mourns
-
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
మైనర్లను డ్రైవింగ్కు ఎందుకు అనుమతించకూడదనేదానికి పూణె పోర్షే ప్రమాదం కొందరికి విషాదకరమైన ఉదాహరణ. తప్పతాగి, పోర్స్చే కారును 200 కి.మీ వేగంతో నడిపిన యువకుడు రెండు కుటుంబాల్లో అంతు లేని అగాధాన్ని మిగిల్చాడు. చెట్టంత ఎదిగిన బిడ్డలు తిరిగి రాని లోకాలకువెళ్లిపోయారన్న షాక్నుంచి తేరుకోలేకపోతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. పుణేలో ఆదివారం తెల్లవారుజామున హై-ఎండ్ కారు పోర్సే కారుమితిమీరిన వేగంతో దూసుకొచ్చి ముందు ఉన్న బైక్ను వేగంగా ఢీ కొట్టింది. కారు ఢీ కొనడంతో బైక్పై ఉన్న ఇద్దరు ఎగిరిపడి స్పాట్లోనే చనిపోయారు. ఈ ఘోర ప్రమాదంలో చనిపోయిన వారిని మధ్యప్రదేశ్కు చెందిన అనిష్ అవధియా , అశ్విని కోస్తా అనే ఇద్దరు 24 ఏళ్ల ఇంజనీర్లుగా గుర్తించారు.అశ్విని 20 అడుగుల ఎత్తుకు ఎగిరి బలంగా పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.జబల్పూర్లో నివసించే అశ్విని తల్లి మమత ఇప్పటికీ షాక్లో ఉన్నారు. ‘‘కూతురికి పెళ్లి చేసి పల్లకీలో అత్తారింటికి పంపించాలను కున్నాం.. ఇలా పాడె ఎక్కించాల్సివస్తుందని ఊహించలేదు’’ అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.మా పాప అశ్వినికి న్యాయం జరగాలి. మైనర్ , అతని తల్లిదండ్రులను కఠినంగా శిక్షించాలి. వారు అతన్ని సరిగ్గా పెంచలేదు. వారు అతనికి కారు ఇవ్వకూడదు," అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు జువెనైల్ జస్టిస్ బోర్డ్ విధించిన శిక్షపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. (300 పదాల వ్యాసం రాయడం, 15 రోజుల పాటు ట్రాఫిక్ నిబంధనలను అధ్యయనం చేయడం మద్యపానం అలవాటుపై మానసిక చికిత్స కోసం కౌన్సెలింగ్కు హాజరు కావడం వంటి షరతులు)"ఇది ఒక జోక్? అతను ఏ వ్యాసం వ్రాస్తాడు? అశ్విని చాలా టాలెంటెడ్ గర్ల్.. కోటిమందిలో ఒకరు ఆమెకు. చాలా కలలు కనింది’’ అంటూ" కన్నీళ్లు పెట్టుకున్నారు. తను చాలా స్మార్ట్, ఇండిపెండెంట్, అన్ని రంగాల్లో ముందుండేది..వచ్చే నెలలో మా నాన్నగారి పుట్టినరోజుకి రావాలని ప్లాన్ చేశాం.. ఆయనకు రిటైర్మెంట్ పార్టీ కూడా ఆమె ప్లాన్ చేసిందంటూ అశ్విని సోదరుడు సంప్రీత్ వాపోయాడు.“నా కొడుకుని చంపేసాడు.. ఇప్పుడు నా కొడుకుని ఎప్పటికీ కలవలేను.. ఆ అబ్బాయి హత్యచేశాడు. వాణ్ని సరిగ్గా పెంచి ఉంటే ఈ రోజు నా కొడుకు జీవించి ఉండేవాడు” అనిష్ అవధియా తల్లి సవితా అవధియా గర్భశోకమిది. అనీష్ ఎంబీఏ చేయాలనుకుంటున్నాడని, చాలా హ్యపీ, సరదాగాఉండే వాడంటూ కొడుకును తలచుకుని గుండెపగిలేలా రోదించారామె. ఇటీవల యానివర్సరీకి ఇంటికొచ్చాడు. మళ్లీ వస్తాను..గిప్ట్ తెస్తా అన్నాడు అంటూ గుర్తు చేసుకున్నారు.“అపరాధికి శిక్ష పడుతుంది.. కానీ ఇప్పుడు మా బిడ్డను ఎలా తిరిగి తీసుకొస్తారు, ప్రమాదం జరగడానికి రెండు రోజుల ముందు తన తల్లితో మాట్లాడి, త్వరలో వస్తానని చెప్పాడు. కుటుంబానికి పెద్ద ఆసరాగా ఉన్నాడు. పూణేలో ఉన్న నా చిన్న కొడుకును ఇప్పుడు ఎవరు చూసుకుంటారు?" కుటుంబ బాధ్యతలను భుజానకెత్తుకునే బాధ్యతాయుతమైన కొడుకు దూరమైపోయాడంటూ అనీష్ తండ్రి ఓం అవధియా కంట తడిపెట్టారు. -
Pankaj Udhas కాలం పగబట్టిందేమో! మరో దిగ్గజం నింగికెగిసింది!
లెజెండ్రీ గాయకుడు, గజల్ మాస్ట్రో పంకజ్ఉద్దాస్ సుదీర్ఘ అనారోగ్యంతో బాధపడతున్న ఆయన సోమవారం ఇక సెలవంటూ వెళ్లిపోయారు. పంకజ్ ఉదాస్అనేక ఆల్బమ్లను విడుదలచేశారు ప్రపంచవ్యాప్తంగా కచేరీలిచ్చారు. మధురమైన గాత్రంతోనే కాదు, పదునైన సాహిత్యంతో కూడా ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు. గజల్ పంకజ్.. పంకజ్ గజల్! 'చిట్టి ఆయీ హై', 'జీయే తో జీయే కైసే', 'చుప్కే చుప్కే' 'ఔర్ అహిస్తా', లాంటి పాటలతో దశాబ్దాల పాటు ఆబాల గోపాలాన్ని ఉర్రూతలూగించిన ఆ గళం మూగపోయింది. కానీ తరతరాలుగా శ్రోతల చెవులలో ఆ మధుర గీతాలుప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. పంకజ్ ఉద్ధాస్ మరణంతో యావత్ సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. సోనూ నిగమ్ లాంటి గాయకులు ఆయనను గుర్తు చేసుకొని సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. కాలం పగబట్టిందేమో.. పెద్దవాళ్లు, గొప్పవాళ్లు ఒక్కొక్కరూ వెళ్లిపోతున్నారు అంటూ కన్నీటి పర్యంత మవుతున్నారు. సోషల్ మీడియాలో ఆర్ఐపీ పంకజ్ ఉద్దాస్ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. Thank you Pankaj Udhas Ji for such masterpieces 😊 RIP to the departed soul 💔 Legend never Dies !! @musicculturehub pic.twitter.com/YAiWccPgvo — Utkarsh (@utkarshh_tweet) February 26, 2024 View this post on Instagram A post shared by Sonu Nigam (@sonunigamofficial) 1951న మే 17, గుజరాత్లో జన్మించారు. తన ముగ్గురు సోదరులలో చిన్నవాడు పంకజ్. చిన్న వయస్సులోనే సంగీతం పట్ల ఆకర్షితులై, తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించారు. అలా భారతీయ సంస్కృతి, సంగీతం ఆయన ముద్ర చెరగనిది. 1980 , 1990 లలో ఆయన పాటలు, గజల్స్ బాగా పాపులర్ అయ్యాయి. గజల్స్తోపాటు, బాలీవుడ్ సినిమాల్లో పాటలు అనేకం సూపర్హిట్గా నిలిచాయి. 1989లో 'నబీల్' ఆల్బమ్ అత్యధికంగా అమ్ముడైన ఆల్బమ్లలో ఒకటిగా నిలిచింది. తొలి కాపీ వేలంలో రూ. 1 లక్షకు విక్రయించారు. సంగీత ప్రపంచంలో తన ప్రతిభను చాటుకున్న పంకజ్ఉద్దాస్ దాత్వంలోని తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ లక్ష రూపాయలను కేన్సర్ పేషెంట్స్ ఎయిడ్ అసోసియేషన్కు అందజేశారు. ఇలాంటి ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు సామాజిక సంక్షేమం కార్యక్రమాలకు మద్దతిచ్చేవారు. సంగీత ప్రపంచానికి ఆయన చేసిన సేవలకుగాను 2006లో భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి పద్మశ్రీ దక్కింది. మరికొన్ని సంగతులు పంకజ్ఉద్దాస్ కన్సర్ట్లో బాలీవుడ్ స్టార్ హీరోషారూఖ్ఖాన్ అందుకున్న తొలి పారితోషికం 50 ఆ డబ్బుతో రైల్లో ఆగ్రా వెళ్లి తాజ్ మహల్ చూశామని స్వయంగా షారూఖ్ ఒకసారి వెల్లడించారు. బాలీవుడ్కు పాటలను అందించడమే కాకుండా నటుడు జాన్ అబ్రహంను కూడా తెరపైకి తెచ్చింది కూడా పంకజ్ ఉద్ధాస్. పంకజ్ తొలుత డాక్టర్ కావాలనుకున్నారట. తండ్రి కేశుభాయ్ ఒక రైతు , తల్లి జితుబెన్ సాధారణ గృహిణి. పెద్ద సోదరుడు మన్హర్ బాలీవుడ్ చిత్రాలలో హిందీ నేపథ్య గాయకుడు. రెండో అన్నయ్య నిర్మల్ ఉద్దాస్ కూడా ప్రసిద్ధ గజల్ గాయకుడే. పంకజ్ భార్య ఫరీదా. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు- నయాబ్, రీవా -
అయ్యో! ఎంత విషాదం: గుండె పగిలిందంటున్న నెటిజనులు
మాట్లాడటం మినహా, మనుషులకుండే అన్ని భావోద్వేగాలు ప్రపంచంలోని అన్ని ఇతర జీవుల్లోనూ సహజమే. ఆకలి దప్పికలతోపాటు, కోపం,శోకం, దుంఖం ఇలా అన్ని ఫీలింగ్స్ ఉంటాయి. తాజాగా జీవిత సహచరుడిని కోల్పోవడాన్ని మించిన విషాదం మరొకటి ఉండదు. అలా ఒకచెట్టుకింద, ప్రేయసిని కోల్పోయి విలపించిన కోలా హృదయ విదారక వీడియో ఒకటి నెట్టింట తెగషేర్ అవుతోంది. సౌత్ ఆస్ట్రేలియన్ వాలంటీర్ కోలా రెస్క్యూ గ్రూపు ఈ కోలాని గుర్తిచింది. అక్కడ చనిపోయిన ఆగ కోలాను పట్టుకుని మగ కోలా విలపిస్తోంది. ఇది చాలా హృదయ విదారకంగా ఉంటూ ఈ టీం ఈ వీడియోను సోషల్మీడియాలో షేర్ చేసింది. ఈ జంటను చూసినప్పుడు గుండె పగిలిందన్నారు కోలా రెస్క్యూ అధికారి హార్ట్లీభావోద్వేగానికి లోనయ్యారు. అత్యంత విషాదకరమైన వీడియో. గుండె పగిలిపోయింది.. నా కళ్లలోనూ నీళ్లు తిరుగుతున్నాయంటూ చాలామంది కమెంట్ చేశారు. ఈ వీడియో ఇప్పటికే 12 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది. A koala mourning its female friend who has passed , holding and hugging her pic.twitter.com/zLO9JZE3Ox — Science girl (@gunsnrosesgirl3) February 23, 2024 కాగా ఆస్ట్రేలియా తూర్పు ప్రాంతంలోని యూకలిప్టస్ అడవుల్లో ఇవి కనిపిస్తాయి. యూకలిప్టస్ ఆకులు తింటాయి. ఈ ఆకులే వాటి ఏకైక, ప్రధాన ఆహారం. అంతేకాదు ప్రపంచంలోనే రోజుకు 22 గంటలు నిద్రించే జంతువు. తమ జీవితకాలంలో ఒక్కసారి కూడా నీళ్లు తాగవు. అందుకే వీటిని 'నో డ్రింక్' జంతువు అని కూడా అంటారు. ఆకుల్లో ఉండే తేమే వీటికి ఆధారం. -
ఆర్బీఐ మాజీ గవర్నర్ కన్నుమూత: పలువురి సంతాపం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ ఎస్.వెంకటరమణన్ (92) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో శనివారం ఉదయం చెన్నైలో ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహా పలువురు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. అద్భుతమైన వ్యక్తిత్వం , ప్రజా సేవకుడు, సంక్షోభ సమయాల్లో అపారమైన సహకారాన్ని అందించిన వెంకటరమణన్ మరణం విచారకరం అంటూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంతాపం వెలిబుచ్చారు. ఆత్మకు శాశ్వత శాంతి కలగాలంటూ ట్వీట్ చేశారు. ఆర్థిక రంగంలో తనదైన ముద్ర వేశారంటూ కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ కూడా తన సంతాపాన్ని తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధికి , ఇంధనానికి కూడా ప్రధాన కృషి చేసారనీ. 60వ దశకం మధ్యలో హరిత విప్లవానికి నాంది పలకడంలో కీలక పాత్ర పోషించిన సి.సుబ్రమణ్యంకు కీలక సహాయకుడిగా పనిచేశారన్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా తమకు అనుబంధం ఉంది, చాలా మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి, చాలా నేర్చుకున్నాను అంటూ ఆయన ట్వీట్ చేశారు. Very sad to hear about the demise of Shri S.Venkitaramanan, former Governor of the RBI. He was an outstanding personality and public servant. Made immense contribution during periods of crisis. May his soul rest in eternal peace. — Shaktikanta Das (@DasShaktikanta) November 18, 2023 కాగా వెంకటరమణన్ 1931లో తమిళనాడులోని నాగర్ కోయిల్ లో జన్మించారు. తిరువనంతపురంలోని యూనివర్సిటీ కాలేజ్ నుండి భౌతికశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు. ఆ తర్వాత 1953లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS)లో చేరారు. 1968లో, అమెరికా కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం నుంచి మేనేజ్మెంట్లో మరొక మాస్టర్స్ డిగ్రీని చేశారు. 1990 - 1992 వరకు ఆర్బీఐ 18వ గవర్నర్గా పనిచేశారు.1985 నుండి 1989 వరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక కార్యదర్శిగా పనిచేశారు. ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు చేపట్టక ముందు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగానూ వ్యవహరించారు. వెంకటరమణన్కు భార్య, ఇద్దరు కుమార్తెలు (గిరిజా వైద్యనాథన్, తమిళనాడు మాజీ ప్రధాన కార్యదర్శి , సుధా వైద్యనాథన్.) ఉన్నారు. One of India's most brilliant civil servants who left his mark, especially in the field of finance, has just passed away in Chennai at the age of 92. S. Venkitaramanan was RBI Governor at a most crucial time of our economic history during 1990-92. Apart from this he made major… — Jairam Ramesh (@Jairam_Ramesh) November 18, 2023 -
