Price Cut
-
శుభవార్త.. మళ్ళీ తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు
నిర్మలా సీతారామన్ 'కేంద్ర బడ్జెట్ 2025-26' ప్రవేశపెట్టడానికి ముందే.. చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరను తగ్గించాయి. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల రేటు తగ్గడం వరుసగా ఇది రెండోసారి. తగ్గిన ధరలు లేదా కొత్త ధరలు ఈ రోజు నుంచే అమలులోకి వస్తాయి.కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధర రూ. 7 తగ్గింది. దీంతో ఢిల్లీలో రూ. 1,804 వద్ద ఉన్న 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,797కి చేరింది. జనవరి 1న కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.14.5 తగ్గి రూ.1,818.5 నుంచి రూ.1,804కి చేరింది.కోల్కతాలో ఈ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,911 నుంచి రూ.1,907కి తగ్గింది. ముంబైలో రూ. 1,756 నుంచి రూ. 1,749.50కి అందుబాటులో ఉంది. చెన్నైలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,959.50గా ఉంది.Oil marketing companies have revised the prices of commercial LPG gas cylinders. The rate of 19 KG commercial LPG gas cylinders has been reduced by Rs 7 with effect from today. In Delhi, the retail sale price of a 19 kg commercial LPG cylinder is Rs 1797 from today.— ANI (@ANI) February 1, 2025వంట గ్యాస్ సిలిండర్ల ధరలుగృహాల్లో వినియోగించే వంటగ్యాస్ సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి ఢిల్లీలో 14 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ పాత ధరకే.. అంటే రూ.803 వద్ద అందుబాటులో ఉంది. లక్నోలో ఈ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.840.50 కాగా.. ముంబైలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.802.50. చెన్నైలో ఈ సిలిండర్ ధర రూ.818.50. కోల్కతాలో రూ.829గా ఉంది. -
మారుతి సుజుకి చిన్న కార్ల ధరలు తగ్గింపు
మారుతి సుజుకి ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో మోడళ్లలో కొన్ని వేరియంట్ల ధరలను తగ్గించింది. ఇటీవలి నెలల్లో నిస్తేజంగా ఉన్న మినీ, కాంపాక్ట్ సెగ్మెంట్లో అమ్మకాలను పెంచే ప్రయత్నంలో భాగంగా ఎస్-ప్రెస్సో ఎల్ఎక్స్ఐ (S-Presso LXI) పెట్రోల్ మోడల్పై రూ.2,000, ఆల్టో కే10 వీఎక్స్ఐ (Alto K10 VXI) పెట్రోల్ వేరియంట్పై రూ. 6500 మారుతి సుజుకి తగ్గించింది.మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ఎక్స్షోరూం ధర రూ.4.26 లక్షల నుంచి రూ.6.12 లక్షల వరకు ఉంది. ఇక మారుతి సుజుకి ఆల్టో కే10 ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల మధ్య ఉంది. కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీ వెల్లడించింది.తగ్గిన విక్రయాలుఈ ఏడాది ఆగస్ట్లో మారుతి సుజుకి మొత్తం వాహన విక్రయాలు 3.9 శాతం తగ్గాయి. ఈ ఆగస్టు నెలలో 181,782 యూనిట్లను విక్రయించగా గతేడాది ఇదే నెలలో 189,082 యూనిట్లను విక్రయించింది. వీటిలో స్థానిక మార్కెట్ విక్రయాలు 145,570 యూనిట్లు కాగా, ఎగుమతులు 26,003 యూనిట్లుగా ఉన్నాయి.ముఖ్యంగా మినీ, కాంపాక్ట్ సెగ్మెంట్లలో అమ్మకాలు గతేడాది ఆగస్ట్లో 84,660 ఉండగా ఈ ఆగస్ట్లో 68,699కి తగ్గాయి. బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్ వంటి కాంపాక్ట్ కార్ల అమ్మకాలు కూడా 20% తగ్గి 58,051 యూనిట్లకు పడిపోయాయి.గత సంవత్సరం ఇదే నెలలో ఇవి 72,451 యూనిట్లుగా ఉన్నాయి. -
పెట్రోల్, డీజిల్పై రూ.2 తగ్గింపు
న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: దాదాపు రెండేళ్ల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. త్వరలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రానుండగా పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు రూ.2 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగ సంస్థలు తెలిపాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి తగ్గించిన ధరలు అమల్లోకి రానున్నాయని కేంద్ర చమురు శాఖ గురువారం సాయంత్రం తెలిపింది. ధర తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.96.72 నుంచి రూ.94.72కు, డీజిల్ ధర రూ.89.62 నుంచి 87.62కు రానుంది. వారం క్రితమే కేంద్రం వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.100 మేర తగ్గించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఇలా.. స్థానిక, అమ్మకం పన్నులు కలిపి రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ.2.70, డీజిల్ ధర రూ. 2.54 మేర తగ్గనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో రూ.109.66గా ఉన్న పెట్రోల్ ధర రూ.106.96కు తగ్గనుండగా, డీజిల్ ధర రూ.97.82 నుంచి రూ. 95.28కు తగ్గనుంది. -
వాహనదారులకు శుభవార్త.. భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
లోక్సభ 2024 ఎన్నికల వేళ వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల మీద ఏకంగా రూ. 2 తగ్గింపు ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. కొత్త ధరలు మార్చి 15, ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వస్తుంది. పెట్రోలు, డీజిల్ ధరలను రూ. 2 తగ్గించడం ద్వారా దేశంలోని కోట్లాది మంది భారతీయుల సంక్షేమం, సౌలభ్యమే తన లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిరూపించుకున్నారని మంత్రి అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో తగ్గింపు నగరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రస్తుతం 89.62 రూపాయలున్న లీటరు డీజిల్ రేపటి నుంచి రూ. 87.62లకు విక్రయిస్తారని పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశ రాజధానిలో 96.72 రూపాయలుగా ఉన్న లీటరు పెట్రోల్ రేపటి నుంచి రూ. 94.72 కి లభిస్తుంది. पेट्रोल और डीज़ल के दाम ₹2 रुपये कम करके देश के यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी ने एक बार फिर साबित कर दिया कि करोड़ों भारतीयों के अपने परिवार का हित और सुविधा सदैव उनका लक्ष्य है। वसुधा का नेता कौन हुआ? भूखण्ड-विजेता कौन हुआ? अतुलित यश क्रेता कौन हुआ? नव-धर्म… https://t.co/WFqoTFnntd pic.twitter.com/vOh9QcY26C — Hardeep Singh Puri (मोदी का परिवार) (@HardeepSPuri) March 14, 2024 -
సిలిండర్ ధర రూ.100 తగ్గింపు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 14.2 కేజీల వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.100 తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. తగ్గిన ధర వెంటనే అమల్లోకి వచి్చందని ప్రభుత్వం పేర్కొంది. ధర తగ్గింపుతో ఢిల్లీలో 14.2 కేజీల గృహవినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.803కు దిగి వచి్చంది. స్థానిక పన్నుల్లో వ్యత్యాసాలను బట్టి రాష్ట్రాల్లో ధరలో స్వల్ప మార్పులు ఉండొచ్చు. దేశీయ ఇంధన ధరలకు ప్రామాణికంగా భావించే అంతర్జాతీయ చమురు, గ్యాస్ ధరలు స్వల్పంగా కిందకు దిగొచి్చన కారణంగానే ఎల్పీజీ ధర తగ్గించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. రికార్డుస్థాయిలో గత 23 నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. ‘ మహిళా దినోత్సవం సందర్భంగా మా ప్రభుత్వం ఎలీ్పజీపై రూ.100 తగ్గించింది. దేశవ్యాప్తంగా కోట్లాది గృహాలకు ముఖ్యంగా నారీశక్తికి ఈ నిర్ణయం లబ్ధి చేకూరుతుంది’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్ట్చేశారు. గత ఆరునెలల వ్యవధిలో వంటగ్యాస్ ధర తగ్గించడం ఇది రెండోసారి. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో గత ఏడాది ఆగస్ట్లో సిలిండర్పై రూ.200 ధర తగ్గించారు. దీంతో అప్పటిదాకా తొమ్మిది నెలలుగా గరిష్టస్థాయి వద్ద ఉన్న సిలిండర్ ధర రూ.1,103 నుంచి రూ.903కు దిగివచి్చంది. శుక్రవారం నాటి తగ్గింపుతో వినియోగదారులకు ఇంకాస్త ఉపశమనం లభించింది. ఉజ్వల లబ్ధిదారులకు రూ.503కే : దేశవ్యాప్తంగా అందరూ సబ్సిడీయేతర ధరకే వంటగ్యాస్ను కొనుగోలుచేస్తున్నారు. అయితే ‘‘ ప్రధాన్మంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత కనెక్షన్ పొందిన గ్రామీణ ప్రాంత పేదలకు మాత్రమే ఒక్కో సిలిండర్పై రాయితీ రూ.300 వారి బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్నాయి. తాజా తగ్గింపుతో వారు రూ.503కే సిలిండర్ పొందొచ్చు’’ అని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టంచేశారు. గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్న గ్యాస్ ధరలు ఎన్నికల్లో ప్రధానాంశంగా మారాయి. 2021 జూలై– 2023 ఆగస్ట్ మధ్య సిలిండర్ ధర ఏకంగా రూ.294 పెరిగింది. దేశవ్యాప్తంగా ఎల్పీజీ వినియోగదారులు 33 కోట్లకుపైగా ఉన్నారు. ఉజ్వల పథకం లబి్ధదారులు దాదాపు 10 కోట్ల మంది ఉంటారు. ధర తగ్గింపుతో దేశంలోని రిటైల్ చమురు రంగ సంస్థలకు రూ.వేల కోట్ల అదనపు భారం పడొచ్చని అంచనా. -
లేటెస్ట్ ఫ్లిప్ ఫోన్.. అప్పుడు కొనలేకపోయారా? ఇప్పుడు కొనేయండి!
