local
-
లోకల్ హిట్టర్స్..
ఒకప్పుడు ఆదివారం వస్తే చాలు ఉదయం చాయ్ తాగి ఇంట్లో నుంచి బయటకు వెళ్తే సాయంత్రం ఆరు గంటల వరకూ కూడా ఇంటికి రాకుండా క్రికెట్ ఆడిన రోజులు పాత తరం యువతకు చాలామందికి అనుభవమే. అలాగే క్రికెట్ చూడాలంటే కనీసం 5 నుంచి 7 కి.మీ. ప్రయాణించి టీవీ చూసి వచ్చిన రోజులూ ఉన్నాయి.. క్రికెట్ అంటే అంత పిచి్చ.. అంత అభిమానం ఉండేది. ఇప్పుడు కూడా ఆ అభిమానం అస్సలు మారలేదు. కానీ రూపు మార్చుకుంది. గల్లీ క్రికెట్ కాస్త పోష్ క్రికెట్ అయ్యింది. అకాడమీల్లో గంటకు కొంత డబ్బులు చెల్లించి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నారు. అంతేనా లోకల్ మ్యాచ్ల నుంచి జాతీయ స్థాయి మ్యాచ్ల స్థాయికి చేరుతున్నారు. రోజుకు కనీసం 8 గంటల పాటు ప్రాక్టీస్ మెళకువలతో పాటు ఫిట్నెస్పై దృష్టి బౌండరీలు దాటుతున్న లోకల్ టాలెంట్ ఐపీఎల్ వరకూ ఎదిగేందుకు అడుగులు క్రికెట్.. భారతదేశంలో ఒక మతం. దేశంలో క్రికెట్ను ఆరాధించని వారు లేరంటే అతిశయోక్తి కాదు. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు చిన్నా పెద్దా, ఆడా మగ తేడా లేకుండా టీవీలకు అతుక్కుపోతుంటారు. క్రికెట్ ఆడటం అంటే చిన్నప్పటి నుంచే క్రేజ్. గల్లీ క్రికెట్లో ఆడుతూ మంచి షాట్ కొడుతూ తమను తామే సచిన్ టెందుల్కర్, విరాట్కోహ్లి అనుకుంటూ సంబరపడిపోతుంటారు. అయితే ఒకప్పుడు క్రికెట్ అంటే కేవలం వినోదం కోసం చూడటమో.. ఆడటమో చేస్తుండేవారు. కానీ నేటి తరం క్రికెట్ను కూడా తమ కెరీర్గా మార్చుకుంటున్నారు. క్రికెట్ కాస్త ఖరీదైన వ్యవహారమే అయినా.. ఎలాగైనా కష్టపడి రంజీ లేదా ఐపీఎల్ ఆడి తమ సత్తా చూపాలని తాపత్రయపడుతున్నారు. అందుకోసం చిన్నతనం నుంచే గ్రౌండ్లో చెమటలు చిందిస్తున్నారు. ఎప్పటికైనా జాతీయ స్థాయిలో ఆడకపోతామా అనే ధీమాతో ముందుకు వెళ్తున్నారు. క్రికెట్ను కెరీర్గా చేసుకునే వారికి చాలా నిబద్ధతతో శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్లు నగరంలో భారీగా వెలిశాయి. అసలు కోచింగ్ సెంటర్లు పిల్లలను క్రికెటర్లుగా ఎలా మలుస్తున్నాయి.. ఎన్ని గంటల పాటు వారికి శిక్షణ ఇస్తున్నాయి.. ఎలా కష్టపడితే ఐపీఎల్ లేదా జాతీయ స్థాయిలో ఆడేందుకు అవకాశం వస్తుంది.. అనే విషయాలను తెలుసుకుందాం..! ఏడో యేటనుంచే.. సాధారణంగా క్రికెట్ ఆకాడమీల్లో పిల్లలు ఏడేళ్ల వయసు నుంచే చేరుతుంటారు. అందరూ క్రికెట్ను కెరీర్గా మలచుకునేందుకు చేరరు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు ఫిట్గా ఉండాలనే ఉద్దేశంతో చిన్నతనంలోనే క్రికెట్ అకాడమీల్లో చేరి్పస్తుంటారు. మిగిలిన వారంతా క్రికెటర్లుగా చూడాలనే ఉద్దేశంతోనే అకాడమీల్లో చేరి్పస్తుంటారు. మొదటి రెండేళ్ల వరకూ టెన్నిస్ బాల్, ప్లాస్టిక్ బాల్తో ఆడిస్తారు. 12 ఏళ్లు దాటిన తర్వాత లెదర్ బాల్తో నెట్స్లో ఆడిస్తుంటారు. ఈ సమయంలోనే బ్యాచ్లుగా వేరు చేసి, వారి ఆట తీరునుబట్టి తరీ్ఫదు ఇస్తుంటారు. కష్టపడితే ఎన్నో అవకాశాలు.. క్రికెట్లో రాణించడం ఒకప్పుడు డబ్బులపైనే ఆధారపడి ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. కష్టపడి మంచి ఆటతీరు కనబరిస్తే ఎంతో ఎత్తుకు వెళ్లే అవకాశాలు ఉంటాయని పలువురు కోచ్లు చెబుతున్నారు. టాలెంట్ ఉన్న వారికి అవకాశాలు ఎదురుచూస్తూనే ఉంటాయని, ఎట్టిపరిస్థితుల్లో కుంగిపోకుండా ముందుకు వెళ్లాలని చెబుతున్నారు.ఒక్కో రోజు ఒక్కో సెషన్.. సాధారణంగా క్రికెట్ ఆడాలంటే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని అంశాల్లో ప్రత్యేకంగా శిక్షణ పొందాల్సి ఉంటుంది. రోజుకో అంశంలో పిల్లలకు కోచ్ శిక్షణ ఇస్తుంటారు. ఒక రోజు బ్యాటింగ్ అయితే మరో రోజు బౌలింగ్, ఇంకో రోజు నాకింగ్, ఫీల్డింగ్లో ప్రాక్టీస్ చేయిస్తుంటారు. క్యాచ్లు పట్టే విధానంలో కూడా మెళకువలు నేరి్పస్తుంటారు. దీంతో పాటు క్రికెట్ ఫిట్నెస్ కూడా ముఖ్యం. ఇందులో భాగంగా జంపింగ్స్, ఫాస్ట్ రన్నింగ్, డ్రిల్స్ చేయిస్తుంటారు.అకాడమీ ఎంచుకునే ముందు..చాలా అకాడమీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఈ ట్రెండ్ను క్యాష్ చేసుకునేందుకు కొందరు ప్రయతి్నస్తున్నారు. ఇలాంటి వారి వద్ద చేరితే సమయంతో పాటు డబ్బు కూడా వృథా అవుతుంది. కమర్షియల్గా, బాక్స్ క్రికెట్ మాదిరిగా ఉండే అకాడమీలు కూడా ఉన్నాయి. అందుకే అకాడమీల్లో చేరేముందు అది ఎలాంటి అకాడమీ.. వాళ్లు ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు.. ఎంత సమయం ప్రాక్టీస్ చేయిస్తారు అనే విషయాలు ముందే చూసుకుని చేరి్పస్తే మంచిదని పలువురు శిక్షకులు సూచిస్తున్నారు.భారత్ తరపున ఆడించాలనే లక్ష్యంతో.. ప్రతి అకాడమీ కూడా తమ పిల్లలను భారత జట్టులో చూసుకోవాలన్నదే లక్ష్యంగా పెట్టుకుంటాయి. అందుకోసం వారు మెళకువలు నేర్చుకోవడంతో పాటు వాటిని పిల్లలకు నేరి్పస్తుంటారు. ప్రతి వారం మ్యాచ్లు పెట్టి వారి ఆటతీరును పరిశీలిస్తుంటారు. సీజనల్ మ్యాచ్లు అంటే జూన్–జులైలో జరిగే వన్ డే, టూడే, త్రీడే లీగ్ మ్యాచ్లకు కూడా వెళ్లి పాల్గొంటారు. హెచ్సీఏ నుంచి జరిగే లీగ్ మ్యాచ్లలో బాగా ఆడితే అండర్–14, –16, –19 స్టేట్ టీమ్స్కు ఆడే అవకాశం వస్తుంది. అక్కడ ఎవరైనా మంచి పెర్ఫార్మెన్స్ చేస్తే రంజీ ఆడే అవకాశం ఉంటుంది.రోజుకు ఎనిమిది గంటల ప్రాక్టీస్ క్రికెట్ అకాడమీల్లో చాలావరకూ ఉదయం 5– 5.30 గంటల నుంచే దినచర్య ప్రారంభం అవుతుంది. రెండు గంటల పాటు ప్రాక్టీస్ చేస్తుంటారు. ఆ తర్వాత కాసేపు బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత మళ్లీ ప్రాక్టీస్ చేస్తుంటారు. మళ్లీ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ రాత్రి 7 గంటల వరకూ ప్రాక్టీస్ చేస్తుంటారు. బౌలింగ్ మెషీన్స్, నెట్ సెషన్స్, సైడ్ ఆర్మ్ ప్రాక్టీస్ చేస్తుంటారు. వీరి వెన్నంటే ఉండే కోచ్లు ఎప్పటికప్పుడు వారికి ఆటలో తప్పులు అర్థం చేసుకుని ఆటగాళ్లు ఆడే విధానంలో మార్పులు చేస్తుంటారు. ఎక్కడైనా టోర్నమెంట్స్కు వెళ్లినప్పుడు వేరే అకాడమీ లేదా వేరే జట్టు ఆటగాళ్లు ఆడే తీరును కూడా పరిశీలించి.. తమ అకాడమీ పిల్లల ఆటలో ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుందనే విషయాలను వారికి చెబుతుంటారు. ఇలా రోజులో కనీసం 8 నుంచి 9 గంటల పాటు గ్రౌండ్లోనే ప్రాక్టీస్ చేస్తూ ఎప్పటికప్పుడు తమ ఆటతీరును అప్డేట్ చేసుకుంటారు. క్వాలిఫైడ్ ట్రైనర్స్తో.. క్రికెట్ కోసం చాలా మంది అకాడమీకి వస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ శిక్షణ ఇస్తుంటాం. దాదాపు 15 మంది మా అకాడమీ నుంచి రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ అయ్యారు. వారికి ఎప్పటికప్పుడు ఆటలో మెళకువలు నేర్పించేందుకు క్వాలిఫైడ్ ట్రైనర్స్ ఉంటారు. మానసికంగా కూడా వారికి కావాల్సిన మద్దతు ఇస్తుంటాం. – కల్యాణ్, క్రికెట్ కోచ్, కూకట్పల్లి ఆసక్తి చూపుతున్న అమ్మాయిలు.. ఇటీవల కాలంలో అమ్మాయిలు కూడా క్రికెట్పై ఎంతో ఆసక్తి చూపుతున్నారు. వారికి కూడా అబ్బాయిలతో పాటు సమానంగా అకాడమీ నుంచి శిక్షణ ఇస్తుంటాం. కావ్యశ్రీ అనే అమ్మాయి ఇటీవల సీనియర్ వుమెన్స్ రంజీ ట్రోఫీలో ఆడుతున్నారు. ఆమెతో పాటు మరో నలుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు స్టేట్ లెవల్ టీమ్స్లో ఆడే అవకాశం దక్కించుకున్నారు. వారిలో ఒకరినైనా ఇండియా జట్టులో చూడాలనేదే మా ఆశ. – తలకంటి సతీశ్రెడ్డి, ఎంఎస్డీ క్రికెట్ అకాడమీ, మేడిపల్లి -
ఏడు రైల్వే స్టేషన్ల పేర్లు మార్పు
ముంబై: మహానగరం ముంబైలోని ఏడు లోకల్ స్టేషన్ల పేర్లు త్వరలో మారనున్నాయి. ముంబైలోని మెరైన్ లైన్స్ స్టేషన్ను ఇకముందు ముంబా దేవి స్టేషన్గా పిలవనున్నారు. ఈ స్టేషన్ పేరును మార్చడం వల్ల ముంబా దేవి దర్శనానికి వెళ్లే భక్తులకు ఎంతో సౌలభ్యంగా ఉండనుంది.ముంబైలోని ఏడు స్థానిక రైల్వే స్టేషన్ల పేర్లను మార్చే ప్రతిపాదనను మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆమోదించింది. దీంతో ఈ ప్రతిపాదనను రైల్వే మంత్రిత్వ శాఖకు పంపనున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే రైల్వే స్టేషన్ల పేర్లను మార్చనున్నారు. మెరైన్ లైన్ను ముంబా దేవిగా, కర్రీ రోడ్డును లాల్బాగ్గా, సాండ్హర్స్ట్ రోడ్డును డోంగ్రీగా, చర్ని రోడ్డును గిర్గావ్ స్టేషన్గా మార్చనున్నారు. అలాగే కాటన్ గ్రీన్ స్టేషన్కు కాలాచౌకీ అని, డాక్యార్డ్ రోడ్డును మజ్గావ్గా, కింగ్ సర్కిల్ను తీర్థంకర్ పార్శ్వనాథ్ స్టేషన్గా మార్చనున్నారు.ఈ ప్రతిపాదనను రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి చంద్రకాంత్ పాటిల్ సమర్పించారు. ఇది ఏకగ్రీవంగా ఆమోదంపొందింది. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నాయి. దీనికి అనుమతి లభించిన వెంటనే ఈ స్టేషన్ల పేర్లను మార్చనున్నారు. -
మళ్లీ ‘లోకల్’ ఫైట్: మెడపట్టి రైలులో నుంచి..
ఢిల్లీ మెట్రో- ముంబై లోకల్ మధ్య వైరల్ వీడియోల వార్ జరుగుతోంది. రీల్స్ చేయడం మొదలుకొన్ని ప్రయాణికులు పరస్పరం తన్నుకునేవరకూ ఇలా లెక్కలేనన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజా వీడియో ముంబై లోకల్ ట్రైన్కు సంబంధించినది. వేగంగా వెళుతున్న రైలులో డోరు దగ్గర నిలుచున్న ఇద్దరు ప్రయాణికుల మధ్య వివాదం చేటుచేసుకోవడాన్ని వీడియోలో చూడవచ్చు. ముంబై మేటర్స్ పేరుతో ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసిన ఈ వీడియోలో ఇద్దరు ప్రయాణికులు రైలు డోర్ దగ్గర నిలుచుని ఉండటం కనిపిస్తుంది. వారిద్దరూ ఏదో విషయమై గొడవపడుతుంటారు. ఇంతలో ఒక వ్యక్తి తన ఎదురుగా ఉన్న వ్యక్తి గొంతుపట్టి అతనిని రైలు నుంచి బయటకు నెట్టివేసేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఆ వ్యక్తి ట్రైన్ గ్రిల్ పట్టుకుని తనను తాను కాపాడుకుంటాడు. దీనిని చూసిన రైలులోని తోటి ప్రయాణికులు పెద్దగా కేకలు పెడతారు. ఈ వీడియోను చూసినవారికి తృటిలో ప్రమాదం తప్పిందని అనిపిస్తుంది. ఈ వీడియో వైరల్ అయిన నేపధ్యంలో పలువురు యూజర్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ ముంబై మెట్రోలో ఇది నిత్యకృత్యమై పోయిందని కామెంట్ చేయగా, మరొక యూజర్ ‘ఇంత చిన్న గొడవకే ప్రాణాలు తీసుకుంటారా?’ అని ప్రశ్నించాడు. ఇది కూడా చదవండి: ఈ ఆమ్లెట్ తింటే లక్ష.. కండీషన్స్ అప్లై! Commuter Fights inside speeding #MumbaiLocal trains that too near the Open Doors (Gate) is very very Risky. Whenever the much promised conversion of all the Mumbai local trains into AC Local trains (with doors) happens, commuters can fight in cool comfort without sweating &… pic.twitter.com/d8KCxYc9Np — मुंबई Matters™ (@mumbaimatterz) October 11, 2023 -
‘స్థానిక’ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా
సాక్షి, అమరావతి: ఎన్నికలు ఏవైనా రాష్ట్రంలో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం నగర కార్పొరేషన్ మేయర్ స్థానంతో పాటు నందిగామ మున్సిపల్ వైస్ చైర్మన్, రెండు ఎంపీపీ, మూడు వైస్ ఎంపీపీ స్థానాలకు సోమవారం జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ విజయం సాధించింది. మచిలీపట్నం నగర కార్పొరేషన్ మేయర్గా వైఎస్సార్సీపీకి చెందిన 43వ వార్డు మెంబర్ సీహెచ్ వెంకటేశ్వరమ్మ ఎన్నికయ్యారు. నందిగామ మున్సిపల్ వైస్ చైర్మన్గా వైఎస్సార్సీపీ తరుఫున గెలిచిన ఒకటో వార్డు మెంబర్ పాకాలపాటి కృష్ణ ఎన్నికైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం వెల్లడించింది. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం, లింగాల ఎంపీపీగా అలవాలపాటి రమాదేవి (వైఎస్సార్సీపీ), తాడిపత్రి నియోజకవర్గం, పెద్దపప్పూరు మండలాధ్యక్షుడిగా జి.వెంకటరామిరెడ్డి (వైఎస్సార్సీపీ), అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా గాలి శ్రీనివాసులు (వైఎస్సార్సీపీ), రాప్తాడు నియోజకవర్గం, చెన్నేకొత్తపల్లి మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా పి.జ్యోతి (వైఎస్సార్సీపీ), అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్.రాయవరం మండల ఉపాధ్యక్షుడిగా బొలిశెట్టి గోవిందరావు (వైఎస్సార్సీపీ)లు ఎన్నికైనట్టు అధికారులు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా నలజర్ల మండలంలో పార్టీ రహితంగా జరిగిన కోఆప్షన్ సభ్యుని ఎన్నికలో సయ్యద్ మునాఫ్ గెలిచినట్లు అధికారులు వెల్లడించారు. 170 గ్రామాల్లో ఉప సర్పంచి ఎన్నిక పూర్తి.. రాష్ట్ర వ్యాప్తంగా 186 గ్రామాల్లో ఉప సర్పంచి పదవులకుగాను సోమవారం 170 గ్రామాల్లో ఎన్నిక పూర్తయినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం అధికారులు పేర్కొన్నారు. 11 గ్రామాల్లో ఎన్నికలు వాయిదా పడగా.. మరో చోట స్థానిక వార్డు మెంబర్ చనిపోయిన కారణంగాను, ఇంకో నాలుగు గ్రామ పంచాయతీల్లో కోరం లేక తాత్కాలికంగా ఉప సర్పంచ్ ఎన్నిక వాయిపడినట్టు అధికారులు వివరించారు. వాయిదా పడిన 11 గ్రామాల్లో మంగళవారం మరో విడత ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. -
‘లోకల్’లో హోరాహోరీ.. ‘మెట్రో’తో పోటీ అంటూ..