మాజీ ఎంపీ బాసుదేవ్ ఆచార్య కన్నుమూత: సీఎం మమత సంతాపం
Veteran CPI(M) leader Basudeb Acharia ప్రముఖ సీపీఎం నేత, పశ్చిమ బెంగాల్లోని బంకురా నుంచి తొమ్మిది సార్లు ఎంపీగా ఎన్నికైన బాసుదేవ్ ఆచార్య (81) కన్ను మూశారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. దీంతో రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొంత కాలంగా ఆయన వృద్ధాప్య కారణాలతో బాధపడుతున్నట్టు సమాచారం. బాసుదేవ్ మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎండీ సెలీమ్ నివాళులర్పించారు. పశ్చిమ బెంగాల్లోని బంకురా లోక్సభ నియోజకవర్గానికి 9 సార్లు ఎంపికూ బాసుదేవ్ ఆచార్య బంకురాకు పర్యాయపదంగా నిలిచారు. 1980 నుంచి 2014 వరకు దాదాపు 34 ఏళ్ల పాటు ఎంపీగా ఉన్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మున్మున్ సేన్ చేతిలో ఓడిపోయారు. 1942 జూలై 11 న పురూలియాలో జన్మించారు బాసుదేవ్. విద్యార్థి జీవితం నుండి చురుగ్గా ఉంటూ విద్యార్థి నాయకుడిగా, తరువాత కార్మిక నాయకుడిగా ఎదిగారు. అక్కడి గ్రామీణ గిరిజన సంఘం ఉద్యమంలో కీలకభూమికను పోషించారు. పశ్చిమ బెంగాల్ రైల్వే కాంట్రాక్టర్ లేబర్ యూనియన్, LIC ఏజెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, DVC కాంట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ , ఇతరులకు అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అనేక పార్లమెంటరీ కమిటీలకు పనిచేసిన ఆచార్య 25 ఏళ్లపాటు రైల్వే స్టాండింగ్ కమిటీలో ఉన్నారు. Saddened at the demise of the veteran Left leader and former MP Basudeb Acharia. He was a trade union leader and Parliamentarian of formidable strength and his departure will cause significant loss in public life. Condolences to his family, friends and colleagues. — Mamata Banerjee (@MamataOfficial) November 13, 2023 -
ఇలా ఉన్నామంటే...అంతా ఆయన పుణ్యమే: ఆనంద్ మహీంద్ర నివాళులు
హరిత విప్లవ పితామహుడు, దిగ్గజ వ్యవసాయ శాస్త్రవేత్త డా.ఎం.ఎస్ స్వామినాథన్ మృతిపై వ్యాపారవేత్త ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర సంతాపం ప్రకటించారు. ఈ రోజు భారతదేశంలో ఆహార భద్రత ఉందీ అంటే ఆయన పుణ్యమే.. దానికి మన అందరమూ రుణపడి ఉండాలి అంటూ ఆయనకు ఘన నివాళులర్పించారు. ఆయనతో కంపెనీకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 2011లో మహీంద్రా సమృద్ధి అవార్డ్స్లో ఇయర్ అవార్డలు సందర్బంగా వ్యవసాయంతో సంస్థకున్న లోతైన సంబంధాల దృష్ట్యా, హరిత విప్లవ సారధిగా ఆయన అందించిన సేవలకు అగ్రి-ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించుకున్నాం. అదే రోజు డిన్నర్లో స్వామినాథన్ గారితో ముచ్చటించడం తన అద్భుత జ్ఞాపకాలలో ఒకటి అని వెల్లడించారు. అలాగే 2019లో, బలహీనంగా ఉన్నప్పటికీ, తమ కోసం ఒక వీడియో రికార్డు చేసి పంపించారంటూ గుర్తుచేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు. వ్యవసాయంలో అయనకున్న అపారమైన జ్ఞానం, వ్యవసాయం పట్ల మక్కువ 1.4 బిలియన్ల భారతీయుల జీవితాలను మరింత సురక్షితం చేసింది. కానీ ఆయన ఏ లోకాన ఉన్నా, ఆయన చుట్టూ ఉన్నపొలాలు మరింత సారవంతంగా ఉంటాయంటూ నివాళులర్పించారు. ఆయనకు భారత రత్న ఇవ్వాలి! దీంతో నెటిజన్లను కూడా ఎంఎస్ స్వామినాథన్కు నివాళలర్పించారు. నిజానికి దేశానికి ఆయనందించిన సేవలకు ప్రతిఫలంగా భారత రత్న ఇవ్వాలి.. ఇది మన దేశ పరిశోధకులు , శాస్త్రవేత్తల సంఘానికి పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుందంటూ కమెంట్ చేశారు. కాగా 1925 ఆగస్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో పుట్టిన మాంకోంబ్ సాంబశివన్ స్వామినాథన్ దేశీయ వ్యవసాయం రంగానికి ఎనలేని కృషి చేశారు. ముఖ్యంగా మేలు రకపు, ఎక్కువ దిగుబడినిచ్చే వరి వంగడాలను రైతులకు అందించింది. ముఖ్యంగా 1960- 70లలో భారతదేశం వ్యవసాయ రంగంలో ప్రవేశ పెట్టిన సమూల మార్పులు, అభివృద్ధికి ఆయనందించిన అపారమైన సేవలు, కృషి దేశీయ రైతుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే భారతీయ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్నారు. 98 ఏళ్ల వయసులో గురువారం సెప్టెంబరు 28న కన్నుమూసిన సంగతి తెలిసిందే. If we have food security in India today, then in large measure we owe it this man—M.S.Swaminathan, fondly known as the ‘Father of the Green Revolution.’ Given our deep links with agriculture, we presented him with the Agri-Icon of the year award at the Mahindra Samriddhi Awards… pic.twitter.com/1WAjQKt4CC — anand mahindra (@anandmahindra) September 30, 2023 -
యావద్దేశం మూగగా..ఫెయిల్-సేఫ్ మెకానిజంపై ఆనంద్ మహీంద్ర వ్యాఖ్యలు
Odisha Train Accident: ఒడిశా పెను విషాదంపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా విచారం ప్రకటించారు. ఏకకాలంలో మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీ కొన్న ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి జ్ఞాపకార్థం దేశవ్యాప్తంగా నిశ్శబ్దంగా ఉండిపోవాల్సిన ఒక విషాదం. ఓం శాంతి అంటూ ఆయన ట్వీట్ చేశారు. “ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగనివ్వకూడదు. ఈ విషాదానికి మూలకారణాన్ని తెలుసుకోవాలి. మానవ తప్పిదమైనా లేదా సాంకేతిక తప్పిదమైనా, ఇంత వినాశనానికి దారితీయకూడదు. రైల్వే ఆపరేషన్లోఫెయిల్-సేఫ్ మెకానిజమ్ వ్యవస్థను మరోసారి సమీక్షించుకోవాలి’’ అని ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు. కాగా ఒడిశా బాలాసోర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 261కి చేరింది. అత్యంత ఘోరమైన ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ దుర్ఘటనపై సర్వత్రా తీవ్ర సంతాపం వెల్లు వెత్తుతోంది. A tragedy the scale of which requires the entire country to pause in silent reflection, in memory of those who have lost their lives. Om Shanti🙏🏽 We cannot let such accidents happen again. We must get to the root cause of this tragedy. Whether human or technical error, neither… https://t.co/fxs2k387YG — anand mahindra (@anandmahindra) June 3, 2023 -
కుప్పకూలిపోయాను..డియర్.. RIP: కిరణ్ మజుందార్ షా భావోద్వేగం
బెంగళూరు: బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా తన జీవితంలో చోటు చేసుకున్న విషాదంపై భావోద్వానికి లోనయ్యారు. దీపావళి పర్వదినం రోజు తనను శాశ్వతంగా విడిచివెళ్లిన భర్త జాన్ షా ను గుర్తు చేసుకుంటూ ట్విటర్ పోస్ట్ ద్వారా కన్నీటి నివాళి అర్పించారు. ‘‘కుంగిపోయాను.. నా భర్త, సోల్ మేట్, గురువును కోల్పోయాను. నా లక్క్ష్య సాధనలో జాన్ ఎప్పుడూ చాలా అండగా నిలిచారు. ఎంతో మార్గనిర్దేశనం చేశారు. నా జీవితాన్ని ఇంత స్పెషల్గా ఉంచి నందుకు ధన్యవాదాలు. రెస్ట్ ఇన్ పీస్ మై డియర్ జాన్...మీరు లేని లోటు పూడ్చలేనిది’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. కేన్సర్తో బాధపడుతున్న జాన్ షా (73)బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. దీంతో పలువురు వ్యాపార, రాజకీయ పెద్దలు ఆమెకు తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కాన్సర్తో బాధపడుతూ కిరణ్ మజుందార్ షా తల్లి యామిని మజుందార్ షా ఈ ఏడాది జూన్లో కన్నుమూశారు. ఇపుడు భర్తను కోల్పోవడంతో కిరణ్ విషాదంలో మునిగిపోయారు. కాగా స్కాటిష్ జాతీయుడైన జాన్షా 1998లో కిరణ్ మజుందార్ షాను వివాహం చేసుకున్నారు. తరువాత వివిధ బయోకాన్ గ్రూప్ కంపెనీల సలహా బోర్డు సభ్యుడు సేవలందించారు. 1978లో కిరణ్ మజుందార్ షా బయోకాన్ కంపెనీని స్థాపించగా 1999 నుంచి జాన్ షా బయోకాన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒకరిగా వివిధ హోదాల్లో పనిచేశారు. విదేశీ ప్రమోటర్గా వ్యవహరిస్తూనే బయోకాన్ గ్రూప్ కంపెనీలకు అడ్వైజరీ బోర్డ్ మెంబర్గానూ సేవలు అందించారు. 1999లో బయోకాన్లో చేరడానికి ముందు వస్త్ర తయారీదారు మధుర కోట్స్కు నాయకత్వం వహించారు జాన్ షా. జూలై 2021లో పదవీ విరమణకు ముందు బయోకాన్ వైస్ ఛైర్మన్ ,నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా 22 సంవత్సరాలు కంపెనీకి విశిష్ట సేవలు అందించారు. I am devastated to lose my husband, my mentor and soul mate. I will always be spiritually guided by John as I pursue my purpose. Rest in Peace my darling John. Thank you for making my life so very special. I will miss you profoundly pic.twitter.com/b0qv6ZGI2D — Kiran Mazumdar-Shaw (@kiranshaw) October 25, 2022 -
అల్విదా బిగ్బుల్ ఒక శకం ముగిసింది: పలువురి భావోద్వేగం
సాక్షి, ముంబై: ప్రముఖ పెట్టుబడిదారుడు, బిలియనీర్ రాకేష్ ఝున్ఝున్వాలా(62) ఆకస్మిక మరణం దిగ్భ్రాంతి గురిచేసింది. నేడు(ఆగస్టు 14న) ముంబైలో గుండెపోటుతో కన్నుమూయడంపై దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్ ద్వారా సంతాపం తెలిపారు. ఇంకా కేంద్ర హోంమంత్రి అమిత్షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్,మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే బిలియనీర్ హఠాన్మరణంపై ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. చదవండి : రాకేష్ ఝున్ఝున్వాలా నిర్మించిన బాలీవుడ్ మూవీలు ఏవో తెలుసా? ఒక శకం ముగిసిందంటూ పలువురు పారిశశ్రామికవేత్తలు, వ్యాపార దిగ్గజాలు, ఆయన అభిమానులు నివాళులర్పించారు. ముఖ్యంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ ఉదయ్ కోటక్, బిలియనీర్ గౌతమ్ అదానీ, హీలియోస్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు అండ్ ఫండ్ మేనేజర్ సమీర్ అరోరా తదితరులు ట్విటర్ ద్వారా సంతాపం వెలిబుచ్చారు. ఝున్ఝున్వాలా సలహాలు, సూచనలతో మార్కెట్లో విజయం సాధించిన పలువురు అభిమానులు ఆయన ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన జ్ఞాపకాలను తలుచుకుని కంట తడి పెట్టు కుంటున్నారు. పెట్టుబడిదారులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తన గుమిగూడడంతో ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మార్కెట్లో ఆయన లేని లోటు పూడ్చలేనిదని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా ఫోర్బ్స్ ప్రకారం భారతదేశానికి చెందిన వారెన్ బఫెట్ అని పిలుచుకునే నికర విలువ 5.8 బిలియన్ డాలర్లు (ఆగస్టు 2022 నాటికి) ఇండియాలో 36వ సంపన్నుడు. ప్రపంచంలోని 438వ బిలియనీర్గా ఉన్నారు. Rakesh Jhunjhunwala was indomitable. Full of life, witty and insightful, he leaves behind an indelible contribution to the financial world. He was also very passionate about India’s progress. His passing away is saddening. My condolences to his family and admirers. Om Shanti. pic.twitter.com/DR2uIiiUb7 — Narendra Modi (@narendramodi) August 14, 2022 Shri Rakesh Jhunjhunwala is no more. Investor, bold risk taker, masterly understanding of the stock market, clear in communication- a leader in his own right. Fondly remember several conversations we’ve had. Had strong belief in India’s strength and capabilities. Condolences — Nirmala Sitharaman (@nsitharaman) August 14, 2022 Shri Rakesh Jhunjhunwala is no more. Investor, bold risk taker, masterly understanding of the stock market, clear in communication- a leader in his own right. Fondly remember several conversations we’ve had. Had strong belief in India’s strength and capabilities. Condolences — Nirmala Sitharaman (@nsitharaman) August 14, 2022 Very saddened to know about the passing of the veteran investor Shree Rakesh JhunJhunwala. India has lost a gem, who made a mark not just on the stock market but on the minds of almost every investor in india.#RakeshJhunjhunwala pic.twitter.com/QX4uvBx7hA — Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) August 14, 2022 -