మార్కెట్లోకి రకరకాల లేటెస్ట్ స్మార్ట్ఫోన్లు వస్తూ ఉన్నాయి. ప్రత్యేకమైన సరికొత్త ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే లాంచ్ అయినప్పుడు వాటి ధర ఎక్కువగా ఉంటుంది. దీంతో కొంతమంది వాటిని కొనలేకపోయామే అని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం కంపెనీలు కొన్ని నెలల తర్వాత ఆ ఫోన్ల ధరలను తగ్గిస్తుంటాయి. మోటరోలా రేజర్ 40 (Moto Razr 40), మోటరోలా రేజర్ 40 అల్ట్రా (Moto Razr 40 Ultra) ఫ్లిప్ ఫోన్లు గతేడాది జూన్లో విడుదలయ్యాయి. 2000ల ప్రారంభం నాటి ఐకానిక్ Motorola Razr ఫ్లిప్ ఫోన్లను పునరుద్ధరిస్తూ లేటెస్ట్ ఫీచర్లతో కంపెనీ వీటిని తీసుకొచ్చింది. ప్రస్తుతం వీటి ధరలను మోటరోలా భారీగా తగ్గించింది. అధిక ధరల కారణంగా అప్పుడు కొనలేకపోయినవారు ఇప్పుడు కొనవచ్చు. రూ.20,000 తగ్గింపు మోటరోలా భారత్లో తన మోటో రేజర్ 40, మోటో రేజర్ 40 అల్ట్రా ఫ్లిప్ ఫోన్లకు గణనీయమైన ధర తగ్గింపును ప్రకటించింది. మోటో రేజర్ 40 ధరను రూ. 15,000 తగ్గించింది. దీని అసలు ధర రూ. 59,999 కాగా ఇప్పడు రూ. 44,999కి తగ్గింది. అదేవిధంగా మోటో రేజర్ 40 అల్ట్రా ధరను ఏకంగా రూ. 20,000 తగ్గించింది. రూ. 89,999 ఉన్న ఈ ఫోన్ను రూ. 69,999కే కొనుక్కోవచ్చు. మోటరోలా అధికారిక వెబ్సైట్తోపాటు అమెజాన్లోనూ ఇవి అందుబాటులో ఉన్నాయి. మోటో రేజర్ 40 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు 144 Hz రిఫ్రెష్ రేట్, 1080×2640 పిక్సెల్ల రిజల్యూషన్తో 6.90-అంగుళాల ప్రైమరీ డిస్ప్లే, 1.50-అంగుళాల సెకండరీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 ద్వారా ఆధారితం 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్. ఇందులో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13-మెగాపిక్సెల్ కెమెరా, 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అజూర్ గ్రే, చెర్రీ పౌడర్, బ్రైట్ మూన్ వైట్ రంగులలో లభ్యం 4200 mAh బ్యాటరీ, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ మోటో రేజర్ 40 అల్ట్రా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు 1080×2640 పిక్సెల్స్ రిజల్యూషన్, 165 Hz రిఫ్రెష్ రేట్తో 6.9-అంగుళాల ప్రైమరీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 ద్వారా ఆధారితం 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 12-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇన్ఫినిట్ బ్లాక్, వివా మెజెంటా రంగులలో లభ్యం వైర్లెస్, వైర్డు ఛార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేసే 3800mAh బ్యాటరీ -
గుడ్న్యూస్.. వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
కమర్షియల్ వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. అంతర్జాతీయ ధరల పరిస్థితుల్లో సానుకూలతల నేపథ్యంలో దేశంలో చమురు సంస్థలు వాణిజ్య వంటగ్యాస్ ధరను కాస్త తగ్గించాయి. వాణిజ్య వంటగ్యాస్ (LPG) 19 కిలోల సిలిండర్ ధర శుక్రవారం రూ.39.50 తగ్గింది. కమర్షియల్ వంట గ్యాస్ ధర తగ్గింపుతో హోటళ్లు, రెస్టారెంట్లతోపాటు వీటిని వినియోగించే అనేక వర్గాలకు ఉపశమనం కలిగింది. ధర తగ్గింపు అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 1,757 ఉంది. అంతకుముందు రూ. 1,796.50 ఉండేది. ఈ మేరకు చమురు సంస్థలు నోటిఫికేషన్లో తెలిపాయి. ఇదీ చదవండి: Gold Price Today: పెరిగిన బంగారం, వెండి ధరలు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు చివరిసారిగా డిసెంబర్ 1న వాణిజ్య ఎల్పీజీ ధరను రూ.21 పెంచాయి. కమర్షియల్ వంట గ్యాస్ 19 కిలోల సిలిండర్ ధర ప్రస్తుతం ముంబైలో రూ. 1,710, కోల్కతాలో రూ. 1,868.50, చెన్నైలో రూ. 1,929 లుగా ఉంది. స్థానిక పన్నుల ఆధారంగా వీటి ధరలు రాష్ట్రానికి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. కాగా గృహావసరాలకు వినియోగించే వంట గ్యాస్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. డొమెస్టిక్ ఎల్పీజీ 14.2 కిలోల సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 903 ఉంది. -
పిజ్జా ప్రియులకు శుభవార్త.. సగానికి తగ్గిన ధరలు - కారణం ఇదే!
ఆధునిక కాలంలో పిజ్జాలకు ఎంత డిమాండ్ ఉందో అందరికి తెలుసు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ పిజ్జా బ్రాండ్ డొమినోస్ (Domino’s) విపరీతమైన ధరలకు విక్రయిస్తోంది. కాగా తాజాగా కంపెనీ ధరలను దాదాపు 50 శాతం వరకు తగ్గించినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి భారతదేశంలోని క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (QSR) మాత్రమే కాకుండా టాసిన్, గోపిజ్జా, లియోస్ పిజ్జేరియా, మోజోపిజ్జా, ఓవెన్స్టోరీ, లా పినోజ్ వంటి సంస్థలు పుట్టుకురావడం, తక్కువ ధరలకే పిజ్జాలను అందించడంతో క్రమంగా డొమినోస్ ఆదరణ తగ్గుముఖం పట్టింది. కానీ పోటీ ప్రపంచంలో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి డొమినోస్ సన్నద్ధమైంది. ఇందులో భాగంగానే ధరలను తగ్గించడం జరిగింది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, మారుతున్న వినియోగదారుల అవసరాలను తీర్చడానికి డొమినోస్ కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే వెజిటేరియన్ లార్జ్ పిజ్జా ధరలను రూ. 799 నుంచి రూ. 499కి తగ్గించింది. అదే సమయంలో లార్జ్ నాన్వెజ్ పిజ్జా ధరలను రూ. 919 నుంచి రూ. 549కి దగ్గించింది. ఇదీ చదవండి: మొబైల్ బ్యాంకింగ్ కొత్త యాప్.. రూ.5 లక్షల వరకు లోన్! తక్కువ చెల్లించి ఎక్కువ పిజ్జా పొందండి అంటూ కంపెనీ పిజ్జా ప్రియులకు శుభవార్త చెప్పింది. భారతదేశంలో 1800కి పైగా డొమినోస్ పిజ్జా కేంద్రాలు ఉన్నాయి. వీటన్నింటిని డొమినోస్ మాతృ సంస్థ 'జూబిలెంట్ ఫుడ్వర్క్స్' నిర్వహిస్తోంది. ఈ కంపెనీ డొమినోస్ కంపెనీతో పాటు డంకిన్ రెస్టారెంట్లను, పాప్ఐస్ ఔట్ లెట్లను నిర్వహిస్తోంది. భారతదేశంలో కేవలం డొమినోస్ మాత్రమే కాకుండా, పిజ్జా హట్, మెక్ డొనాల్డ్స్ వంటి కంపెనీలు తమ అమ్మకాలను పెంచుకోవడానికి, కస్టమర్లను ఆకర్షించడానికి ధరలను తగ్గించనున్నాయి. కాగా దేశీయ మార్కెట్లో పిజ్జా చైన్స్ కూడా ఎక్కువ కావడంతో కస్టమర్లు తక్కువ ధరకు పిజ్జా అందించే సంస్థల నుంచే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మొత్తానికి చిన్న సంస్థల దెబ్బకు డొమినోస్ దిగి వచ్చినట్లు స్పష్టమవుతోంది. -
మరో గుడ్ న్యూస్: భారీగా తగ్గిన గ్యాస్ ధర
Commercial LPG cylinder price cut కమర్షియల్ సిలిండర్ ధరలను తగ్గించిన కేంద్రం ఇప్పుడు మరో శుభవార్త అందించింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు)కీలక నిర్ణయం తీసుకున్నాయి. కేంద్రం వంటగ్యాస్ డొమెస్టిక్ సిలిండర్ల ధరలను భారీగా తగ్గించిన నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్లను తగ్గించాయి.కొత్త ధరలు నేటి నుండి అమలులో ఉంటాయి. (పాక్ ఆర్థిక సంక్షోభం: రూ. 300 దాటేసిన పెట్రోలు) అనేక రాష్ట్రాల్లో 19 కిలోల కమర్షియల్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధరను సుమారు రూ.158 తగ్గించాయి. తాజా తగ్గింపుతో ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ రిటైల్ విక్రయ ధర రూ. 1,522.50 అవుతుంది. అదే విధంగా ముంబైలో గతంలో రూ.1640.50 ఉండగా ఇప్పుడు రూ.1482గా ఉందినుంది. అలాగే చెన్నైలో రూ.1852.50కి బదులుగా రూ.1695కే అందించనున్నారు. వాణిజ్య, గృహ LPG (ద్రవీకృత పెట్రోలియం గ్యాస్) సిలిండర్ల ధరలను ప్రతి నెల మొదటి రోజున సమీక్షిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలైలో 7 రూపాయలు పెరిగిన వాణిజ్య LPG సిలిండర్ల ధర ఆగస్టులో రూ. 99.75 మేర తగ్గిన సంగతి తెలిసిందే. ( LPG Price Cut: మహిళలకు రూ. వేల కోట్ల రక్షాబంధన్ గిఫ్ట్) కాగా రక్షా బంధన్ సందర్భంగా, దేశంలోని మహిళలకు బహుమతిగా కేంద్ర ప్రభుత్వం దేశీయ ఎల్పిజి ధరను రూ.200 తగ్గించింది. అలాగే ఉజ్వల స్కీమ్ కింద అందించే రూ.200 సబ్సిడీకి అదనంగా రూ.200తో మొత్తంగా రూ. 400 తక్కువకే సిలిండర్ లభిస్తోంది. -