రద్దీగా ఉన్న ముంబై లోకల్ ట్రైన్లో సీటు కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య చోటుచేసుకున్న గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో ఇద్దరు ప్రయాణికుల మధ్య ఘర్షణ చెలరేగడాన్ని గమనించవచ్చు. Just a Normal daily scene inside a crowded #MumbaiLocal Loved the Super Cool Referee.. pic.twitter.com/i0X9yAperP — मुंबई Matters™ (@mumbaimatterz) September 1, 2023 ముంబైలోని కిక్కిరిసిన లోకల్ రైళ్లలో పరిమిత సీటింగ్ స్థలం కోసం ప్రయాణికులు పోటీ పడుతుంటారు. అయితే ఈ వీడియోలో ఇద్దరు ప్రయాణికులు కొట్టుకుంటుండగా ఒక ప్రయాణికుడు జోక్యం చేసుకుని వారిద్దరి ఆగ్రహాన్ని చల్లార్చాడు. ఈ వీడియో వైరల్ అయిన నేపధ్యంలో ఇంటర్నెట్లో ముంబై లోకల్.. ఢిల్లీ మెట్రో మధ్య పోలికలు మొదలయ్యాయి. ఢిల్లీ మెట్రోలో ఘర్షణలు, ఇబ్బందికర పరిస్థితులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఢిల్లీ మెట్రోతో ముంబై లోకల్ రైలు పోటీపడుతున్నదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: పుట్టాడు ఏలియన్ లాంటి పిల్లోడు.. చేస్తున్నాడు వింతవింత శబ్ధాలు! Fight in Delhi metro. Passengers were fighting into the train during the journey. #delhimetro #Metro #Delhi pic.twitter.com/kDUOydRQEY — anuj kumar singh (@sanuj42) June 28, 2023 -
మొక్కుబడిగా ‘స్థానిక’ ధ్రువీకరణ పత్రాలిస్తారా?
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య (ఎంబీబీఎస్, బీడీఎస్) అడ్మిషన్ల భర్తీ కోసం ‘స్థానిక’ధ్రువీకరణ పత్రాల జారీలో తహసీల్దార్ల తీరు ఆక్షేపణీయమని హైకోర్టు వ్యాఖ్యానించింది. స్థానికత ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థి తెలంగాణకు చెందిన వారో.. కాదో విచారణ చేసి సర్టీ ఫికెట్ ఇవ్వాలి తప్ప, మొక్కబడిగా ఇస్తే ఎలాగని ప్రశ్నించింది. ఈ విషయంలో తహసీల్దార్లకు తగిన సూచనలు చేయాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ)కు చెప్పింది. ఇతర రాష్ట్రాల్లో చదివి తిరిగి తెలంగాణకు వచ్చిన విద్యార్థులకు ‘స్థానిక’ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారని, ఇందులో ఫలానా చోట రెండేళ్లుగా నివాసం ఉంటున్నారని మాత్రమే జారీ చేయడంతో వాటిని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఆమోదించడం లేదని పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తెచ్చిన వైద్య విద్య అడ్మిషన్ల నిబంధనల కారణంగా తెలంగాణకు చెందిన వారైనప్పటికీ సీట్లు కోల్పోతున్నారని, తల్లిదండ్రుల ఉద్యోగ, ఇతర కారణాలతో ఒకట్రెండేళ్లు పక్క రాష్ట్రాల్లో చదువుకున్న వారికి స్థానిక కోటా కింద సీటు నిరాకరించడం తగదని ఇటీవల సీజే ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంటే.. ఎటూ తేల్చని విధంగా ఇస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది చెప్పారు. దీంతో స్థానికతపై స్పష్టత ఇస్తూ సర్టి ఫికెట్లు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. -
హానర్ లవర్స్కు గుడ్ న్యూస్: స్మార్ట్ఫోన్లు వచ్చేస్తున్నాయ్!
Honor Comeback: హానర్ బ్రాండ్ స్మార్ట్ఫోన్లు మళ్లీ భారత్ మార్కెట్లోకి రానున్నాయి. చైనా స్మార్ట్ డివైజెస్ సంస్థ హానర్ నుంచి లైసెన్సు పొందిన హానర్టెక్ కంపెనీ వీటిని సెపె్టంబర్లో ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉంది. ఈ వ్యాపారానికి సంబంధించి రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. హానర్టెక్ సీఈవో మాధవ్ సేథ్ ఈ విషయాలు వెల్లడించారు. వచ్చే ఏడాది ఆఖరు నాటికి 4-5 శాతం మార్కెట్ వాటాను దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నట్లు, తద్వారా రూ. 10,000 కోట్లు ఆదాయం సాధించే అవకాశాలు ఉన్నట్లు ఆయన వివరించారు. హానర్టెక్ పూర్తిగా భారత సంస్థ అని, హానర్ నుంచి తీసుకున్న లైసెన్సుతో ఇక్కడే తయారీ నుంచి అమ్మకాల కార్యకలాపాలు నిర్వహించనున్నామని సేథ్ చెప్పారు. చైనా టెలికం దిగ్గజం హువావే అప్పట్లో హానర్ బ్రాండ్ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 2020లో మరో చైనా సంస్థకు దాన్ని విక్రయించింది. మరోవైపు, రియల్మి అంతర్జాతీయ వ్యాపారానికి సారథ్యం వహిస్తున్న సేథ్ ఇటీవలే దాన్నుంచి తప్పుకున్నారు. వ్యాపారవేత్త సీపీ ఖండేల్వాల్కి చెందిన పీఎస్ఏవీ గ్లోబల్తో కలిసి హానర్టెక్ను జాయింట్ వెంచర్గా ఏర్పాటు చేశారు. -
దేశీయంగా కీవే బైక్స్ తయారీ: లక్కీ కస్టమర్లకు భారీ ఆఫర్
సూపర్బైక్స్ బ్రాండ్ కీవే ఎస్ఆర్ 250, ఎస్ఆర్ 125 మోడళ్ల తయారీని దేశీయంగా ఈ ఏడాది నుంచి చేపట్టనున్నట్టు ఆదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా ప్రకటించింది. ఇటీవలే ప్రీమియం సెగ్మెంట్లో నాన్-రెట్రో మోటార్సైకిళ్లను ప్రవేశపెట్టింది కీవే. ఢిల్లీఎక్స్షోరూంలో పరిచయ ఆఫర్ ధర ఎస్ఆర్ 250 రూ.1.49 లక్షలు వద్ద అందుబాటులో ఉంటుంది. రూ.2,000కి బుక్ చేసుకోవచ్చు. ఇక ఎస్ఆర్ 125 రూ.1.19 లక్షలుగా ఉంది. కేవలం 1000కే బుక్ చేసుకోవచ్చు. వినియోగదార్లు దేశవ్యాప్తంగా ఉన్న 55 బెనెల్లి, కీవే షోరూంలు లేదా ఆన్లైన్లో ఈ బైక్స్ను కొనుక్కోవచ్చు. కీవే ఎస్ఆర్ 250 తొలి 500 డెలివరీల కోసం ప్రత్యేకంగా ఒక ప్రత్యేక లక్కీ డ్రాను ప్రకటించారు. ఈ లక్కీ డ్రాలో, ఐదుగురు లక్కీ కస్టమర్లు కీవే ఎస్ఆర్ ఎక్స్-షోరూమ్ ధరపై 100 శాతం క్యాష్బ్యాక్ను గెలుచుకునే అవకాశం ఉంటుంది. అంతేనా దీనికి అదనంగా , AARI 'My SR My Way' అనే కొత్త ప్లాట్ఫారమ్ను పరిచయం చేస్తోంది. కీవే ఎస్ఆర్ 125 బెస్ట్ మైలేజీ సామర్థ్యాన్ని కోరుకునే బైక్ లవర్స్కు ఇది బెస్ట్ ఆప్షన్. 125 సీసీ 4-స్ట్రోక్ ఎలక్ట్రానిక్ ఫ్యూయల్-ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజన్ ఇందులో అమర్చారు. ఇది గరిష్టంగా 9.7hp శక్తిని 8.2nm గరిష్ట టార్క్ అందిస్తుంది. ఇంకా హాలోజన్ హెడ్ల్యాంప్, LCD కలర్ డిస్ప్లే, కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ , డ్యూయల్-పర్పస్ టైర్స్ 1 ఉంది. బ్రేకింగ్ సిస్ఠంలో 300ఎంఎం ఫ్రంట్ డిస్క్, వెనుకవైపు 210ఎంఎ డిస్క్ను అందించింది. బైక్కు 160ఎంఎ గ్రౌండ్ క్లియరెన్స్తో పాటు, అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్ లభిస్తుంది. Wishing a Happy World Motorcycle Day to those who love corners and the open highways.#HappyWorldMotorcycle #Bikers #MotorcycleDay #Passion #Riding #Keeway #India pic.twitter.com/sUPSPE272j — KeewayIndia (@keeway_india) June 20, 2023 -
ఎన్ని ప్లాప్ వచ్చిన టాలీవుడ్ ని వదిలేదే లే ....
-
ఓఎన్డీసీలోకి మీషో, ఎందుకో తెలుసా?
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ సంస్థ మీషో తాజాగా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)లో చేరింది. కొనుగోలుదారులను హైపర్లోకల్ విక్రేతలకు అనుసంధానించేందుకు ఇది ఉపయోగపడ గలదని సంస్థ తెలిపింది. తమ పైలట్ ప్రాజెక్టు ముందుగా బెంగళూరులో ప్రారంభమై తర్వాత మిగతా నగరాలకు విస్తరించనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విదిత్ ఆత్రే తెలిపారు. (ఆకట్టుకునేలా స్పోర్టీ లుక్లో పల్సర్ పీ 150: ధర ఎంతంటే?) మీషోలో 8 లక్షల మంది పైగా విక్రేతలు ఉన్నారు. విక్రేతలు, వినియోగదారుల వ్యయాల భారాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఓఎన్డీసీని తెరపైకి తెచ్చింది. ఆన్లైన్లో తక్కువ రేట్లకు ఉత్పత్తులు, సర్వీసులను కొనుగోలుదారులు దక్కించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇది ప్రయోగదశలో ఉంది. (Satyam Scam:హెచ్డీఎఫ్సీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు) -
స్థానిక ఉత్పత్తులే కొనండి
అహ్మదాబాద్: భారత్ అన్ని రంగాల్లోనూ స్వయం సమృద్ధి సాధించాలంటే ప్రజలంతా స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 25 ఏళ్ల పాటు ఇలా స్థానిక ఉత్పత్తుల్నే కొంటే దేశంలో నిరుద్యోగ సమస్య తీరిపోతుందన్నారు. ‘‘స్థానిక ఉత్పత్తులకు ఆదరణ పెరిగితే అందరికీ ఉద్యోగావకాశాలు వస్తాయి. అందుకోసమే వోకల్ ఫర్ లోకల్ పథకం తెచ్చాం’’ అని చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ స్వయంసమృద్ధిని సాధనకు కృషి చేస్తున్నందున మనం కూడా అదే బాటన ముందుకెళ్లాలన్నారు. హనుమజ్జయంతి సందర్భంగా గుజరాత్లోని మోర్బిలో 108 అడుగుల భారీ విగ్రహాన్ని శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. దేశం నాలుగు దిక్కులా హనుమంతుడి భారీ విగ్రహాలను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన హనుమాన్జీ చార్ధామ్ ప్రాజెక్టులో భాగంగా పశ్చిమాన దీన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరాన సిమ్లాలో 2010లో ఇలాంటి విగ్రహాన్నే ఆవిష్కరించారు. దక్షిణాన రామేశ్వరంలో సన్నాహాలు సాగుతున్నాయి. 3 రోజులు గుజరాత్కు మోదీ ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో సోమవారం నుంచి మోదీ మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారని పీఎం కార్యాలయం వెల్లడించింది. అల్లర్లపై మాట్లాడరేం? శ్రీరామనవమి సందర్భంగా దేశంలో పలు ప్రాంతాల్లో జరిగిన మత ఘర్షణలపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. విద్వేష ప్రసంగాలు, మతహింస ఘటనలపై ఆయన స్పందించకపోవడం దారుణమంటూ సోనియాగాంధీ (కాంగ్రెస్), శరద్పవార్ (ఎన్సీపీ), మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్), ఎంకె స్టాలిన్ (డీఎంకే) సహా 13 విపక్ష పార్టీల అధ్యక్షులు ధ్వజమెత్తారు. శనివారం వారు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మతఘర్షణలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలంతా శాంతి, సహనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని ఖండించకపోతే ఆయన మౌనాన్ని మద్దతుగా తీసుకుని మత విద్వేషకులు మరింత రెచ్చిపోతారన్నారు. ఇలాంటి కుట్రదారులందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
పండుగలప్పుడు ఆంక్షలు పెట్టండి!