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. బొజ్జల కుటుంబసభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనారోగ్యం కారణంగా బొజ్జల.. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శ్రీకాళహస్తి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు. ఆయన స్వగ్రామం శ్రీకాళహస్తి సమీపంలోని ఊరందూరు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా బొజ్జల పనిచేశారు. చదవండి: మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత -
పప్పా నా హీరో, బిగ్గెస్ట్ మోటివేటర్: బ్రిగేడియర్ లిడ్డర్ కుమార్తె కన్నీరు
సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడులోని ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన బాసిన బ్రిగేడియర్ లఖ్వీందర్ సింగ్ లిడ్డర్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీ కంటోన్మెంట్లోని బ్రార్ స్క్వేర్ క్రిమటోరియంలో శనివారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా లిడ్డర్ సతీమణి గీతిక, కుమార్తె అస్నా భావోద్వేగానికి లోనుకావడం అక్కడున్న వాందరి కళ్ళల్లో కన్నీరు నింపింది. (రావత్ మంచి నీళ్లు అడిగారు.. కాపాడుకోలేకపోయా: ప్రత్యక్ష సాక్షి కంటతడి) ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తండ్రి అమరుడయ్యారన్న దుఃఖాన్ని గుండెల్లో దాచుకుంటూ కుమార్తె అస్నా తండ్రికి దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తండ్రి పార్థివ దేహాన్ని ముద్దు పెట్టుకుని కడసారి వీడ్కోలు పలికిన ఘటన ప్రతి ఒక్కరినీ కలిచి వేసింది. ఈ సందర్భంగా ఆస్రా మాట్లాడుతూ ఆయన అకాల మరణం జాతికి తీరని నష్టం. నన్ను చాలా గారాబం చేసేవారు.. ఇపుడు భయంగా ఉంది. నాకిపుడు 17 ఏళ్లు. ఈ 17 ఏళ్లు నాన్న నాతో ఉన్నారు. ఆ సంతోషకరమైన జ్ఞాపకాలతో ముందుకు వెళ్తా. మా పప్పా నా హీరో, నా బెస్ట్ ఫ్రెండ్. ఆయనే నా బిగ్గెస్ట్ మోటివేటర్ అంటూ కంటతడి పెట్టారు. #WATCH | Daughter of Brig LS Lidder, Aashna Lidder speaks on her father's demise. She says, "...My father was a hero, my best friend. Maybe it was destined & better things will come our way. He was my biggest motivator..." He lost his life in #TamilNaduChopperCrash on Dec 8th. pic.twitter.com/j2auYohtmU — ANI (@ANI) December 10, 2021 బ్రిగేడియర్ లిడ్డర్ పార్థివదేహంపై కప్పిన జాతీయ పతాకాన్ని ఆయన భార్యకు అప్పగించారు ఆర్మీ అధికారులు. ఆ పతాకాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు గీతిక. అనంతరం సతీమణి గీతిక మాట్లాడుతూ ‘‘ఆయన చాలా మంచి మనిషి, స్నేహ శీలి..అందుకే నవ్వుతూ సాగనంపుతామని వచ్చా ఆయన మంచి తండ్రి. నా బిడ్డ ఆయనను చాలా మిస్ అవుతుంది. ఆయన లేకుండా జీవించాల్సిన జీవితం ఇంకా చాలా ఉంది. చాలా నష్టం. కానీ విధి అలా ఉంది..గర్వంగా కంటే చాలా బాధగా ఉంది’’ అని భావోద్వేగానికి లోనయ్యారు. కాగా తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో లిడ్డర్తోపాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్, మరో 11మంది అసువులు బాసిన సంగతి తెలిసిందే. లిడ్డర్ జనరల్ రావత్కు రక్షణ సలహాదారుగా ఉన్నారు. లిడ్డర్ మేజర్ జనరల్ ర్యాంక్కి పదోన్నతి పొందాల్సి ఉంది. లిడ్డర్కు 2020లో సేన మెడల్, విశిష్ట సేన పతకం లభించింది. గతంలో కశ్మీర్లో ఉగ్ర వ్యతిరేక ఆపరేషన్స్కు నేతృత్వం వహించారు. #WATCH | "...We must give him a good farewell, a smiling send-off, I am a soldier's wife. It's a big loss...," says wife of Brig LS Lidder, Geetika pic.twitter.com/unLv6sA7e7 — ANI (@ANI) December 10, 2021 -
Sirivennela Seetharama Sastry అస్తమయం: మాదిక ఏకాకి జీవితం,కన్నీటి నివాళులు
సాక్షి, హైదరాబాద్: సినీ గేయ రచయిత సిరివెన్నెల ఇక లేరన్న వార్తలో యావత్ సినీలోకాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆయన పాటలు, ఆ పాటల్లోని సాహిత్య విలువలను గుర్తు చేసుకుంటూ పలువురు నటీనటులు, గాయకులు, ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ హీరోలు నందమూరి బాలకృష్ణ, చిరంజీవి సిరివెన్నెల మరణం తీరని లోటంటూ సంతాపం వెలిబుచ్చారు. Heartbroken After my Father,he was d only 1 who wud scold,Correct or appreciate me rightfully Wil miss U Dearest Uncle Lov U & ThankU 4 all d Magical Lyrics dat decorated my Tunes & 4 Encouraging my Lyrics U r Irreplaceable — DEVI SRI PRASAD (@ThisIsDSP) November 30, 2021 'సిరివెన్నెల' మనకిక లేదు. సాహిత్యానికి ఇది చీకటి రోజు — Chiranjeevi Konidela (@KChiruTweets) November 30, 2021 ప్రముఖ నటుడుప్రకాశ్ రాజ్, మాదిక ఏకాకి జీవితం అంటూ సంతాపం ప్రకటించారు. ప్రముఖ దర్శకులు దేవ కట్టా, అనిల్ రావిపూడి ‘‘మా గుండెల్లో నిద్రపోయావా?... విశ్వాత్మలో కలిసిపోయావా? ఆయన ఆత్మకి శాంతి చేకూరాలంటూ ట్వీట్ చేశారు. అలాగే నా తండ్రి తరువాత నన్నునడిపించిన ఏకైక వ్యక్తి మీరు .. మిస్ యూ అంకుల్ అంటూ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ట్వీట్ చేశారు. ముఖ్యంగా సినీ ప్రపంచానికి ‘సిరివెన్నెల’ను పరిచయం చేసిన ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాథ్ సిరివెన్నెల లేని లోటు తీరనిదని పేర్కొన్నారు. (Sirivennela Seetharama Sastry: ప్రతీ పాటా ఆణిముత్యమే) ‘పదం ఆయన ఆస్తి... జ్ఞానంతో ఆయనకు దోస్తీ ఆయనో పదభవన నిర్మాణ మేస్త్రి సీతారామ శాస్త్రి..సీతారాముడికి సెలవు’ అంటూ మోహన కృష్ణ అనే అభిమాని సిరివెన్నెలకు నివాళులర్పించారు. (Sirivennela Seetharama Sastry చుక్కల్లారా.. ఎక్కడ ‘మా సిరివెన్నెల’) "మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ వెనుకవచ్చు వాళ్ళాకు బాట అయినది ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు" - మహానుభావా…చిరస్మరణీయుడా…ఇక కనిపించవా?…మా గుండెల్లో నిద్రపోయావా?...విశ్వాత్మలో కలిసిపోయావా? — dev katta (@devakatta) November 30, 2021 జగమంత కుటుంబం మీది మీరు లేక ఏకాకి జీవితం మాది... Unbearable loss thank you for the poetic perceptions which added meaning in to our lives .. YOU WERE THE BEST GURUJI తెలుగు సాహిత్య శిఖరం... సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ... అజ్ఞానపు చీకటి ని తన అక్షర కిరణాల తో వెన్నెల గా మార్చిన సిరివెన్నెల గారికి..... కన్నీటి వీడ్కోలు ...... ,, — Anil Ravipudi (@AnilRavipudi) November 30, 2021 — Prakash Raj (@prakashraaj) November 30, 2021 The Lyrical Legend. It's deeply saddening to hear the demise of Sirivennela Seetharama Sastry Garu. There will never be one like him. There will never shine another star like the way he did. May his soul rest in peace — v e n u u d u g u l a (@venuudugulafilm) November 30, 2021 His words, his songs and his magic will live forever. ఆయన సాహిత్యం లోని సిరివెన్నెల మన మనసుల మీద ఎప్పటికీ అలానే వుంటుంది. వీడుకోలు గురువు గారూ.. — Nani (@NameisNani) November 30, 2021 Thank you #SirivennelaSeetharamaSastry Garu for your unparalleled contribution to our industry. You shall forever be remembered and missed. Honoured to have known you and worked with you. Rest in peace sir. — RAm POthineni (@ramsayz) November 30, 2021 -
బిగ్బాస్ విన్నర్ మరణం: షాక్లో బాలీవుడ్
సాక్షి,ముంబై: యువనటుడు, బిగ్బాస్-13 విన్నర్ సిద్ధార్థ శుక్లా (40) హఠాన్మరణంపై బాలీవుడ్, టీవీ పరిశ్రమ పెద్దలు ఒక్కసారిగా దిగ్ర్భాంతికి లోనయ్యారు. తీవ్రమైన గుండెపోటుతో సిద్దార్థ కన్నుమూశాడన్న వార్తతో నిద్రలేచిన బాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. సిద్ధార్థ్ గుండెపోటు కారణంగా నిద్రలోనే ప్రాణాలు కోల్పోయినట్టు ముంబైలోని కూపర్ హాస్పిటల్ ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. సిద్ధార్థ్ మరణంపై పలువురు నటీ నటులు, ఇతర ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటించారు. దీంతో ట్విటర్ ఆర్ఐపీ సిద్ధార్థ్ శుక్లా హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లో నిలిచింది. నమ్మకలేకపోతున్నామంటూ ప్రముఖ గాయకుడు అర్మాన్ మాలిక్, నటి మోడల్ మల్లికా షెరావత్ ట్వీట్ చేశారు. ప్రముఖ టీవీ, సినీ నటి రేణుకా సహానే, మున్మున్ దత్తా తదితరులు సిద్ధార్థ్ ఆకస్మిక మరణంపై సంతాపం వ్యక్తంచేశారు. చదవండి : Sidharth Shukla: బిగ్బాస్ విజేత సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణం కాగా1980, డిసెంబర్ 12న ముంబైలో జన్మించిన సిద్ధార్థ్ శుక్లా మోడల్గా కెరీర్ను ప్రారంభించాడు. బాబుల్ కా ఆంగన్ చూటే నా అనే టెలివిజన్ షో ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యాడు. జానే పెహచానే సే, యే అజ్నబీ, లవ్ యు జిందగీ లాంటి సీరియల్స్లో నటించాడు. ముఖ్యంగా పాపులర్ టీవీ సీరియల్ ‘బాలికా వధు’ ద్వారా మంచి పేరు సంపాదించుకున్నాడు. 2014లో కరణ్ జోహార్ నిర్మించిన హంప్టీ శర్మకి దుల్హానియాతో బాలీవుడ్కీ ఎంట్రీ ఇచ్చాడు. చదవండి : నేను అమ్మకూచిని: బిగ్బాస్ విన్నర్ With a broken heart and sadness in in my soul I miss you more every day. Rest in peace#SiddharthShukla absolutely heartbroken I don't know what to say totally blank I miss you your jabra fan ❤️❤️ pic.twitter.com/NFy9gsJjth — Dhruvvvv🌟 (@dhruvda7) September 2, 2021 Too young to go💔 #SiddharthShukla RIP 🙏🙏 pic.twitter.com/78AW1l8Gsd — Mallika Sherawat (@mallikasherawat) September 2, 2021 Shocked and numb. No Words 🙏🙏🙏 #SiddharthShukla — Munmun Dutta (@moonstar4u) September 2, 2021 I cannot process that Siddharth Shukla has passed away. Life is just too unpredictable. RIP Siddharth. My condolences to his family and friends and to all his devastated fans 🙏🏽🙏🏽🙏🏽😢 — Renuka Shahane (@renukash) September 2, 2021 Hello bollywood !!! Is it really a heart attack ??? Remember SSR.#SiddharthShukla 😓😨💔 pic.twitter.com/6TSfBe9hlS — Diptiman Yadav (@Dipti_6450) September 2, 2021 I cannot process this news that I just came across. Is this true? Please no. No… #SiddharthShukla — ARMAAN MALIK (@ArmaanMalik22) September 2, 2021 -
