుంది. ‘గాధాసప్తశతి’ రాసిన హాల చక్రవర్తి, ‘బృహత్కథామంజరి’ రచిం చిన గుణాఢ్యుడు ఆంధ్రులని చెబుతున్నా, వీరి రచనలు ప్రాకృతంలోనే ఉండేవి. అప్పటికి తెలుగు భాష కవిత్వ భాషగా ఎదగకపోవడమే దీనికి కారణం. ఆ తర్వాత వెయ్యేళ్లపాటు జానపదుల గీతాల్లో, శాసనాల్లో, ఆస్థానాల్లో, అంతఃపురాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ, రాజరాజనరేంద్రుడి కాలం నాటికి కావ్యభాషగా అవతరించింది. ఆనాడు వాడుకలో ఉన్న సంస్కృతం, ప్రాకృతం, పాళీ మొదలైన భాషల పదాలను తనలో విలీనం చేసుకుని, విస్తృతి చెందింది. బౌద్ధ, జైన మతాల ప్రచారం కూడా ఈ భాషాభివృద్ధికి దోహదం చేసింది. ఇలా ద్రావిడ భాషా కుటుంబం నుంచి పుట్టిన తెలుగు సంస్కృత భాషా సంగమంలో పరిపుష్టి చెంది, ఆర్య ద్రావిడ భాషల సమ్మిళితమైన తియ్యని తేనెలూరు తెలుగు భాషగా అవతరించింది. శాతవాహనుల తర్వాత కొంతకాలానికి తెలుగుదేశాన్ని పాలించిన రేనాటి చోళులు మొట్టమొదటిసారిగా తెలుగుభాషను శాసనాలలో వాడటం మొదలెట్టారు. అప్పటినుంచి దినదినాభివృద్ధి చెందుతూ పల్లవులు, చాళుక్యులు, చోళులు మొదలైన రాజుల ప్రాపకంలో రాజ భాషగా ఎదిగి 11 వ శతాబ్దం నాటికి సర్వాంగసుందరంగా రూపొంది, గ్రంథ రచనకు అనువైన భాషగా మన తెలుగు భాష అవతరించింది. 11వ శతాబ్దంలో తెలుగుదేశాన్ని పరిపాలించిన తెలుగు రాజు రాజరాజనరేంద్రుడు మాతృభాషలో గ్రంథరచనకు ప్రోత్సహించడంతో ప్రపంచ సాహిత్యంలోనే అతి పెద్దగ్రంథంగా పంచమవేదంగా ప్రశంసలందుకున్న మహాభారత రచన నన్నయచేతిలో అక్షరరమ్యతతో మొదలైంది. నాటి ఆదికావ్యం నుంచి నేటి ఆధునిక కావ్యాల వరకు శాఖోపశాఖలుగా విస్తరించిన మన తెలుగు సాహిత్యానికి అక్షర రమ్యతతో అందాలు పొదిగాడు నన్నయ్య. తేటతెలుగుల నాటకీయతతో నాణ్యాలుదిద్దాడు తిక్కన. ప్రబంధకవితా రసాలతో రంగులద్దాడు ఎర్రన. పలుకు పలుకులో జాను తెలుగుల కులుకులు నేర్పాడు సోమన్న. భక్తిరసంతో మోక్షానికి సోపానాలు పరిచాడు పోతన. ఇక తెలుగు సాహిత్యానికి పట్టం కట్టిన వారుగా శ్రీకృష్ణదేవరాయలు, గణపతి దేవుడు చరిత్రలో మిగిలిపోతారు. ఎందరో మహాకవులు ఈ భాషా వృక్షాన్ని ఆశ్రయించి చరిత్రపుటల్లో నిలిచిపోయారు. నాచన సోముడు, గోనబుద్ధారెడ్డి, వేములవాడ భీమకవి, శ్రీనాథుడు, పింగళి, అల్లసాని మొదలైన కవులు, మొల్ల, రంగాజమ్మ వంటి కవయిత్రుల లేఖిని నుంచి రమణీయ ప్రబంధ సాహిత్యరూపంలో అవతరించింది మన తెలుగు భాష. రాయల స్వర్ణయుగాన్ని దాటి చక్రవర్తుల కోటల మీదుగా, జమీందార్ల సంస్థానాలను స్పృశిస్తూ, పురోగమించినది తెలుగు భాష. వందల ఏళ్ల బానిసత్వాన్ని ఎదిరించి కవుల కలాల్నే ఖడ్గంగా మార్చుకుని పోరాడింది మన భాష. ఈనాడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో విజయకేతనం ఎగురవేస్తున్నది. ఎందరో విదేశీయులు తెలుగు భాషలోని తియ్యందనానికి ముగ్ధులై ఈ భాషను నేర్చుకోవడమే కాకుండా దీని గొప్పతనాన్ని కీర్తిస్తూ అనేక వ్యాసాలు