ఈ-స్కూటర్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకో ఆఫర్
Bajaj Chetak Electric Scooter Price Cut: దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో టూవీలర్ దిగ్గజం బజాజ్ ఆటో కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల సెగ్మెంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈక్రమంలో ఈ ఏడాది మార్చిలో బజాజ్ ఆటో రెండు వేరియంట్లలో అప్డేట్ చేసిన 2023 చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రకటించింది. తాజాగా తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. చేతక్ఈవీ ధరలను తగ్గించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. బేస్ చేతక్ ధర రూ.1.22 లక్షలు కాగా, ప్రీమియం వేరియంట్ ధర రూ.1.52 లక్షలు. అయితే ఇప్పుడు, బేస్ వేరియంట్ నిలిపి వేసింది. అలాగే ప్రీమియం వేరియంట్ ధర రూ. 22 వేల తగ్గింపును అందిస్తోంది. దీని ప్రకారం రూ. 1.3 లక్షల (ఎక్స్-షోరూమ్)గా ఉండనుంది. అయితే ఈ ఆఫర్ ఎప్పటివరకు అందుబాటులో ఉంటుందనే వివరాలు అందుబాటులో లేవు. (టెక్ దిగ్గజం ఇంటెల్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్) బజాజ్ చేతక్ ఇ-స్కూటర్ ఫీచర్లు చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రష్లెస్ DC మోటార్తో ఆధారితంగా 60.3Ah కెపాసిటీ కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీతో. ఇది 4.08 kW గరిష్ట శక్తిని16 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. బ్యాటరీని 5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. దీన్ని కేవలం ఒక గంటలో 25 శాతం ఛార్జ్ చేయవచ్చు. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎల్ఈడీ లైటింగ్, ఆల్-కలర్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, యాప్ ఆధారిత నోటిఫికేషన్లు, స్మార్ట్ఫోన్ కనెక్టివిటీని పొందుతుంది. హార్డ్వేర్ పరంగా, ఇది సింగిల్-సైడ్ ఫ్రంట్ సస్పెన్షన్, రియర్ మోనోషాక్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ,రియర్ డ్రమ్ బ్రేక్స్ లాంటివి ఉన్నాయి.2023 బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రీమియమ్ ఎడిషన్ వెర్షన్ మూడు రంగులలో లభిస్తుంది. (వరుసగా నాలుగో వారం క్షీణించిన బంగారం ధర..కానీ!) -
ప్యాకెట్ సైజ్ పెంచి ధరలు తగ్గించి.. వృద్ధిపై ఎఫ్ఎంసీజీ పరిశ్రమ ఆశలు
న్యూఢిల్లీ: పరిస్థితులు తిరిగి గాడిన పడుతుండడంతో ఎఫ్ఎంసీజీ పరిశ్రమ వృద్ధి పట్ల ఆశావహ అంచనాలతో ఉంది. ప్రకటనలు, మార్కెటింగ్పై వ్యయాలను పెంచడంతోపాటు, పెట్టుబడులను కూడా ఇతోధికం చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కొన్ని త్రైమాసికాల విరామం తర్వాత అవి తిరిగి అమ్మకాల్లో వృద్ధిని చూస్తున్నాయి. ద్రవ్యోల్బణం, ముడి సరకుల ధరలు తగ్గడం వాటికి అనుకూలిస్తోంది. దీంతో ప్యాకెట్లలో గ్రాములు పెంచడం, ధరల తగ్గింపు వంటి నిర్ణయాలతో వినియోగదారులను ఆకర్షించే చర్యలు తీసుకుంటున్నాయి. మార్చి త్రైమాసికంలో ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీల పనితీరును పరిశీలిస్తే.. హిందుస్తాన్ యూనిలీవర్, డాబర్, మారికో, గోద్రేజ్ కన్జ్యూమర్, ఐటీసీ, టాటా కన్జ్యూమర్, నెస్లే అమ్మకాల్లో వృద్ధిని నమోదు చేశాయి. 2023–24లో ఎఫ్ఎంసీజీ వినియోగం క్రమంగా పుంజుకుంటుందన్న అంచనాను వ్యక్తం చేశాయి. ‘‘స్థిరమైన వృద్ధి అవకాశాలు బలపడ్డాయి. ఐదు త్రైమాసికాలుగా విక్రయాల్లో క్షీణత అనంతరం ఈ రంగం అమ్మకాల్లో వృద్ధిని చూసింది. పట్టణ వినియోగం స్థిరంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ క్షీణత ముగిసినట్టేనని సంకేతాలు కనిపిస్తున్నాయి’’అని మారికో ఎండీ, సీఈవో సౌగతగుప్తా తెలిపారు. ముఖ్యంగా ఆహార ఉత్పత్తులు ఎఫ్ఎంసీజీ వృద్ధిని నడిపిస్తున్నాయని చెప్పుకోవాలి. హోమ్, పర్సనల్ కేర్ ఉత్పత్తుల అమ్మకాలు కూడా సానుకూల శ్రేణిలోకి వచ్చేశాయి. సఫోలా, పారాచ్యూట్ తదితర ప్రముఖ బాండ్లతో ఉత్పత్తులను విక్రయించే మారికో లాభం మార్చి త్రైమాసికంలో 19 శాతం పెరిగి రూ.305 కోట్లుగా ఉండడం గమనార్హం. అమ్మకాలు 4 శాతం పెరిగాయి. మందగమనం ముగిసినట్టే.. ‘‘ఎఫ్ఎంసీజీ మార్కెట్లో మందగమనం ముగిసింది. అమ్మకాలతో మెరుగైన వాతావ రణం నెలకొంది. డిసెంబర్ క్వార్టర్లో సింగిల్ డిజిట్ క్షీణత ఉంటే, మార్చి త్రైమాసికంలో ఫ్లాట్గా విక్రయాలు ఉన్నాయి’’అని హెచ్యూఎల్ సీఎఫ్వో రితేష్ తివారీ తెలిపారు. ఇప్పటికీ ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలోనే ఉన్నందున అమ్మకాలు క్రమంగా పుంజుకుంటాయని అంచనా వేస్తున్నట్టు చెప్పా రు. మార్చి త్రైమాసికంలో హెచ్యూఎల్ నికర అమ్మకాలు 11 శాతం పెరిగితే, నిరక లాభం సైతం 13 శాతం మేర పెరిగింది. అంతర్జాతీయంగా మందగమనం, ఎల్నినో కారణంగా వర్షాలపై నెలకొన్న అనిశ్చితులతో సమీప కాలంలో నిర్వహణ వాతావరణం ఆటుపోట్లను ఎదుర్కోవచ్చని హెచ్యూఎల్ భావిస్తోంది. 2023–24 సంవత్సరంలో ఎఫ్ఎంసీజీ పరిశ్రమ భవిష్యత్ సానుకూలంగా ఉంటుందని, అమ్మకాలతోపాటు మార్జిన్లలోనూ మెరుగుదల ఉంటుందని నువమా గ్రూప్ ఈడీ అబ్నీష్రాయ్ అంచనా వేశారు. ‘‘ముడి సరుకుల ధరలు తగ్గాయి. దీంతో కంపెనీలు క్రమంగా ధరలను తగ్గించొచ్చు. లేదంటే గ్రాములను పెంచొచ్చు. అమ్మకాలు పెరిగితే ధరలపై ఒత్తిడి తగ్గుతుంది’’అని రాయ్ చెప్పారు. అయితే, ఎల్నినో, ఎఫ్ఎంసీజీ విభాగంలో పెద్ద సంస్థగా అవతరించాలని రిలయన్స్ లక్ష్యం విధించుకోవడం వంటి సవాళ్లు ఉన్నట్టు పేర్కొన్నారు. మరోవైపు గోద్రేజ్ కన్జ్యూమర్ మార్చి త్రైమాసికంలో అమ్మకాల్లో 11 శాతం వృద్ధిని చూసింది. ప్రస్తుత సానుకూల వాతావర ణం మరింత బలపడుతుందని, అమ్మకాల్లో వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నట్టు గోద్రేజ్ కన్జ్యూమర్ ఎండీ, సీఈవో సుధీర్ సీతాపతి తెలిపారు. ఇదీ చదవండి: బ్లాక్స్టోన్ చేతికి ఐజీఐ.. బెల్జియం డైమెండ్స్ సర్టిఫికేషన్ సంస్థ -
బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్: కీవే బైక్స్పై భారీ ఆఫర్
సాక్షి, ముంబై: కొత్త బైక్ కొనుగోలు చేయాలనుకుంటున్నారు. అయితే మీకో చక్కటి అవకాశం. కీవే ఇండియా కంపెనీ తన లేటెస్ట్ 300 సీసీ బై బైక్స్ ధరలను భారీగా తగ్గించింది. కే300 ఎన్, కే 300 ఆర్ మోడళ్లపై భారీ తగ్గింపు ఆఫర్ ప్రకటించింది. (మహీంద్రా అండ్ మహీంద్రా మాజీ చైర్మన్ కేషుబ్ మహీంద్రా కన్నుమూత) కంపెనీ తాజా నిర్ణయంతో నేక్డ్ స్ట్రీట్ వెర్షన్ బైక్ కే 300 ఎన్ ధర రూ. 2.65 లక్షల -రూ. 2.85 లక్షల దాకా ఉంది. ఈ మోడల్పై ఇపుడు 33వేల రూపాయల దాకా తగ్గింపు లభిస్తోంది. అలాగే రూ. 2.99 లక్షల నుంచి రూ. 3.2 లక్షల ధర పలికే కే 300 ఆర్ ధర ఇపుడు రూ. 55 వేలు దిగి వచ్చింది. అంటే దీన్ని రూ. 2.65 లక్షలకే కొనుగోలు చేయవచ్చు. కే 300 ఎన్, కే 300 ఆర్ అనే బైక్స్ రెండూ కూడా ఒక ప్లాట్ఫామ్పై తయారైనవే. వీటిల్లో 292 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది హెచ్పీ 27.5. అలాగే టార్క్ 25 ఎన్ఎం ను అందిస్తాయి. బైక్ ముందు, వెనుక డిస్క్ బ్రేకులు, అలాగే డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్,డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, LED లైట్లు , 2 రైడింగ్ మోడ్లు(ఎకో & స్పోర్ట్)హైలైట్ ఫీచర్లుగా చెప్పుకోవచ్చు. ఈ ధరలు 6 ఏప్రిల్ 2023 నుండి అమల్లోకి రాగా రెండు మోడల్లలోని మొత్తం 3 కలర్ ఆఫర్లలో ప్రామాణికంగా ఉంటాయి. -
వంట గ్యాస్ వినియోగదారులకు ఊరట.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర!