ప్రముఖ సామాజిక కార్యకర్త మృతి, సీఎం ఠాక్రే సంతాపం
సాక్షి,ముంబై: సామాజిక కార్యకర్త, పరిశోధకురాలు, రచయిత డాక్టర్ గెయిల్ ఓంవేద్(81)కన్నుమూశారు. సుదీర్ఘ అనారోగ్యంతో ఆమె బుధవారం కన్నుమూశారని భర్త, కార్యకర్త భారత్ పటాంకర్ ప్రకటించారు. గెయిల్ అస్తమయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సంతాపం తెలిపారు. వివిధ సామాజిక ఉద్యమాలు, జానపద సంప్రదాయాలు, మహిళల హక్కులపై ఆమె చేసిన కృషి మరువలేనివని ఠాక్రే నివాళులర్పించారు. అటు పలువురు దళిత, మహిళా ఉద్యమకారులు, ఇతర సాహితీవేత్తలు కూడా గెయిల్ మరణంపై విచారం వ్యక్తం చేశారు. చరిత్రకారుడు రామచంద్ర గుహ, సీపీఎం నేత సీతారాం ఏచూరి, ఎన్సిపి అధ్యక్షుడు శరద్ పవార్ కూడా ఆమెకు నివాళులర్పించారు. రాష్ట్రంలో వామపక్ష ఉద్యమానికి ఎంతో సహాయపడ్డారని సీపీఎం నేత అజిత్ అభ్యంకర్ అన్నారు. అమెరికాలో జన్మించిన గెయిల్ అంబేద్కర్-పూలే ఉద్యమంపై పీహెచ్డీ చేసేందుకు ఇండియాకు వచ్చారు. భారతీయ పౌరురాలిగా మారి సామాజిక కార్యకర్త భరత్ పటాంకర్ను పెళ్లి చేసుకున్నారు. దళిత రాజకీయాలు, మహిళా పోరాటాలు, కుల వ్యతిరేక ఉద్యమంపై అనే పుస్తకాలు రచించారు. ముఖ్యంగా శ్రామిక్ ముక్తీ దళ్ ఏర్పాటు, కుల వ్యతిరేక ఉద్యమంలో విశేష పాత్ర పోషించారు. అలాగే పర్యావరణ సమస్యలపైన కూడా రచనలు చేశారు. కాగా 1941, ఆగస్టు 2వ తేదీన అమెరికాలోని మిన్నసోటా రాష్ట్రంలోని మినియాపోలిస్లో గెయిల్ జన్మించారు. 1963-64 కాలంలో ఇండియాను సందర్శించిన ఆమె దళిత, కుల వ్యతిరేక ఉద్యమాల ఆమె ఆకర్షితురాలయ్యారు. అలా పీహెచ్డీ నిమిత్తం 1970-71లో ఇండియాకు వచ్చారు. 1976లో భరత్ పటాంకర్ను ఆమె పెళ్లి చేసుకున్నారు. 1983లో భారతీయ పౌరసత్వం సాధించారు. అప్పటినుంచి సతారా జిల్లాలోని కాసేగావ్లో నివాసముంటున్నారు. భర్తతో గెయిల్ (ఫైల్ ఫోటో) భర్తతో కలిసి శ్రామిక్ ముక్తి దళ్ను స్థాపించి అక్కడి మహిళల అభ్యున్నతికి కృషి చేశారు. మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల ప్రజల అభివృద్ధి, కొంకణ్ ప్రాంతంలో నీటి హక్కుల కోసం సాగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అలాగే సావిత్రిబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం, నార్డిక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏషియన్ స్టడీస్, ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీల బోర్డ్లో సభ్యురాలిగా ఉన్నారు. ఇటీవలి సంవత్సరాలలో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్తో వివిధ సమస్యలపై సలహాదారుగా కూడా గెయిల్ పనిచేయడం విశేషం. -
నిర్మాత, మీడియా మొగల్ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం
సాక్షి, ముంబై: మీడియా మొగల్ సినీ నిర్మాత ప్రదీప్ గుహ (60) తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. స్టేజ్ -4 క్యాన్సర్తో బాధపడుతున్న ఆయనను ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రి ఐసీయూలో చేర్చారు. ఆయనకు శుక్రవారం వెంటిలేటర్పై చికిత్సఅందించారు. కానీ ఆరోగ్యం మరింత క్షీణించడంతో శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో వెల్లడించారు. దీంతో పలువురు బీటౌన్ సెలబ్రిటీలతోపాటు, ఇతర ప్రముఖులు ప్రదీప్ గుహ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రదీప్ గుహ మృతిపై నటుడు, మనోజ్ బాజ్పేయి, సుభాష్ ఘాయ్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. హీరోయిన్లు దియామీర్జా, లారా దత్తా మిస్ ఆసియా పసిఫిక్ పోటీల నాటి సంఘటనను గుర్తుచేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో ఒక నోట్ రాశారు. ఒక గొప్ప శక్తిని కోల్పోయామంటూ విచారం వ్యక్తం చేశారు. గత 21 సంవత్సరాలుగా తనకు ధైర్యాన్నిచ్చిన వ్యక్తి అంటూ ఆయనకు నివాళులర్పించారు. 2000 సంవత్సరంలో అందాలపోటీదారులకు మార్గదర్శకులలో ప్రదీప్ ఒకరని తెలిపారు. కళాకారులు, రచయితలు, మీడియా నిర్వాహకులకు మార్గదర్శకుడిగా, ప్రకటనల దిగ్గజం’ గా ఆస్ట్రేలియా బేస్డ్ మీడియా టెక్ ఎంటర్ప్రెన్యూర్ చార్ల్టన్ డిసిల్వా గుర్తు చేసుకున్నారు. మీడియా అమ్మకాలను ఆకర్శణీయంగా చేసిన ఘనత ప్రదీప్ గుహాకే దక్కుతుందన్నారు. ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ మాజీ అధ్యక్షుడైన ప్రదీప్ అస్తమయంపై దేశంలో అంతర్జాతీయ ప్రకటనల సంస్థ కూడా సంతాపం తెలిపింది. కాగా9ఎక్స్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నా ప్రదీప్ గుహ టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, జీ నెట్వర్క్ వంటి అనేక సంస్థలలో పనిచేశారు. ఆయనకు భార్య పాపియా గుహా, కుమారుడు సంకేత్ ఉన్నారు. హృతిక్ రోషన్, కరిష్మా కపూర్ నటించిన 'ఫిజా' , మిథున్-డింపుల్ కపాడియా జంటగా 'ఫిర్ కభీ' చిత్రాలను గుహ నిర్మించారు. Deeply shocked and saddened to hear about my friend @guhapradeep ‘s passing away !! May you rest in peace Pradeep 🙏 — manoj bajpayee (@BajpayeeManoj) August 21, 2021 Pradeep Guha, Past President IAA, passed away today. Our condolences to his family & dear ones. He continues to live in our hearts. pic.twitter.com/wJrlAKpSBI — IAA India Chapter (@IAA_India) August 21, 2021 Good bye my friend #Pradeep Guha I will always be indebted for your genuine love n support to I needed n we all @Whistling_Woods international 4 your enriched guidance as a director on board since its birth. U were the makers of many in our industry👍 RIP MY FRIEND🙏🏽 pic.twitter.com/Io33oh5gM3 — Subhash Ghai (@SubhashGhai1) August 21, 2021 Our Dearest PG as we so lovingly called him. A formidable force… i think back to the courage he consistently gave me over the 21 years i’ve known him. A man who truly empowered us. We will always work hard to make you proud PG 🙏🏻❤️🙏🏻 Gone too soon… @guhapradeep https://t.co/FyR7frz3MC — Dia Mirza (@deespeak) August 21, 2021 -
ఒక స్వర్ణయుగం ముగిసింది: సోనియా గాంధీ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మరణంపై కాంగ్రెస్ చైర్పర్సన్ సోనియా గాంధీ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆమె దిలీప్ కుమార్ భార్య సైరా బానుకు ఒక లేఖ రాశారు. "మీ ప్రియమైన భర్త దిలీప్ కుమార్ కన్నుమూతతో, భారతీయ సినిమా చరిత్రలో ఒక స్వర్ణయుగం ముగిసింది’’ అని సైరా బానుకు గురువారం రాసిన సంతాప సందేశంలో సోనియా పేర్కొన్నారు. దిలీప్ కుమార్ ఒక లెజెండ్..భవిష్యత్తులో కూడా లెజెండ్గానే కొనసాగుతారు.ఎందుకంటే భవిష్యత్తరం సినీ ప్రేమికులు కూడా ఆయన అద్భుతమైన నటనా వైభవాన్ని ఆస్వాదిస్తాయి. ఎన్నో ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీలను అందించిన ఆయన నటనా నైపుణ్యాన్ని ఆరాధిస్తారంటూ ఆయన సాధించిన ఘనతను, విజయాలను గుర్తుచేసుకున్నారు. అలాగే గంగా జమునా, డాగ్, దీదార్, మొఘల్-ఏ-ఆజం, నయా దౌర్, మధుమతి, దేవదాస్,రామ్ ఔర్ శ్యామ్ లాంటి ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో తన పాత్రలతో అలరించిన ఆయన నటను ఎవరు మరచిపోగలమని వ్యాఖ్యానించారు..పూర్తికాల జీవితాన్ని అనుభవించిన దిలీప్ కుమార్ అమూల్యమైన వారసత్వాన్ని ప్రపంచ సినిమాకు అందించారని కొనియాడారు. ఆయన మరణం విశేష అభిమానులను దుఃఖ సాగరంలో ముంచేసిందనీ, దేశం ఎప్పటికీ ఆయనను గుర్తు పెట్టుకుంటుందనీ తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. అలాగే ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని,ధైర్యాన్ని మీకివ్వాలని ప్రార్థిస్తున్నానని సోనియా తన లేఖలో పేర్కొన్నారు. కాగా వయసు సంబంధిత సమస్యలతో దిలీప్ కుమార్ ముంబై ఆసుపత్రిలో బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. భారతీయ సినిమా 'కోహినూర్' గా భావించే మొహమ్మద్ యూసుఫ్ ఖాన్, స్క్రీన్ పేరు దిలీప్ కుమార్గా ప్రపంచానికి సుపరిచితుడు. 1966లో ఆయన సైరా బానును వివాహమాడారు. -
మూగబోయాను..సైరా భాభీ మీకు నమస్కారం!
సాక్షి, ముంబై: బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మరణంతో సీనీరంగంతో పాటు, యావత్ ప్రపంచం తీవ్ర దిగ్బ్రాంతి లోనైంది. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. దీంతో సోషల్ మీడియాలో ‘ఆర్ఐపీ దిలీప్ సాబ్’ ట్రిండింగ్లో నిలిచింది. దిలీప్ అస్తమయంపై పలువురు నటీనటులతో పాటు ప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘యూసుఫ్ భాయ్ తన చిన్న సోదరిని విడిచి వెళ్లిపోయారు..నాకేమీ తోచడం లేదు.. చాలా బాధగా ఉంది... మీ జ్ఞాపకాలు ముప్పిరిగొన్నాయి..మౌనం ఆవహించింది’ అంటూ సోషల్ మీడియా ద్వారా తన సంతాపాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా దిలీప్ సతీమణి సైరా బానుపై గౌరవంతో లతాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న యూసుఫ్ భాయ్కి సైరా భాభి ఎంతో సేవచూశారు. ఎవర్నీ గుర్తించలేని స్థితిలో ఉన్న ఆయనను రాత్రి పగలూ కంటికి రెప్పలా కాపాడుకున్న సైరాబానుకు నమస్కరిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. యూసుఫ్ భాయ్ ఆత్మకు శాంతికలగాలని ప్రార్థిస్తున్నాన్నారు. ఈ సందర్భంగా దిలీప్ కుమార్తో తన కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఇంకా బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ, టాలీవుడ్ హీరోయిన్ తమన్నా తదితరులు దిలీప్ కుమార్ మరణంపై సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. దిలీప్ సాబ్ అల్విదా అంటూ సంతాపం తెలిపిన షబానా, ఆయనకు తాను ఏకలవ్య శిష్యురాలనని చెప్పుకున్నారు. అంతేకాదు. దిలీప్జీ నిమాలకు, భాషకు, డిగ్నీటీతోపాటు సామాజిక బాధ్యత వహించినందుకు కూడా ఆమె ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు భర్తను కోల్పోయిన సైరా బాను తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సహచరుడి పార్థివదేహం వద్ద కన్నీరు పెడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు, పలువురు ఓదార్చారు. pic.twitter.com/nPwM4myyOJ — Lata Mangeshkar (@mangeshkarlata) July 7, 2021 यूसुफ़ भाई पिछले कई सालों से बिमार थे, किसीको पहचान नहीं पाते थे ऐसे वक़्त सायरा भाभीने सब छोड़कर उनकी दिन रात सेवा की है उनके लिए दूसरा कुछ जीवन नहीं था. ऐसी औरत को मैं प्रणाम करती हूँ और यूसुफ़ भाई कीं आत्मा को शान्ति मिले ये दुआ करती हूँ. — Lata Mangeshkar (@mangeshkarlata) July 7, 2021 Adieu Dilip Saab . Unknown to you I have been your Eklavya.Thank you for the movies.Thank you for the language . Thank you for the dignity . Thank you for being socially responsible.Thank you🙏🙏 pic.twitter.com/P5UeMUOQ8t — Azmi Shabana (@AzmiShabana) July 7, 2021 -
గుండె బద్దలైంది.. సారీ మందిరా!