రాశారు. పరిశోధనలు చేశారు. నిఘంటువులు వెలువరించారు. వారిలో ముఖ్యులు సీపీ బ్రౌన్, డా. కార్వే, డా. కాంప్బెల్, డా. కాల్డ్వెల్ మొదలైనవారు. ఆధునిక కవులు గురజాడ, కందుకూరి, జాషువా, రాయప్రోలు, శ్రీశ్రీ, ఆరుద్ర, సినారె లాంటి అభ్యుదయవాదులు, ఎన్టీఆర్, వైఎస్సార్ వంటి తెలుగుతల్లి ముద్దుబిడ్డలు ఈ జాతికి, భాషకు పోరాటాలు నేర్పారు. ఆత్మగౌరవాన్ని అందించారు. వారి బాటలో రెండు తెలుగు రాష్ట్రాలు భాషా వికాసానికి కృషి చేయాలి. అప్పుడే తెలుగు రాష్ట్రాల ఔన్నత్యాన్ని కాపాడుకోగలుగుతాం. (డిసెంబర్ 15–19 తేదీల్లో హైదరాబాద్లో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా) - డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి వ్యాసకర్త సాహితీవేత్త, వైఎస్సార్సీపీ నాయకురాలు -
నాపై సినిమా తీస్తే కోర్టుకెళతా : లక్ష్మీపార్వతి
సాక్షి, విజయవాడ : అనుమతి తీసుకోకుండా తన జీవితంపై సినిమాలు తీస్తే కోర్టును ఆశ్రయిస్తానని ఎన్టీఆర్ సతీమణి, వైఎస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి హెచ్చరించారు. ప్రచారం కోసం పాకులాడుతోన్న కొందరు తనను అవమానించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని, ఎట్టిపరిస్థితుల్లోనూ వారిని అడ్డుకుంటానని చెప్పారు. ఆదివారం విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘నన్ను ఇబ్బంది పెట్టినా భరిస్తాను. నాకు పోరాటాలు కొత్తకాదు. కానీ నా భర్త పరువుప్రతిష్టలకు భంగం వాటిల్లితేమాత్రం ఊరుకునే సమస్యేలేదు. అనుమతి తీసుకోకుండా నాపై సినిమా తీస్తే కోర్టును ఆశ్రయిస్తాను. అయితే ఎన్టీఆర్కు జరిగిన అన్యాయంపై ఎవరు సినిమాలు తీసినా స్వాగతిస్తాను’ అని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. తెలుగుతేజం, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవితగాథ ఆధారంగా పలువురు దర్శక నిర్మాతలు సినిమాలు తీయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటిలో బాలకృష్ణ హీరోగా తేజ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న సినిమా ఒకటికాగా, రాంగోపాల్వర్మ ప్రకటించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మరొకటి. ఈ మధ్యే దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి తాను ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు. ఆయా సినిమాల్లో ఎన్టీఆర్నుగానీ, తనను గానీ అవమానించాలనే ఉద్దేశంతో తీస్తే ఊరుకోబోనని లక్ష్మీపార్వతి హెచ్చరించారు. ఎన్టీఆర్కు జరిగిన అన్యాయంపై తీస్తే స్వాగతిస్తాను -
జాబ్ లేదు.. కానీ, కొడుక్కి మంత్రి పదవి