న్యూఢిల్లీ: కోవిడ్19 వ్యాప్తిని అడ్డుకోవడానికి వీలుగా రాబోయే పండుగల సందర్భంగా స్థానికంగా ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. మొహర్రం (ఆగస్టు 19), ఓనం (ఆగస్టు 21), జన్మాష్టమి (ఆగస్టు 30), వినాయక చవితి (సెప్టెంబరు 10), దుర్గా పూజ (దసరా నవరాత్రులు, అక్టోబరు 5-15) లకు జనం గుంపులుగా ఒకేచోట చేరకుండా చూడాలని, స్థానికంగా ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో కోరారు. పండుగల సందర్భంగా జనం పెద్దసంఖ్యలో ఒకేచోటికి చేరితే... సూపర్ స్ప్రెడర్గా అవి మారే అవకాశం ఉంటుందని, కోవిడ్ కేసులు పెరిగిపోవచ్చని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం (ఎన్సీడీసీ) ఆందోళన వ్యక్తం చేశాయని తెలిపారు. సెకండ్ వేవ్లో కేసుల వ్యాప్తిని అడ్డుకోవడానికి రాష్ట్రాలు చేసిన కృషిని అభినందించారు. -
యూట్యూబ్ వీడియోలు తెగ చూస్తున్నారు
సాక్షి,న్యూఢిల్లీ: యూట్యూబ్లో వీడియోల వీక్షణం భారత్లో అంతకంతకూ పెరుగుతోంది. వీక్షిస్తున్న సమయం క్రితం ఏడాదితో పోలిస్తే 2020 జూలైలో 45 శాతం పెరిగింది. ఆరు ప్రాంతీయ భాషలలో 2020 రెండవ భాగంలో యూట్యూబ్ ఇండియాలో అత్యధికంగా వీక్షించిన టాప్ 10 వాణిజ్య ప్రకటనల జాబితాలో చోటు దక్కించుకున్నట్లు ఆన్లైన్ వీడియో ప్లాట్ఫాం శుక్రవారం తెలిపింది. తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, కన్నడ లాంటి ప్రాంతీయ భాషల్లో కంటెంట్ ఉండడం కూడా ఈ వృద్ధిని నడిపించిన కారణాల్లో ఒకటని యూట్యూబ్ తెలిపింది. అందుబాటు ధరలో స్మార్ట్ఫోన్లు లభించడం, చవక డేటా టారిఫ్లతో కొన్నేళ్లుగా వీడియోలు ఎక్కువగా చూస్తున్నారని వివరించింది. మహమ్మారి నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా ఓటీటీల వాడకం మరింతగా పెరిగిందని యూట్యూబ్ తెలిపింది. 2019 సెప్టెంబరులో విడుదలైన గూగుల్-కాంటార్ అధ్యయనం ప్రకారం 93 శాతం మంది ప్రాంతీయ భాషల్లో ఉన్న కంటెంట్ను చూసేందుకే మొగ్గు చూపుతున్నారు. యూట్యూబ్లో ప్రస్తుతం ఆరు ప్రాంతీయ భాషల్లో ప్రకటనలు వెలువడుతున్నాయి. -
మన నినాదం ‘వోకల్ ఫర్ లోకల్’
జైపూర్/న్యూఢిల్లీ: దీపావళి పండుగ సందర్భంగా స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసి, దేశీయ వ్యాపారులకు ఊతం ఇచ్చినట్లుగానే స్థానిక ఆర్థిక వ్యవస్థకు మద్దతు కొనసాగించాలని దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వోకల్ ఫర్ లోకల్ (స్థానికానికి మద్దతుగా గళమెత్తాలి) అనే సందేశాన్ని దశదిశలా వ్యాపింపజేయాలని కోరారు. ప్రఖ్యాత జైన మత బోధకుడు విజయ్ వల్లభ్ సురీశ్వర్ 151వ జయంతి సందర్భంగా రాజస్తాన్లోని పాలీ పట్టణంలో నెలకొల్పిన ఆయన విగ్రహాన్ని ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జైన ఆచార్యుడు విజయ్ వల్లభ్ విద్య, మహిళా సాధికారత కోసం ఎంతగానో కృషి చేశారని మోదీ కొనియాడారు. కరోనా మహమ్మారిపై ప్రజల్లో అవగాహన పెంచడంలో మీడియా ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కరోనాపై పోరాటం విషయంలో ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణలో మీడియా ఒక విలువైన భాగస్వామి అని తెలిపారు. సోమవారం నేషనల్ ప్రెస్ డే సందర్భంగా ఆయన లిఖితపూర్వక సందేశం ఇచ్చారు. సానుకూలమైన విమర్శలు లేదా విజయగాధలను ప్రచారం చేయడం ద్వారా మీడియా ప్రజలకు మేలు చేస్తోందన్నారు. -
మెర్సిడెస్ బెంజ్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: మెర్సిడెస్ బెంజ్ తన ఏఎంజీ కార్ల అసెంబ్లింగ్ ప్రక్రియను భారత్లో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. పుణేలోని చకన్ యూనిట్లో అసెంబ్లింగ్ను చేపడతామని తెలిపింది. అసెంబ్లింగ్ ద్వారా తయారయ్యే మొదటి ఉత్పత్తి ‘‘ఏఎంజీ జీఎల్సీ 43 కూపె’’ మోడల్ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఈ సందర్భంగా మెర్సిడస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సీఈవో మార్టిన్ ష్వెంక్ మాట్లాడుతూ ... భారత మార్కెట్ల పట్ల మెర్సిడస్ బెంజ్కు స్పష్టమైన ప్రణాళిక ఉంది. ధీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఏఎంజీ కార్ల అసెంబ్లింగ్ స్థానికంగానే జరగాలనే నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొస్తున్నాము, అర్హత కలిగిన కస్టమర్లకు అందరికీ ఏఎంజీను సులభంగా అందుబాటులోకి ఉంచుతాము, ఇక్కడ అసెంబ్లింగ్ అయ్యే మోడళ్లు మా పోర్ట్ఫోలియోలో కీలక పాత్ర పోషిస్తాయని ఆశిస్తున్నాము’’ అన్నారు. -
బాబాకా ధాబాకు క్యూ కట్టిన కస్టమర్లు
-
సోషల్ మీడియానా మజాకా: వైరల్ వీడియో
సాక్షి, న్యూఢిల్లీ: చిన్నపిల్లలనుంచి వృద్ధుల దాకా సోషల్ మీడియా విపరీతమైన ప్రభావాన్ని పడవేస్తోంది. ఆధునిక టెక్నాలజీ యుగంలో సోషల్ మీడియా ప్రపంచ దిశ దశను మారుస్తోంది. రాజకీయాలు నుంచి వంటింటి దాకా సోషల్ మీడియానా మజాకా అనిపిస్తోంది. ఢిల్లీలో చోటు చేసుకున్న ఒక సంఘటన గురించి తెలుసుకుంటే.. సోషల్ మీడియా మీద ఒకింత కోపంగా ఉన్న వారు కూడా ఔరా అనక మానరు. ఢిల్లీలోని మాలవీయనగర్లో ఉన్న బాబాకా ధాబా గురించి ట్విటర్లో ఒక వీడియో పోస్ట్ అయింది. కరోనా, లాక్డౌన్ కారణంగా డిమాండ్ లేక షాపు యజమాని కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలో షేర్ చేశారు. దాదాపు 80 ఏళ్ళ వృద్ధాప్యంలో జీవనం కోసం ఆ జంట పడుతున్న ఆరాటాన్ని చూపించారు. అంతేకాదు వీరిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతే క్షణాల్లో ఈ వీడియో వైరల్ గా మారింది. పిల్లల అనాదరణకు గురైన ఈ వృద్ధ దంపతుల పోరాట కథ పలువురి హృదయాలను కదిలించింది. బాలీవుడ్ నటులు సునీల్ శెట్టి, రవీన్ టాండన్, సోనమ్ కపూర్, రవీనా టాండన్, జర్నలిస్టు, నటి స్వర భాస్కర్, క్రికెటర్ ఆర్ అశ్విన్ లాంటి సెలబ్రిటీలతో పలువురు దీన్ని లైక్ చేసి, షేర్ చేశారు. దీంతో నెటిజనుల నుంచి స్పందన భారీగా వచ్చింది. సపోర్ట్ లోకల్ అంటూ స్థానికులు బాబా కా ధాబాకు క్యూ కట్టారు. ఫుడ్ స్టాల్ లో లభ్యమయ్యే భోజనం, చపాతీలకు ఇబ్బడి ముబ్బడిగా ఆర్డర్లు ఇవ్వడం మొదలు పెట్టారు. బాబా చేతి వంట మటర్ పనీర్ ఆసాంతం లొట్టలేసుకుంటూ ఆరగించేశారు. సెల్ఫీలతో సందడి చేశారు. దీంతో సంతోషంతో ఉక్కిరి అయిపోవడం యజమాని వంతైంది. అంతేకాదు మాలవీయ నగర్ బాబాకా ధాబా ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచింది. ఈ వీడియో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిని కూడా కదిలించింది. బాబా కా ధాబాను తాను సందర్శించానని, వారి జీవితాల్లో సంతోషం కోసం తాను చేయగలిగింది తాను చేస్తానంటూ ట్వీట్ చేశారు. కాగా ఈ వీడియోను బ్లాగర్ గౌరవ్ వాసన్ చిత్రీకరించారు. బాబా కా దాబా ఓనరు పేరు కాంత ప్రసాద్. భార్య పేరు బాదామి దేవి. .@RICHA_LAKHERA .@VasundharaTankh .@sohitmishra99 .@sakshijoshii .@RifatJawaid .@ShonakshiC .@TheDeshBhakt Visited "Baba Ka Dhaba" n hv done d needful to bring SMILE on their faces as promised. Will take care of them n I am starting a drive 2 take care of similarly placed people. pic.twitter.com/S9A94AmJxK — Adv. Somnath Bharti (@attorneybharti) October 8, 2020 -
సూపర్ లోకల్ మొబైల్ యాప్స్.. అదుర్స్!
సాక్షి, సిటీబ్యూరో: మియాపూర్లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్న ప్రవీణ్కు క్రికెట్ అంటే మహా ఇష్టం. కానీ తానుండే ప్రదేశంలో తనలా ఆ ఆటపై ఆసక్తి ఉన్న వారెవరో తెలియదు. తన అభిరుచులు, ఇష్టాఇష్టాలకు అనుగుణంగా ఉన్నవారితో స్నేహం చేయడం మైలో యాప్ ద్వారా సాధ్యపడుతుంది. నగరానికి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ సిద్ధం చేసిన ఈ యాప్ను పలు గేటెడ్ కమ్యూనిటీల్లో వినియోగిస్తున్నారు. ఈ యాప్ ద్వారా ఇరుగుపొరుగు వారిని మరింత దగ్గర చేయడం, ఇష్టాఇష్టాలు, అభిరుచులు పరస్పరం పంచుకోవడం.. కష్టసుఖాలు షేర్ చేసుకునేందుకు ఈ యాప్ ఓ అవకాశం కల్పిస్తుండటం విశేషం. మైగేట్తో మరో ముందడుగు... గేటెడ్ కమ్యూనిటీల్లో స్థానికుల అవసరాలను తీరుస్తోన్న మరో యాప్ మైగేట్ మొబైల్ యాప్. ఈయాప్ ద్వారా ఆయా నివాస సముదాయాలకు బయటి వ్యక్తులు, మార్కెటింగ్ సిబ్బంది తదితరులు ఎవరు.. ఏఏ సమయాల్లో వచ్చారు..? క్యాబ్ సర్వీసులు ఏ సమయంలో లోనికి వచ్చాయి..? పనిమనిషి ఏ సమయంలో లోనికి ప్రవేశిస్తుంది.. తొలుత ఎవరి ఇంట్లో పనిచేస్తుంది. ఆమె తీరిక వేళలు ఏమిటి.. మీ ఇంటికి వచ్చేందుకు ఆమెకు ఏ సమయంలో వీలవుతుంది..? తదితర వివరాలన్నీ నోటిఫికేషన్స్, అలర్ట్ రూపంలో మొబైల్కు అందనుండటం సరికొత్త సమాచారం ఇచ్చినట్లవుతుంది. ఈయాప్లు భద్రమైనవేకాక... ఆయా పనులను సులభతరం చేస్తున్నాయని నిపుణులు సైతం చెబుతున్నారు. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ, చెన్నై తదితర మహా నగరాల్లో సూపర్ లోకల్ మొబైల్ యాప్స్ను గేటెడ్ కమ్యూనిటీల్లో నివసిస్తున్న వారు విరివిగా వినియోగిస్తున్నారని.. భాగ్య నగరంలోనూ ఈ ట్రెండ్ ఇటీవలికాలంలో జోరందుకుందని చెబుతున్నారు. యాప్ల కాలం.. నెటిజనుల్లానే సిటీజనులు.. ఐటీ, బీపీఓ, కేపీఓ, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న వేతనజీవులు, విద్యార్థులు, వయోధికులు, మహిళలు, చిన్నారులు, రోగులు ఇలా అన్ని వర్గాల వారికీ కోరిన సేవలు ఇంటి ముందుకు తీసుకొచ్చేందుకు మొబైల్ యాప్స్ అందుబాటులోకి వచ్చిన విషయం విదితమే. కోవిడ్ కలకలం నేపథ్యంలో ఆహారం, మెడిసిన్స్, వైద్యసేవలు, వైద్య పరీక్షలు, వివిధ రకాల సేవలు, షాపింగ్ తదితర అవసరాలను తీర్చే యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరుణంలో ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన సూపర్ లోకల్ మొబైల్ యాప్స్కు విశేష ప్రజాదరణ లభిస్తోంది. -
స్ధానిక సమరం!