సాక్షి,ముంబై: ప్రముఖ నటి, మోడల్ మందిరా బేడీ భర్త రాజ్కౌశల్ ఆకస్మిక మరణం పలువుర్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో బాలీవుడ్ నటీ నటులతో పాటు, మందిరా దంపతుల స్నేహితులు, ఇతర ప్రముఖులు సోషల్ మీడియాలో తమ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మందిరా బేడీకి, ఆమె కుటుంబ సభ్యలుకు తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ముఖ్యంగా ప్రముఖ నటులు అనుపమ్ ఖేర్, కబీర్బేడీ, మాధవన్, నటి నేహా ధూపియా, మనోజ్బాజ్పాయ్ తోపాటు, సింగర్ విశాల్ దాద్లానీ తమ సానుభూతి ప్రకటించారు. 49 సంవత్సరాల చిన్న వయసులో ఆయన మరణం తీరని విషాదమంటూ ట్వీట్ చేశారు. రాజ్ కౌశల్ దర్శకత్వంలో వచ్చిన ఆంథోనీ కౌన్ హై మూవీలో నటించిన మినీషా లాంబా, ఆంథోనీ కౌన్ హై చిత్రంలో ఆయనతో పనిచేసిన అర్షద్ వార్సీ ట్విటర్ ద్వారా తమ విచారాన్ని వ్యక్తం చేశారు. ఇంకా కృతి కర్బందా, రణదీప్ హుడా, లారా దత్తా, రణ్వీర్ శ్రాయ్, గౌరవ్ చోప్రా, సినీ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్, ఇతర ప్రముఖులు సోషల్ మీడియాద్వారా సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కాగా భర్త రాజ్ కౌశల్ ఆకస్మిక మరణంతో మందిరాబేడీ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దీంతో బాలీవుడ్ ప్రముఖులు హ్యుమా ఖురేషి, అపూర్వ అగ్నిహోత్రి, సమీర్ సోని, రోహిత్ రాయ్, గుల్ పనాగ్, ఆశీష్ చౌదరీ తదితరులు మందిరా నివాసానికి చేరుకుని ఆమెను ఓదార్చారు. స్నేహితులు, సన్నిహితుల అశ్రునయనాల మధ్య ముంబైలోని బాంద్రా శ్మశాన వాటికలో బుధవారం అంత్యక్రియలను పూర్తి చేశారు. తీరని దుంఖంతో పిల్లలను ఓదార్చుతూ మందిరా తన భర్తకు అంతిమ సంస్మారాలను పూర్తి చేసిన వైనం కంటతడిపెట్టించింది. చదవండి : ప్రముఖ నటి మందిరా బేడి భర్త కన్నుమూత ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా No news can be more shocking and tragic for us personally than loosing our dear friend and a fantastic human being Raj kaushal !! It will definitely take time to come to terms with this loss!! Rest in peace my friend 🙏 — manoj bajpayee (@BajpayeeManoj) June 30, 2021 Deeply saddened & shocked to know about the sudden demise of #RajKaushal! A friend, a film maker & a very positive man. Have some great memories of working with him & spending time with him few years back. Sorry dearest @mandybedi & family for your irreparable loss. 🙏#OmShanti pic.twitter.com/HrzULdJhYd — Anupam Kher (@AnupamPKher) June 30, 2021 Deepest condolences to Mandira Bedi on the tragic passing of her husband Raj Kaushal. Such a sudden and unexpected loss is deeply traumatic. My heart is with her in her great sorrow. @mandybedi #MandiraBedi — KABIR BEDI (@iKabirBedi) June 30, 2021 I just don’t know what to say. No words nor lines can express how devastating this news has been. One of the nicest guys with a heart of gold is now lighting up the heavens. Farewell my bro @rajkaushal1. Our world just got very very small. 🙏🙏🙏🙏 pic.twitter.com/KBZZz7ejVF — Ranganathan Madhavan (@ActorMadhavan) June 30, 2021 RIP #RajKaushal 🙏🏽 pic.twitter.com/X9J2oTL3Hc — Randeep Hooda (@RandeepHooda) June 30, 2021 Deepest condolences to Mandira Ma’am, her children and their family. This is so shocking. Rest in peace #RajKaushal sir. 💔 — kriti kharbanda (@kriti_official) June 30, 2021 -
గురుప్రసాద్ మహాపాత్ర మృతి: పీఎం మోదీ సంతాపం
సాక్షి,ముంబై: కరోనా సంబంధిత సమస్యలతో పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి డాక్టర్ గురుప్రసాద్ మహాపాత్ర కన్నుమూశారు.ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడిన ఆయన శనివారం కన్నుమూశారు. గురుప్రసాద్ మరణంపై ప్రధానమంతత్రి నరేంద్ర మోదీ ట్విటర్ ద్వారా సంతాపం తెలిపారు. అలాగే వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ గురుప్రసాద్ మృతిపై విచారాన్ని వ్యక్తం చేశారు. మహాపాత్రను కోల్పోయినందుకు చాలా బాధగా ఉందనీ సుదీర్ఘకాలంపాటు, దేశానికి ఎనలేని సేవలందించారని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగానికి ఆయన కుటుంబానికి స్నేహితులకు సానుభూతిని తెలిపారు. అటు ఆర్బీఐ గవర్నరు శక్తికాంత దాస్ కూడా సంతాపం వెలిబుచ్చారు. అత్యంత సమర్థవంతమైన, డెడికేటెడ్ అధికారిని కోల్పోవడం విచారకరమని పేర్కొన్నారు. కాగా కోవిడ్-19 కారణంగా ఏప్రిల్ నెలలో ఎయిమ్స్లో చికిత్స తీసుకున్నారు. అయినా కోవిడ్ అనంతర సమస్యల కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విచారు. గుజరాత్ కేడర్ 1986 బ్యాచ్ ఐఎఎస్ అధికారి అయిన గురుప్రసాద్ 2019 ఆగస్టులో డీపీఐఐటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చైర్మన్గా పనిచేశారు. రాష్ట్ర స్థాయిలో గుజరాత్లోని సూరత్లో మునిసిపల్ కమిషనర్ పదవిని నిర్వహించిన వాణిజ్య విభాగంలో జాయింట్ సెక్రటరీగా తన సేవలను అందించారు. Deeply saddened by the demise of Dr.Guruprasad Mohapatra,Secretary DPIIT,GOI. A highly efficient and dedicated civil servant. Knew him as a former colleague through several interactions.Was always very responsive and constructive. May his soul rest in eternal peace. — Shaktikanta Das (@DasShaktikanta) June 19, 2021 Extremely saddened to hear about the loss of Dr. Guruprasad Mohapatra, Secretary DPIIT. His long-standing service and dedication to the Nation have left a lasting impact. I convey my deepest sympathies to his family and friends. ॐ शांति pic.twitter.com/JFwZJFDE1b — Piyush Goyal (@PiyushGoyal) June 19, 2021 -
దేవుడు చాలా కఠినాత్ముడు: మేఘనా రాజ్ ఎమోషన్
సాక్షి,బెంగళూరు: కన్నడ నటుడు సంచారి విజయ్ అకాల మరణంపై టి మేఘనా రాజ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సోషల్మీడియా ద్వారా విజయ్ మృతిపై మేఘనా భావోద్వేగానికి లోనయ్యారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో విజయ్ అందమైన ఫోటోను షేర్ చేసిన మేఘనా ఒక ఎమోషనల్ నోట్ రాశారు. ‘మనిషిగా, నటుడిగా మీరెంతో అద్భుతమైన వారు. మీరు ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటారు.. నిజంగా దేవుడు కఠినాత్ముడు. ఆర్ఐపీ ఫ్రెండ్’ అని పేర్కొన్నారు. అంతేకాదు గత ఏడాది జూన్లో తన భర్త చిరంజీవి సర్జా మృతిపైవిచారం వ్యక్తం చేసిన సంచార్ విజయ్ పోస్ట్ను షేర్ చేశారు. మేఘనా రాజ్ భర్త , హీరో చిరంజీవి సర్జా తీవ్ర గుండెపోటు కారణంగా (202, జూన్ 7న) ఆకస్మికంగా మృతిచెందిన సంగతి తెలిసిందే. కాగా స్నేహితుడితో కలిసి వెళుతుండగా విజయ్ ప్రమాదానికి గురయ్యారు.తలకు తీవ్రమైన గాయాలు కావడంతో విజయ్ను రక్షించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి ఆయన చని పోయినట్టుగా ప్రకటించారు. మరోవైపు విజయ్ ఆకస్మిక మరణంపై పరిశ్రమకు చెందిన పెద్దలు పలువురుఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప నటుడి ఆకస్మిక మరణంపై విచారం వ్యక్తం చేశారు. అలాగే ఆయన అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. చనిపోయిన తరువాత కూడా విజయ్ పలువురికి ప్రాణదానం చేశారని సీఎం కొనియాడారు. మరోవైపు బంధువులు, సన్నిహితుల అశ్రునయనాల మధ్య ప్రభుత్వ అధికార లాంఛనాలతో విజయ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. -
గౌరీ అమ్మ ఇక లేరు: గవర్నరు, సీఎం సంతాపం
తిరువనంతపురం: కేరళ ప్రముఖ కమ్యూనిస్టు నేత, మాజీమంత్రి నేత కేఆర్ గౌరీ కన్నుమూశారు. కేరళ రాజకీయాల్లో ఐరన్ లేడీగా పేరుగాంచిన కేఆర్ గౌరీ తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వయసు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తనువు చాలించారు. మరికొన్ని వారాల్లో ఆమె 102వ పుట్టిన రోజులు జరుపుకునేవారు. కేరళ గవర్నరు, ముఖ్యమంత్రి సహా పలువురు రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు గౌరీ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, ప్రతిపక్ష నాయకుడు రమేష్ చెన్నితాలాతో సహా పార్టీ సీనియర్ నాయకులు ఆమె స్వస్థలమైన అలప్పులో ఘనంగా నివాళులు అర్పించారు. ‘‘దోపిడీకి వ్యతిరేకంగా సమ సమాజ నిర్మాణంకోసం తన జీవితాన్ని అంకితం చేసిన పోరాట యోధురాలు. మరింత ప్రగతిశీల సమాజాన్నినిర్మిస్తామని ప్రతిజ్ఞ చేయడం ద్వారా ఆమెకిచ్చే నివాళి. రెడ్ సెట్యూట్’’ అని సీఎం విజయన్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో భూసంస్కరణలు, పారిశ్రామిక అభివృద్ధికి ఆమె చేసిన కృషి చిర స్మరణీయమని గవర్నరు సంతాపం తెలిపారు. అసాధారణమైన ధైర్యం, ఉత్తేజకరమైన నాయకత్వంతో మహిళా సాధికారతకు నిజమైన చిహ్నంగా నిలిచారన్నారు. సామాజిక న్యాయం కోసం నిరంతరం చేసిన ఆమె పోరాటాలు కేరళ ప్రజలు గుర్తు పెట్టుకుంటారని ట్వీట్ చేశారు. ఆధునిక కేరళకు పునాదులు వేసిన వారిలో కేఆర్ గౌరీ అమ్మ ఒకరని ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ ఆమెకు నివాళులర్పించారు. మానవ హక్కుల కోసం పోరాడిన వ్యక్తి ఆమె అని గుర్తు చేసుకున్నారు. ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో కేరళలోని రాజకీయ రంగాలలో అనేక కీలక ఫైనాన్స్, పరిశ్రమలు మంత్రి పదవులను చేపట్టారు. గౌరీ అమ్మ చారిత్రాత్మక భూస్వామ్య వ్యతిరేక భూ సంస్కరణల చట్టాన్ని తీసుకు రావడంలో ఆమె చేసిన కృషి అమోఘం. భూమిలేని రైతులకు భూమిని సొంతం చేసుకోవడానికి మార్గం సుగమమైంది.1952లో ట్రావెన్కోర్-కొచ్చిన్ శాసనసభకు ఎన్నిక కావడంతో గౌరీ రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1957లో కమ్యూనిస్ట్ లెజెండ్ ఇఎంఎస్ నంబూద్రిపాత్ నేతృత్వంలోని ప్రపంచంలోని మొట్టమొదటి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన కమ్యూనిస్ట్ ప్రభుత్వ మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. 1960 లలో కమ్యూనిస్టులు విడిపోయిన తరువాత, గౌరీ సీపీఎంలో చేరారు, ఆమె భర్త మరో ముఖ్య నాయకుడు టీవీ థామస్ సీపీఐలో చేరారు. మొదటి కేరళ శాసనసభ నుండి 1977 వరకు ఆమె ప్రజాప్రతినిధిగా ఉన్నారు. మొత్తం ఆరు క్యాబినెట్లలో 16 సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. Hon'ble Governor Shri Arif Mohammed Khan said : "My heartfelt condolences on the demise of Smt K R #GouriAmma , former minister & veteran political leader. Her exceptional courage and inspiring leadership made her a true symbol of woman empowerment": PRO,KeralaRajBhavan(T1/2) pic.twitter.com/WQjHwiYZRC — Kerala Governor (@KeralaGovernor) May 11, 2021 Com. K R Gauri was a brave fighter, dedicated her life to end exploitation, build an egalitarian society. She made seminal contributions in building the Communist movement & as an administrator. Let's show respects, by pledging to build a more progressive society. Red Salute! pic.twitter.com/NYzyv8wyjD — Pinarayi Vijayan (@vijayanpinarayi) May 11, 2021 -
ఏబీఎన్ రాధాకృష్ణ భార్య మృతి.. సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ సతీమణి కనకదుర్గ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కనకదుర్గ మృతి పట్ల సంతాపం తెలియజేశారు. ఈ కష్ట సమయంలో రాధాకృష్ణకు, వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. -
బిడ్డ కోసం పెంగ్విన్ల ఆరాటం
-
వైరల్: ‘బిడ్డా లే.. అమ్మ వచ్చింది చూడు’
న్యూఢిల్లీ: బిడ్డకు చిన్న దెబ్బతగిలితేనే తల్లి హృదయం విలవిల్లాడుతుంది. పిల్లలు ఏ చిన్నాపాటి అనారోగ్యానికి గురైన అమ్మ మనసు సహించదు. బిడ్డలు కోలుకునే వరకు వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. దురదృష్టం కొద్ది బిడ్డ మరణిస్తే.. ఆ తల్లి కడుపుకోతను వర్ణించడానికి మాటలు చాలవు. ఇలాంటి తల్లి ప్రేమ మనుషులకే కాదు.. జంతువులకు కూడా ఉంటుంది. వాటి బిడ్డలకు ఏం జరిగినా అవి కూడా తట్టుకోలేవు. ఇందుకు నిదర్శనంగా నిలిచే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన ప్రతి ఒక్కరి హృదయం ద్రవిస్తోంది. చనిపోయిన పిల్ల పెంగ్విన్ని చూసి దాని తల్లిదండ్రులు హృదయవిదారకంగా విలపించాయి. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్లో ఇందుకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు. ‘‘జీవితం అంటేనే ఇలా ఉంటుంది. తమ బిడ్డను కోల్పోయినందుకు ఈ రెండు పెంగ్విన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మహమ్మారి టైంలో తమ ప్రియమైన వారిని కోల్పోయి.. బాధపడుతున్న వారికి దేవుడు ఆత్మనిబ్బరాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అంటూ సుశాంత నంద వీడియో షేర్ చేశారు. ఇక దీనిలో ఓ పెంగ్విన్ జంట చనిపోయిన బిడ్డను అటు ఇటు దొర్లిస్తూ.. ముక్కుతో దాన్ని కదుపుతూ లేపే ప్రయత్నం చేశాయి. కానీ దానిలో ఎలాంటి చలనం లేదు. బిడ్డ చనిపోయిందని తెలిసి ఆ పెంగ్విన్ల గుండె పగిలింది. బిడ్డను చూస్తూ.. మౌనంగా రోదించాయి. వాటి వేదన ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. చదవండి: షాకింగ్: తెలిసిన వాడని ఫోటో పంపితే.. దాన్ని మార్ఫ్ చేసి -
గుండె పగిలింది: విషాదంలో పూజా హెగ్డే
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే టీచర్ మరణవార్తతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తన ఫేవరెట్ టీచర్ శ్రీమతి జెసికా దరువాలా ఇక లేరనే వార్తతో తన గుండె పగిలి పోయిందంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషాదాన్ని తట్టుకోలేకపోతున్నానంటూ ఇన్స్టాలో తన బాధను షేర్ చేసుకున్నారు. ఢిల్లీలోని మానెక్జీ కూపర్ స్కూల్లో చదివి ఉంటే ఇతరులకు కూడా తన టీచర్ గురించి తెలుసుకునే అదృష్టం దక్కేదని పేర్కొన్నారు. ఈ ప్రపంచం ఒక రత్నాన్ని కోల్పోయిందంటూ సంతాపం ప్రకటించారు పూజా. తాను నిరాశపడిన ప్రతీసారి ఆమె తనకు ఎంతో ధైర్యం చెప్పేవారని ఆమె ధైర్యవచనాలు ఎప్పటికీ తనతోనే ఉంటాయంటూ భావోద్వేగానికి గురయ్యారు. నిజంగా కొంతమంది టీచర్లు ప్యూర్ గోల్డ్ అంటూ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన ఉన్నతికి కారణమైన అంతటి గొప్ప టీచర్ మాటలను ఎప్పుడూ మరిచిపోలేను.. జెసికా జియోగ్రఫీ టీచర్ అయినా ఎన్నో జీవిత పాఠాలను నేర్పించారన్నారు. ఈ సందర్భంగా టీచర్ కుటుంబ సభ్యులకు పూజా తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. చదవండి: ఎన్నిసార్లు గెలుస్తావ్ భయ్యా..! నెటిజన్లు ఫిదా జొమాటో కొత్త ఫీచర్, దయచేసి మిస్ యూజ్ చేయకండి! -