కాకినాడ: ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దారుణంగా మోసం చేశాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. ఇంటికో జాబ్ సంగతి ఏమోగానీ తన కొడుక్కి మాత్రం మంత్రి పదవి ఇచ్చుకున్నారని ఆమె తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటి కూడా ఆయన అమలు చేయలేకపోయారని ఆమె అన్నారు. ఇక రిజర్వేషన్ల పేరుతో కాపులను దారుణంగా మోసం చేశారని, పైగా ఉద్యమం చేస్తున్న ముద్రగడను ఇంట్లో నిర్భంధించి వేధిస్తున్నారని తెలిపారు. కాకినాడ ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించి చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని కాపులకు లక్ష్మీపార్వతి పిలుపునిచ్చారు. -
ఇన్నారెడ్డి నివాసంలో వైఎస్ఆర్సీపీ-కాన్బెర్రా సమావేశం
కాన్బెర్రా : ఆస్ట్రేలియాలో వైఎస్ఆర్సీపీ-కాన్బెర్రా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మాన్క్రిఫ్లోని వైఎస్ఆర్సీపీ నాయకులు ఇన్నా రెడ్డి నివాసంలో వైఎస్ఆర్సీపీ-కాన్బెర్రా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అక్కడికి హాజరయిన వైఎస్ఆర్సీపీ నేతలను ఉద్దేశించి లక్ష్మీపార్వతి మాట్లాడారు. ఈ సమావేశంలో ఇన్నారెడ్డితోపాటూ వైఎస్ఆర్సీపీ నాయకులు రాజశేఖర్, రాజ్కుమార్ బద్దం, జగన్ జంబుల, స్టానిస్ బెనెడిక్ట్, వరుణ్, శౌరీ రెడ్డి, సంపత్, ఈశ్వర్ రెడ్డి, రాకేష్లు పాల్గొన్నారు. -
‘పట్నం’కు ఎన్టీఆర్ ఎక్సలెన్సీ అవార్డు
అనంతపురం కల్చరల్ : నగరానికి చెందిన ప్రసిద్ధ నాట్యాచార్యులు డాక్టర్ పట్నం శివప్రసాద్ ఎన్టీఆర్ ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపికయ్యారు. నందమూరి లక్ష్మీపార్వతీ నేతృత్వంలో శిఖరం ఆర్ట్స్ అకాడమీ వారు వివిధ రంగాల్లో విభిన్న కృషి చేస్తున్న వారికి అందించే పురస్కారాన్ని పట్నం ఈనెల 26న హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగే పురస్కార మహోత్సవంలో అందుకోనున్నారు. అదేవిధంగా ఆయన శిష్యబృందం రాష్ట్రస్థాయి సాంస్కృతిక సంబరాల్లో అనంత తరపున శాస్త్రీయ నృత్య ప్రదర్శన చేస్తారు. -
ఎన్టీఆర్పై చెప్పులేయించిన నీచుడు చంద్రబాబు
విజయవాడ: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్పై చెప్పులేయించిన నీచుడు చంద్రబాబు నాయుడని ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి విమర్శించారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. మంగళవారం విజయవాడలో జరుగుతున్న వైఎస్ఆర్ సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె ప్రసంగించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాళ్లు పట్టుకుని కేసు మాఫీ చేయించుకున్న చంద్రబాబు ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. -
'చంద్రబాబుకు డైరెక్ట్ పాలిటిక్స్ చేతకాదు'