-
ఉత్కంఠకు తెర!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలిఘట్టం పూర్తయ్యింది. జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి..జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీఠం ఈసారి ఎస్సీ మహిళకు దక్కింది. 2014 జెడ్పీ ఎన్నికల్లో చైర్పర్సన్ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించారు. ఈ సారి ఎస్సీ మహిళకు రిజర్వయ్యింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్లాల్ రిజర్వేషన్ల వివరాల జాబితాను విడుదల చేశారు. జిల్లాలో 34 జెడ్పీటీసీలు, 34 ఎంపీపీలు, 549 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎంపీపీల్లో ఎస్టీ మహిళలకు 2, ఎస్టీ జనరల్కు 2 స్థానాలు కేటాయించారు. ఎస్సీ మహిళలకు 2, ఎస్సీ జనరల్ 2 స్థానాలు, బీసీ మహిళలకు 13, బీసీ జనరల్కు 13 స్థానాలు కేటాయించారు. జిల్లాలోని 34 జెడ్పీటీసీ స్థానాలకు ఎస్టీ మహిళలకు 2 స్థానాలు, ఎస్టీ జనరల్కు 2 స్థానాలను కేటాయించారు. ఎస్సీ మహిళలకు 2, ఎస్సీ జనరల్ 2 స్థానాలు, బీసీ మహిళలకు 9, బీసీ జనరల్కు 9, అన్ రిజర్వుడ్ మహిళలకు 4, అన్ రిజర్వుడ్ జనరల్కు 4 స్థానాలు కేటాయించారు. ఎంపీటీసీలకు సంబంధించి 549 స్థానాలకు ఎస్టీ మహిళలకు 37, ఎస్టీ జనరల్కు 24, ఎస్సీలకు 35, ఎస్సీ జనరల్కు 23, బీసీ మహిళలకు 150, బీసీ జనరల్కు 138, అన్ రిజర్వుడ్ మహిళలకు 80, అన్ రిజర్వుడ్ జనరల్కు 62 స్థానాలను కేటాయించారు. తుది నిర్ణయం తీసుకోనున్న హైకోర్టు రిజర్వేషన్ల ఖరారుపై ఈ నెల 8న రాష్ట్ర హైకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం 1994 రూల్ నెం.13 ప్రకారం రిజర్వేషన్ల కేటాయింపు జరగడంతో దాదాపుగా ఇవే ఖరారయ్యే అవకాశం ఉంది. రిజర్వేషన్ల ప్రకారం చూస్తే జిల్లాలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యం లభించింది. ఎంపీటీసీలుగా 549 స్థానాలకు 302 స్థానాల్లో మహిళలే పోటీ చేయాల్సి ఉంది. 34 జెడ్పీటీసీ స్థానాల్లో సగం మహిళలకే దక్కాయి. ఎంపీపీల్లోనూ 34 స్థానాల్లో 17 మహిళలకే కేటాయించారు. తాజా రిజర్వేషన్ల ప్రకారం రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా చోట్ల ఆశావహులు పోటీ చేయాలని ఆశగా ఉన్నారు. రిజర్వేషన్ల గెజిట్ విడుదల తర్వాత వారిలో చాలా మంది అవకాశాన్ని కోల్పోయారు. అలాంటి వారిలో కొంత నైరాశ్యం ఏర్పడింది. కానీ ప్రభుత్వం ఏ విధమైన రాజకీయాలకు, పక్షపాతానికి తావు లేకుండా 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను అనుసరించి అధికారుల చేత రిజర్వేషన్లు రూపొందించింది. -
‘స్థానికులకే ఉపాధి కల్పించాలి’
రెబ్బెన : సింగరేణి యాజమాన్యం పులికుంట గ్రామానికి సమీపంలో నూతనంగా నిర్మించిన సీహెచ్పీలో పులికుంట గిరిజనులకు, యువకులకు ఉపాధి కల్పించాలని నంబాల ఎంపీటీసీ కొవ్వూరి శ్రీనివాస్, పులికుంట గ్రామస్తులు కోరారు. సోమవారం గోలేటిటౌన్షిప్లోని జీఎం కార్యాలయంలో వినతిపత్రం అందచేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పులికుంట గ్రామానికి అతి సమీపంలో సీహెచ్పీని నిర్మించడం వల్ల దాని నుంచి వెలువడే దుమ్మూ, దూళితో గ్రామం నాషనం కానుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని గిరిజనులంతా వ్యవసాయంపై ఆధారపడి జీవించే ౖరైతులు, కూలీల కుటుంబాలు ఉన్నాయన్నారు. అయినప్పటికీ గ్రామస్తులు సీహెచ్పీ నిర్మాణానికి సహకరించారని పేర్కొన్నారు. సీహెచ్పీతో తీవ్రంగా ప్రభావానికి గురయ్యే పులికుంటను సింగరేణి యాజమాన్యం పునరావాస గ్రామంగా గుర్తించి గ్రామంలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ కోలావార్ మండల అధ్యక్షుడు మైలారం శ్రీనివాస్, గ్రామపెద్దలు ఎర్గటి పోచయ్య, మారయ్య, భీమేశ్, అశోక్, పోశం తదితరులు పాల్గొన్నారు. -
కుషాయిగూడలో కాల్పుల కలకలం
హైదరాబాద్ : కుషాయిగూడలోని ఈసీ నగర్లో కాల్పులు కలకలం రేగింది. ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఓ వర్గం వారు, స్థానికంగా ఉన్న ఓ వర్గం వారు ఘర్షణ పడ్డారు. కూరగాయల మార్కెట్ స్థల వ్యవహారంలో ఉత్తర్ప్రదేశ్కి చెందిన వర్గంతో స్థానిక వర్గీయులుతో ఘర్షణకు దిగారు. వివరాలు..ఉత్తర్ప్రదేశ్కి చెందిన గజేందర్ సింగ్ స్థానికంగా వారంతపు సంత నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ వారాంతపు సంత విషయమై హెచ్బీ కాలనీకి చెందిన తులసి(41) అనే వ్యక్తితో వాగ్వివాదం జరిగింది. దీంతో ఆవేశం పట్టలేక తన దగ్గర ఉన్న లైసెన్స్లేని రివాల్వర్తో బెదిరింపులకు గురిచేస్తూ గాలిలోకి కాల్పులు జరిపాడు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. విషయం తెలియగానే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కాల్పులు జరిపిన గజరాజ్ సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రెండు తుపాకీలు స్వాధీనం చేసుకున్నారు. ఇరువర్గాల తోపులాటలో గాయపడిన వారిని 108 వాహనంలో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గజేందర్ కాల్పులు జరుపుతుండగా అడ్డుకుని అరెస్ట్ చేసిన కానిస్టేబుల్ చక్రపాణి రెడ్డిని సీపీ మహేష్ భాగవత్ అభినందించారు. -
సామరస్యంగా పరిష్కరించుకోండి
సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగుల విభజన విషయంలో తలెత్తిన వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. అలా కుదరని పక్షంలో తామే పూర్తిస్థాయిలో వాదనలు విని నిర్ణయం వెలువరిస్తామని చెప్పి తదుపరి విచారణను డిసెంబర్ 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎం.ఎస్.కె. జైశ్వా ల్లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఉద్యోగుల విభజన నిమిత్తం తెలంగాణ విద్యుత్ సంస్థ లు రూపొందించిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ 1,260 మందికి పైగా విద్యుత్ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు.. ఏపీ స్థానికత ఆధారంగా రిలీవ్ చేసిన ఉద్యోగుల జీతభత్యాలను 58:42 నిష్పత్తిలో ఉభయ రాష్ట్రాలు చెల్లించాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ తుది విచారణను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై తుది విచారణ ప్రారంభించిన జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. స్థానికత ఆధారంగా పక్కన పెట్టిన 1,200 మంది ఉద్యోగుల్లో అసలు ఎంతమంది ఏపీకి వెళ్లాలనుకుంటున్నారు.. ఎంతమంది తెలంగాణలో ఉండదలిచారో తెలుసుకోవాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం గత విచారణ సమయంలో ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు తెలంగాణ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్రెడ్డి ఆప్షన్ల వివరాలను ధర్మాసనం ముందుంచారు. 596 మంది ఏపీకి, 501 మంది తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చారని ఆయన తెలిపారు. 22 మంది ఆప్షన్లు ఇవ్వలేదని, మరో ఐదు మంది ఆప్షన్లు అవసరంలేదని చెప్పారని ఆయన వివరించారు. తరువాత ఏపీ ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది డి.రమేశ్ వాదనలు వినిపిస్తూ, సామరస్యపూర్వక పరిష్కారంపై వైఖరి తెలిపేందుకు తమకు మరో రెండు వారాల గడువు కావాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది. -
15 ఏళ్ల తల్లిదండ్రుల నివాసమే ‘స్థానికత’
► కొత్త నియామకాలకు స్థానికతను పునర్ నిర్వచించాలి ► ఉద్యోగ సంఘాల డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా చేపట్టే నియామకాలకు స్థానికతను పునర్ నిర్వ చించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. 4 నుంచి 10వ తరగతిలో నాలు గేళ్లు ఎక్కడ ఉంటే అక్కడే స్థానికులుగా గుర్తిస్తున్న ప్రస్తుత విధానాన్ని మార్పు చేయాలన్నాయి. 15 ఏళ్ల పాటు తల్లిదండ్రు లు నివాసమున్న ప్రాంతంలోనే స్థానికులు గా గుర్తించాలని పేర్కొన్నాయి. గురువారం తెలంగాణ గెజిటెట్ అధికారుల సంఘం (టీజీవో) కార్యాలయంలో ఉద్యోగ సంఘా ల రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. జోనల్ వ్యవస్థ రద్దు, రాష్ట్ర, జిల్లా కేడర్లపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. టీజీవో చైర్మన్ శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. కొత్త విధానాన్ని భవిష్యత్తులో చేపట్టే నియామకాల్లోనే వర్తింపజేయాలని.. ఇప్పటికే నియమితులైన ఉద్యోగులకు భవిష్యత్తులో సీనియారిటీ, బదిలీల్లో ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. టీజీవో అధ్యక్షురాలు మమత మాట్లా డుతూ.. యువతకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టా లన్నారు. రాష్ట్ర కేడర్లో స్థానిక రిజర్వేషన్ కోటా 85 శాతం, రాష్ట్ర రిజర్వేషన్ కోటా 15 శాతం ఉండాలన్నారు. ప్రస్తుత ఉద్యోగుల కు కొత్త విధానాలు ఎలా వర్తింపజేస్తారని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అ«ధ్యక్షుడు మధుసూదన్రెడ్డి ప్రశ్నించారు . వీటిపై రాత్రికిరాత్రే నిర్ణయం తీసుకో కుండా, నిఫుణుల కమిటీ అధ్యయనం చేయించాలన్నారు. గ్రూప్–1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్గౌడ్ మాట్లా డుతూ.. గ్రూప్–1లోని జోనల్ పోస్టులను రాష్ట్ర పోస్టులుగా మార్పు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిభగల, వెనుకబడిన వర్గాల వారికి గ్రూప్–1, గ్రూప్–2 పోస్టుల భర్తీకి వార్షిక విధానం ఉండాలన్నారు. సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పద్మాచారి, శివశంకర్, లాలూ ప్రసాద్, చక్రధర్ పాల్గొన్నారు. అధ్యయనానికి గడువివ్వండి రెండంచెల జోన్ల విధానంపై మరింత లోతుగా చర్చించేందుకు సమయం ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్కు విజ్ఞప్తి చేశారు. రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం సచివాలయంలో సీఎస్ను కలసి వినతిపత్రం అందజేశారు. ‘మోడల్’టీచర్లకు బకాయిలు విడుదల రాష్ట్రంలోని మోడల్ స్కూల్ టీచర్లకు అన్ని రకాల బకాయిలు విడుదల చేస్తూ పాఠ«శాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీచేసింది. 2013 జూలై 1 నుంచి 2017 మార్చి 31 వరకు రావాల్సిన డీఏ, 2014 జనవరి 1 నుంచి జూన్ 1 వరకు రావాల్సిన ఐఆర్ బకాయిలను మంజూరు చేసింది. 2014 జూన్ 2 నుంచి 2015 ఫిబ్రవరి 28 వరకు రావాల్సిన పీఆర్సీ బకాయిలను 18 భాగాలుగా ఇతర ఉద్యోగులకు ఇచ్చే విధంగానే నెలనెలా వేతంనంతో ఇచ్చేలా ఉత్తర్వులు జారీచేసింది. -
అమెరికా ఇన్పోసిస్లో స్థానికులకే ప్రాధాన్యత
-
ఇక చకచక ధ్రువీకరణ పత్రాలు
ఏలూరు సిటీ : విద్యార్థులకు అవసరమైన కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ శాఖ అధికారుల ద్వారా అందించేందుకు చర్యలు తీసుకున్నట్టు జేసీ పి.కోటేశ్వరరావు తెలిపారు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఎ) అనిల్ చంద్రపునీత బుధవారం విజయవాడ నుంచి జాయింట్ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పునీత మాట్లాడుతూ ఏప్రిల్ 15లోగా విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందించాలి్సందిగా సూచించగా జేసీ ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. విద్యార్థుల చెంతకే మీ సేవ కేంద్రాలను తరలించి అవసరమైన ధ్రువీకరణ పత్రాలను అక్కడికక్కడే జారీ చేసే ప్రక్రియ పటిష్టవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో కే.హైమావతి, సూపరింటెండెంట్ సూర్యనారాయణ పాల్గొన్నారు. -
కొలువులపై విభజన క్రీనీడ
విలీన మండలాల డీఎస్సీ అభ్యర్థుల ఆక్రోశం స్థానికులు కాదంటూ నియామకాలకు అడ్డంకి కోర్టు కరుణించినా ఖాతరు చేయని ఐటీడీఏ! నెల్లిపాక : రాష్ట్ర విభజన గిరిజన నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. కష్టపడి చదివిన వారిని స్థానికత కష్టాల పాలు చేసింది. అర్హత ఉన్నా వారికి ఉద్యోగాలు అందని ద్రాక్షలా మారాయి. విలీన మండలాల ఏజెన్సీ డీఎస్సీలో ఆ మండలాల అభ్యర్థుల పట్ల ప్రభుత్వ నిర్ణయం వారికి తీరని ఆవేదనను మిగుల్చుతోంది. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఆధ్వర్యంలో 2016 అక్టోబర్ 29న ప్రత్యేక డీఎస్సీ అర్హత పరీక్షను నిర్వహించారు. ఇందులో అర్హత సాధించిన వారిని గత ఏడాది డిసెంబర్ 29న ఉపాధ్యాయ ఉద్యోగాల్లో నియమించారు. అయితే రాష్ట్ర విభజనతో తూర్పుగోదావరి జిల్లాలో కలిపిన నాలుగు విలీన మండలాల్లోని కొందరు అభ్యర్థులు అర్హత సాధించినా స్థానికత పేరుతో నియామకాలను నిలిపివేశారు. దీంతో వారు గత మూడు నెలలుగా ఉద్యోగాల కోసం పోరాటం చేసూ్తనే ఉన్నారు. కోర్టును కూడా ఆశ్రయించి అనుకూలంగా ఉత్తర్వులు సాధించుకున్నా అధికారుల నుంచి స్పందన లేదని వారు వాపోతున్నారు. విలీన మండలాల్లో మొత్తం 10 మంది అభ్యర్థుల నియామకాలను ప్రస్తుతం నిలిపివేశారు. వీరిలో ఎటపాక మండలంలోని ఆదివాసీ తెగకు చెందిన ముగ్గురు మహిళా అభ్యర్థులు, నలుగురు లంబాడా తెగకు చెందిన వారు కాగా చింతూరు మండలంలో ఒకరు, వీఆర్ పురం మండలంలో ఇద్దరు ఆదివాసీ అభ్యర్థులు ఉన్నారు. వీరి నియామకాలను స్థానికత లేదనే కారణంగా నియామకపు ఉత్తర్వులు ఇవ్వలేదు. కోడళ్లుగా వచ్చిన వారికీ అడ్డంకే ఆరుగురు ఆదివాïసీ అభ్యర్థులకు తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ స్థానికత లేదని ఉద్యోగావకాశం కల్పించలేదు. అయితే వీరిలో ఎటపాకకు చెందిన కోర్స సుజాత, పొడియం కౌసల్య, వీఆర్పురానికి చెందిన కారం అరుణ, సీహెచ్ వెంకటలక్ష్మి ఈ ప్రాంతానికి కోడళ్లుగా వచ్చారు. మిగతా ఇద్దరు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతానికి వచ్చి నివాసం ఉంటున్నవారే. ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ఏజెన్సీలోనే ఉంటూ వీరి చదువులు పూర్తి చేశారు. వివాహాలు కూడా రాష్ట్ర విభజనకు ముందే జరిగాయి. ప్రత్యేక డీఎస్సీలో కొలువులు సాధించేందుకు అహర్నిశలు కష్టపడి చదివి అర్హత పొందారు. కానీ వీరిని ఈ ప్రాంతానికి చెందిన వారు కాదని నియామకాలు నిలిపివేయటం పట్ల తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. సాధించుకున్న ఉద్యోగాలు గత మూడునెలలుగా దూరం కావటంతో వీరు వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. -
స్థానిక’ ఎమ్మెల్సీ ఓటర్ల తుది జాబితా విడుదల
– మొత్తం ఓటర్లు 1476 మంది కాకినాడ సిటీ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఓటర్ల తుది జాబితాను అధికారులు బుధవారం విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం స్థానిక సంస్థల నియోజకవర్గ పరిధిలోని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, నగర పంచాయతీ వార్డు సభ్యులతోపాటు స్థానిక సంస్థల్లో ఎక్స్అఫిషియో సభ్యులైన ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు 1476 మంది ఓటర్లుగా ఉన్నారు. వీరిలో పురుషులు 632 మంది, మహిళలు 844 మంది ఉన్నారు. జిల్లాలోని ఏడు డివిజన్ కేంద్రాలలోని పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్లు ఈ విధంగా ఉన్నారు. రంపచోడవరంలో 66 మంది, పెద్దాపురంలో 317, రాజమండ్రిలో 185, రామచంద్రపురంలో 221, అమలాపురంలో 385, కాకినాడలో 261, ఎటపాక డివిజన్లో 41 మంది ఓటర్లు ఉన్నారు. ఆయా స్థానిక సంస్థల వారీగా ఓటర్లను పరిశీలిస్తే రాజమహేంద్రవరం కార్పొరేటర్లు 50 మంది, మున్సిపల్ కౌన్సిలర్లు పిఠాపురం 30, సామర్లకోట 30, పెద్దాపురం 28, తుని 30, అమలాపురం 29, రామచంద్రపురం 24, మండపేట 29, నగర పంచాయతీల వార్డు సభ్యులు గొల్లప్రోలు 20, ఏలేశ్వరం 20, ముమ్మిడివరం 20 మంది, జెడ్పీటీసీలు 60, ఎంపీటీసీలు 1091 మంది ఉన్నారు. ఎక్స్అఫీషియో మెంబర్లు 15 మంది మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎంపీలు తోట నరసింహం, పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కరరామారావు, సోము వీర్రాజు, ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు ఎస్వీఎస్ఎన్ వర్మ, దాడిశెట్టి రాజా, వరుపుల సుబ్బారావు, ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, అయితాబత్తుల ఆనందరావు, దాట్ల బుచ్చిరాజు, తోట త్రిమూర్తులు, వేగుళ్ళ జోగేశ్వరరావు ఓటర్లుగా ఉన్నారు. ఈ ఓటర్ల జాబితాలను కలెక్టరేట్, జిల్లాపరిషత్ సీఈఓ కార్యాలయం, మున్సిపాల్టీలతో పాటు డివిజన్ కేంద్రాల్లోని ఏడు పోలింగ్ కేంద్రాలలో అందుబాటులో ఉంచారు. -
తెలుగుదేశంలో సంకుల సమరం
- అమాత్యుల ఓటు ‘బొడ్డు’కే - ‘హోం’పై సామాజిక వర్గం నిప్పులు - రేసులో చిక్కాల, గన్ని, మెట్ల స్వపక్షంలోనే విపక్షం ... సొంత గూట్లోనే పొగ ... తెలుగు తమ్ముళ్లలో కలకలం ... క్యాడర్లో అయోమయం. ఇదీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పెడుతున్న చిచ్చు. దీంతో తూర్పుగోదావరి జిల్లా టీడీపీలో ఇద్దరు మంత్రులతోపాటు ఎమ్మెల్యేల్లో అంతర్గత కుమ్ములాటలకు దారితీస్తోంది. ఒకే కుర్చీ కోసం పోటాపోటీ తయారైంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలో ఖాళీ అయిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోసం టీడీపీలో సంకుల సమరానికి తెరలేచింది. నామినేషన్ల గడువు దగ్గర పడేకొద్దీ పార్టీలో ఆశావహుల మధ్య పోరు తీవ్రమవుతోంది. ఈ ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్, నగర పంచాయతీ సభ్యులు ఓటర్లుగా ఉన్నారు. స్థానిక సంస్థల్లో మెజార్టీ టీడీపీకి ఉన్న నేపథ్యంలో గెలుపు సునాయాసమనే విశ్వాసంతో రేసులో ఉన్న వారి సంఖ్య చాంతాడును తలపిస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు పదవీ కాలం మే ఒకటో తేదీతో ముగియనుండటంతో ఆ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. సిటింగ్ ఎమ్మెల్సీ భాస్కర రామారావు రెండోసారి బరిలో నిలుస్తున్నట్టు ఆయన అనుచరగణం ఇప్పటికే విస్తృతమైన ప్రచారం చేస్తోంది. మంగళవారం విజయవాడలో సీఎం చంద్రబాబుతో మాట్లాడేందుకు వెళ్లడం అందులో భాగమేనంటున్నారు. విజయవాడ వెళ్లి తిరిగి వస్తుండగానే ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవడం తెలిసిందే. రెండోసారి బరిలో నిలిచేందుకు భాస్క ర రామారావు ప్రయత్నాలపై ప్రత్యర్థి వర్గం నీళ్లు చల్లేం దుకు పావులుకదుపుతోంది. పార్టీని కాదని విడిచి వెళ్లిపోయి తిరిగొచ్చిన వారికి రెండోసారి అవకాశం ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. సిటింగ్ ఎమ్మెల్సీకి రాజకీయంగా బద్ధవిరోధి అయిన ప్రత్యర్థి వర్గానికి చెందిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తండ్రి మాజీ ఎమ్మెల్యే మూలారెడ్డి వంటి నేతలు భాస్కర రామారావు వ్యతిరేకులందరినీ ఏకం చేస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అందుకు వ్యూహాత్మకంగానే కేబినెట్ విస్తరణలో అవకాశం లభిస్తుదంటున్న చంద్రబాబు తనయుడు లోకేష్ను ప్రతిపాదించారు. ఇక్కడ పార్టీకి మెజార్టీ ఓటింగ్ ఉండటాన్ని చూపించగా మొదట్లో బాబు కూడా సానుకూలత ప్రదర్శించారు. ఇంతలో ఎమ్మెల్యే, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు ఉండటంతో ఇక్కడ నుంచి పోటీ చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంతోనే భాస్కర రామారావుకు తిరిగి అవకాశం కల్పించే విషయంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గ్రీ¯ŒS సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. కాపుల వైపు చూపు... రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న కాపు ఉద్యమంలో జిల్లా నుంచి ముద్రగడ పద్మనాభం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న క్రమంలో ఈసారి ఆ సామాజిక వర్గానికి కేటాయించాలనే ప్రతిపాదన వచ్చింది. పార్టీలో సీనియర్ అయిన మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు లేదా, కోనసీమ కేంద్రం అమలాపురం నుంచి దివంగత మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు తనయుడు మెట్ల రమణబాబు పేర్లు ప్రముఖంగా ఆ సామాజికవర్గ నేతలు బాబు వద్ద పరిశీలనలోకి తీసుకువెళ్లారు. ఈ రెండు పేర్లు పరిగణనలోకి తీసుకోవాలని ఆ సామాజికవర్గానికి చెందిన ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధినేత దృష్టికి తీసుకువెళ్లారంటున్నారు. వీరితో పాటు 24 ఏళ్లుగా పార్టీలో ఎటువంటి పదవులు ఆశించలేదంటూ తాళ్లరేవు మండలం మల్లవరానికి చెందిన దూళిపూడి బాబి యువత కోటాలో పరిగణనలోకి తీసుకోవాలని సీనియర్లను అభ్యర్థిస్తున్నారు. అయోమయంలో చిన రాజప్ప రమణబాబు, చిక్కాల విషయంలో మొదట సానుకూలత వ్యక్తం చేసిన చినరాజప్ప తాజా రాజకీయ సమీకరణల్లో భాస్కర రామారావు వైపే మొగ్గుచూపుతున్నారని సమాచారం. ప్రధానంగా రెండు కారణాలను ఇందుకు నేతలు విశ్లేషిస్తున్నారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఆర్థిక మంత్రి యనమల చాలాకాలంగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. అటువంటి యనమలకు విరోధి అయిన ఎంపీ తోట ప్రతిపాదిస్తున్న అతని బావమరిది రమణబాబుకు సానుకూలంగా ఉంటే, భాస్కర రామారావుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యనమలతో దూరం ఏర్పడుతుందని చినరాజప్ప మనసు మార్చుకున్నారంటున్నారు. రెండోది తన రాజకీయ భవిష్యత్తు ఒకప్పుడు పెద్దాపురం బొడ్డు భాస్కర రామారావుకు పెట్టనికోట. ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చినరాజప్ప 2019 ఎన్నికల్లో తిరిగి అక్కడి నుంచే అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా చేస్తే వచ్చే ఎన్నికల్లో పెద్దాపురంలో ‘బొడ్డు’ అడ్డు ఉండదనే ముందుచూపుతోనే చినరాజప్ప ప్లేటు ఫిరాయించారంటున్నారు. ఇది చినరాజప్ప రాజకీయ భవిష్యత్తుకు ఎంతవరకు ఉపకరిస్తుందో ఇప్పుడే అంచనాకు రావడం పొరపాటే అవుతుంది. కానీ జిల్లాలో పోలీసుల సాయంతో కాపు ఉద్యమంపై ఉక్కుపాదం మోపిన చినరాజప్పపై ఆ సామాజికవర్గం ఇప్పటికే ఆగ్రహంతో రగిలిపోతోంది. ఇప్పుడు తమ సామాజిక వర్గానికి వచ్చే అవకాశాన్ని కూడా తన రాజకీయ భవిష్యత్తు కోసం పణంగా పెడుతున్నారని టీడీపీలోని కాపు వర్గీయులు కూడా రాజప్పపై మండిపడుతున్నారు. పావులు కదుపుతున్న గన్ని... పార్టీలో సీనియర్ అయిన తనకు అవకాశం ఇవ్వాలని గన్ని కృష్ణ పట్టుబడుతున్నారు. రాజమహేంద్రవరంలో అనుచరులతో సమావేశమై రేసులో ఉన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో రాజమహేంద్రవరం రూరల్, సిటీ కోసం ప్రయత్నించిన సందర్భంలో ఇచ్చిన హామీ ప్రకారం ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కృష్ణ పట్టుబడుతూ తాడోపేడో తేల్చుకుంటారని గన్ని వర్గం పేర్కొంటోంది. గన్ని ఆశలపై రాజకీయ ప్రత్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గండికొట్టే దిశగా పావులుకదుపుతున్నారని అనుమానపడుతున్నారు.‘గుడా’ చైర్మన్ కోసం దరఖాస్తు చేసుకున్న కృష్ణ ఎమ్మెల్సీ రేసులో కూడా ఉంటారా అని గోరంట్ల వర్గం ప్రశ్నిస్తోంది. ఇంకా మరి కొందరు... బ్రాహ్మణ కోటాలో డొక్కా నా«థ్బాబు, మత్స్యకార కోటాలో కాట్రేనికోన జెడ్పీటీసీ నాగిడి నాగేశ్వరరావు కూడా ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గ నేతలను వెంటబెట్టుకుని సీఎంను కలిసేందుకు నాగేశ్వరరావు వెళుతున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు సీఎం అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా చివరకు బొడ్డు, చిక్కాలలో ఒకరికి ఖాయమవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బరిలో నిలిచే అభ్యర్థి ఎవరనేది పార్టీ అధినేత ఈ నెల 25న తేలుస్తారు. -
సమరానికి నేడే ప్రారంభం
‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికకు నేడు నోటిఫికేషన్ 28 వరకూ నామినేషన్ల స్వీకరణ కాకినాడ సిటీ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు మంగళవారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానున్నది. రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఈ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఆ క్షణం నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల 28వ తేదీతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. సెలవు రోజులు (ఈ నెల 24, 26) మినహా ప్రతి రోజూ కలెక్టరేట్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 30 సంవత్సరాల వయస్సు ఉండి ఏ జిల్లాకు చెందినవారయినా నామినేషన్ వేయవచ్చు. కానీ ఆ వ్యక్తిని ప్రతిపాదించే 10 మంది జిల్లాలోని శాసన మండలి స్థానిక సంస్థల నియోజకవర్గం ఓటర్లుగా నమోదై ఉండాలి. జిల్లా రెవెన్యూ అధికారి చెన్నకేశవరావు సహాయ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను సోమవారం విడుదల చేశారు. దీని ప్రకారం శాసన మండలి స్థానిక సంస్థల నియోజకవర్గ పరిధిలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, నగర పాలక సంస్థల కార్పొరేటర్లు, నగర పంచాయతీ వార్డు సభ్యులతోపాటు పట్టణ, నగరాల్లో ఓటరై ఎక్స్ అఫీషియో సభ్యులైన ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు కలిపి మొత్తం 1,476 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 631, మహిళలు 845 మంది ఉన్నారు. రంపచోడవరం డివిజన్లో 66 మంది, పెద్దాపురంలో 317, రాజమహేంద్రవరంలో 185, రామచంద్రపురంలో 221, అమలాపురంలో 385, కాకినాడలో 261, ఎటపాక డివిజన్లో 41 మంది ఓటర్లున్నారు. 24 వరకూ అభ్యంతరాల స్వీకరణ ముసాయిదా ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు, సవరణలు ఉంటే ఈ నెల 24వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. వాటిని కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్కు అందజేయాలి. పరిశీలన నిమిత్తం ఈ ఓటర్ల జాబితాలను కలెక్టరేట్, జిల్లా పరిషత్ సీఈఓ కార్యాలయం, రాజమహేంద్రవరం కార్పొరేషన్, మున్సిపల్, నగర పంచాయతీ కార్యాలయాలతోపాటు ఆర్డీఓ, ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. నిర్దేశించిన తేదీలోపు వచ్చిన అభ్యంతరాలు, సవరణలను ఈ నెల 26 లోపు పరిష్కరిస్తారు. తుది ఓటర్ల జాబితాను ఈ నెల 27వ తేదీన విడుదల చేస్తారు. పోలింగ్ కేంద్రాలు ఇవే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణకు జిల్లాలోని ఏడు రెవెన్యూ డివిజన్లలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అమలాపురం ఆర్డీఓ కార్యాలయం; కాకినాడ అర్బన్, పెద్దాపురం, రంపచోడవరం, ఎటపాక తహసీల్దార్ కార్యాలయాలు; రామచంద్రపురం, రాజమహేంద్రవరం రూరల్ మండలం హుకుంపేటలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. -
త్వరలో ‘స్థానిక’ మండలి సమరం!
- ముగియనున్న ఎమ్మెల్సీ భాస్కర రామారావు పదవీ కాలం - మొదలుకానున్న ఎన్నికల ప్రక్రియ - నెలాఖరుకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కాకినాడ సిటీ : శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గ ఎన్నికల నిర్వహణకు జిల్లాలో రంగం సిద్ధమవుతోంది. 2011లో జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్, కార్పొరేషన్, మున్సిపల్ ప్రజాప్రతినిధుల ద్వారా బొడ్డు భాస్కర రామారావు స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన ఆరేళ్ల పదవీ కాలం మే ఒకటో తేదీతో ముగియనుంది. ఈ గడువు మరో రెండు నెలల 20 రోజులు మాత్రమే ఉండడంతో.. ఎన్నికల ప్రక్రియకు త్వరలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఖాళీ కానున్న స్థానిక సంస్థల నియోజకవర్గాలపై ఆయా జిల్లాల ఎన్నికల అధికారులకు ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ ఇప్పటికే సమాచారం అందించారు. ఓటర్ల జాబితాలతో అన్నివిధాలా సిద్ధంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు ఓటర్ల జాబితాలను అధికార యంత్రాంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. షెడ్యూల్ విడుదలైతే అదే రోజు నుంచి జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుంది. 1,467 మంది ఓటర్లు జిల్లాలో స్థానిక సంస్థల నియోజకవర్గానికి మొత్తం 1,467 మంది ఓటర్లున్నారు. జిల్లా పరిషత్ నుంచి చైర్పర్సన్, జెడ్పీటీసీ సభ్యులు; మండల పరిషత్ల నుంచి ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు; రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ నుంచి మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు; తుని, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, రామచంద్రపురం, మండపేట, అమలాపురం పురపాలక సంఘాల నుంచి చైర్మన్లు, కౌన్సిలర్లు; ముమ్మిడివరం, గొల్లప్రోలు, ఏలేశ్వరం నగర పంచాయితీల నుంచి చైర్మన్లు, వార్డు సభ్యులు ఓటర్లుగా ఉంటారు. కాకినాడ నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగకపోవడంతో ఇక్కడి నుంచి ఓటర్లు లేరు. 2011లో ఎన్నిక సమయంలోనూ ఇక్కడ ఓటర్లు లేక పోవడం విశేషం. అలాగే గతంలో నగర పంచాయతీలు లేవు. ఇవి కొత్తగా ఏర్పడడంతో అక్కడి సభ్యులు కూడా ఈసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. -
‘నేను పక్కా లోకల్’..