కోరిక తీరకుండానే వెళ్లిపోయిన వివేక్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా పరిశ్రమ ఏదైనా తనదైన నటనతో ఆకట్టుకున్న ప్రముఖ హాస్య నటుడు వివేక్. ఆయన అకాల మరణం మొత్తం సినీరంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 500కి పైగా చిత్రాలు, తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వివేక్ తీవ్రమైన గుండెపోటుకు గురై అకస్మాత్తుగా ఈ లోకాన్ని వీడటం తీవ్ర విషాదాన్ని నింపింది. చాలా తొందర పడ్డారు సార్ అంటూ ఆయన హితులు, సన్నిహితులు తీరని ఆవేదన వ్యక్తం చేశారు. నటులు సూర్య, విక్రం, నటి జ్యోతిక, మహానటి ఫేం కీర్తి సురేష్తోపాటు పలువురు ప్రముఖులు వివేక్ మృతదేహానికి నివాళుర్పించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తన ట్విటర్ ద్వారా వివేక్కు సంతాపం తెలియజేస్తూ శివాజీ సినిమా షూటింగ్ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నటనపైన మక్కువ మాత్రమే కాదు..వివేక్ ప్రకృతి ప్రేమికుడు కూడా. పర్యావరణ పరిరక్షణకోసం నిరంతరం పాటుపడేవారు. తన నటనా కౌశలంతో పద్మశ్రీ పురస్కారాన్ని సొంతం చేసుకున్న వివేక్ తనకు గురువు మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్ కలాం అని ఎపుడూ చెబుతూ ఉండేవారు. ఈ క్రమంలోనే కలాం కోరిక మేరకు గ్లోబల్ వార్మింగ్కు వ్యతిరేకంగా ప్రచారంతోపాటు, చెట్ల పెంపకాన్ని తన జీవిత మిషన్గా చేపట్టారు. తన వంతు బాధ్యతగా కోటి చెట్లు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులోభాగంగా 2011 లో భారీ చెట్ల పెంపకం కోసం ‘గ్రీన్ కలాం’ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ మేరకు ఇప్పటికే 33.23 లక్షల మొక్కలు నాటారు. ఈ విషయాన్నే ఆయన అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. కోరిక తీరకుండానే వివేక్ ప్రకృతిలో కలిసిపోయారంటూ కంటతడిపెట్టారు. కానీ ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ట్విటర్లో పోస్ట్ చేసిన వీడియోలను రీపోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆర్ఐపీ వివేక్ సార్ హ్యాష్ట్యాగ్లో ట్రెండింగ్లో నిలిచింది. #RipVivek pic.twitter.com/MSYVv9smsY — Rajinikanth (@rajinikanth) April 17, 2021 Bye Sir. Even in death you were too ahead of your time. We will all miss you terribly. ❤️ There will be laughter and food for thought in the heavens tonight. #VIVEKH pic.twitter.com/zGRcUhEwmt — Siddharth (@Actor_Siddharth) April 17, 2021 Thalaivi Pays Homage to #Vivek sir #RIPVivekSir 💔🙏🏻 pic.twitter.com/enqgAOYmWY — sᴀɴᴅʜʏᴀ 🦄 ᴋᴇᴇʀᴛʜʏ 𝐃𝐞𝐯𝐨𝐭𝐞𝐞 (@Sandy_kitty_) April 17, 2021 We are shocked and saddened.. I missed sharing screen space with you and missed learning so much from a legend like you.. will miss you forever sir. Deepest condolences to the family🙏 #RIPVivekSir pic.twitter.com/DSSxzb7cG6 — Sivakarthikeyan (@Siva_Kartikeyan) April 17, 2021 Gone tooooo soon saar. Life is truly unfair. #RIPVivekSir deepest condolences to friends and family — venkat prabhu (@vp_offl) April 17, 2021 End of an era 💔 pic.twitter.com/QmoCBvMKcI — Hansika (@ihansika) April 17, 2021 -
కరోనాతో బీజేపీ ఎంపీ మృతి: మోదీ సంతాపం
సాక్షి, భోపాల్: కరోనా మహమ్మారి బారిన పడి మరో బీజేపీ ఎంపీ కన్నుమూశారు. మధ్యప్రదేశ్ బీజేపీ లోక్సభ ఎంపీ నందకుమార్ సింగ్ చౌహాన్ తుదిశ్వాస విడిచారు. ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో గత 15 రోజులుగా ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం కన్నుమూశారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. పార్టీకి ఆయన లేని లోటు తీరనిది అంటూ ట్వీట్ చేశారు. పార్టీ బలోపేతం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు. అటు నందకుమార్ మృతిపై బీజేపీ శ్రేణులు, నేతలు విషాదంలో మునిగిపోయారు. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ , తమనేత అకాలమరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా 2009-14మధ్య ఐదేళ్ల కాలంలో తప్ప 1996 నుండి చౌహాన్ లోక్సభ ఎంపీగా కొనసాగుతున్నారు. చదవండి : ఎన్నికల వేడి: బీజేపీలో చేరిన సినీ నటి హత్రాస్లో మరో దారుణం : బాధితురాలి తండ్రి హత్య Saddened by the demise of Lok Sabha MP from Khandwa Shri Nandkumar Singh Chauhan Ji. He will be remembered for his contributions to Parliamentary proceedings, organisational skills and efforts to strengthen the BJP across Madhya Pradesh. Condolences to his family. Om Shanti. — Narendra Modi (@narendramodi) March 2, 2021 -
చిరునవ్వుల వరమిస్తావా.. చితినుండి లేచొస్తా!!
సాక్షి, హైదరాబాద్: గేయ రచయిత వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. గుండెపోటుతో ఆయన చెన్నైలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. పలువురు సినీ రంగ ప్రముఖులు, నటీనటులు, గాయనీ గాయకులు వెన్నెలకంటి మృతిపై సంతాపం ప్రకటించారు. ఆయన కలం నుంచి జాలువారిన అద్భుతమైన పాటలను, అజరామర సాహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. 1988లో వచ్చిన `మహర్షి` మూవీలోని మాటరాని మౌనమిది ప్రధానంగా చెప్పుకోవచ్చు. అలాగే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బిగ్గెస్ట్హిట్ చంద్రముఖిలోని `కొంత కాలం కొంతం కాలం కాలమాగిపోవాలి’ అనే పాట కూడా అభిమానులకు ఆకట్టుకుంది. దీంతోపాటు బృందావనం చిత్రంలో "మధురమే సుధా గానం", ఓహో ఓహో పావురమా’’, ఆదిత్య 369 చిత్రంలో ‘రాసలీల వేళ ’ లాంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలున్నాయి. వీటితోపాటు స్వాతికిరణం, బిరియానీ, ఆవారా, ఆకాశమంతా, పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాల్లోని ఆయన పాటలు విశేష ఆదరణ పొందాయి. వెన్నెలకంటి అకాలమరణంపై గాయని చిన్మయి శ్రీపాద విచారం వ్యక్తం చేశారు. ‘చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి లేచొస్తాను అంటూ చిరునవ్వుల వరమిస్తావా మూవీ కోసం ఆయన రాసిన గీతాన్ని తలుచుకున్నారు మరో సినీ గేయ రచయిత భాస్కర భట్ల. వెన్నెలకంటికి ట్విటర్ ద్వారా అశృనివాళులర్పించారు. చిరునవ్వుల వరమిస్తావా చితి నుండీ లేచొస్తా మరుజన్మకి కరుణిస్తావా ఈ క్షణమే మరణిస్తా -వెన్నెలకంటి ❤️ వెన్నెలకంటి గారికి అశృనివాళి 💐💐💐 — bhaskarabhatla (@bhaskarabhatla) January 5, 2021 Heartbreaking that Sri Vennelakanti garu has passed on. A legendary writer that’ll be sorely missed. — Chinmayi Sripaada (@Chinmayi) January 5, 2021 -
ట్రూ లవ్.. ఆలస్యంగా నడిచిన 23 రైళ్లు
బెర్లిన్ : ప్రేమ అనేది మనుషులకు మాత్రమే కాదు జంతువులు, పక్షులకు కూడా ఉంటుంది. నిస్వార్థమైన ప్రేమను చూపడంలో మనుషుల కన్నా జంతువులే మిన్నగా ఉంటాయి. తాజాగా దీన్ని నిజం చేసే సంఘటన ఒకటి జర్మనీలో చోటు చేసుకుది. ఆ వివరాలు.. రెండు హంసలు హై స్పీడ్ రైల్వే లైన్లోకి దూసుకెళ్లాయి. ఈ క్రమంలో ఒక హంస ఒవర్హెడ్ పవర్ కేబుల్లో చిక్కుకుని మరణించింది. దాంతో మిగిలిన హంస రైల్వే ట్రాక్ మీదనే ఉండి చనిపోయిన భాగస్వామి శరీరాన్ని చూస్తూ.. బాధపడసాగింది. అధికారులు హంసను అక్కడి నుంచి తరిమే ప్రయత్నం చేసినప్పటికి అది కదలలేదు. దాదాపు 50 నిమిషాల పాటు అలా చనిపోయిన హంసను చూస్తూ.. బాధపడుతూ.. సంతాప సూచకంగా అక్కడే ఉండిపోయింది. దాని మూగ వేదనను అర్థం చేసుకున్న అధికారులు హంసను అలాగే ఉండనిచ్చారు. దాదాపు 50 నిమిషాల తర్వాత అగ్నిమాపక దళ సిబ్బంది వచ్చి చనిపోయని హంస మృతదేహాన్ని అక్కడి నుంచి తొలగించడంతో జంట హంస కూడా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ 50 నిమిషాల పాటు ట్రాక్పై రాకపోకలు సాగకపోవడంతో 23 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఈ సంఘటనతో జంతువులు, పక్షులు కూడా ప్రేమ వంటి భావోద్వేగాలను కలిగి ఉండటమే కాక సున్నితంగా ఉంటాయని మరోసారి రుజువయ్యింది. అవి మనకంటే అధికంగా నొప్పిని అనుభూతి చెందుతాయిని నిరూపితమయ్యింది. అంతేకాక మనుషులు జంతువుల, పక్షులు వంటి మూగజీవుల పట్ల మరింత కరుణతో వ్యవహరించాలిన ఈ సంఘటన గుర్తు చేసింది. -
నోముల అకాల మరణం : ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) అకాల మరణంపై నిజామాబాద్ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ వెంట నడిచిన గొప్ప నాయకులంటూ నోముల సేవలను గుర్తు చేసుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూన్నానంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె నోముల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరోవైపు తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్రావుకూడా నోముల మృతిపై విచారం వ్యక్తం చేశారు. (టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత) కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస తీసకున్నారు. ఈ ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో వెంటనే నోములను అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. నోముల మృతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన పార్టీకి చేసిన సేవలు ఎనలేనివని, ఆయన లేని లోటు పూడ్చలేనిదని టీఆర్ఎస్ శ్రేణులు విచారం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గారి అకాల మరణం వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యాను. ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ వెంట నడిచిన గొప్ప నాయకులు నోముల నర్సింహయ్య గారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. pic.twitter.com/y6lm4KdxJQ — Kavitha Kalvakuntla (@RaoKavitha) December 1, 2020 నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గారి ఆకస్మిక మరణం తీవ్ర దురదృష్టకరం. జీవితాంతం ప్రజలకోసం వారి హక్కుల కోసం పోరాడారు. తాను నమ్ముకున్న సిద్ధాంతాలకోసం నిబద్ధతగా పనిచేసిన వ్యక్తి నర్సింహయ్యగారు. వారిమృతి పట్ల తీవ్రసంతాపాన్ని తెలుపుతూ.. వారి కుటుంభసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి pic.twitter.com/67iX9HXRF7 — Harish Rao Thanneeru #StayHome #StaySafe (@trsharish) December 1, 2020 -
గుండె పగిలింది : కమలా హారిస్
హాలీవుడ్ నటుడు చాడ్విక్ బోస్మ్యాన్ అకాలమరణం సినీలోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అతని మరణం తీరని లోటంటూ పలువురు హాలీవుడ్ ప్రముఖులు, ఇతరులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీలో ఉన్న డొమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ కూడా విచారం ప్రకటించారు. తెలివైన వాడు, మంచివాడు. తన స్నేహితుడు ఇంత చిన్న వయసులో ఈ లోకాన్ని వీడాడంటూ ట్వీట్ చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. (బ్లాక్ పాంథర్ నటుడు కన్నుమూత) చాడ్విక్ బోస్మ్యాన్ పెద్దప్రేగు క్యాన్సర్తో శుక్రవారం తుది శ్వాస విడిచారు. కాలిఫోర్నియాలో జరిగిన ఫ్రీడమ్ ఫర్ ఇమ్మిగ్రెంట్స్ కార్యక్రమంలో కమలా హారిస్కు మద్దతుగా నిలిచారు. ముఖ్యంగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా కమలాను జో బైడెన్ ప్రతిపాదించిన అనంతరం కమలాతో కలిసి ఉన్న ఫోటోను ట్విటర్ లో షేర్ చేశారు. అదే అతని ఆఖరి ట్వీట్ కావడం విషాదం. దీంతో కమలా హారిస్ చాడ్విక్ మరణంపై విచారం వ్యక్తం చేశారు. కాగా బ్లాక్ పాంథర్ మార్వెల్ పాత్రతో పాపులర్ అయిన జాకీ రాబిన్సన్ పాత్రతోపాటు అనేక పాత్రల్లో అద్భుతమైన నటనతో మెప్పించారు. YES @KamalaHarris! 👏🏾👏🏾👏🏾#WhenWeAllVote #Vote2020 pic.twitter.com/iOU3duBAcA — Chadwick Boseman (@chadwickboseman) August 11, 2020 Heartbroken. My friend and fellow Bison Chadwick Boseman was brilliant, kind, learned, and humble. He left too early but his life made a difference. Sending my sincere condolences to his family. pic.twitter.com/C5xGkUi9oZ — Kamala Harris (@KamalaHarris) August 29, 2020 -
ఘోర ప్రమాదం : ఎంత విషాదమీ దృశ్యం
సాక్షి, న్యూఢిల్లీ: కేరళ కోళీకోడ్ విమాన ప్రమాదంలో వింగ్ కమాండర్ దీపక్ వసంత్ సాథే (59) దుర్మరణంతో ఆయన తల్లిదండ్రులు తీరని విషాదంలో మునిగిపోయారు. వృద్ధాప్యంలో తమకు కొండంత అండగా ఉన్న తమ అభిమాన దీపక్ ఇకలేడన్న వార్త వారిని దిగ్భ్రాంతికి గురి చేసింది. గత కొంతకాలం క్రితం జరిగిన ప్రమాదంలో తమ మరో కుమారుడిని ఈ దంపతులు కోల్పోవడం విషాదం. (ఆయన ధైర్యమే కాపాడింది!) "నా కొడుకు చాలా గొప్పవాడు. అవసరమైనవారికి సాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే వాడు'' అంటూ తల్లి నీలా సాథే దివంగత కెప్టెన్ దీపక్ సాథేని గుర్తు చేసుకున్నారు. కళ్ల నిండా నీళ్లతో, విషణ్ణ వదనాలతో మీడియాతో మాట్లాడిన మాటలు హృదయాలను ద్రవింప చేస్తున్నాయి. తమ కుమారుడు అన్ని విద్యల్లో ఆరితేరిన వాడంటూ కన్నీంటి పర్యంతమయ్యారు. మంచివారినే ఆ దేవుడు తీసుకెళ్లి పోతారని ఆమె వ్యాఖ్యానించారు. తమ ఇద్దరు కుమారులు ఇలా తమ కళ్లముందే ప్రాణాలు కోల్పోవడాన్ని మించిన విషాదం ఏముంటుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (విషాదం : మృత్యువును ముందే పసిగట్టాడేమో? ) మరోవైపు కెప్టెన్ సాథేతో తమ అనుబంధాన్ని తలుచుకుంటూ, ఆయన అభిమానులు, సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ప్రమాదానికి ముందు కెప్టెన్ సాథే ఇంజీన్ ఆపివేసి తద్వారా ప్రయాణీకులు, సిబ్బంది ప్రాణాలను కాపాడారంటూ నివాళులర్పిస్తున్నారు. Captain Deepak Vasant Sathe is a very experienced hand at pilots seat. He saved many a lives in yesterday’s AI Express plane crash at Kozhikode by switching off the engine. Sadgati to his soul. Salutes to his professionalism even at the cost of life . — B L Santhosh (@blsanthosh) August 8, 2020 Respect sir. You did your best. Before joining civil aviation you were decorated Indian Air Force pilot. Captain/Wing Commander DV Sathe 🙏🏻🙏🏻 pic.twitter.com/dz4NMDozLM — Parveen Kaswan, IFS (@ParveenKaswan) August 7, 2020 -
మరో విషాదం : 2020.. దయచేసి ఇక చాలు!