కర్నూలు: ఒక్క ప్రాజెక్టు కూడా కట్టని ఘనచరిత్ర చంద్రబాబుదని వైఎస్సార్ సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి అన్నారు. స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన జలదీక్షకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రజల సొమ్ముతో చంద్రబాబు జల్సాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడికి వెళ్లాలన్న విమానాల్లోనే వెళ్తున్నారని చెప్పారు. చంద్రబాబుకు వెన్నుపోటు రాజకీయాలు తప్పా డైరెక్ట్ పాలిటిక్స్ చేతకాదని ఎద్దేవా చేశారు. చిదంబరం కాళ్ల మీద పడి జగన్ పై కేసులు బనాయించారని ఆరోపించారు. నీచులతో చేతులు కలిసి జగన్ ను జైలుకు పంపారన్నారు. అవినీతికి పెద్దపీట వేయడంలో చంద్రబాబు ముందున్నారని దుయ్యబట్టారు. కోట్లతో ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు. గెలిచిన పార్టీకి వెన్నుపోటు పొడిచి ఫిరాయింపు ఎమ్మెల్యేలు మరో వెన్నుపోటుదారు వద్దకు వెళుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజల మేలు కోసమే జగన్ ఆలోచిస్తున్నారని, ప్రజా సంక్షేమం కోసం ఆయన ఎన్నో దీక్షలు చేశారని గుర్తు చేశారు. జననేత ప్రజలతోనే ఉన్నారని, ప్రజలకు ఎప్పుడు దూరంగా లేరని చెప్పారు. అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ఎలా కొనాలా అని నారా లోకేశ్ ఆలోచిస్తున్నారని లక్ష్మీపార్వతి విమర్శించారు. -
'జీవితమంతా మోసాలేనా.. కాస్త మారండి'
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికీ, అధికారంలో ఉన్న పార్టీకే మంచి ప్రయోజనం. అయినా వాళ్లు గట్టిగా కేం ద్రాన్ని అడగలేకపోతున్నారు. ప్రతిపక్ష నేతగా ఎంతో బాధ్యతతో ప్రత్యేక హోదా కోసం ఆరు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న జగన్ కోమాలోకి వెళ్లే పరిస్థితి ఉంటే.. ఆయనకేదో మంచి పేరు వస్తుందన్న దుగ్ధతో దీక్షపైనే ప్రజలలో అనుమానాలు కలిగించడానికి ఈ సీఎం, మంత్రులు నీచమైన ఆలోచనలు చేయడం దుర్మార్గం’’ అని వైఎస్సార్సీపీ నాయకురా లు నందమూరి లక్ష్మీపార్వతి దుయ్యబట్టారు. ఆ మె సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు జీవితమంతా మాయ మాటలతో మాయ చేస్తూనే వస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ను మోసం చేశారు. మొన్నటి ఎన్నికల ముందు ప్రజలకు మోసపు మాటలు చెప్పే అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ప్రతిపక్ష నేత చేపట్టిన దీక్ష విషయంలో ప్రజల తప్పుదారి పట్టించేలా మాట్లాడుతున్నారు. ఇలా ఇంకెంతకాలం బతుకుతారో ఏమో’’ అని విమర్శించారు. ఇప్పటికైనా కొంచెం మారి, మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటే కనీసం ఎన్టీఆర్ ఆత్మయినా శాంతిస్తుందని సలహా ఇచ్చారు. ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీకి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. -