గ్యాస్ ధరలపై కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. 2023-2024 ఆర్థిక సంవత్సరం మొదటి రోజునే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించింది. ఏప్రిల్ 1న వంట గ్యాస్ ధరలు దాదాపు రూ.92 తగ్గించింది. అయితే రేట్ల తగ్గింపు కేవలం వాణిజ్య గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మాత్రమే. గృహోపయోగానికి వినియోగించే డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి తగ్గింపు లేదు. 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలను ప్రభుత్వం గత నెలలోనే రూ.50 పెంచిన విషయం తెలిసిందే. అలాగే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను రూ.350 పెంచింది. (Jio offer: జియో అన్లిమిటెడ్ డేటా ఆఫర్.. కొత్త కస్టమర్లకు ఉచిత ట్రయల్!) సాధారణంగా కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజున పెట్రోలియం కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ల ధరలను సవరిస్తుంటాయి. డాలర్తో రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ బెంచ్మార్క్ రేటు భారతదేశంలో ఎల్పీజీ సిలిండర్ ధరలను ప్రభావితం చేసే రెండు కీలక అంశాలు. సవరించిన తర్వాత 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర ఢిల్లీలో రూ.2,028, కోల్కతాలో రూ.2,132, ముంబైలో రూ.1,980, చెన్నైలో రూ.2192.50 చొప్పున ఉంది. కాగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం గృహ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీని ప్రకటించింది. ఈ పథకం కింద 9.59 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రతి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్పైనా రూ.200 సబ్సిడీ అందిస్తున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ గత నెలలో ప్రకటించారు. డొమెస్టిక్ సిలిండర్లు ఏడాదికి 12 మాత్రమే వినియోగించకునేలా కేంద్ర ప్రభుత్వం పరిమితిని విధించింది. -
వినియోగదారులకు శుభవార్త: దిగిరానున్న వంట గ్యాస్ ధర
సాక్షి, ముంబై: మరికొన్ని రోజుట్లో వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త అందనుంది. దేశంలోని సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేలా గ్యాస్ ధరపై కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఊహాగానాలు వెలుడుతున్నాయి. దీనికి తోడు తగ్గుతున్న చమురు ధరలు ఈ అంచనాలకు ఊతమిస్తున్నాయి. (షాకింగ్: 5.4 మిలియన్ల ట్విటర్ యూజర్ల డేటా లీక్! మస్క్ స్పందన ఏంటి?) వంట గ్యాస్ను చౌకగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ముఖ్యంగా సీఎన్జీ, ఎల్పీసీ గ్యాస్ రెండింటి ధరలను తగ్గించే అవకాశం ఉందని అంచనా. గత కొంత కాలంగా కోవిడ్ మహమ్మారి, ఇటీవలి భౌగోళిక రాజకీయ సంక్షోభం గ్యాస్ ధర పెరగడంతో ప్రజలపై భారం పడుతోంది. ఈ నేపథ్యంలో గ్యాస్ ధరల నియంత్రణకు సెప్టెంబరులో ఏర్పాటైన కమిటీ ఒక ప్రణాళికను రూపొందిస్తోంది. దీని కింద ప్రభుత్వ రంగ సంస్థల పాత సెక్టార్ నుంచి వచ్చే సహజ వాయువు ధర పరిమితిని నిర్ణయించాలని ప్లాన్ చేస్తోంది. ఇది గ్యాస్ కోసం సిఫార్సు చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు కిరీట్ ఎస్ పరేఖ్ నేతృత్వంలోని కమిటీ నవంబర్ 29న ప్యానెల్ సభ్యులు తమ సిఫార్సులను సమర్పించనున్నారు. ఈ అంచనాలు నిజమైతే సామాన్య ప్రజలకు ఎంతో ఊరట లభిస్తుంది. (ఉద్యోగులను భారీగా పెంచుకోనున్న కంపెనీ) కాగా ప్రతి నెల మొదటి తేదీన చమురు కంపెనీలు ధరలను సమీక్షించడం తెలిసిన సంగతే. గత నెలలో కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు తగ్గించిన సంగతి తెలిసిందే. -
వన్ప్లస్ ప్రీమియం స్మార్ట్ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదే లక్కీ చాన్స్!
సాక్షి,ముంబై: ప్రీమియం స్మార్ట్ఫోన్ తయారీదారు వన్ప్లస్కుచెందిన స్మార్ట్ఫోన్ డిస్కౌంట్ ధరలో లభ్యమవుతోంది. త్వరలోనే ఈ సిరీస్లో కొత్త ఫోన్ లాంచ్ కానున్న నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో తీసుకొచ్చిన ఫ్లాగ్షిప్ ఫోన్ వన్ప్లస్ 10 ప్రో ఇండియాలో 5 వేల రూపాయల తగ్గింపుతో అందిస్తోంది. వన్ప్లస్ 10 ప్రో 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఇండియా లాంచింగ్ ప్రైస్ రూ. 66,999. కాగా ప్రస్తుతం 5,000 ధర తగ్గింపుతో రూ. 61,999లకే కొనుగోలు చేయవచ్చు. అలాగే 12 జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 66,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. గ్రీన్, బ్లాక్ కలర్స్లో ఇది లభ్యం. దీంతోపాటు వన్ప్లస్ 10 ప్రో బేస్ వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో రూ. 60,999 కే లభిస్తోంది. వన్ప్లస్ 10 ప్రో స్పెసిఫికేషన్లు 6.7 అంగుళాల QHD+ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 48+ 50+8 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 5,000mAh బ్యాటరీ మరోవైపు వన్ప్లస్ 10కి కొనసాగింపుగా వన్ప్లస్ 11 స్నాప్డ్రాగన్ 8 Gen 2 SoCతో వచ్చే ఏడాది తొలి క్వార్టర్లో చైనాలో లాంచ్ కానుందని అంచనా. -
సామాన్యులకు శుభవార్త.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
వాహనదారులకు శుభవార్త. దేశంలో చాలా రోజుల తర్వాత ఇంధన ధరలు తగ్గాయి. లీటర్ పెట్రోల్, డీజిల్పై 40 పైసలు తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. మంగళవారం ఉదయం నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. న్యూఢిల్లీలో సోమవారం పెట్రోల్ ధర రూ.96.72గా ఉండగా, ముంబైలో రూ.106.31గా ఉంది. కోల్కతాలో రూ.106.03, చెన్నైలో రూ.102.63, హైదరాబాద్లో రూ.109.66గా ఉంది. మంగళవారం నుంచి ఈ ధరలపై 40 పైసలు త్గగింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గి చాలా రోజులుగా స్థరంగా కొనసాగుతుండటంతో చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తున్నాయి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ బ్యారెల్ ధర 95 డాలర్లకు దిగువన ఉంది. ఆరు నెలల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఇదే తొలిసారి. ఈ ఏడాదిలో చివరిసారిగా ఏప్రిల్ 7 ఇంధన ధరలను తగ్గించారు. అలాగే ఆర్థికవ్యవస్థ పుంజుకోవడంతో అక్టోబర్ తొలి అర్ధభాగంలో ఇంధన విక్రయాలు భారీగా పెరిగి కరోనా ముందు స్థితికి చేరుకున్నాయి. పండుగ సీజన్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు భారీ వృద్ధి నమోదు చేశాయి. దీంతో ధరలు తగ్గించాలని చమురు సంస్థలు నిర్ణయించాయి. ప్రస్తుతం లీటర్పై 40 పైసలే తగ్గించినప్పటికీ.. రానున్న రోజుల్లో రూ.2వరకు తగ్గే అవకాశమున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఎయిర్టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే! -
సామాన్యులకు శుభవార్త, భారీగా తగ్గిన వంట నూనెల ధరలు
వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టాయి. మార్చిలో ఉక్రెయిన్పై రష్యా దా డుల కారణంగా మన దేశానికి ఉక్రెయిన్ నుంచి దిగుమతులు తగ్గిపోయాయి. ఈ కారణంగా వంట నూనెల ధరలు గణనీయంగా పెరి గాయి. సామాన్య ప్రజలు ఆర్థికంగా ఇ బ్బందులు పడ్డారు. పల్లి, సన్ఫ్లవర్, పామాయిల్ నూనెలను వంటలో ఎక్కువగా వినియోగిస్తారు. ఈ నూనె గింజల ఉత్పత్తి మన దేశంలో తక్కువగా ఉండటంతో పొరుగు దేశాల నుంచి దిగుమతి అవుతుంది. దిగుమతులు తగ్గడంతో ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తు తం నెల రోజుల వ్యవధిలోనే ధరలు భారీగా తగ్గడంతో సామాన్యులపై భారం తప్పింది. గతంలో సన్ఫ్లవర్ నూనె లీటర్కు రూ.210గా ఉండగా, ఇప్పుడు రూ.150కి చేరింది. పల్లి నూనె లీటర్కు రూ.220 పలుకగా రూ.165కి తగ్గింది. పామాయిల్ ధర లీటర్కు రూ.150 నుంచి రూ.95కు తగ్గింది. పామాయిల్న్ గతంలో పౌర సరఫరాల శాఖ ద్వారా రేషన్ దుకాణా ల్లో తక్కువ ధరకు విక్రయించేవారు. సబ్సిడీ భారం తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఈ నూనె సరఫరాను నిలిపివేసింది. ప్రస్తుతం నూనె ధరలు రూ.55 నుంచి రూ.60 వరకు తగ్గడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ధరలు మళ్లీ పెరగకుండా చూడాలని కోరుతున్నారు. చదవండి👉 చమురు ఉత్పత్తికి ఒపెక్ కోత, దేశంలో మళ్లీ పెట్రో ధరల మంట? -
గుడ్ న్యూస్.. 70 శాతం వరకూ తగ్గనున్న ఔషధాల ధరలు!
న్యూఢిల్లీ: రోగులకు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుక ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. కీలకమైన ఔషధాల ధరలను తగ్గించనున్నట్లు సమాచారం. ప్రధానంగా క్యాన్సర్, డయాబెటిస్, కార్డియోవాస్క్యులర్ వ్యాధులకు సంబంధించిన మందుల ధరల తగ్గనున్నాయి. దీనివల్ల రోగులకు భారీ ఉపశమనం లభించనుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ, ప్రకటనపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. మందుల ధరలను నియంత్రించాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. అంతా అకున్నట్లు జరిగితే వాటి ధరలు 70 శాతం వరకు తగ్గిపోతాయని అధికారులు వెల్లడించారు. నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియనల్ మెడిసిన్(ఎన్ఎల్ఈఎం)–2015ను సవరించడంపై కేంద్రం దృష్టి పెట్టింది. రోగులు దీర్ఘకాలం ఉపయోగించే ఔషధాలపై హై–ట్రేడ్ మార్జిన్లపై పరిమితి విధించాలని యోచిస్తోంది. ఈ మేరకు పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు కూడా నిర్వహించింది. ఎన్ఎల్ఈఎంలో ఉన్న 355 మందుల ధరలపై నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ(ఎన్పీపీఏ) ఇప్పటికే పరిమితి విధించింది. కొన్ని రకాల షెడ్యూల్డ్ మెడిసిన్లపై ట్రేడ్ మార్జిన్ను హోల్సేల్ వ్యాపారులకు 8 శాతం, రిటైలర్లపై 16 శాతానికి పరిమితం చేసింది. ఇలాంటి మందుల తయారీదార్లు సీలింగ్ ప్రైస్ కంటే తక్కువ ధరకే విక్రయించాల్సి ఉంటుంది. మిగతా మందుల విషయంలో ఇలాంటి నియంత్రణలు ఏవీ లేవు. కంపెనీలు ఇష్టమొచ్చిన ధరలకు అమ్ముకోవచ్చు. ధరలను కంపెనీలే నిర్ధారించుకోవచ్చు. ధరల నియంత్రణ పరిధిలో లేని ఔషధాలపై ట్రేడ్ మార్జిన్లు ఎన్నో రెట్లు అధికంగా ఉంటున్నాయి. ఫలితంగా ఆ భారమంతా అంతిమంగా రోగులే భరించాల్సి వస్తోంది. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. కీలక ఔషధాలను నియంత్రణ పరిధిలోకి తీసుకొస్తే వాటి ధరలు చాలావరకు తగ్గిపోతాయి. ఇదీ చదవండి: Ukraine Students: ‘మా పిల్లల భవిష్యత్తుకు కేంద్రమే భరోసా కల్పించాలి’ -
విమానయాన సంస్థలకు భారీ ఊరట
సాక్షి,ముంబై: విమానయాన సంస్థలకు భారీ ఊరట లభించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగి వస్తున్న నేపథ్యంలో జెట్ ఇంధనం (ATF) ధరలు 2.2 శాతం దిగి వచ్చింది. ఈ మేరకు దేశీయ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు శనివారం ఒక నోటిఫికేషన్ విడుదల చేశాయి. ధరలు కిలోలీటర్కు రూ. 3,084.94 లేదా 2.2 శాతం తగ్గి, కిలోలీటర్కు రూ. 138,147.93గా ఉన్నాయని తెలిపాయి. ఈ ఏడాదిలో రేట్లు తగ్గించడం ఇది రెండోసారి మాత్రమే. గత నెలలో ధరలు కిలో లీటర్కు రూ. 141,232.87 (లీటర్కు రూ.141.23)కు ఉన్నాయి. స్థానిక పన్నులను బట్టి ధరలు కూడా రాష్ట్రానికి, రాష్ట్రానికి రేట్లో వ్యత్యాసం ఉంటుంది. బెంచ్మార్క్ అంతర్జాతీయ చమురు ధరల రేట్ల ఆధారంగా ప్రతి నెలా 1, 16వ తేదీల్లో సవరించబడతాయి. జూన్ 1 నాటి రివ్యూలో ధరలలో మార్పులేనప్పటికీ జూన్ 16 నాటి పెంపుతో విమాన ఇంధన ధరలు ఆల్ టైం హైకి చేరాయి. మొత్తంగా, సంవత్సరం ప్రారంభం నుండి 11 సార్లు రేట్లు సవరించగా, దీంతో ఆరు నెలల్లో ధరలు దాదాపు రెట్టింపయ్యాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం భయాల కారణంగా అంతర్జాతీయ చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్ల దిగువకు చేరాయి. ఇదిలా ఉండగా, ఏటీఎఫ్ ధరల సమస్యపై చర్చించేందుకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలతో సమావేశమయ్యేందుకు ఇండియన్ ఎయిర్లైన్ ఎగ్జిక్యూటివ్లు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. స్పైస్జెట్, గోఫస్ట్ ఇండిగో, విస్తారా ఇతర విమానయాన సంస్థలు ఐవోసీ, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఈ కమిటీలో ఉన్నాయి. -
భారీ ఊరట: వంట నూనె ధర తగ్గింపు, వెంటనే అమల్లోకి
సాక్షి, న్యూఢిల్లీ: వంటనూనెల ధరలను అదుపు చేసేందుకవసరమైన చర్యలు తీసుకుంటున్న కేంద్రం తాజాగా శుభవార్త అందించింది. వంట నూనెల రిటైల్ ధరను లీటరుకు రూ. 15 తగ్గించింది. సవరించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని సంబంధిత మంత్రిత్వశాఖ శుక్రవారం ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. ధర తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు తక్షణమే అందించాలని తయారీదారులు, రిఫైనరీలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీంతో సామాన్యులకు వంటింటి భారం నుంచి భారీ ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు దిగిరావడం, ఆయిల్ తయారీ కంపెనీలతో చర్చల నపథ్యంలో వంట నూనె ధరలు దిగి వచ్చాయి. కాగా వినియోగదారుల వ్యవహారాల శాఖ అందించిన సమాచారం ప్రకారం జూన్ 1 నుంచి దేశంలో ఆవ, పొద్దు తిరుగుడు, సోయాబీన్, పామాయిల్ రిటైల్ ధరలు 5-11 శాతం తగ్గాయి. -
శాంసంగ్ గెలాక్సీ 5జీ స్మార్ట్ఫోన్ ధర భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ఫోన్ భారీ తగ్గింపు ధరలో లభిస్తుంది. గత ఏడాది లాంచ్ చేసిన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ‘ఎం52 5జీ’ ధరను 10వేల రూపాయలు తగ్గించింది. రిలయన్స్ డిజిటల్ స్టోర్ నుండి కొనుగోలు చేసిన వినియోగదారులకు ఈ ఆఫర్ లభించనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ హై-ఎండ్ వేరియంట్ (8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్) ను రిలయన్స్ డిజిటల్ స్టోర్లో 21,999 రూపాయలకు అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 31,999. బ్లేజింగ్ బ్లాక్, ఐసీ బ్లూ కలర్ ఆప్షన్స్లో లభిస్తుంది. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 29,999గా ఉంటే ఇపుడు రిలయన్స్ డిజిటల్ ద్వారా రూ.20,999 లకే లభిస్తోంది. ఇదే వేరియంట్ ధర అమెజాన్లో రూ. 24,999 గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎం52 ఫీచర్లు 6.7 అంగుళాల పూర్తి హెచ్డీ సూపర్ AMOLED డిస్ప్లే 1080 x 2400 పిక్సెల్స్ రిజల్యూషన్ క్వాల్కం స్నాప్ డ్రాగన్ 778G SoC 64+12+ 5 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 mAh బ్యాటరీ , 25W ఫాస్ట్ ఛార్జింగ్ USB టైప్-C పోర్ట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ -
శుభవార్త! వంట నూనెల ధరలు తగ్గనున్నాయ్..
వంటనూనెల ధరలు తగ్గనున్నాయ్! అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టడంతో వంట నూనెల ప్రైస్ తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. లీటరుకు గరిష్టంగా రూ.15 వరకు ఈ తగ్గింపు ఉండవచ్చని చెబుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుదలతో సామాన్యులు బడ్జెట్ తలకిందులైపోయింది. మేలో వంట నూనెల కేటగిరిలో రికార్డు స్థాయిలో 13.26 శాతంగా ద్రవ్యోల్బణం నమోదు అయ్యింది. మనం వినియెగించే వంట నూనెలో సగానికి పైగా దిగుమతి చేసుకోవ్లాసి ఉంది. దీంతో కేంద్రం సైతం దిగుమతి సుంకాలు తగ్గించింది. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లలోనూ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా సన్ఫ్లవర్, సోయా, పామాయిల్ ధరలు తగ్గాయని ఇండియన్ వెజిటేబుల్ ప్రొడ్యుసర్స్ అసోసియేషన్ తెలిపింది. ఇప్పటికే తగ్గింపు హోల్సేల్ మార్కెట్లలో అమలకు చర్యలు మొదలయ్యాయని ఆయిల్ అసోసియేషన్ తెలిపింది. వారం పదిరోజుల్లో రిటైల్ మార్కెట్లో ఎంఆర్పీ ధరలు కూడా తగ్గుతాయంటూ హామీ ఇచ్చింది. ప్రస్తుత అంచనాల ప్రకారం పామాయిల్పై లీటరుకు రూ.7 నుంచి 8, సన్ఫ్లవర్ ఆయిల్పై రూ.10 నుంచి 15, సోయాబీన్పై రూ.5 వంతున ధరలు తగ్గే అవకాశం ఉంది. చదవండి: బంగారం వెండి, వంటనూనెల బేస్ దిగుమతి రేటు తగ్గింపు -
గుడ్న్యూస్: భారీగా తగ్గిన వ్యాక్సిన్ల ధర
వ్యాక్సిన్ తయారీ సంస్థలు శుభవార్త చెప్పాయి. కరోనాకి విరుగుడుగా పని చేసే వ్యాక్సిన్ల ధరలను భారీగా తగ్గించాయి. ఈ మేరకు ఈ వ్యాక్సిన్ల తయారీ సంస్థలు శనివారం వేర్వేరుగా ప్రకటించాయి. దీంతో దేశంలో తొలి, మలి వ్యాక్సిన్లుగా వచ్చిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. కరోనా ముప్పు తొలగిపోయిందనుకుంటున్న ప్రతీసారీ కొత్త వేరియంట్ తెరమీదకు వస్తోంది. ఒమిక్రాన్ ముచ్చట మరిచిపోయేలోగానే ఎక్స్ఈ వేరింట్ దాడి చేస్తోంది. దీంతో కరోనా వ్యాక్సిన్లు, బూస్టర్ డోసులు తప్పనిసరిగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు హాస్పటిల్స్కి కూడా తక్కువ ధరకే వ్యాక్సిన్లు సరఫరా చేస్తామని సీరమ్ ఇన్సిస్టిట్యూట్, భారత్ బయోటెక్ సంస్థలు ప్రకటించాయి. సీరమ్ ఇన్స్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర ఒక డోసు ఇంతకు ముందు రూ.600గా నిర్ణయించారు. కాగా ఈ ధరను రూ.225కి తగ్గించారు. ఇదే సమయంలో కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఒక డోసు ధర రూ.1,200 ఉండగా ఇప్పుడది రూ. 225కి మార్చారు. కరోనా కొత్త వేరియంట్ల నేపథ్యంలో 18 ఏళ్ల వయసుపైబడి సెకండ్ డోస్ తీసుకున్న 9 నెలల తర్వాత బూస్టర్ డోసు ముందు జాగ్రత్తగా వేసుకోవాలని కేంద్రం సూచిస్తోంది. -
హోండా బంపరాఫర్..! ఆ బైక్పై ఏకంగా రూ. 10 లక్షల తగ్గింపు..!
స్పోర్ట్స్ బైక్ ప్రియులకు ప్రముఖ టూవీలర్ దిగ్గజం హోండా బంపరాఫర్ను ప్రకటించింది. హోండా పోర్ట్ఫోలియోలోని ఫ్లాగ్షిప్ మోటార్సైకిల్ హోండా CBR1000RR-R ఫైర్బ్లేడ్ ధరలను గణనీయంగా తగ్గించింది. 2020లో హోండా CBR1000RR-R ఫైర్బ్లేడ్-2020 బైక్ను భారత్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. హోండా CBR1000RR-R ఫైర్బ్లేడ్ లాంచ్ ధర రూ. 32.68 (ఎక్స్-షోరూమ్ ధర) లక్షలుగా ఉంది. ప్రస్తుతం ఈ బైక్పై ప్రకటించిన తగ్గింపుతో ఇప్పుడు హోండా CBR1000RR-R ఫైర్బ్లేడ్ బైక్ రూ. 23.11 లక్షలకు రిటైల్ కానుంది. దాదాపు రూ. 10 లక్షల తగ్గింపును హోండా ప్రకటించింది. ధర తగ్గింపుపై హోండా ఎలాంటి ప్రకటన చేయలేదు. కంపెనీ అధికారిక బిగ్వింగ్ ఇండియా వెబ్సైట్లో హోండా CBR1000RR-R ఫైర్బ్లేడ్ బైక్ కొత్త ధరతో కన్పిస్తోంది. హోండా CBR1000RR-R ఫైర్బ్లేడ్ బైక్ రెండు కలర్ వేరియంట్లలో రానుంది. బ్లాక్, రెడ్ కలర్ వేరియంట్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. హోండా CBR1000RR-R ఫైర్బ్లేడ్ అత్యంత శక్తివంతమైన ఫైర్బ్లేడ్ బైక్ నిలుస్తోంది. ఈ బైక్లో 1000cc, లిక్విడ్-కూల్డ్, 4-స్ట్రోక్, DOHC, ఇన్లైన్-4 సిలిండర్ ఇంజన్ను అమర్చారు. హోండా CBR1000RR-R ఫైర్బ్లేడ్ 14,500 RPM వద్ద 214.5 hp గరిష్ట శక్తిని, 12,500 RPM వద్ద 113 Nm గరిష్ట టార్క్ను విడుదల చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో జత చేయబడింది. ఇది హోండాకు చెందిన సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC)ని కూడా పొందుతుంది. చదవండి: హల్చల్ చేస్తోన్న మారుతి సుజుకీ వ్యాగన్ఆర్ నయా మోడల్..! ధర ఎంతంటే..? -
ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్.. ధర తగ్గించిన అమెజాన్
Amazon.com: కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి కోవిడ్ 19 నిర్థారణ పరీక్షలు సర్వసాధారణంగా మారాయి. ముఖ్యంగా కొత్త ప్రదేశాలకు వెళ్లాలంటే ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరిగా మారింది. ఇండియాతో పాటు ప్రపంచ దేశాల్లో ఆర్టీపీసీఆర్ టెస్ట్నే ఎక్కువ మంది ప్రామాణికంగా తీసుకుంటున్నారు. దీంతో తమ వెబ్సైట్ ద్వారా అమ్ముతోన్న ఆర్టీపీఆర్ టెస్ట్ కిట్ ధరను తగ్గిస్తున్నట్టు అమెజాన్ డాట్ కామ్ ప్రకటించింది. దీంతో ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్ ధర 3 డాలర్లు తగ్గి 36.99 డాలర్లకు చేరుకుంది. అమెజాన్ డాట్ కామ్ సైట్లో అందుబాటులో ఉన్న ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్కి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఉంది. ఇండియాలో ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లకు అనుమతి లేదు. కేవలం యాంటి జెన్ టెస్ట్ కిట్లకే అనుమతి ఉంది. ప్రస్తుతం అమెజాన్లో యాంటిజెన్ టెస్ట్ కిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ. 250 నుంచి 500ల వరకు ఉంది. చదవండి: Amazon own smart TV: అలెక్సాతో పనిచేసే టీవీ, ఫీచర్లు ఇలా ఉన్నాయ్! -
వరుసగా రెండో రోజు తగ్గిన డీజిల్ ధరలు
హైదరాబాద్: వరుసగా రెండో రోజు డీజిల్ ధరను తగ్గించాయి చమురు కంపెనీలు. లీటరు డీజిల్పై మరోసారి 20 పైసల వంతున ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పడిపోవడంతో డీజిల్ ధరలు తగ్గుతున్నాయి. డీజిల్ ధరలు తగ్గిస్తోన్న చమురు కంపెనీలు పెట్రోలు ధర తగ్గించకపోవడంపై ప్రజల్లో అంసంతృప్తి నెలకొంది. ధరల తగ్గింపుకు ముందు హైదరాబాద్లో లీటరు డీజిల్ ధర రూ.97.74 ఉండగా తాజా తగ్గింపుతో రూ.97.54గా ఉంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను ఒకేసారి 25 రూపాయలు పెంచుతూ డీజిల్ ధరలు కేవలం లీటరుకు 20 పైసల వంతున తగ్గించడంపై విమర్శలు వస్తున్నాయి. మొత్తంగా చూస్తే గత నెల రోజులుగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరగకుండా నిలకడగా ఉండటం వల్ల సామాన్యులకు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తోంది. -
ఇండిపెండెన్స్డే ఆఫర్లు... తగ్గిన రెడ్మీ ఫోన్ల ధరలు
స్వాతంత్ర దినోత్సవ కానుకగా షావోమీ తన మొబైల్ ఫోన్లపై ప్రత్యేక తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది. రీసెంట్గా మార్కెట్లో రిలీజైన మోడల్స్తో పాటు రన్నింగ్లో ఉన్న మొబైల్స్పై ఈ తగ్గింపును వర్తింప చేస్తోంది. ఈ మేరకు షావోమి తన ట్విట్టర్ పేజీ ద్వారా అధికారిక ప్రకటన జారీ చేసింది. ఎంఐ ఎక్స్ 11 5 జీ Xiaomi's Mi 11X 5G మొబైల్ ప్రస్తుతం మార్కెట్ ధర రూ.27,999లు ఉండగా ప్రత్యేక ఆఫర్ కింద రెండు వేలు తగ్గించారు. ఎంఐ 10టీ ప్రో 5జీ Xiaomi Mi 10T Pro ధర రూ. 39,999 ఉండగా ఇండిపెండెన్స్ డే ఆఫర్ కింద రూ. 36,999కి లభిస్తోంది. ఎంఐ 10ఐ Mi 10i మిడ్రేంజ్ సెగ్మెంట్లో ఎంఐ 10ఐ మొబైల్ని లాంచ్ చేసినప్పుడు ధర రూ.21,999 ఉండగా ఇప్పుడు రూ. 20,999కి తగ్గించింది. రెడ్మీ 9 Redmi 9 మొబైల్ ఫోన్ ధర రూ. 8,999 ఉండగా రూ. 1500 తగ్గింపు ప్రకటించింది. స్టార్ట్ టీవీపై కూడా స్వాతంత్ర దినోత్సవ తగ్గింపు ఆఫర్లను ఆగస్టు 5 నుంచి 9 వరకు షావోమీ అమలు చేస్తోంది. మొబైల్ ఫోన్లతో పాటు హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు ఉపయోగించి షావోమీ స్మార్ట్టీవీ కొనుగోలు చేస్తే గరిష్టంగా రూ. 7,500ల వరకు క్యాష్బ్యాక్ అమలు చేస్తోంది. దీంతో పాటు 20,000 ఎంఏహెచ్ పవర్బ్యాంక్పై రూ.500 తగ్గింపు అందిస్తోంది. Avail exciting offers on #MiSmartphones during the #BigSavingDays 📲 Up to ₹6,000 off on Exchange🤑 📲 Up to ₹2,500 Instant Discount and more Last day today! Shop now on @flipkart and save BIG! 😇 pic.twitter.com/ppREeLdcAD — Mi India (@XiaomiIndia) August 9, 2021 -
బజాజ్ డొమినర్పై బంపర్ ఆఫర్
ముంబై: బైక్ లవర్లకు శుభవార్త. స్పోర్ట్స్ బైక్స్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న బజాన్ డొమినర్ ధరలు తగ్గాయి. బజాజ్ ఆటో తన డొమినర్ 250 మోడళ్ల ధరలపై రూ.16,800 తగ్గిస్తున్నట్లు తెలిపింది. ధర తగ్గింపుతో ఈ మోడల్ ధర రూ.1.54 లక్షలకు దిగిరానుంది. ‘‘ఆటో కంపెలన్నీ వాహన ధరలను పెంచుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో డొమినార్ మోడళ్ల ధరలను తగ్గిస్తున్నాము. కస్టమర్లకు స్పోర్ట్స్, టూరింగ్ సదుపాయాలను మరింత చేరువ చేసేందుకు సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది’’ అని బజాజ్ ఆటో ప్రెసిడెంట్ సారంగ్ కనడే తెలిపారు. గతేడాది మార్చిలో విడుదలైన డొమినర్ 248.8 సీసీ పెట్రోల్ ఇంజిన్ను కలిగి ఉంది. స్పోర్ట్స్ బైక్ కేటగిరిలో డోమినర్ ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. ధర తగ్గింపుతో డొమినర్ అమ్మకాలు పుంజుకునే అవకాశం ఉంది. -
Samsung: కొత్త మోడల్స్ వస్తున్నాయ్.. మడత పెట్టేద్దాం