సాక్షి, ముంబై: పారిశ్రామికవేత్త, క్యుకి డిజిటల్ మీడియా సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ బంగారా (46) ఆకస్మిక మరణం వ్యాపార వర్గాలను విభ్రాంతికి గురిచేసింది. ముంబై శివారు ప్రాంతంలో ఆదివారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో బంగారా కన్నుమూశారు. ఆయన అకాల మరణంపై కంపెనీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఈ విషాదవార్తతో షాక్ లో వున్నామని క్యుకి మరో కో-ఫౌండర్ సీవోవో సాగర్ గోఖలే ఉద్యోగులకు పంపిన ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. ఈ లోటును వర్ణించడానికి మాటలు చాలవని పేర్కొన్నారు. ఈ కష్ట కాలంలో మనమంతా ఆయన కుటుంబానికి అండగా నిలబడాలన్నారు. అలాగే కరోనా మహమ్మారి కాలంలో అందరూ ఇంటినుంచే బంగారాకు నివాళులర్పించాలన్నారు. అటు సమీర్ బంగారా మరణంపై బాలీవుడ్ ప్రముఖులు విశాల్ దాడ్లాని, అర్మాన్ మాలిక్, కుబ్రా సైట్, అదితీ సింగ్ శర్మ తదితరులు ట్విటర్ ద్వారా సంతాపం ప్రకటించారు. తన స్నేహితుడు, సమీర్ ఇక లేడన్న భయంకరమైన, హృదయ విదారక వార్త తెలిసి చాలా బాధపడుతున్నా అన్నారు. జీవితంలో ఎంతోమందికి సాయం చేసిన మంచి వ్యక్తి అని విశాల్ గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాది విషాదాలను తలుచుకుంటూ 2020 ఇక చాలు దయచేసి..అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. Just heard that @samirbangara is no more. Horrible, heartbreaking news. Man's been a friend for a long time. Such a good guy, so straight-up. Helped so many people build careers out of nothing! His legacy will remain. Much love & strength to the family. 🙏🏼 2020, enough please! — VISHAL DADLANI (@VishalDadlani) June 14, 2020 Really very sad to wake up to the news that @samirbangara is no more. He was a great guy with a drive and passion like no other. Shocking and heartbreaking. Sincere condolences, strength and prayers to his immediate family & the @MyQyuki family... — ARMAAN MALIK (@ArmaanMalik22) June 14, 2020 -
ఇర్ఫాన్ కాల్ కోసం ఎదురు చూస్తా
సాక్షి, జైపూర్ : ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణంపై ఆయన చిన్ననాటి స్నేహితుడు భరత్ పూర్ (రాజస్థాన్) ఎస్పీ హైదర్ అలీ జైదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. తన స్నేహితుడు ఇర్ఫాన్ ఖాన్ ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన చెందారు. ఇర్ఫాన్ గొప్ప మనిషి అని వ్యాఖ్యానించిన ఆయన ఏ క్షణమైనా అతడినుంచి ఫోన్ వస్తుందని ఇప్పటికీ ఎదురు చూస్తున్నానంటూ కంటతడి పెట్టారు. ఇంతటి విషాదాన్ని తట్టుకునే ధైర్యం ఆ కుటుంబానికి కలగాలని ప్రార్థించారు. ఇర్ఫాన్ కుటుంబానికి సన్నిహితంగా మెలిగిన జైదీ ఈ సందర్భంగా ఇర్ఫాన్ జీవితానికి సంబంధించి ఒక విషయాన్ని పంచుకున్నారు. ఇర్ఫాన్ ఉపాధ్యాయుడు కావాలని ఆమె తల్లి కోరుకున్నారని జైదీ గుర్తు చేసుకున్నారు. (ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత) క్యాన్సర్ బారిన పడిన ఇర్ఫాన్ ఖాన్ లండన్ లో కొంతకాలం చికిత్స పొందారు. ఇటీవలే భారత్కు తిరిగి వచ్చిన ఇర్ఫాన్ తీవ్ర అనారోగ్యంతో బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో యావత్ సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది. కాగా గత వారం, ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయీదా బేగం (95) జైపూర్లో కన్నుమూశారు. అయితే లాక్ డౌన్ కారణంగా తల్లి అంత్యక్రియలకు ఇర్ఫాన్ వెళ్లలేకపోయారు. Irrfan Khan's friend, Haider Ali Zaidi, the SP of Bharatpur, shares a video after coming to know of his death pic.twitter.com/IsZhRVAWEq — Jayadev (@jayadevcalamur) April 29, 2020 -
కుమారుని మరణం కుంగదీసింది
ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు కన్నుమూతపై టాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తెలుగు సినీ రంగానికి ఆయన అందించిన విశేషమైన సేవలను గుర్తు చేసుకుంటూ ఆ ప్రతిభాశాలికి నివాళులర్పిస్తున్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు, మారుతిరావుకి సన్నిహితుడు కోట శ్రీనివాసరావు స్పందిస్తూ గొల్లపూడి అస్తమయం తనను షాక్కు గురి చేసిందన్నారు. ఆయనను చిన్న కుమారుడు శ్రీనివాస్ ఆకస్మిక మరణం బాగా కుంగదీసిందన్నారు. గొల్లపూడి మరణం పరిశ్రమకు తీరని లోటని వ్యాఖ్యానించారు. ఆయన భార్యకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఇవ్వాలంటూ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. తనకు ఇష్టమైన నటులలో గొల్లపూడి మారుతిరావుగారు ఒకరని టాలీవుడ్ హీరో నాని ట్వీట్ చేశారు. ఆయన మాట్లాడేతీరు, నటించిన తీరు ఆకట్టుకుంటుందని, ఆయన సాన్నిహిత్యం మరువలేనిదని పేర్కొన్నారు. హీరో నిఖిల్ సిద్ధార్థ్ స్పందిస్తూ హ్యాపీడేస్ సినిమాకు ముందు ఒక చిన్న సినిమాలో ఆయనతో కలిసి నటుడు కమ్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాననీ, ఆ సందర్భంగా ఆయన మార్గదర్శకత్వం, సలహాలు ఎప్పటికీ తనతోనే శాశ్వతంగా ఉంటాయంటూ గొల్లపూడిని గుర్తు చేసుకున్నారు. అద్భుతమైన సినిమాలు, నటనతో ఆయన మన గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ ట్విట్ చేశారు. దీంతోపాటు ఒక ఫోటోను కూడా షేర్ చేశారు. కాగా గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గొల్లపూడి చెన్నైలోని లైఫ్లైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు.1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించిన మారుతీరావు వివిధ కళారంగాల్లో తనదైన ప్రతిభను చాటుకుని బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణించారు. రచయితగా, నటుడుగా, జర్నలిస్ట్, ఎడిటర్, డైరెక్టర్ ఇలా విభిన్న రంగాలలో విశిష్ట సేవలందించారు. ఆయన మరణంపై పలువురు సినీ ప్రముఖులతోపాటు, ఇతర ప్రముఖులు కూడా సంతాపం వెలిబుచ్చారు. Gollapudi Maruthi Rao gaaru, one of my most favourites. The way he spoke and the way he acted always felt so familiar and family like. You will always be remembered Sir 🙏🏼 — Nani (@NameisNani) December 12, 2019 Worked as an actor come Assistant director with Sir on a small movie before Happy Days.. the guidance and advice he gave me then is still with me... Rest in Peace sir.. you are always immortal and with us in the form of your brilliant movies 🙏🏽 Gollapudi Maruti Rao garu 🙏🏽 pic.twitter.com/Jwzt5csokB — Nikhil Siddhartha (@actor_Nikhil) December 12, 2019 -
తీరని విషాదంలో నిమ్మకూరు
నల్గొండ జిల్లాలో కారు ప్రమాదంలో మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ (61) చనిపోవడంతో ఆయన స్వగ్రామం నిమ్మకూరు తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన ఆకస్మిక మరణవార్త గ్రామంలో ప్రతి ఒక్కరినీ దిగ్ర్భాంతికి గురి చేసింది. తమ అభిమాన నాయకుడు దుర్మరణం చెందారని తెలిసి నిమ్మకూరు భోరున విలపించింది. చైతన్య రథ సారధి హరికృష్ణ ఇక లేరన్న వార్తతో నిద్రలేవాల్సి రావడాన్ని వారిని తీవ్రంగా కలిచి వేస్తోంది. తమ గ్రామానికి అండ పోయిందని గ్రామస్తులు కలత చెందారు. ఆయన తండ్రి ఎన్టీఆర్ మరణంతో కృంగిపోయాం..ఇపుడికి మరో పెద్ద దిక్కును కోల్పోయామంటూ వారు భోరున విలపించారు. గ్రామంలో ప్రతీ ఒక్కరినీ పేరు పెట్టి పిలిచే అనుబంధం హరికృష్ణది, ఎన్టీఆర్ కుటుంబంలో ఈ గ్రామంలో అందరికి తెలిసిన వ్యక్తి ఆయనొక్కడే అని ఆయన బంధువులు, సన్నిహితులు కన్నీరు పెట్టారు. మరోవైపు ఆయన తుదిశ్వాస విడిచిన కామినేని ఆసుపత్రి వద్ద కూడా తీవ్ర ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఆయన కుమారులతోపాటు,సోదరి, బీజేపీ నేత పురందేశ్వరి కూడా ఆసుపత్రికి చేరుకుని అన్నకు నివాళులర్పించారు. అలాగే హరికృష్ణ అభిమానులు, టీడీపీ నాయకులు, శ్రేణులు ఆసుపత్రికి భారీగా తరలివస్తున్నారు. అటు హైదరాబాద్లోని హరికృష్ణ నివాసంలో తీరని విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు.హరికృష్ణ భౌతికకాయాన్ని ఆయనకెంతో ఇష్టమైన ఆయన నివాసానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఎన్టీఆర్ తరువాత నిమ్మకూరు గ్రామంతో హరికృష్ణది విడదేయలేని బంధం సెప్టెంబర్ 2,1956లో నిమ్మకూరులోనే హరికృష్ణ జన్మించారు. హరికృష్ణ బాల్యం, విద్యాబ్యాసం, వివాహం అన్నీ నిమ్మకూరులోనే జరిగాయి. హరికృష్ణ భార్య లక్ష్మీది కూడా నిమ్మకూరే. ఎంపీగా, మంత్రిగా ఉన్న సమయంలో స్వస్థలం నిమ్మకూరులో ఆయన పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఆయన సేవలను గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. తన కుమారుడు జానకీ రాం రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో హరికృష్ణ మానసికంగా బాగా కృంగిపోయారనీ, చివరిసారిగా 10నెలల క్రితం కుమారుడు కల్యాణ్రామ్తో కలిసి హరికృష్ణ నిమ్మకూరు వచ్చారంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. కాగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగతనేత నందమూరి తారక రామారావుకు మూడవ కుమారుడైన హరికృష్ణ సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. -
నివ్వెరపోయిన టెక్ దిగ్గజాలు
భౌతిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్ స్టీఫెన్ హాకింగ్ మరణ వార్తతో ప్రపంచం యావత్తూ విషాదంలో మునిగిపోయింది. ముఖ్యంగా టెక్నాలజీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయామంటూ టెక్ దిగ్గజాలు సంతాపాన్ని వ్యక్తం చేశాయి. ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక రంగ ప్రముఖులతోపాటు, పలువురు రాజకీయ నేతలు హాకింగ్ కన్నుమూతపై సంతాపాన్ని ప్రకటించారు. వైజ్ఞానిక రంగానికి హాకింగ్ అందించిన సేవలు అమూల్యమైనవని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ట్వీట్ చేశారు. క్లిష్టమైన సిద్ధాంతాలను, భావనలను ప్రజలకు మరింత అందుబాటులో తీసుకొచ్చిన ఆయన సేవలు ఎప్పటికీ నిలిచిపోతాయన్నారు. ఎన్ని అడ్డంకులున్నప్పటికీ, విశ్వంపై పూర్తి అవగాహన పొందేందుకు ఆయన కృషి చిరస్థాయిగా నిలిచిపోతుందంటూ సత్య నాదెళ్ల సంతాపాన్ని ప్రకటించారు. అద్భుతమైన శాస్త్రవేత్తను, మేధావిని ప్రపంచం కోల్పోయిందంటూ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయి ట్వీట్ చేశారు. నరాల వ్యాధి (అమ్యోట్రోఫిక్ లేటరల్ క్లిరోసిస్)తో బాధపడుతూ కన్నుమూసిన హాకింగ్ మోడరన్ కాస్మోలసీ రూపకర్తగా లక్షలాదిమంది ప్రేరణగా నిలుస్తారని పేర్కొన్నారు. కాగా బ్లాక్ హోల్పై కీలక పరిశోధనలు చేసిన విశ్వవిఖ్యాత శాస్త్రజ్ఞుడు స్టీఫెన్ హాకింగ్ ఆరోగ్య సమస్యలతో ఐన్స్టీన్ పుట్టిన రోజునాడే బుధవారం కన్నుమూశారు. హ్యాకింగ్కు రాబర్ట్, లూసీ, తిమోతి అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. We lost a great one today. Stephen Hawking will be remembered for his incredible contributions to science – making complex theories and concepts more accessible to the masses. He’ll also be remembered for his spirit and unbounded pursuit to gain a complet…https://t.co/z1du859Gy2 — Satya Nadella (@satyanadella) March 14, 2018 The world has lost a beautiful mind and a brilliant scientist. RIP Stephen Hawking — Sundar Pichai (@sundarpichai) March 14, 2018 -