'మందిని ముంచినవారు మాట్లాడుతున్నారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా డిమాండ్తో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరమని లక్ష్మీ పార్వతి అన్నారు. నైతిక హక్కులేని వారంతా వైఎస్ జగన్ ఆరోగ్యంపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రత్తిపాటి పుల్లారావు, మంత్రి గంటా శ్రీనివాసరావుల గురించి ఎవరికీ తెలియని విషయం లేదని, ప్రత్తిపాటి పుల్లారావు మందిని ముంచినవారేనని, తక్కువ ధరలకే రైతుల భూములు ఆక్రమించుకున్నారని, వారి పత్తి పంట సొమ్ములు తన ఖాతాలోకి వేసుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసపూరిత హామీలతో అధికారంలోకి వస్తే రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి కోసం చిన్నవాడైనా వైఎస్ జగన్ అనేక దీక్షలు, ధర్నాలతో ముందుకు వెళుతున్నారని చెప్పారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ లాగా ఎవరూ శ్రమించలేదని పేర్కొన్నారు. ఆయనను చూసైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు. గాంధీ అనుసరించిన మార్గాన్ని వైఎస్ జగన్ఎంచుకున్నారని, నిరవధిక దీక్ష అంటే అమరణ నిరాహార దీక్షేనని, అలాంటి దీక్షను అవమాన పరుస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని విస్మరిస్తారా.. అందుకేనా ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది అని ప్రశ్నించారు. నీతి ఆయోగ్ పేరిట ప్రత్యేక హోదా అడ్డుకుంటున్నారని, నాడు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని సభలో అడిగిన వెంకయ్యనాయుడికి ఇప్పుడు ఆ విషయం ఎందుకు అర్థం కావడంలేదో అని అన్నారు. కేవలం 4,200 కోట్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ కు ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చిందని, కాని తెలంగాణ 5,145కోట్లు కేంద్రం నుంచి సాధించుకుందని చెప్పారు. -
'అబద్ధాల పోటీలో చంద్రబాబుకే ఫస్ట్ ర్యాంక్'
గుంటూరు: అబద్ధాల పోటీ పెడితే ప్రపంచంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదటి స్థానంలో ఉంటాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మీ పార్వతి అన్నారు. ఆయన అబద్ధాల్లో గిన్నీస్ బుక్లోకి కూడా ఎక్కుతాడని విమర్శించారు. ఆంధప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద నిరవధిక నిరాహార దీక్ష బుధవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ దీక్ష రెండో రోజుకు చేరిన సందర్భంగా అక్కడికి వచ్చిన లక్ష్మీ పార్వతీ మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ దీక్షకు అనూహ్యమద్దతు వస్తుందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యక్రమాలకు అక్రమంగా కోట్లు ఖర్చుపెట్టి వాహనాలు ఏర్పాటు చేస్తున్నా వచ్చేందుకు ఆసక్తి చూపని జనం.. వైఎస్ జగన్ దీక్షకు మాత్రం భారీ సంఖ్యలో తరలి వస్తున్నారని చెప్పారు. వైఎస్ జగన్ చేస్తున్న దీక్ష ప్రజలకే కాకుండా రైతులకు ఓ ధైర్యం అని చెప్పారు. మరోపక్క, దీక్షకు మద్దతుగా గుంటూరు జిల్లా బార్ అసోసియేషన్ మద్దతు తెలిపింది. భారీ సంఖ్యలో న్యాయవాదులు దీక్ష ప్రాంగణానికి చేరి వైఎస్ జగన్కు సంఘీభావం తెలిపారు. -
'అబద్ధాల పోటీలో చంద్రబాబుకే ఫస్ట్ ర్యాంక్'