-
విద్యుత్ సమస్యల పరిష్కారానికి లోకల్ కోర్టులు
హన్మకొండ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి లోకల్ కో ర్టులు నిర్వహిస్తున్నట్లు వరంగల్ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరి ష్కార వేదిక చైర్మన్ కందుల కృష్ణయ్య తెలిపారు. విద్యుత్ వినియోగదారు లు ఎదుర్కొంటున్న సమస్యలను లోకల్ కోర్టులో ఫిర్యాదు చేయడం ద్వారా పరిష్కరించుకోవచ్చని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో వచ్చే హెచ్చుతగ్గులు, అంతరాయాలు, మీటర్, బిల్లులోని సమస్యలు, కొత్త సర్వీసులు ఇవ్వడంలో జాప్యం, నిరాకరణను ఈ కోర్టు ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. ఈనెల 8న స్టేషన్ఘన్పూర్ సబ్ డివిజన్ కార్యాలయంలో, 10న కురవి సబ్డివిజన్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 వరకు లోకల్ కోర్టులు నిర్వహించనున్నట్లు వివరించారు. -
దేశీయ విత్తనమే జాతికి పునాది
ఆంధ్రప్రదేశ్ ద్వితీయ దేశీవిత్తన సంబరంలో వక్తలు కొరిటపాడు (గుంటూరు): దేశీయ విత్తనమే మన జాతికి పునాది అని వివిధ రాష్ట్రాల దేశీ విత్తనోద్యమకారులు ఎలుగెత్తిచాటారు. హరిత భారతి ట్రస్టు(విజయవాడ) ఆధ్వర్యంలో నగరంలోని వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శుక్రవారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ద్వితీయ దేశీ విత్తన సంబరంలో పలువురు విత్తనోద్యమకారులు ప్రసంగించారు. కర్ణాటకకు చెందిన జాతీయ విత్తన ఉద్యమకారుడు Mýష్ణప్రసాద్ మాట్లాడుతూ నేలే మనకు తల్లి అని, మనం ఏ విత్తనం నాటితే తల్లి ఆ విత్తనాలను వందల పాలబిడ్డలుగా అందిస్తుందని చెప్పారు. దేశీయ లేదా సొంత విత్తనమే మన వ్యవసాయానికి పునాది అని, ఆ పునాదిని బలంగా నిర్మించడమే ఈ దేశీయ విత్తన సంబరమని పేర్కొన్నారు. హరిత భారతి ట్రస్టు నిర్వాహకుడు సీహెచ్ త్రినాథ్ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. తమిళనాడుకు చెందిన దేశీ విత్తన ఉద్యమకారుడు భాస్కరన్ మాట్లాడుతూ పాలేకర్ సూచనలకు అనుగుణంగా రైతులు సహజ వ్యవసాయంపై మక్కువ చూపాలని కోరారు. వేప నూనె, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరప కాయలతో కషాయం తయారు చేసి చీడపీడలను నివారించుకోవాలని చెప్పారు. వరి పొలంలో పక్షి స్థావరాలను ఏర్పాటు చేస్తే చిన్న చిన్న పురుగులను ఏరుకుని తింటాయన్నారు. వక్తలు వారి వారి రాష్ట్రాల్లో సాగు చేసిన దేశవాళీ విత్తనాల గురించి తెలియజేశారు. వారి రాష్ట్రాల్లో పండించిన పంటల విధానాల గురించి క్లుప్తంగా వివరించారు. రైతుల నుంచి హామీపత్రం తీసుకుని ఉచితంగా 5 రకాల దేశవాళీ వరి విత్తనాలు, కంది విత్తనాలు 100 గ్రాములు చొప్పున అందజేశారు. కార్యక్రమంలో జాతీయ పత్తి సలహా సంఘం సభ్యుడు డాక్టర్ డీ నరసింహారెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త ఇంద్రసేనారెడ్డి, తమిళనాడుకు చెందిన దేశీ విత్తన ఉద్యమకారుడు జయచంద్రన్, రామస్వామి, సోంపేటకు చెందిన ఢిల్లీరావు, పద్మజ, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారుగా రెండు వేల మంది రైతులు పాల్గొన్నారు. -
అంత్యంత మాత్రమే
పుష్కర ఏర్పాట్లపై చొరవ చూపని ప్రజాప్రతినిధులు నోరుమెదపని రూరల్ ఎమ్మెల్యే, ఎంపీ ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడమే కారణమా? నగరపాలక సంస్థ అధికారులపైనే ఏర్పాట్ల భారం బెల్లం చుట్టూ ఈగలు ముసిరిన ట్టుగా.. డబ్బులు వచ్చే అవకాశమున్న ఏ కార్యక్రమంలోనైనా రాజకీయ నేతల హడావిడి కనిపిస్తుంటుంది. అదే డబ్బులు రాని కార్యక్రమాలైతే.. ఆ దరిదాపుల్లోనే రాజకీయ నేతలు కనిపించరు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ గోదావరి అంత్య పుష్కరాలే. గతేడాది గోదావరి పుష్కరాలను అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లంతా తామే నిర్వహిస్తున్నట్టుగా హడావిడి చేశారు. తీరా అంత్య పుష్కరాలవిషయానికొచ్చే సరికి కనీసం వాటి ఊసెత్తే ప్రజాప్రతినిధే కరువయ్యారు. – సాక్షి, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో.. అంత్య పుష్కరాల ఏర్పాట్లను నగరపాలక సంస్థ యంత్రాంగమే చేస్తోంది. నెలరోజుల ముందు నుంచే ఏర్పాట్లపై నగరపాలక సంస్థ కమిషనర్, అంత్యపుష్కరాల నోడల్ అధికారి వి.విజయరామరాజు కసరత్తు చేశారు. ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఆయా శాఖలు చేపట్టాల్సిన పనులపై సంబంధిత అధికారులతో చర్చించారు. వరదలతో ఘాట్లపై పేరుకుపోయిన బురదను అగ్నిమాపకశాఖ తొలగించాల్సిన ఉన్నా, సమయం దగ్గరపడుతుండడంతో నగరపాలక సంస్థ సిబ్బందితో తొలగించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఘాట్లలో సీసీ కెమారాలను పునరుద్ధరిస్తున్నారు. అంత్యపుష్కరాలకు వచ్చే భక్తులకు వివిధ సేవలందించేందుకు ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థలతో సమావేశాలు నిర్వహించి వారు చేయాల్సి పనులపై సూచనలు చేస్తున్నారు. గోదావరి పుష్కరాలకు గతేడాది నగరపాలక సంస్థ రూ.240 కోట్లతో ప్రతిపాదనలు పంపింది. ఇందులో నగరంలోని 50 డివిజన్లలో అవసరమైన చోట రోడ్లు వేయడం, దెబ్బతిన్న వాటì కి మరమ్మతులు చేయడం, నగర సుందరీకరణ పేరుతో నగరపాలక సంస్థ పాఠశాలలకు రంగులు వేయడం వంటి అనేక పనులకు నిధులు కే టాయించాలని ప్రభుత్వానికి విన్నవించింది. వీటిలో తమ పరిధిలో చేసే పనులలో కమీషన్లు వస్తాయని కార్పొరేటర్లు, తమకు గంపగుత్తగా ముడుపులు అందుతాయని ఎమ్మెల్యే, ఎంపీలు పుష్కరాలు ప్రారంభానికి నెలల ముందు నుంచి తెగ హడావిడి చేశారు. అంతేకాదు వచ్చే ఏడాది అంత్యపుష్కరాలనూ ఘనంగా నిర్వహిస్తామని ఆయా ప్రజాప్రతినిధులు శపథం చేశారు. ఇంకా నాలుగురోజులే ఉంది.. ఈ నెల 31 నుంచి గోదావరి అంత్యపుష్కరాలు ప్రారంభం కానున్నాయి. వచ్చేనెల 11 వరకు ఇవి జరగనున్నాయి. రోజుకు సుమారు 1.5 లక్షల మంది వస్తారని యంత్రాంగం అంచనా వేస్తోంది. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు రానున్నారు. ఇక ప్రారంభానికి కేవలం నాలుగు రోజుల సమయమున్నా ఇప్పటి వరకు అంత్యపుష్కరాలపై ప్రజాప్రతినిధులు ఎక్కడా మాట్లాడలేదు. ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయో కనీసం పరిశీలించేవారే కరువయ్యారు. దీనికి కారణం అంత్య పుష్కరాలకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడమేననే విమర్శలు వినిపిస్తున్నాయి. నగరం, రాష్ట్రంలో జరిగే ఏ చిన్న విషయంపైనైనా విలేకర్ల సమావేశాల్లో అదరగొట్టే రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పటి వరకు అంత్యపుష్కరాలపై నోరుమెదపకపోవడం విశేషం. ఇక రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యుడు మాగంటి మురళీమోహన్ గతేడాది పుష్కరాలు ముగింపు రోజున ప్రధాన రైల్వే స్టేషన్లో విలేకర్ల సమావేశం నిర్వహించి పుష్కరాలను ఘనంగా నిర్వహించామని, ఇదే విధంగా అంత్యపుష్కరాలు, గోదావరి ఉత్సవాలు కలిపి బ్రహ్మాండంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఇక్కడ అంత్య పుష్కరాల ముగింపు, అక్కడ కృష్ణా పుష్కరాలు ఆరంభం అంటూ గొప్పగా చెప్పారు. తీరా అంత్యపుష్కరాలు సమీపిస్తున్న ఆయన కనీసం స్పందించలేదు. నేతలిచ్చిన హామీలపై నిలదీయాల్సిన ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు మిన్నుకుండిపోయారు. కొద్దోగొప్పో నగరపాలక సంస్థ మేయర్ పంతం రజనీశేషసాయి, సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఘాట్లు పరిశీలిస్తూ ఏర్పాట్లపై సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. -
అంతా అబద్ధం
♦ స్థానికంగా ఉంటున్నట్లు నివేదికలు ♦ స్థానికంగా ఉండని ఇన్చార్జి ఎంఈవోలు ♦ జిల్లా, నియోజకవర్గ కేంద్రాలే అసలు నివాసం ♦ ఎంఈవోల పర్యవేక్షణ అంతా ప్రయాణంలోనే.. ♦ విద్య, ఆదాయ శాఖ అధికారులకు తప్పుడు నివేదికలు ♦ మెరుగైన విద్యకు ప్రభుత్వ ఆదేశాలు బుట్టదాఖలు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : వారు జిల్లా విద్యాశాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మండల విద్యా వ్యవస్థను గాడిలో పెట్టె రథసారధులు. పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజన పర్యవేక్షణ, బాల కార్మికులను బడిలో చేర్పించడం వంటి విధులతో పర్యవేక్షణ చేయాల్సిన సమయూన్ని ప్రయాణంలో గడిపేస్తున్నారు. రోజు కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుండటంతో విధులకు సకాలంలో రాలేని పరిస్థితి. మరో వైపు వీరంతా డిప్యూటేషన్పై పనిచేస్తుండటంతో ఏ పోస్టుకు న్యాయం చేయడం లేదు. మరోవైపు వీరంతా మండల కేంద్రంలోనే నివాసం ఉంటున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారులకు, ఆదాయశాఖ పన్ను శాఖాధికారులకు నివేదికలు మాత్రం పంపుతున్నారు. ఇదంతా ఒక పెద్ద అబద్దం అని తెలిసినా డివిజన్, జిల్లా విద్యాశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా మండల స్థాయిలో విద్యా వ్యవస్థ గాడి తప్పుతున్నది. ఇదే అదనుగా కొందరు ఉపాధ్యాయులు డుమ్మాలు కొడుతున్నారు. స్థానికంగా ఉండని ఇన్చార్జి మండల విద్యాశాఖాధికారులు జిల్లాలో 36 మండలాల్లో గల విద్యాశాఖాధికారుల్లో గాంధారి మండల విద్యాశాఖాధికారి మాత్రమే శాశ్వత పోస్టును కలిగి ఉన్నారు. మిగతా 35 మండలాల విద్యాశాఖాధికారులు డిప్యూటేషన్పై పనిచేస్తున్నారు. జిల్లాలో చాలా మంది విద్యాశాఖాధికారులు నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లా కేంద్రంలో ఉంటూ ప్రతినిత్యం వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ సమయమంతా ప్రయాణంలోనే గడిపేస్తూ విద్యావ్యవస్థ పర్యవేక్షణ బాధ్యతలను ఏలుతున్నారు. అటు సొంత పాఠశాలల్లో విధులకు ఎగనామం పెడుతూ.. ఇటు మండల విద్యావ్యవస్థ బాధ్యతలను సక్రమంగా నిర్వహించక విద్యావ్యవస్థను దిగజారే స్థాయికి తెస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. మండల విద్యాశాఖాధికారులు మారుమూల మండల కేంద్రాల్లోని గ్రామాల్లో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఉపాధ్యాయులు బడులకు డుమ్మాలు కొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బీంగల్, సిరికొండ, జుక్కల్, గాంధారి, మద్నూరు, బిచ్కుంద మండలాల్లో ఈ పరిస్థితి కనిపిస్తున్నది. కామారెడ్డి విద్యా డివిజన్లోని కొన్ని మండలాల్లో కూడా ఉపాధ్యాయులు, రియల్ ఎస్టేట్, ఎల్ఐసీ వంటి స్థిరాస్తి వ్యాపారాలు చేసుకుంటూ బడులకు ఎగనామం పెడుతున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జిల్లా విద్యాశాఖాధికారి, విద్యాశాఖ కార్యదర్శి వరకు ఫిర్యాదులు కూడా వెళ్లినా వారిలో మార్పులేదు. తప్పుడు సమాచారం ఇస్తున్న ఎంఈవోలు మండల విద్యాశాఖాధికారులు తమ అసలు నివాసం యొక్క చిరునామా గూర్చి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. జిల్లా విద్యాశాఖాధికారులకు, ఆదాయం పన్ను శాఖ అధికారులకు ఇచ్చే నివేదికల్లో అసలు నివాసం మండల అభివృద్ధి కార్యాలయాల సమీపంలో నివాసం ఉంటున్నట్లు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. అంతా అబద్దం అని తెలిసిన కూడా జిల్లా ఉన్నతాధికారులు సంఘాల యొక్క ప్రతినిధులు ఒత్తిడి వల్ల ఏమి చేయలేక మిన్నకుండి పోతున్నారు. ఫిబ్రవరిలో సమర్పించిన ఇన్కంటాక్స్ పత్రాలలో అందరు ఎంఈవోలు తమ నివాసాలు మండల కేంద్రంలోనే పేర్కొనడం నిజంగా గమనార్హం. కాగా మండల విద్యాశాఖాధికారులు స్థానికంగా ఉండకపోవడం సమయమంతా ప్రయాణంలో గడపడం వల్ల పర్యవేక్షణ గాలిలో దీపంలా మారింది. నిరంతర పర్యవేక్షణ ఉండకపోవడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందడం లేదు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుశాతం తగ్గుతున్నది. మారుమూల గిరిజన ప్రాంతాలలో బడులు కూడా సరిగా తెరుచుకోవడం లేదు. అలాగే తమ పాఠశాలల్లో వీరు బోధించాల్సిన సబ్జెక్టులలో విద్యార్థులు వెనుకబడిపోతున్నారు. -
నిబంధనలనుంచి మినహాయింపు కోరిన 'యాపిల్'
అమెరికాకు చెందిన ఐఫోన్, ఐ ప్యాడ్ తయారీ సంస్థ యాపిల్ విడిభాగాల సమీరకణ నిబంధనలపై మరోసారి మినహాయింపును కోరింది. ఈ నేపథ్యంలో యాపిల్.. పారిశ్రామిక విధాన ప్రోత్సాహక మండలి (డిప్) కు ఓ ప్రదర్శన ఇచ్చింది. దేశంలోని దుకాణాలతోపాటు, ఆన్ లైన్ విక్రయాలకు అనుమతి కోరిన సంస్థ.. డీఐపీపీకి వివరణ ఇచ్చింది. భారత్ లో వస్తువులను విక్రయించాలంటే 30 శాతం విడి భాగాలను దేశీయంగా సమీకరించాలన్న నిబంధన నుంచి యాపిల్ సంస్థ మినహాయింపు కోరుతూ మరోసారి వివరణ ఇచ్చింది. అమెరికా ఆధారిత సంస్థ దేశంలో సింగిల్ బ్రాండ్ రిటైల్ దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వంనుంచి ఆమోదం కోరింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డీ ఐ) నిబంధనల ప్రకారం అత్యున్నత సాంకేతికత ఇమిడి ఉండే సింగిల్ బ్రాండ్ ఉత్పత్తులకు నిబంధనలు తప్పనిసరి చేసే అవకాశం లేకపోవడంతో యాపిల్ కు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో డిప్ త్వరలోనే యాపిల్ సంస్థ ధరఖాస్తును స్వీకరించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. దీనిపై సమీక్షించేందుకు ప్రభుత్వం ఓ ప్రత్యేక కమిటీని కూడ ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి డీఐపిపి శాఖ కార్యదర్శి రమేష్ అభిషేక్ నేతృత్వం వహిస్తారు. ప్రస్తుతం సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగంలో ఎఫ్డీఐ అనుమతి 100 శాతం ఉంది. కానీ కంపెనీలు 49 శాతం మించి ఉన్నపుడు ఎఫ్ ఐపిబి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే యాపిల్ కంపెనీ తన ఉత్పత్తులను తమ స్వంత రిటైల్ దుకాణాల ద్వారా చైనా, జర్మనీ, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లో విక్రయిస్తోంది. అయితే ఇండియాలో మాత్రం యాపిల్ స్వంత దుకాణాలను తెరవలేదు. రెడింగ్టన్, ఇన్ గ్రామ్ మైక్రో వంటి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా విక్రయిస్తోంది. ప్రస్తుతం యాపిల్ తో పాటు చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ గ్జియామీ కూడ భారత్ లో సింగిల్ బ్రాండ్ విక్రయశాలల ప్రారంభానికి అనుమతికోసం ధరఖాస్తు చేసుకుంది. -
తెలంగాణ వారికే విద్యుత్ పోస్టులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర జెన్కో పరిధిలో జరిగే నియామకాల్లో తెలంగాణ వారికే అవకాశం కల్పించనున్నారు. ఓపెన్ కేటగిరీలో పోటీ చేసే వారు కూడా తెలంగాణావాసులై ఉండాలి. ఈ మేరకు ఏపీ విద్యుత్ బోర్డు నియామక మార్గదర్శకాలను సవరిస్తూ జెన్కో సీఎం ప్రభాకర్రావు కొత్త మార్గదర్శకాలు జారీచేశారు. అసిస్టెంట్ ఇంజనీర్, కెమిస్ట్ల భర్తీలో 60:40 నిష్పత్తిలో, సబ్ ఇంజనీర్ల నియామకాల్లో 70:30 నిష్పత్తిలో లోకల్, ఓపెన్ రిజర్వేషన్లు అమలు కానున్నాయి. జెన్కో పరిధిలోని విద్యుత్ కేంద్రాల ఆధారంగా రాష్ట్రాన్ని రెండు జోన్లుగా విభజించారు. ఉత్తర తెలంగాణ పరిధిలోని 4 జిల్లాలతో జోన్-1ను, దక్షిణ తెలంగాణలోని 6 జిల్లాలతో జోన్-2ను ఏర్పాటు చేశారు. ఆయా జోన్లలోని కేంద్రాల్లో ఖాళీల భర్తీకి స్థానిక అభ్యర్థులకు లోకల్ రిజర్వేషన్ కల్పిస్తారు. -
రైతుకు ధరహాసం