పడవ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైఎస్ జగన్
-
అమ్మకోసం మరో సింహాసనం
చెన్నై: అసాధారణ వ్యక్తిత్వం..పోరాట పంథాతో తుదికంటూ పోరాడి దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహిళా రాజకీయవేత్త తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ డిశంబర్ 5న అమ్మ కన్నుమూయడం తమిళ ప్రజలతో పాటు పలు వర్గాలు విషాదంలో మునిగిపోయాయి. కథానాయకిగా సినీరంగంలో వెలుగుతూ రాజకీయాల్లోకి ప్రవేశించి విప్లవనాయకిగా కీర్తి గడించిన అలనాటి అందాల తార జయలలితకు తమిళ సినీ రంగ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా నివాళు లర్పించారు. ముఖ్యంగా తమిళ సినీ అగ్ర కథానాయికలు అమ్మ ఆత్మకు శాంతి కలగాలంటూ ట్విట్ చేశారు. హీరోయిన్లు గౌతం వాసు దేవ్ మీనన్, రాధిక, త్రిష, శృతి హాసన్ తదితరులు ఆమెకు నివాళులర్పించినవారిలో వున్నారు. స్వర్గంలో ఆమెకోసం మరోసింహాసనం ఎదురుచూస్తోందని హీరోయిన్ త్రిష ట్వీట్ చేశారు. తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి జయలలిత అంటూ ఆమె సంతాపం ప్రకటించారు. ఆమెను కలవడం అదృష్టమనీ, చాలా గర్వంగా ఉందంటూ జయలలిత కలిసిన క్షణాలను ఆమె గుర్తు చేసుకున్నారు. అతి ధైర్యవంతమైన మహిళల్లో జయలలిత ఒకరని శృతి హాసన్ ట్వీట్ చేశారు. తమిళనాడు అత్యంత సాహసోపేతమైన మహిళా నాయకురాలని కోల్పోయిందని, ఆమె మృతి తీరనిలోటని విచారం వ్యక్తం చేశారు. ఆమె ఒక ఫైటర్ , అందరికీ స్పూర్తి ప్రదాత అంటూ ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి జయలలిత మరణం తమిళ ప్రజలకు తీరని లోటు..కానీ వారి గుండెల్లో శాశ్వతంగా మిగిలిపోతారని, ఆత్మకు శాంతి కలగాలని రాధిక ప్రార్థించారు. మరోవైపు తమిళనాడుకేకాదు...యావత్ భారతదేశానికే సాహస పుత్రిక అని సూపర్ స్టార్ రజనీకాంత్ ట్విట్టర్ ద్వారా అమ్మ మృతికి సంతాపం తెలిపారు. బల్గేరియాలో షూటింగ్ లో ఉన్న అజిత్ కుమార్ అమ్మ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జీవితంలో అనేక యుద్ధాల్లో పోరాడుతూ ధైర్యంగా నిలబడ్డారనీ, ఈ సమయంలో ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని ఆ దైవం ప్రసాదించాలంటూ ట్వీట్ చేశారు. తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి జయలలిత అనీ హీరోయిన్ త్రిష సంతాపం ప్రకటించారు. స్వర్గంలో ఆమెకోసం మరోసింహాసనం ఎదురుచూస్తోందని ట్వీట్ చేశారు. ఆమెను కలవడం ఒక అదృష్టమనీ, ఇందుకు తనకు చాలా గర్వంగా ఉందంటూ జయలలితను కలిసిన క్షణాలను ఆమె గుర్తు చేసుకున్నారు. అతి ధైర్యవంతమైన మహిళల్లో జయలిలత ఒకరని మరో హీరోయిన్ శృతి హాసన్ ట్వీట్ చేశారు. తమిళనాడు ఒక సాహసోపేతమైన మహిళా నాయకురాల్ని కోల్పోయిందని, ఆమె మృతి తీరనిలోటని విచారం వ్యక్తం చేశారు. ఆమె ఒక ఫైటర్ , అందరికీ స్పూర్తి ప్రదాత అంటూ ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్ ట్వీట్ చేశారు. ఆమె మరణం తమిళ ప్రజలకు తీరని లోటు..కానీ వారి గుండెల్లో శాశ్వతంగా మిగిలిపోతారని, ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. వీరందరితో పాటు పార్తీపన్, మాధవన్, నకుల్ , జయం రవి తదితర పలువురు సినీ ప్రముఖులు జయలలిత ఆత్మకు శాంతి కలగాలంటూ ట్వీట్స్ చేసారు. Der will never be another U❤️ #ironlady #TamilNadusdaughter #myalmamatter #ChurchParkian #mostcherishedmemories #darkestdayinTN #heartbroken pic.twitter.com/DUa4159DO4 — Trisha Krishnan (@trishtrashers) December 5, 2016 -
కాస్ట్రో నిర్యాణంపై బి-టౌన్
ముంబై: క్యూబా విప్లవ యోధుడు, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట యోధుడు ఫెడల్ కాస్ట్రో మరణానికి నివాళులర్పిస్తూ బాలీవుడ్ స్పందించింది. దర్శకులు మధుర్ భండార్కర్, హన్సల్ మెహతా, అశ్విన్ ముశ్రన్, నిఖిల్ అద్వాని వివేక్ అగ్నిహోత్రి, ఆయు ష్మాన్ ఖురాన్ తదితర ప్రముఖులు 90సం.రాల వయస్సులో అనారోగ్యంతో మరణించిన కాస్ట్రోకి ట్విట్టర్ ద్వారా సంతాపం ప్రకటించారు. ఆయనొక విప్లవ చిహ్నమని కొనియాడారు. ప్రపంచంలో ఉత్తమ, అత్యంత వివాదాస్పద నాయకులలో కాస్ట్రో ఒకరని, అమెరికా చేసిన వందల హత్యాయత్నాలను తప్పించుకున్నా అంతిమంగా అనారోగ్యంతో మరణించి సుదీర్ఘ నైతిక పోరాటాన్ని నిరూపించారన్నారు. ఫిడేల్ కాస్ట్రో మరణంతో క్యూబా చరిత్రలో ఒక ముఖ్యమైన శకం ముగింసింని మధుర్ భండార్కర్ ట్వీట్ చేశారు. ప్రభావవంతమైన విప్లవాత్మక నాయకుడు కాస్ట్రో అని అభివర్ణించారు. కాగా కాస్ట్రో మృతి పట్ల ప్రపంచ వ్యాప్తంగాసంతాప సందేశాలు వెల్లువెత్తాయి. దేశ ప్రధాని నరేంద్రమోదీ కూడా నివాళులర్పించారు. , Death of #FidelCastro marks the end of an important era in Cuban history. An influential & a revolutionary leader. Almost traveled to Havana. Visa issues made me change plans. Wish I'd made it before the passing away of #FidelCastro — Hansal Mehta (@mehtahansal) November 26, 2016 -
రైలు ప్రమాదంపై వెంకయ్య దిగ్భ్రాంతి
పనాజి: ఉత్తరప్రదేశ్లో జరిగిన రైలు ప్రమాదంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోవాలోని శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆడిటోరియంలో జరుగుతున్న 47వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐఐఎఫ్ఐ) వేడుకలకు హాజరైన ఆయన రైలు ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. ’ఉత్తరప్రదేశ్లో విచారకరమైన సంఘటన జరిగింది. ఘోర రైలు ప్రమాదంలో వంద మందికి పైగా ప్రజలు విలువైన ప్రాణాలను కోల్పోయారు. వారి కోసం ఒక నిమిషం మౌనం పాటిద్దాం’ అని వెంకయ్యనాయుడు మృతులకు సంతాపం తెలిపారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారు జామున 3:30 గంటల ప్రాంతంలో ఇండోర్-పాట్నా ఎక్స్ప్రెస్ 14 బోగీలు పట్టాలు తప్పడంతో 100 మందికి పైగా మృతి చెందగా.. 150 మంది గాయపడ్డారు. -
కవి ఆవంత్స మృతికి వైఎస్ జగన్ సంతాపం
-
సీనియర్ జర్నలిస్ట్ కాశీపతి మృతి
హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్ కాశీపతి గురువారం హైదరాబాద్లో మృతి చెందారు. గత కొంతకాలంగా అస్వస్థతకు గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాశీపతి మృతి పట్ల వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. గొప్ప రచయిత, విలువలతో కూడిన పాత్రికేయుడు కాశీపతి అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. పత్రికాలోకానికి తీరనిలోటు: రఘువీరారెడ్డి వై.కాశీపతి మృతికి ఏపీసీసీ అధ్యక్షులు డాక్టర్ ఎన్. రఘువీరారెడ్డి సంతాపం తెలిపారు. కాశీపతి రచించిన పుస్తకాలు ప్రజలను అలోచింపజేశావి అన్నారు. మధ్యతరగతి, మందు భారతం వంటి పుస్తకాలు సామన్య ప్రజల జీవన శైలిని అద్దం పట్టేవి అని ఈ సందర్భంగా రఘువీరారెడ్డి గుర్తుచేసుకున్నారు. సాహిత్య చర్చలకు కాశీపతి అధిక ప్రాధ్యనత ఇచ్చేవారని అన్నారు. అభ్యదయ భావాలు కల్గిన, ఉన్నత ఆశయాలు కల్గిన వ్యక్తి కాశీపతి అని రఘువీరా కొనియాడారు. కాశీపతి మరణం ప్రతికలోకానికి తీరాని లోటు అన్నారు. -
బాలీవుడ్ గుండె బరువెక్కింది!
బ్రసెల్స్ వరుస పేలుళ్లపై ఉగ్రదాడిపై బాలీవుడ్ స్పందించింది. సోషల్ మీడియాలోబాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు, నటీ నటులు బ్రసెల్స్ పేలుళ్ల పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతులకు సంతాపాన్ని ప్రకటించారు. బాధితులకు తమ సంఘీభావాన్ని ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. ఇలాంటి పేలుళ్లను చూడడం చాలా బాధగా ఉంటుందని హీరోయిన్ ఆలియా భట్ ట్వీట్ చేసింది. ఇంకా హీరోలు అనిల్ కపూర్, హృతిక్ రోషన్, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, హీరోయిన్ ప్రీతి జింటా తదితరులు ట్వీట్ చేసిన వారిలో ఉన్నారు. కాగా పారిస్ ఉగ్రదాడిని మర్చిపోకముందే.. యూరోప్ మరోసారి బాంబుదాడులతో దద్దరిల్లింది. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ విమానాశ్రయంలోనూ, మెట్రో స్టేషన్లోనూ బాంబులు పేల్చిన ముష్కర మూకలు మారణహోమం సృష్టించాయి. ఈ పేలుళ్లలో దాదాపు 34మంది మరణించగా వందల మంది గాయపడిన సంగతి తెలిసిందే. Heart goes out to those affected by the #BrusselsAttacks !!! Scary to have to witness blasts like these.. Disturbing!!#prayersforBrussels — Alia Bhatt (@aliaa08) March 22, 2016 Really saddened by the Brussels killings!! Can't believe all of us belong to the same species !!! Just feel so helpless and frustrated ! — Shankar Mahadevan (@Shankar_Live) March 23, 2016 Heartbreaking & shocking to hear of the #BrusselsAttacks. My prayers & condolence to the families affected. RIP,the departed. #unacceptable — Preity zinta (@realpreityzinta) March 22, 2016 When people come to believe that taking lives is a justifiable means to an end, it is humanity that has failed... #Brussels, we stand with u — Jai Singh Rathore (@AnilKapoor) March 22, 2016 -
మునికోటికి సంతాపం ప్రకటించిన వైఎస్ జగన్
-
కాశ్మీర్ వరద మృతులకు దలైలామా సంతాపం
ధర్మశాల : జమ్మూ కాశ్మీర్ వరదల్లో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు టిబెట్ ఆధ్యాత్మిక బౌద్ధమత గురువు దలైలామా గురువారం సంతాపం తెలిపారు. వరదల బీభత్సంతో సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టంపై ఆయన జమ్మూ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు రాసిన ఓ లేఖలో తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగించవల్సిందిగా దలైలామా సూచించారు. అలాగే వినాశకరమైన వైపరీత్యంతో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఆయన సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు దలైలామా ట్రస్ట్ నుంచి విరాళం ప్రకటించారు. విరాళాన్ని ముఖ్యమంత్రి ఫ్లడ్ రిలీఫ్ ఫండ్కు పంపించినట్లు ధర్మశాలలోని దలైలామా కార్యాలయం వెల్లడించింది. మరోవైపు భారీ వరదలతో అతలాకుతలమైన జమ్మూకాశ్మీర్లో బాధితులను ఆదుకునేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ఇప్పటివరకూ వరద ప్రాంతాల్లో 77 వేలమంది బాధితులను రక్షించారు. మృతుల సంఖ్య 215కి పెరిగింది.