-
ఇదీ మా అల్లుడు 'బాబు' ఘనచరిత్ర
-
ఇదీ మా అల్లుడు 'బాబు' ఘనచరిత్ర
గుంటూరు: అల్లుడి ఘన చరిత్ర తెలియాలంటే.. అత్తనే అడగాలని వైఎస్ఆర్ సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి అన్నారు. చంద్రబాబు నాయుడికి సంబంధించిన పలురహస్యాలను ఆమె 'సమర దీక్ష' వేదికగా ఆమె బయటపెట్టారు. 10 లక్షలు తీసుకుని ఎన్టీ రామారావు కూతురిని పెళ్లి చేసుకుని అల్లుడైపోయాడని ఆమె చెప్పారు. ఒకటో తరగతిలో ఉండగానే పక్కన పిల్లాడి దగ్గర బలపం కొట్టేశాడని, అప్పుడు వాళ్ల టీచర్ కొట్టారని ఆమె తెలిపారు. కేజీ బేసిన్లో ఓఎన్జీసీ ద్వారా గ్యాస్ నిక్షేపాలు బయటపడినప్పుడు రిలయన్స్తో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు 34 వేల కోట్ల ఒప్పందం చేసుకున్నాడని లక్ష్మీపార్వతి వెల్లడించారు. దీంట్లో 30 వేల కోట్లు మోదీకి పంపాలి, 4 వేల కోట్లు ఉంచుకుంటానన్నాడు. కానీ చివరికి 4 వేలకోట్లు గుజరాత్కి పంపి, 30 వేలకోట్లు తను ఉంచుకున్నాడని చెప్పారు. అల్లుడు చరిత్ర అత్తకే కదా తెలిసేది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సమర దీక్ష రెండోరోజున చంద్రబాబుకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. వెధవా నువ్వు చేస్తున్నది పనికిమాలిన పని అని టీచర్లు గానీ, తల్లి గానీ ఎవరో ఒక్కరైనా చెప్పి ఉంటే రాష్ట్రానికి ఈ దౌర్భాగ్యం పట్టి ఉండేది కాదు అని చంద్రబాబుపై లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. ఆమె ఇంకా ఏమన్నారంటే.. ''ఇప్పటివరకు ఎవ్వరూ చెప్పని రహస్యాలు నాకు తెలుసు. వీడు ఒకటో క్లాసు చదువుకునేటప్పుడే పక్క పిల్లల బలపాలు కాజేసి టీచర్ దగ్గర దెబ్బలు తిన్నాడు. కాలేజీకి వచ్చాక క్లాస్మేట్ల జేబుల్లో డబ్బులు కాజేసి రెండుసార్లు పోలీసు స్టేషన్లకు వెళ్లాడు. తర్వాత ఎన్టీఆర్ 10 లక్షలిస్తే.. కూతురిని పెళ్లి చేసుకుని అల్లుడైపోయాడు. ఈ వేదిక మీద ఆకలి కేకలున్నాయి.. ఆ వేదిక మీద అధికార కాంక్షలున్నాయి. ఈ వేదిక మీద సింహం ఉంది. అక్కడేమో నక్కలున్నాయి. మా అల్లుడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. చాలా బాధపడుతున్నాను.. ఇంత మొద్దోడు అనుకోలేదు. ప్రజాబ్యాలెట్లో వందకి సున్నా మార్కులు తెచ్చుకున్నవాడిని చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. నాకైతే, రెండు మొట్టికాయలు మొట్టి వెధవా.. బాగా చదువు అని చెప్పాలనిపిస్తోంది. చంద్రబాబుకు జరిగిన అవమానానికి సంతాపం తెలియజేస్తున్నాను. మనవడైనా గట్టివాడు ఉంటాడేమో అనుకుంటే.. అబ్బిగాడికి అబ్బిగాడే పుడతాడని తేలింది. ఒబామాతో ఫొటో దిగడానికి 6 లక్షలు ఖర్చుపెట్టాడు. మా మనవడు లోకేశ్.. ఒబామాకే స్మార్ట్ సిటీలు ఎలా ఉండాలో చెప్పాడని బిల్డప్పిచ్చారు. తండ్రికి తగ్గ కొడుకే పుట్టాడని అప్పుడు అనుకున్నాను.'' -
ఎన్టీఆర్కు భారతరత్నను అడ్డుకున్నది బాబే!