మండపేట : ఎండల తీవ్రతతో కుదేలైన కోళ్ల పరిశ్రమకు ప్రస్తుతం గుడ్డు ధర ఆశాజనకంగా ఉండటం ఊరటనిస్తోంది. ఎగుమతులతో పాటు స్థానిక వినియోగం పెరిగి రైతు ధర పుంజుకుంటోంది. మార్కెట్ పోకడ దృష్ట్యా గుడ్డు ధర రైతు వద్ద రూ.4.25కు చేరే అవకాశం ఉందని పౌల్ట్రీవర్గాలు భావిస్తున్నాయి. ఎగుమతులతో పాటు స్థానిక వినియోగం తగ్గడం, సెలవుల కారణంగా హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు మూతపడడం వల్ల వేసవిలో రైతు వద్ద గుడ్డు ధర పతనమైంది. ఏప్రిల్ నుంచి మే నెలాఖరు వరకు రూ.2.24 నుంచి రూ. 2.95 మధ్య పడుతూ లేస్తూ ఉన్న గుడ్డు రైతు ధర జూన్ ప్రారంభం నుంచి వేగంగా పుంజుకుంటోంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో జిల్లా నుంచి పశ్చిమబెంగాల్, అస్సాం, బీహార్ తదితర రాష్ట్రాలకు గుడ్ల ఎగుమతులు పెరిగాయి. పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు తెరవడం, కూరగాయల ధరలు పెరిగిపోవడంతో స్థానికంగానూ గుడ్లు వినియోగం పెరిగింది. ఈ నేపథ్యంలో గుడ్డు ధర రైతువద్ద పెరుగుతూ శుక్రవారం నాటికి రూ.3.94లకు చేరుకుంది. ఇది మరింత పెరిగి రూ.4.25 వరకు చేరే అవకాశం ఉందని పౌల్ట్రీ వర్గాలంటున్నాయి. జిల్లాలోని పౌల్ట్రీల్లో సుమారు 1.30 కోట్ల కోళ్లు ఉండగా రోజుకు కోటీ 10 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతుంటాయి. వీటిలో 65 శాతం గుడ్లు బీహార్, ఒరిస్సా, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు ఎగుమతవుతుండగా మిగిలినవి స్థానికంగా వినియోగమవుతున్నాయి. వేసవిలో ఎండల తీవ్రతతో 20 శాతం మేర ఉత్పత్తి పడిపోగా, రోజుకు లక్ష వరకు కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఆ రకంగా జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమకు రూ.20 కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా. వేసవి నష్టాలను కొంత భర్తీ చేసుకునేందుకు ప్రస్తుత ధర దోహదపడుతుందని కోళ్ల రైతులు భావిస్తున్నారు. కూరగాయలతో పాటు అపరాల ధరలు మండిపడుతున్న తరుణంలో మంచి ప్రత్యామ్నాయంగా ఉన్న కోడిగుడ్డు రేటు కూడా ఇప్పుడు వాటి సరసన చేరిపోరుుంది. తక్కువ ధరలో అందుబాటులో ఉండే పౌష్టికాహారంగా కోడిగుడ్లను సామాన్య, మధ్య తరగతి ప్రజలు అధికంగా వినియోగిస్తారు. రిటైల్ మార్కెట్లో వ్యాపారులు రూ.ఐదు వరకు, కొన్ని చోట్ల రూ.5.50 వరకు కూడా అమ్ముతుండటంతో సామాన్యులకు కొనడం భారమవుతోంది. రైతు ధర ఆశాజనకంగా ఉంది.. గుడ్ల ఎగుమతులు, స్థానిక వినియోగం పెరగడంతో రైతు ధర ఆశాజనకంగా ఉంది. వేసవి నష్టాలను కొంత మేర భర్తీ చేసుకునేందుకు ఈ ధర ఉపకరిస్తుంది. అయితే ధర ఏడాదిలో సగటున రూ.3.25 ఉంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. - పడాల సుబ్బారెడ్డి, పౌల్ట్రీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి -
స్థానికులకు ఉద్యోగాలివ్వకపోతే పోరాటాలు
తోటపల్లిగూడూరు : తీర ప్రాంతం వెంబడి నెలకొల్పుతున్న పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించకపోతే పోరాటాలు తప్పవని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి హెచ్చరించారు. మండంలోని వరకవిపూడి, మండపం పంచాయతీల్లో జరిగిన జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని తీర ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఏర్పాటవుతున్నా స్థానికులకు ఉద్యోగావకాశాలు లభించడంలేదని చెప్పారు. అతి చౌకగా భూములను తీసుకొని అందులో పరిశ్రమలను స్థాపించిన కంపెనీల యాజమాన్యాలు చదువుకొని నిరుద్యోగులుగా మిగిలిపోతున్న వారికి ఎందుకు ఉపాధి కల్పించడంలేదని మండిపడ్డారు. స్థానికులకు పోనూ మిగిలిన ఉద్యోగాలను మాత్రమే బయటి వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో స్థానికులకు అండగా నిలిచి కంపెనీలపై పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పేదల జీవన విధానాన్ని తెలుసుకోకుండా.. వారి జీవితాల్లో ఎలా మార్పులు తీసుకురావాలో ప్రణాళికలు వేయకుండా.. పేదరికంపై గెలుపంటూ పాలకులు డప్పులు కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ సుజలధార పథకంపై సంతకం చేశారని, దీని ద్వారా రూ.2కే 20 లీటర్ల స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తామని చెప్పారన్నారు. అయితే తమ వద్ద నిధుల్లేవని, దాతలే ముందుకొచ్చి వాటర్ ప్లాంట్ను నిర్మించాలని చంద్రబాబు ప్రస్తుతం చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పారు. అర్హుల పింఛన్లను తొలగిస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజల పక్షాన నిలిచి పోరాటాలకు సిద్ధమవుతామని స్పష్టం చేశారు. అనంతరం పింఛన్లను పంపిణీ చేశారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటారు. తహశీల్దార్ రామకృష్ణ, ఎంపీడీఓ సావిత్రమ్మ, జెడ్పీటీసీ సభ్యుడు మన్నెం చిరంజీవులుగౌడ్, సర్పంచ్లు కాల్తిరెడ్డి సుబ్బారావు, వెల్లసిరి వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ సభ్యులు ఉప్పల స్వర్ణలత, కాయల జోసఫ్, నాయకులు ఇసనాక రమేష్రెడ్డి, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు చిల్లకూరు సుధీర్రెడ్డి, మండల కన్వీనర్ టంగుటూరు పద్మనాభరెడ్డి, ముత్తూకూరు మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్రెడ్డి, వేనాటి జితేంద్రరెడ్డి, ఉప్పల శంకరయ్యగౌడ్, తూపిలి శ్రీధర్గౌడ్, కృష్ణారెడ్డి, ఎండికళ్ల దయాకర్గౌడ్ పాల్గొన్నారు. -
కటాఫ్.. 1956 నవంబర్ 1
‘ఫాస్ట్’కు ‘స్థానిక’ నిర్ధారణపై టీ సర్కారు ఉత్తర్వులు ఎమ్మార్వోల నుంచే ధ్రువపత్రాలు సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం(ఫాస్ట్)’ పేరుతో ప్రకటించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఇంతకు ముందు ప్రకటించిన విధంగానే 1956కు ముందు నుంచీ తెలంగాణలో నివసించిన వారి వారసులకే ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. ఇందుకు 1956 నవంబర్ 1 (01-11-1956)వ తేదీని కటాఫ్గా నిర్ధారించారు. మండల రెవెన్యూ కార్యాలయాల ద్వారా ఈ బోనఫైడ్ నివాస ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంటుంది. ఈ ధ్రువపత్రాన్ని జత చేసిన పేద విద్యార్థులకే ఈ ఏడాది నుంచి ‘ఫాస్ట్’ పథకాన్ని వర్తింపజేస్తారు. 2014-15 విద్యాసంవత్సరంలో కొత్తగా చేరే పోస్టు మెట్రిక్ విద్యార్థులతో పాటు ఇప్పటికే వివిధ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ‘ఫాస్ట్’ పథకాన్ని వర్తింపజేయడంపై తుది విధివిధానాల రూపకల్పనకు ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ బుధవారం ఉత్తర్వులు (జీవోఆర్టీ నం. 36) జారీ చేశారు. ఈ కమిటీలో దళిత అభివృద్ధి, ఎస్టీ, బీసీ సంక్షేమ విభాగాల ముఖ్య కార్యదర్శి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి, సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సహాయాన్ని ఖరారు చేస్తుంది. ఎమ్మార్వో కార్యాలయాల నుంచే.. విద్యార్థులు ‘ఫాస్ట్’ పథకం కింద ఈ విద్యా సంవత్సరం నుంచి ఫీజు పొందాలంటే తప్పనిసరిగా వారి తల్లిదండ్రులు, తాతలకు సంబంధించి 1956కు ముందు నుంచీ నివాసమున్నట్లుగా ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా అందజేయాల్సిందే. మండల రెవెన్యూ కార్యాలయాల్లో దీనికి సంబంధించి పూర్తిస్థాయి ఫార్మాట్ను అందుబాటులో ఉంచుతారు. అందులో స్థానికతకు సంబంధించిన వివరాలను విద్యార్థులు పూర్తి చేసి మండల కార్యాలయాల్లో అందజేస్తే.. ధ్రువీకరణ పత్రం జారీ చేసేలా నిబంధనలు రూపొందించారు. -
''తెలంగాణ ప్రభుత్వ జీఓపై కోర్టుకు వెళతాం''
-
తెలంగాణ ప్రభుత్వ జీఓపై కోర్టుకు వెళతాం: ఏపి మంత్రి రావెల
హైదరాబాద్: స్థానికత విషయంలో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీఓపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఏపి సాంఘీక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్బాబు చెప్పారు. తెలంగాణలో 1956కు ముందు ఉన్నవారినే స్థానికులుగా పరిగణించాలని ఆ ప్రభుత్వం జిఓ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ జీఓ జారీపై ఏపి ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీఓ ప్రకారం 1956 తరువాత నుంచి ఇక్కడ ఉన్నవారిని స్థానికులుగా పరిగణించరు. దాంతో విద్యార్థులకు, నిరుద్యోగులకు అనేక చిక్కులు ఇస్తాయి. ఆ జీఓపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో మంత్రి కిషోర్ బాబు అడ్వకేట్ జనరల్(ఏజీ)ను సంప్రదించారు. -
స్థానికతపై న్యాయపోరాటం : అఖిలపక్షం నిర్ణయం
హైదరాబాద్: స్థానికత అంశంపై న్యాయపోరాటం చేయాలని అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది. ఫీజు రీయింబర్స్మెంట్, స్ధానికతపై అఖిలపక్షం సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఏపి మంత్రులు గంటా శ్రీనివాస రావు, రావెల కిషోర్బాబు, వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, శ్రీనివాసులు, బిజెపి విష్ణుకుమార్ రాజు, ఉన్నత విద్యామండలి అధికారులు పాల్గొన్నారు. స్థానికతను నిర్ణయించే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి లేదని ఈ సమావేశం అభిప్రాయపడింది. 1956 కటాఫ్ విధించండం సమంజసం కాదని నేతలు అన్నారు. ఇది ఫీజురీయింబర్స్మెంట్ వరకే పరిమితం కాదని, భవిష్యత్తులో ఉద్యోగాలు, నివాసానికి కూడా వర్తింపచేసే దురాలోచన ఉందని పేర్కొన్నారు. ఈ విషయంపై 21న జరిగే మంత్రి మండలి సమావేశంలో చర్చిస్తామని మంత్రులు చెప్పారు. సుప్రీం కోర్టులో కూడా ఎంసెట్పై ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అవుతుందని మంత్రులు తెలిపారు. విద్యార్ధులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలకు సహకరిస్తామని వైఎస్ఆర్ సిపి నేత జ్యోతుల నెహ్రూ చెప్పారు. మంత్రి మండలి నిర్ణయాన్ని తమ పార్టీకి అందజేయాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తమ నేత వైఎస్ జగన్మోహన రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తమ వైఖరి చెప్తామన్నారు. కేంద్రంపై ఒత్తిడికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. -
ఫీజుకు ప్రాతిపదిక 1956
స్థానికత నిర్ధారణపై కేసీఆర్ ఆదేశం వేరే రాష్ట్ర విద్యార్థులకు ‘ఫీజులు’ చెల్లించకూడదు పకడ్బందీ చట్టం రూపొందించాలని అధికారులకు సీఎం సూచన వారం రోజుల్లో ఉత్తర్వులు! సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో స్థానికత నిర్ధారణకు 1956 కన్నా ముం దు నుంచీ తెలంగాణలో నివసించడాన్నే ప్రాతిపదికగా తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దీనికి న్యాయపరమైన అడ్డంకులు ఎదురుకాకుండా పకడ్బందీ చట్టాన్ని రూపొందించాలని, తెలంగాణ విద్యార్థులు నష్టపోకుండా చూడాలని స్పష్టం చేశారు. తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు 1956 కన్నా ముందు నుంచీ తెలంగాణలో నివసించిన వారినే స్థానికులుగా గుర్తించాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఏ ఆధారంగా స్థానికతను గుర్తిస్తారనే వాదనలూ వచ్చాయి. ఈ నేపథ్యలో ఈ అంశంపై ఇప్పటికే సమీక్షించిన సీఎం కేసీఆర్ శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, ఆర్థిక, విద్యా, సంక్షేమ, న్యాయశాఖ అధికారులతో మరోసారి సమీక్షా సమావేశం నిర్వహించారు. ‘‘తెలంగాణ బిడ్డలకే ఫీజు రీయింబర్స్మెంట్ ఇద్దామని ఇప్పటికే స్పష్టం చేశాం. దానికే కట్టుబడి ఉన్నాం. తెలంగాణ పిల్లలు ఆంధ్రప్రదేశ్లో చదివినా.. దేశంలో ఎక్కడ చదువుకుంటున్నా అర్హులైన వారందరికి తెలంగాణ ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుంది. దీనిపై రాద్ధాంతం అనవసరం. హైదరాబాద్ స్టేట్ ఆంధ్రరాష్ట్రంలో కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తరువాతే సీమాంధ్ర వాళ్లు తెలంగాణ జిల్లాలకు వచ్చారు. అంటే వారి బీజాలన్నీ ఆంధ్రావే కదా. అలాంటి వారికి తెలంగాణ ప్రభుత్వం ఎలా ఫీజులు చెల్లిస్తుంది. మరోసారి పూర్తిగా అధ్యయనం చేసి నివేదికలు రూపొందించండి. రెండు మూడు రోజుల్లో మరోసారి సమావేశమవుదాం. క చ్చితమైన చట్టాన్ని రూపొందిద్దాం. ఏ కోర్టుకు వెళ్లినా మన పిల్లల ప్రయోజనాలకు భంగం కలగకూడదు. అలాగే వేరే రాష్ట్రం వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం ఫీజులు చెల్లించకూడదు..’’ అని కేసీఆర్ అధికారులకు స్పష్టం చేశారు. అయితే ఈ సమావేశంలో 1969, 1973 సంవత్సరాలలో ఒకదానిని కటాఫ్ ఏడాదిగా గుర్తించి, ఆయా సంవత్సరాలకు ముందు నుంచీ నివసిస్తున్న వారిని స్థానికులుగా గుర్తించాలన్న అంశంపైనా చర్చ జరిగింది. కానీ ముఖ్యమంత్రితో పాటు అధికారులు కూడా 1956 సంవత్సరాన్నే కటాఫ్ ఏడాదిగా గుర్తించాలని అభిప్రాయం వ్యక్తం చేశారని విశ్వసనీయ సమాచారం. దీనికి సంబంధించి వారం రోజుల్లోపే స్పష్టమైన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి, సీఎస్ రాజీవ్ శర్మ, ఏజీ రామకృష్ణారెడ్డి, అదనపు ఏజీ రాంచందర్రావు, విద్యాశాఖ కార్యదర్శి నాగిరెడ్డి, సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు. -
అన్ని సర్వేల్లోనూ వైఎస్సార్సీపీ విజయప్రస్థానం
నాయుడుపేటటౌన్, న్యూస్లైన్: అన్ని సర్వేల్లోనూ వైఎస్సార్సీపీ విజయ ప్ర స్థానం స్పష్టంగా కనిపిస్తోందని ఆ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి అన్నారు. ఎన్ని గిమ్మిక్కులు చేసిన నా ప్రజల్లో గుండెల్లో నుంచి వైఎస్సార్ ముద్రను చెరపలేరన్నారు. గురువారం నాయుడుపేటలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ మాట్లాడుతూ పలు సర్వేల్లో వైఎస్సార్సీపీ 135-145 స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడైందన్నారు. టీడీపీకి 35- 40 స్థానాలు దక్కుతాయని సర్వేల్లో తే లిందన్నారు. కొంతమంది కాంగ్రెస్ నా యకులు టీడీపీ పంచన చేరుతుండటం తో చంద్రబాబు ఆనందపడుతున్నారని, అయితే ప్రజల్లో వైఎస్సార్సీపీకి ఏమాత్రం ఆదరణ తగ్గలేదన్నారు. 25 ఎంపీ స్థానాల్లో 22 వైఎస్సార్ సీపీకి దక్కే అవకాశం ఉందని పలు సర్వేలు తేల్చి చెప్పాయన్నారు. రాబోయే రోజు ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా పెద్ద భాగస్వామ్య పార్టీ కాబోతుందన్నారు. అన్ని విధాలుగా అభివృద్ధికి బాటలు వేసేం దుకు కృషి చేస్తున్న జగన్బాబును ఆదరించి స్థానిక, మున్సిపల్ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి పార్టీ అభ్యర్థులకు విజయం చేకూర్చాలని కోరారు. ఎంపీ వెంట వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, తిరుపతి పార్లమెం టు నియోజకవర్గ సమన్వయకర్త వరప్రసాద్, నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య, మండల కన్వీనర్ తంబిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, నాయకు లు కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, కట్టా సుధాకర్రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర యువజన విభాగ కార్యవర్గ సభ్యులు ఓడూరు గిరిధర్రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పేరం మధునాయుడు, 786 సేవా సంఘ చైర్మన్ షేక్ రఫీ, కట్టా వెంకటరమణారెడ్డి ఉన్నారు. మేకపాటి ప్రచార ర్యాలీకి అపూర్వ స్పందన నాయుడుపేటలో మేకపాటి ప్రచార ర్యాలీకి అపూర్వ స్పందన లభించింది. ముందుగా మేకపాటి పాతబస్టాండ్ వద్దనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్, వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి ప్రచార ర్యాలీ నిర్వహించారు. దారిపొడవునా వ్యాపారులు, గృహణిలను ఆప్యాయంగా పలకరిస్తూ ముం దుకు సాగారు. టీడీపీకి చెందిన స్థానిక ఫ్రెండ్స్ హోమ్ నీడ్స్ అధినేత చంద్రశేఖర్, స్థానిక నాయకులు కిలివేటి సంజీవయ్య, షేక్ రఫీ ఆధ్వర్యంలో మేకపాటి సమక్షంలో పార్టీలో చేరారు. జామియా మసీదు కూడలి వద్ద మసీదు ముతవళ్లీతో పాటు పలువురు మతపెద్దలను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు దారి పొడవునా బాణాసంచా కాల్చుతూ పూలవర్షం కురిపిస్తూ మేకపాటికి ఘనస్వాగతం పలికారు. -
రోడ్డు నిర్మాణం.. ప్రచారాస్త్రమే !
బెజ్జూర్, న్యూస్లైన్ : ప్రజాప్రతినిధులు.. ప్రభుత్వాలు.. స్థాని క ప్రజాప్రతి నిధులు మారి నా రోడ్డు సమస్య తీరడం లేదు. ఎన్నికల సమయంలో ప్ర చారాస్త్రంగా మారుతూనే ఉంది. ఇచ్చిన హామీలను నాయకులు మర్చిపోతూనే ఉన్నా రు. మండలంలోని ఎర్రగుంట, నందిగాం, మొర్లిగూడ, జిల్లేడ గ్రామాల ప్రజలు దీర్ఘకాలంగా సరైన రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నా రు. పాపన్పేట నుంచి మొర్లిగూడ వరకు 12కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆరు కిలోమీట ర్ల మేర అటవీ శాఖ భూమి ఉంది. మొర్లిగూడ పక్కనే జిల్లేడ, నందిగాం గ్రామాలున్నాయి. మొర్లిగూడ, జిల్లెడ గ్రామాల్లో 2000 మంది జ నాభా ఉండగా.. వీరిలో 1,070 మంది ఓటర్లు ఉన్నారు. అందరూ గిరిజనులే. పాపన్పేట్ గ్రామం నుంచి అటవీ ప్రాంతంలో రో డ్డు ని ర్మాణం చేపడితే సమస్య తీరిపోతుంది. బస్సు సౌకర్యమూ కలుగుతుంది. కానీ రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ అనుమతి లభించడం లేదు. రెండేళ్ల క్రితం ఎమ్మెల్యే నిధుల నుంచి మట్టి రోడ్డు వేసినా అటవీ శాఖ పరిధిలోని భూ మి వరకు రాగానే నిలిపివేశారు. ఎన్నికల సమయంలో నాయకులు ఇస్తున్న హామీలు ఇప్పటి కీ నెరవేరడం లేదు. బెజ్జూరుకు 20 కిలోమీటర్ల దూరంలోని ఎర్రగుంట గ్రామంలో 400 మం ది జనాభా ఉన్నారు. అక్కడ ఇప్పటికీ కరెం టు, రోడ్డు, నీటి సమస్య తీవ్రంగా ఉంది. పెంచికల్పేట నుంచి ఎర్రగుంటకు రోడ్డు సౌకర్యం లేదు. దీంతో ఆరు కిలోమీటర్లు కాలినడ క, ఎడ్లబండిపై వెళ్తున్నారు. సమస్యలు పరిష్కరించే వారికే ఓటు వేస్తామని ఆయా గ్రామాల ప్రజలు తేల్చిచెబుతున్నారు. -
బదిలీలపై బదులేదీ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: విద్యాశాఖలో ‘స్థానిక’ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. జిల్లాలో స్థానికేతర ఉపాధ్యాయుల వివరాలు తేల్చాలంటూ రాష్ట్ర విద్యాశాఖ జిల్లా విద్యాశాఖకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 2001కి ముందువరకు నిర్వహించిన డీఎస్సీల్లో స్థానిక, స్థానికేతర అభ్యర్థులు 70:30 చొప్పున పరిగణనలోకి తీసుకోవాలని, 2001 తర్వాత నిర్వహించిన డీఎస్సీల్లో ఈ నిష్పత్తి 80:20 చొప్పున గణిస్తూ.. ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో స్థానికేతర అభ్యర్థుల లెక్క తేల్చాలని సూచించింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉత్తర్వులతో నేరుగా జిల్లాకు వచ్చిన వారి విషయంలో స్పష్టత ఇవ్వలేదు. దీంతో వారిని ఏ కేటగిరీలో చూపించాలో విద్యాశాఖకు అర్థం కాని పరిస్థితి తలెత్తింది. అలా చూపించి.. ఇలా చొచ్చుకువచ్చి రాజధాని చుట్టూ జిల్లా విస్తరించి ఉండడంతో వందల సంఖ్యలో అంతర్ జిల్లా టీచర్లు బదిలీపై వచ్చారు. అంతేకాకుండా హైదరాబాద్లో స్థానిక సంస్థల పాఠశాలలు లేకపోవడంతో ఆ జిల్లాకు బదిలీపై వచ్చిన పలువురు టీచర్లు కూడా జిల్లాలో నియమితులయ్యారు. అంతర్జిల్లా బదిలీ ప్రక్రియలో కాకుండా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా ఈ బదిలీ తాకిడి విపరీతంగా పెరిగింది. జిల్లాలో ఇప్పటివరకు 400 మందికిపైగా.. ప్రభుత్వ ఉత్తర్వులతో వచ్చిన వారున్నారని విద్యాశాఖ అధికారుల ప్రాథమిక అంచనా. కానీ విద్యాశాఖ అధికారులు ఇలా వచ్చినవారి వివరాలను ఇప్పటివరకు రికార్డు చేయలేదు. ఆ లెక్కలు అంత సులువేం కాదు జిల్లాలో స్థానికేతర టీచర్లు వెయ్యి మంది వరకు ఉంటారని విద్యాశాఖ ప్రాథమిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే డీఎస్సీల వారీగా పరిశీలిస్తే కచ్చితమైన వివరాలు వెలుగు చూస్తాయి. కానీ అంతర్ జిల్లాల నుంచి బదిలీపై వచ్చినవారి లెక్క తేల్చడం అంత సులువైన విషయం కాదని విద్యాశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గడిచిన పదేళ్ల కాలంలో ఏకంగా 400 మందికిపైగా ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉత్తర్వులతో ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆయా టీచర్ల వివరాలు నియామకాల జాబితాల్లో నమోదు కావు. దీంతో వారి వివరాలు తెలుసుకోవాలంటే క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సిందే. ప్రస్తుతం జిల్లాలో 12వేల మందికిపైగా ప్రభుత్వ టీచర్లున్నారు. డీఎస్సీల వారీగా కాకుండా సర్వీసు పుస్తకాల ఆధారంగా పరిశీలిస్తేనే స్పష్టత వస్తుందని, ఇది సుదీర్ఘ ప్రక్రియని అధికారులు చెబుతున్నారు. డీఎస్సీల వారీగా పరిశీలిస్తాం: సోమిరెడ్డి, డీఈఓ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం డీఎస్సీల వారీగా స్థానిక, స్థానికేతర టీచర్ల వివరాలు పరిశీలిస్తాం. ఇందుకు సంబంధించి ప్రత్యేక నివేదిక తయారు చేస్తాం. ప్రత్యేక ఉత్తర్వులతో జిల్లాకు బదిలీపై వచ్చిన అంతర్జిల్లా టీచర్ల అంశంపై ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. -
రాత్రంతా రైళ్లు నడపండి
సాక్షి, ముంబై: గణేశ్ ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం రాత్రంతా లోకల్ రైళ్లు నడపాలని సార్వజనిక గణేశ్ ఉత్సవ్ సమన్వయ సమితి అధ్యక్షుడు గణేశ్ చవాన్ సెంట్రల్ రైల్వే పరిపాలన విభాగంతో డిమాండ్ చేశారు. ఉత్సవాల సమయంలో నగర, తూర్పు, పశ్చిమ శివారు ప్రాంత ప్రజలతోపాటు ముంబైకి ఆనుకుని ఉన్న ఠాణే, రాయ్గడ్ జిల్లాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. అనేక చోట్ల కళ్లు మిరుమిట్లుగొలిపే విద్యుత్ దీపాలు, ఆకట్టుకునే భారీ విగ్రహాలు, అలంకరణలు తిలకించేందుకు నగర శివారు ప్రాంతాల నుంచి జనం వస్తుంటారు. ముఖ్యంగా కరీరోడ్ ప్రాంతంలో ఉన్న ‘లాల్బాగ్ చా రాజా’, కింగ్స్ సర్కిల్ ప్రాంతంలో ఉన్న జీఎస్బీ ప్రతిష్ఠించిన విగ్రహాలను భక్తిప్రపత్తులతో కొలుస్తారు. వీటితోపాటు అనేక సార్వజనిక గణేశ్ ఉత్సవ్ మండళ్లు ఉన్నాయి. సాయంత్రం ఇంటి నుంచి బయటపడిన జనం విగ్రహాలను దర్శించుకుని అర్ధరాత్రి దాటిన తరువాత తిరుగు ప్రయాణమౌతారు. ఉత్సవాల సమయంలో నగర రోడ్లన్ని జన సంచారంతో కిక్కిరిసి ఉంటాయి. కాని ఇళ్లకు చేరుకునేందుకు తగిన రవాణా సదుపాయాలు లేకపోవడంతో తెల్లవారే వరకు కాలక్షేపం చేయాల్సివస్తుంది. సెంట్రల్ రైల్వే మార్గంలో అర్థరాత్రి 12.38 గంటలకు చివరి కర్జత్ లోకల్ రైలు ఉంటుంది. ఈ రైలు అందని పక్షంలో తెల్లవారు జాము నాలుగు గంటల వరకు ప్లాట్ఫారాలపైనే భక్తులు పడిగాపులు కాయాల్సి వస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడతారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అర్ధరాత్రి దాటిన తరువాత ప్రతీ అర గంటకు ఒక ప్రత్యేక లోకల్ రైలును నడపాలని చవాన్ కోరారు. బెస్ట్ సంస్థ కూడా భక్తుల సౌకర్యార్థం రాత్రిళ్లు కొన్ని కీలమైన రూట్లలో ప్రత్యేక బస్సులు నడుపుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పశ్చిమ, సెంట్రల్, హార్బర్ రైల్వే మార్గంలో ప్రత్యేక లోకల్ రైళ్లు నడపాలని ఆయన రైల్వే శాఖతో విజ్ఞప్తి చేశారు. -
‘లోకల్’ మహిళలకు మరింత రక్షణ
సాక్షి, ముంబై: లోకల్ రైళ్లలో మహిళా ప్రయాణికులకు 24 గంటల పాటు భద్రతను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న భద్రత కన్నా అదనంగా 475 మంది హోంగార్డులను నియమించనుంది. ప్రస్తుతం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ)కు చెందిన 375 మంది రైల్వే ప్లాట్ఫాం, లోకల్ రైళ్ల బోగీలలో భద్రతాపరమైన విధులు నిర్వహిస్తున్నా రు. ఇప్పుడు మరో 475 మంది భద్రతా సిబ్బందిని నియమించడంతో ప్రతి మహిళా బోగీలో 24 గంటల పాటు భద్రత కల్పించేందుకు వీలవుతుంది. శనివారం ప్రభుత్వ సీనియర్ అధికారులు, రైల్వే అధికారుల మధ్య జరిగిన సుదీర్ఘ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అడిషనల్ చీఫ్ సెక్రటరీ (హోం) అమితాబ్ రాజన్ తెలిపారు. ప్రస్తుతం 2,000 బోగీలు మహిళల కోసం కేటాయించబడి ఉన్నాయి. భద్రతా సిబ్బంది కొరత వల్ల 574 బోగీలలో భద్రతను ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం పెరుగుతున్న సిబ్బంది దృష్ట్యా ఈ బోగీ ల్లోనూ భద్రత కల్పించేందుకు వీలవుతుంది. ఇదిలా వుండగా లోకల్ రైళ్లలో రోజుకు 70 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. వీరిలో 20 లక్షల మంది మహిళలు ఉంటారు. రైల్వే నిబంధనల ప్రకారం.. ప్రతి బోగీలో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ సాయుధ దళాలను కలిగిన వారిని నియమించాల్సి ఉంటుంది. ఇదిలా వుండగా తాము 275 మంది ఆర్పీఎఫ్ కింద, 200 మందిని జీపీఆర్ కింద నియమించేందుకు ఈ సమావేశంలో అంగీకరించామని అమితాబ్ రాజన్ తెలిపారు. దీంతో ఇక మీదట ప్రతి మహిళా బోగీలో భద్రతా సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. అయితే ఇది ఆచరణలోకి రావడానికి మరికొంత సమయం పట్టనుందని ఆయన తెలిపారు. -
‘లోకల్’ మహిళలకు మరింత రక్షణ
సాక్షి, ముంబై: లోకల్ రైళ్లలో మహిళా ప్రయాణికులకు 24 గంటల పాటు భద్రతను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న భద్రత కన్నా అదనంగా 475 మంది హోంగార్డులను నియమించనుంది. ప్రస్తుతం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ)కు చెందిన 375 మంది రైల్వే ప్లాట్ఫాం, లోకల్ రైళ్ల బోగీలలో భద్రతాపరమైన విధులు నిర్వహిస్తున్నా రు. ఇప్పుడు మరో 475 మంది భద్రతా సిబ్బందిని నియమించడంతో ప్రతి మహిళా బోగీలో 24 గంటల పాటు భద్రత కల్పించేందుకు వీలవుతుంది. శనివారం ప్రభుత్వ సీనియర్ అధికారులు, రైల్వే అధికారుల మధ్య జరిగిన సుదీర్ఘ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అడిషనల్ చీఫ్ సెక్రటరీ (హోం) అమితాబ్ రాజన్ తెలిపారు. ప్రస్తుతం 2,000 బోగీలు మహిళల కోసం కేటాయించబడి ఉన్నాయి. భద్రతా సిబ్బంది కొరత వల్ల 574 బోగీలలో భద్రతను ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం పెరుగుతున్న సిబ్బంది దృష్ట్యా ఈ బోగీ ల్లోనూ భద్రత కల్పించేందుకు వీలవుతుంది. ఇదిలా వుండగా లోకల్ రైళ్లలో రోజుకు 70 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. వీరిలో 20 లక్షల మంది మహిళలు ఉంటారు. రైల్వే నిబంధనల ప్రకారం.. ప్రతి బోగీలో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ సాయుధ దళాలను కలిగిన వారిని నియమించాల్సి ఉంటుంది. ఇదిలా వుండగా తాము 275 మంది ఆర్పీఎఫ్ కింద, 200 మందిని జీపీఆర్ కింద నియమించేందుకు ఈ సమావేశంలో అంగీకరించామని అమితాబ్ రాజన్ తెలిపారు. దీంతో ఇక మీదట ప్రతి మహిళా బోగీలో భద్రతా సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. అయితే ఇది ఆచరణలోకి రావడానికి మరికొంత సమయం పట్టనుందని ఆయన తెలిపారు.