మొబైల్ ఫోన్ మార్కెట్లో ఏస్ బ్రాండ్గా ఉన్న సామ్సంగ్ కొత్త మార్కెట్పై దృష్టి పెట్టింది. మరోసారి ఫోల్డబుల్, ఫ్లిప్ మోడళ్లతో మార్కెట్లో హల్చల్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా ఆగస్టులో సామ్సంగ్ ఫ్లిప్, సామ్సంగ్ ఫోల్డ్లో కొత్త మోడల్స్ రిలీజ్ చేయనుంది. అంతుకు ముందు ఈ సెగ్మెంట్లో వచ్చిన ఫోన్లతో పోల్చితే వీటిలో అధునాత ఫీచర్లు ఉండబోతుండగా ధర మాత్రం తగ్గనుంది. ఓల్డ్ మంత్ర గడిచిన రెండేళ్లుగా ఫోన్ ఫీచర్లలో పెద్దగా మార్పులు లేవు. ప్రాసెసర్, కెమెరా మెగా పిక్సెల్, డిస్ప్లే విషయంలో ఇంచుమించు ఒక సెగ్మెంట్లో ఒకే తరహాలో ఫోన్లు వస్తున్నాయి. పైగా కంపెనీలు పోటీ పడి డిస్ప్లే సైజు పెంచుకుంటూ పోయాయి. చేతిలో ఫోన్లు ఇమిడే పరిస్థితి ఇప్పుడు లేదు. దీంతో క్రమంగా చేతిలో ఇమిడిపోయే ఫోన్లను వినియోగదారులకు అందుబాటులో తేవాలని సామ్సంగ్ నిర్ణయించింది. అందులో భాగంగానే సామ్సంగ్ జెడ్ ఫోల్డ్ 3, సామ్సంగ్ జడ్ ఫ్లిప్ 3 మోడళ్లు మార్కెట్లోకి తేవాలని నిర్ణయించింది. ఆగష్టు మొదటి వారంలో లాంఛింగ్ ఈవెంట్ జరిపి... ఆగష్టు చివరి వారంలో మార్కెట్లోకి తేవడం సామ్సంగ్ ప్రణాళికలో ఓ భాగంగా ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. కొత్త వ్యూహం రెండేళ్ల క్రితం సామ్సంగ్ జడ్ ఫోల్డ్ మోడల్ని మార్కెట్లోకి సామ్సంగ్ తెచ్చింది. అయితే దీని ధర లక్షకు పైగా ఉండటంతో ఆశించిన స్థాయిలో క్లిక్ కాలేదు. దీంతో మొబైల్ వీడియో కంటెంట్కు ఇబ్బంది రాకుండా చేతిలో ఇమిడి పోయే ఫోల్డ్, ఫ్లిప్కు మార్కెట్ ఉంటుందని సామ్సంగ్ బలంగా విశ్వసిస్తోంది. అయితే ధర ఈ మోడళ్ల అమ్మకాకలు అడ్డంకిగా మారిన ప్రైస్ బ్యారియర్ని తొలగించే పనిలో ఉంది. అందులో భాగంగా రాబోయే కొత్త మోడళ్లు 20 శాతం తగ్గింపు ధరతో తెచ్చే అవకాశం ఉందని టెక్ మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఈ ఫోన్లకు భారీ డిమాండ్ ఉంటుందనే నమ్మకంతోనే సామ్సంగ్ భారీ ఎత్తున వీటి ఉత్పత్తి చేపట్టింది. ఇప్పటికే ఐఫోన్ సైతం మినీ పేరుతో 5 అంగులాల తెర ఉన్న ఫోన్ని మార్కెట్లోకి తెచ్చింది. చదవండి : మార్కెట్లోకి సోనీ టీవీ.. ధర వింటే షాక్ -
భారీగా తగ్గిన యమహా ఎఫ్జెడ్ 25 సిరీస్ బైక్ ధరలు
న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ యమహా మోటార్ ఇండియా తన ఎఫ్జెడ్ఎస్ 25, ఎఫ్జెడ్ 25 బైక్ల ఎక్స్షోరూమ్ ధరలను భారీగా తగ్గించింది. ఎఫ్జెడ్ఎస్ 25, ఎఫ్జెడ్ 25 ధరలు వరుసగా రూ.19.300, రూ.18.800(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) సంస్థ తగ్గించింది. ప్రస్తుతం ఆ కంపెనీ ఎఫ్జెడ్ఎస్ 25, ఎఫ్జెడ్ 25 ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు రూ.1,39,300, రూ.1,34,800గా ఉన్నాయి. యమహా మోటార్ భారతదేశంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. గతంలో ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు ఎఫ్జెడ్ఎస్ 25 రూ.1,58,600, ఎఫ్జెడ్ 25 రూ.1,53,600గా ఉండేవి. "ఈ మధ్యకాలంలో ఇన్పుట్ ఖర్చులు భారీగా పెరగడంతో బైక్ ధరలను పెంచినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా ఎఫ్జెడ్ 25 సిరీస్ ధరలు పెరిగినట్లు సంస్థ తెలిపింది. చివరకు ఈ ఇన్పుట్ ఖర్చులను తగ్గించడం ద్వారా బైక్ ధరలను తగ్గించినట్లు సంస్థ పేర్కొంది. అత్యంత ప్రజాదరణ గల ఎఫ్జెడ్ 25 సిరీస్ ధరలను తగ్గించడం ద్వారా అంతా మొత్తం మా వినియోగదారులకు ఆ ప్రయోజనాన్ని అందించాలనుకున్నట్లు జపనీస్ ద్విచక్ర వాహన మేజర్ చెప్పారు. తగ్గించిన బైక్ ధరలు నేటి నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న అన్నీ షో రూమ్ లకు వర్తిస్తాయని పేర్కొంది. ధర తగ్గించినా బైకులోని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు అవే ఉంటాయని స్పష్టం చేసింది. చదవండి: అదిరిపోయిన యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ -
భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర
సాక్షి, న్యూఢిల్లీ: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్పై రూ. 122 మేర తగ్గిస్తూ తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయించాయి. నేటి(జూన్ 1) నుంచి ఈ సవరించిన ధరలు అమల్లోకి వచ్చాయి. అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మాత్రం ఊరట లభించలేదు. 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర మాత్రం యథాతథంగానే ఉండనుంది. వాణిజ్య సిలిండర్ ధర మే నెలలో కూడా తగ్గిన విషయం తెలిందే. తాజా సవరణతో ఢిల్లీలో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.1473కి చేరింది. ముంబైలోరూ.1422కు, కోల్కతాలో రూ.1544కు, చెన్నైలో కూడా సిలిండర్ ధర రూ.1603కు తగ్గింది. ఇక 14 కేజీల గ్యాస్ సిలిండర్ ఢిల్లీ లో 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ. 809గా ఉంది. . కోల్కతాలో రూ.835, ముంబైలో సిలిండర్ ధర రూ. 809గానూ, చెన్నైలో రూ. 825గా హైదరాబాద్లో రూ. 861.50 గానూ ఉంది. చదవండి: మిషన్ చోక్సీ: కీలక మహిళ ఎవరంటే? కరోనా విలయం: కోటి ఉద్యోగాలు గల్లంతు -
హోలీ ఆఫర్ : ఐఫోన్పై రూ. 13వేల తగ్గింపు
సాక్షి, ముంబై: హోలీ సందర్భంగా ఆపిల్ ఐఫోన్లు తగ్గింపు ధరలో లభించనున్నాయి. పరిమిత కాల ఆఫర్ కింద ఐఫోన్ 11పై 13వేల రూపాయలు తగ్గి, ఇపుడు 41,900 రూపాయలకే లభించనుంది. ఆపిల్ ప్రీమియం రీ సెల్లర్ ఇమేజిన్లో ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటిలో ఐఫోన్ 11 ను కొనుగోలు చేసే వినియోగదారులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. 13వేల రూపాయల హోలీ ఆఫర్లో రూ. 5,000 క్యాష్ బ్యాక్తోపాటు, ఇతర యాక్ససరీస్పై రూ. 8వేలను తగ్గింపును ఆఫర్ చేస్తోంది. దీంతోపాటు,ఎక్స్ఛేంజ్ బోనస్ కింద అదనంగా రూ. 3 వేల తగ్గింపు లభించనుంది. అలాగే ఐఫోన్ 12 మినీ ఐఫోన్ 12 లపై డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. ఆఫర్ ఎంతకాలం ఉంటుందో స్పష్టత లేదు. అయితే హెచ్డీఎఫ్సి క్యాష్బ్యాక్ మార్చి 27 వరకు మాత్రమేఅందుబాటులో ఉండనున్నట్టు సమాచారం. 2019, సెప్టెంబర్ లో లాంచ్ అయిన ఐఫోన్ 11 ధరరూ. రూ. 54,900 గా ఉంది. దేశీయంగా అత్యంత ప్రాచుర్యం పొందిన మోడళ్లలోఇదొకటి. మార్కెటింగ్ పరిశోధన సంస్థ ఓమ్డియా 2020 లోఅత్యధికంగా రవాణా చేయబడిన స్మార్ట్ఫోన్ ఐఫోన్ 11 అని ఇటీవల పేర్కొంది. ఐఫోన్ 11 స్మార్ట్ఫోన్ 64జీబీ, 128 , 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్స్లో బ్లాక్, గ్రీన్, (ప్రొడక్ట్) రెడ్, పర్పుల్, ఎల్లో వైట్ అనే ఆరు విభిన్న రంగుల్లో లభిస్తుంది. 🔴🟢 HOLI OFFERS @IMAGINE 🟣🟠 iPhone 11 now starting at an effective price of ₹41,900* 1️⃣₹5,000* HDFC Cashback 2️⃣Accessories upto ₹8,000* 🛒 https://t.co/Up2M46rc09 🏢https://t.co/cXaVTZ7X7I 📞 82874-82874#Apple #Imagine #iPhone11 #HDFC #DualSim #iPhone #Holi #Offers pic.twitter.com/c8y7hYbM30 — Imagine Apple Premium Reseller (@ImagineApplePR) March 22, 2021 -
ఒప్పో ఎ12 మోడల్ ధర తగ్గింపు
భారతదేశంలో ఒప్పో తన ఎ12 మోడల్ ధరను తగ్గించింది. ఒప్పో ఎఫ్17, ఒప్పో ఎ15, ఒప్పో రెనో 3 ప్రోలతో పాటు ఒప్పో ఎ12ను జూన్లో భారత్లో విడుదల చేశారు. ఒప్పో ఎ12 మీడియాటెక్ హెలియో పీ35 ప్రాసెసర్ ని కలిగి ఉంది. కొత్త ధరల ప్రకారం భారతదేశంలో ఒప్పో ఎ 12 3జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.8,990 నుంచి రూ.8,490కు తగ్గించింది. అదే విదంగా 4 జీబీ ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ ధర కూడా రూ.11490 నుంచి రూ.10,990కు ధర తగ్గించబడింది.(చదవండి: హైక్ మెసెంజర్ సేవలు నిలిపివేత) ఒప్పో ఎ12 ఫీచర్స్: డిస్ప్లే: 6.22-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లే ర్యామ్: 3జీబీ, 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64జీబీ ప్రాసెసర్: మీడియాటెక్ హెలియో పీ35 రియర్ కెమెరా: 13ఎంపీ + 2ఎంపీ+ 2ఎంపీ సెల్ఫీ కెమెరా: 05 మెగాపిక్సెల్ బ్యాటరీ: 4,320 ఎంఏహెచ్(33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్) ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ -
శాంసంగ్ గెలాక్సీ నోట్ 20పై భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. శాంసంగ్ డేస్ సేల్ లో భాగంగా పలు మొబైళ్లపై తగ్గింపు ధరలను సంస్థ ప్రకటించింది. ముఖ్యంగా గెలాక్సీ నోట్ 20పై 9 వేల రూపాయల పరిమితకాల తక్షణ డిస్కౌంట్ అందిస్తోంది. దీనికి అదనంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుదారులకు 6,000క్యాష్బ్యాక్ కూడా లభ్యం. ఈ ఆఫర్ సెప్టెంబర్ 23వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. శాంసంగ్ తోపాటు, ప్రముఖ ఆన్లైన్ పోర్టల్స్ ,రిటైల్ స్టోర్లలో ఈ తగ్గింపును అందిస్తోంది. దీంతోపాటు శాంసంగ్ ఇతర గెలాక్సీ ఫోన్లపై కూడా తగ్గింపు అఫర్లను అందుబాటులో ఉంచింది. గెలాక్సీ నోట్ 20 లాంచింగ్ ధర 77,999 రూపాయలు. సేల్ ధర 68,999 రూపాయలు. ఒకవేళ హెచ్డీఎఫ్సీ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే మరో ఆరువేల తగ్గింపు. మొత్తంగా ఈ స్మార్ట్ ఫోన్ ను 62,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. మిస్టిక్ బ్రాంజ్, మిస్టిక్ గ్రీన్, మిస్టిక్ బ్లూ రంగులలో ఇది లభిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 ఫీచర్లు 6.70 అంగుళాల హెచ్డి ఇన్ఫినిటీ-ఓ సూపర్ అమోలెడ్ + ఫ్లాట్ డిస్ప్లే 1080x2400 పిక్సెల్స్ రిజట్యూషన్ ఆండ్రాయిడ్ 10 శాంసంగ్ ఎక్సినోస్ 990ప్రాసెసర్ 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 12+64+12మెగాపిక్సెల్ రియర్ ట్రిపుల్ కెమెరా 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 4300 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఒప్పో ధరల కోత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీదారు ఒప్పో తన రెనో 3 ప్రో మొబైల్ ధరలను తగ్గించింది. ఈ స్మార్ట్ఫోన్ రెండు వేరియంట్లపైనా ధరల కోతను ప్రకటించింది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ పై 2,000, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరపై 3వేల రూపాయల తగ్గింపును ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఒప్పో రెనో 3 ప్రో ను మార్చిలో ఇండియాలో తీసుకొచ్చింది. వీటి ధరలను 29,990 (128 జీబీ వేరియంట్) గాను, 256 జీబీ వేరియంట్కు 32,990 రూపాయలుగా నిర్ణయించింది. అయితే జీఎస్టీ కారణంగా బేస్ వేరియంట్ ధరను ఏప్రిల్ లో రెండు వేల రూపాయల మేర పెంచింది. దాదాపు మూడు నెలల తరువాత తాజా తగ్గింపుతో ఒప్పో రెనో 3 ప్రో ఫోన్లు వరుసగా 27,990, 29,990 రూపాయలకు లభించనున్నాయి. ఒప్పో రెనో 3 ప్రో స్పెసిఫికేషన్లు 6.4 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 10 , 1,080x2,400 రిజల్యూషన్ 64+13+8+2ఎంపీ రియర్ క్వాడ్ కెమెరా 44+2 ఎంపీ సెల్ఫీ కెమెరా 4025 ఎంఏహెచ్ బ్యాటరీ -
గెలాక్సీ స్మార్ట్ఫోన్ ధర తగ్గింది : క్యాష్బ్యాక్ కూడా
సాక్షి, ముంబై : ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ శాంసంగ్ తన గెలాక్సీ లేటెస్ట్ స్మార్ట్ఫోన్ ధరలను తగ్గించింది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ ధరపై నాలుగువేల రూపాయల శాశ్వత తగ్గింపుతో అందుబాటులో ఉంచింది. దీనికి అదనంగా క్యాష్బ్యాక్ ఆఫర్ను కూడా అందిస్తోంది. ఆన్లైన్ సైట్లలో ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి. ఆఫ్లైన్ స్టోర్ల ద్వారా కూడా ఈ తగ్గింపు వర్తిస్తుందని ముంబైలోని మహేష్ టెలికాంకు చెందిన మనీష్ ఖాత్రి ట్విటర్లో ధృవీకరించారు. (వాట్సాప్లో ఎర్రర్ : యూజర్లు గగ్గోలు) మొబైల్ ఫోన్లపై 12 శాతం నుంచి 18 శాతం జీఎస్టీ రేట్ల పెంపుతో దక్షిణ కొరియా దిగ్గజం గెలాక్సీ నోట్ 10లైట్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా భారతీయ మార్కెటో 4 వేల రూపాయల ధర తగ్గించడంతో పాటు, అదనపు ఆఫర్లను అందించడం విశేషం. సిటీబ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ ద్వారా గెలాక్సీ నోట్ 10 లైట్ను కొనుగోలు చేసే వినియోగదారులకు రూ. 5000 క్యాష్బ్యాక్ లభ్యం. మిగిలిన ఆన్లైన్ చెల్లింపులపై 2000 రూపాయల క్యాష్ బ్యాక్ అందివ్వనుంది. (శాంసంగ్ కొత్త టీవీలు: ఫీచర్లు అదుర్స్) కొనుగోలుదారులు 9 నెలల వరకు నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్, 2 నెలల యూట్యూబ్ ప్రీమియం సభ్యత్వం కూడా పొందవచ్చు. ఈ ఆఫర్లు జూన్ 30, 2020వరకు మాత్రమే చెల్లుతాయి. ఈ మోడల్స్ ధరలు ఇప్పటివరకు వరుసగా 41,999 రూపాయలు, 43,999 రూపాయలుగా ఉన్నాయి. జనవరిలో భారతదేశంలో లాంచ్ చేసినపుడు గెలాక్సీ నోట్ 10 లైట్ ప్రారంభ ధర 38999 రూపాయలు. శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ ప్రస్తుత ధరలు 6 జీబీ వేరియంట్ ధర 37,999 రూపాయలు 8 జీబీ మోడల్ ధర 39,999 రూపాయలు గెలాక్సీ నోట్ 10 లైట్ స్పెసిఫికేషన్లు 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే 1080x2400 పిక్సెల్స్ ఆక్టా-కోర్ ఎక్సినోస్ 9810 సాక్ 6జీబీ 8 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ 1 టీబీ వరకు విస్తరించుకునే అవకాశం 12+ 12+12 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 4500 ఎంఏహెచ్ బ్యాటరీ -
సబ్సిడీయేతర వంటగ్యాస్ ధర రూ.53 తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ: వంట గ్యాస్ ధర పెరిగిందని బెంబేలెత్తుతున్న ప్రజలకు ఊరట లభించింది. సబ్సిడీ లేని వంట గ్యాస్ ధరను ప్రభుత్వం ఆదివారం తగ్గించింది. 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీ, ముంబైల్లో రూ. 53 మేర.. అలాగే 19 కేజీల సిలిండర్ ధర రూ. 84.50 తగ్గిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. ఆగష్టు 2019 నుంచి ఫిబ్రవరి 2020 వరకు మధ్య ఎల్పీజీ ధర 50 శాతం పెరిగింది. -
ఈ స్మార్ట్ఫోన్ ధర భారీగా తగ్గింది!
న్యూఢిల్లీ: ‘నోకియా 4.2’ స్మార్ట్ఫోన్ ధర భారీగా తగ్గింది. అమెజాన్ వెబ్సైట్లో ప్రస్తుతం ఈ ఫోన్ 6,975 రూపాయలకు లభ్యమవుతోంది. ఆరంభ ధరతో పోలిస్తే ఇది 36 శాతం తక్కువ. నోకియా బ్రాండ్ ఫోన్ల విక్రయ సంస్థ హెచ్ఎండీ గ్లోబల్.. ‘నోకియా 4.2’ స్మార్ట్ఫోన్ను గత మే నెలలో భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అప్పుడు ఈ బడ్జెట్ స్మార్ట్ఫోన్ ధర రూ.10,990 కాగా తర్వాత రూ.9,499కు తగ్గించారు. ఆరంభ ధర కంటే ఇప్పుడు బాగా తగ్గింది. ఈ బడ్జెట్ స్మార్ట్ఫోన్లో 5.71 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 13 మెగాపిక్సల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3జీబీ ర్యామ్, 32జీబీ ఆన్బోర్డ్ స్టోరేజీ, క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 439 ప్రాసెసర్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ స్పెసిఫికేషన్లు ఉన్నాయి.