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిల బెట్టిన ఎన్టీఆర్కు భారతరత్న రాకుండా అడ్డుకున్నది చంద్రబాబేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసినప్పుడు ఎన్టీఆర్కు భారతరత్న ఇప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నించలేదని విమర్శించారు. మంగళవారం ఢిల్లీవచ్చిన లక్ష్మీపార్వతి ఏపీభవన్లో మీడియాతో మాట్లాడారు. -
జగన్ ను డిస్టర్బ్ చేయలేరు: లక్ష్మీపార్వతి
-
అవినీతి సామ్రాట్ చంద్రబాబే: లక్ష్మీపార్వతి
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత నారా చంద్రబాబు అవినీతి సామ్రాజ్యానికి చక్రవర్తి వంటి వారని ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి దుయ్యబట్టారు. చంద్రబాబును మించిన అవినీతిపరుడు ఈ ప్రపంచంలో మరెవరూ ఉండరంటూ స్వ యంగా ఆయన మామ దివంగత ఎన్.టి.రామారావు చెప్పిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. చంద్రబాబు అవినీతిపై ‘బాబు జమానా - అవినీతి ఖజానా’ అనే పుస్తకాన్ని కమ్యూనిస్టు పార్టీ, ‘వంద తప్పులు’ అంటూ బీజేపీ పుస్తకాలను ప్రచురించాయన్నారు. అటువంటి వ్యక్తి అవినీతి గురించి ప్రసంగాలు ఇవ్వడం తగదని లక్ష్మీపార్వతి ఎద్దేవాచేశారు. సోమవారం ఆమె తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నీతిమంతుడైతే ఆరోపణలపై విచారణకెందుకు సిద్ధపడట్లేదని ప్రశ్నించారు. -
ఆర్టీసీలో ఇక రెగ్యులరే!
నియామకాల్లో ‘కాంట్రాక్టు’ విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి, డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలన్నీ రెగ్యులర్ విధానంలోనే జరుగనున్నాయి. అయితే, నిర్ణీత గడువు వరకు మాత్రం అప్రెంటిస్ లేదా ట్రెయినీగా పనిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రత్యేకంగా నిర్ణయాలేమీ తీసుకోకుండానే వారి సర్వీసు క్రమబద్ధీకరణ జరుగుతుంది. సోమవారం రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన రవాణా, ఆర్థిక శాఖల కార్యదర్శులు, ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్థసారథి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేష్, ఆర్టీసీ ఎండీ ఎ.కె.ఖాన్, ఆర్టీసీ ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన భేటీలో అధికారులతో పాటు గుర్తింపు సంఘం ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) నేతలు కూడా పాల్గొన్నారు. కాగా, ప్రస్తుతం ఆర్టీసీలో పనిచేస్తున్న కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్ల సర్వీసును వచ్చే ఏడాది ఆఖరులోగా క్రమబద్ధీకరించడానికి చర్యలు తీసుకుంటామని బొత్స హామీ ఇచ్చారు. కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టడానికి, భవిష్యత్లో ఆ విధానాన్ని కొనసాగించడానికి వీలుగా ఉత్తర్వులు ఇవ్వడానికి అంగీకరించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రతిపాదనపై అధ్యయనం చేయడానికి కమిటీ ఏర్పాటు చేస్తూ గతంలో జారీ చేసిన జీవోను సవరించి, మరింత స్పష్టతతో జీవో ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామన్నారు. తొలి విడత 9,518 మంది క్రమబద్ధీకరణ: ఎన్ఎంయూ సీమాంధ్ర జిల్లాల్లో సమ్మె విరమణ సందర్భంగా కుదిరిన ఒప్పందం మేరకు తొలివిడతలో 9,518 మంది కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్లను క్రమబద్ధీకరించడానికి మంత్రి బొత్స అంగీకరించారని ఎన్ఎంయూ అధ్యక్షుడు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మహమూద్ తెలిపారు. -
జనమే జగన్ వద్దకు వచ్చారు: లక్ష్మీ పార్వతి
-
విభజనను ఆపండి: లక్ష్మీపార్వతి
సాక్షి, హైదరాబాద్: దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు సహేతుకం కాదని ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, రూపాయి పతనంతో కొత్తగా ఏర్పడే రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిని కోరారు. లక్ష్మీపార్వతి సోమవారం సచివాలయంలో సీఎంను కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల వరకూ రాష్ట్ర విభజనను ఆపాలని సీఎంను కోరినట్టు చెప్పారు. అసెంబ్లీని సమావేశపరిచి ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని కోరానన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుందని, దీన్ని మేధావులెవరూ హర్షించడం లేదన్నారు. రాష్ట్రాన్ని విభజించాలన్న డిమాండ్తోనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీలో నిరాహార దీక్ష చేశారని చెప్పారు. సమన్యాయం అంటున్నారే తప్ప రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చంద్రబాబు ఏనాడు కోరలేదని పేర్కొన్నారు. విభజనకు అనుకూలంగా కేంద్రమంత్రి పురంధేశ్వరి మాట్లాడడం దివంగత ఎన్టీఆర్ను, ఆయన వంశాన్ని అవమానపరచడమేనన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం ఎవరు పోరాడినా తన మద్దతుంటుందని, ఈనెల 26న వైఎస్సార్సీపీ హైదరాబాద్లో నిర్వహిస్తున్న ‘సమైక్య శంఖారావం’ సభలో పాల్గొంటానని చెప్పారు. -
తెలుగువారిలో చిచ్చుపెట్టారు: లక్ష్మీపార్వతి
సాక్షి , హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయం ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, సోనియాగాంధీ తెలుగువారి మధ్య చిచ్చు పెట్టారని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి విమర్శించారు. ఇన్నాళ్లు కలసిమెలసి ఉన్న తెలుగువారి నడుమ వైషమ్యాలు, విద్వేషాలను సోనియా రెచ్చగొట్టారని మండిపడ్డారు. ఆంధప్రదేశ్ నుంచి 32 మంది ఎంపీలను గెలిపించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకిచ్చే బహుమానం ఇదేనా అని ప్రశ్నించారు. సమైక్యాంధ్రప్రదేశ్ కోరుతూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు చేపట్టిన ఆందోళనకు లక్ష్మీపార్వతి మద్దతు పలికారు. బుధవారం సచివాలయంలో ఉద్యోగుల ఆందోళనలో ఆమె పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర విభజన పాపంలో అన్ని పార్టీల పాత్ర ఉందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ రాష్ట్ర విభజన నిర్ణయం ప్రకటించిందన్నారు. రాష్ట్ర విభజన ద్వారా నష్టపోయేది విద్యార్థులు, ఉద్యోగులేనని.. వారి ఆందోళనలు ఏమాత్రం పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం శోచనీయమన్నారు. 1969లో ఇందిరాగాంధీ తెలంగాణ ఏర్పాటును బలంగా వ్యతిరేకిస్తే, ఆమె కోడలు సోనియాగాంధీ ఇప్పుడు స్వప్రయోజనాల కోసం తెలుగు వారిని చీల్చుతున్నారని విమర్శించారు. ఎనిమిదిన్నర కోట్ల మంది తెలుగువారి రాతను నలుగురు పరభాషీయులు నిర్ణయించడం తెలుగువారికి పట్టిన దౌర్భాగ్యమన్నారు. కేవలం నలుగురు స్వార్థపరులు, సోమరిపోతుల ఉద్యమానికి 120 ఏళ్ల చరిత్ర కలదని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ మోకరిల్లిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబునాయుడు ఆనాడు కేసీఆర్కు మంత్రి పదవి ఇచ్చుంటే తెలంగాణ ఉద్యమమే ఉండేది కాదన్నారు. 50 ఏళ్లుగా హైదరాబాద్ నగరాన్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకున్నామని, ఇప్పుడు సీమాంధ్రులను వెళ్లిపొమ్మనే హక్కు ఎవరికీ లేదన్నారు. రాష్ట్ర విభజన వల్ల విద్య, ఉద్యోగాలు, విద్యుత్, నీరు.. ఇలా లెక్కకు మించి సమస్యలు తలెత్తుతాయని, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు.