railway employee
-
బాలికను వేధించాడని.. రైల్వే ఉద్యోగిపై ప్రయాణికుల దాష్టీకం
న్యూఢిల్లీ: రైలులో మైనర్ బాలికను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో బాధితురాలి కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు రైల్వే ఉద్యోగిని కొట్టి చంపారు. ఈ ఘటన హమ్సఫర్ఎక్స్ప్రెస్ రైలులో గురువారం వెలుగుచూసింది. వివరాలు.. బిహార్లోని సివాన్కుచెందిన కుటుంబం బుధవారం న్యూఢిల్లీకి వెళ్తున్న హమ్ సఫర్ ఎక్స్ప్రెస్ ఎక్కారు. రైలులోని థర్డ్ ఏసీ కోచ్లో ప్రయాణిస్తున్నారు.అయితే రాత్రి 11.30 గంటలల సమయంలో సమయంలో అయితే అదే కోచ్లో ప్రయాణిస్తున్న గ్రూప్ డీ రైల్వే ఉద్యోగి ప్రశాంత్ కుమార్ .. కుటుంబంలోని 11 ఏళ్ల భాలికను తన సీటు వద్ద కూర్చొబెట్టుకున్నాడు. తర్వాత బాలిక తల్లి వాష్రూమ్కు వెళ్లగా.. చిన్నారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడుమహిళ వాష్రూమ్ నుంచి తిరిగి రాగానే, బాలిక తల్లి వద్దకు పరిగెత్తి, ఆమెను పట్టుకొని ఏడవడం ప్రారంభించింది. తల్లిని వాష్రూమ్కి తీసుకెళ్లి జరిగిన విషయం చెప్పింది. దీంతో రైల్వే ఉద్యోగి ప్రశాంత్ కుమార్ ప్రవర్తనపై ఆ మహిళ తన భర్త, మామతోపాటు కోచ్లోని ఇతర ప్రయాణికులకు చెప్పింది. రైలు లక్నోలోని ఐష్బాగ్ జంక్షన్కు చేరుకోవడంతోదీంతో అతడ్ని ఆ కోచ్ డోర్ వద్దకు తీసుకెళ్లారు. కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు కదులుతున్న రైలులోనే గంటన్నరపాటు నిందితుడిని కొట్టారు.అనంతరం రైలు ఉదయం 4.35 నిమిషాలకు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ సెంట్రల్ చేరుకోగా.. నిందితుడుని రైల్వే పోలీసు అధికారులు అప్పగించారు. బాలికను వేధించినట్లు అతడిపై ఫిర్యాదు చేశారు. తీవ్రంగా గాయపడిని ప్రశాంత్ కుమార్ను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడిది బిహార్లోని ముజఫర్పూర్ జిల్లాలోని సమస్త్పూర్ గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు.అయితే బాలిక కుటుంబం, ఇతర ప్రయాణికులు కుట్రతో ప్రశాంత్ కుమార్ను హత్య చేసినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నోయిడా వాసికి రూ.4 కోట్ల కరెంటు బిల్లు
నోయిడా: ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో రైల్వే ఉద్యోగి బసంత్శర్మకు జూన్ నెల కరెంటు బిల్లు షాక్ ఇచ్చింది. ఓ రోజు ఉదయం ఆఫీసుకు బయలుదేరుతుండగా అద్దెకు ఇచ్చిన తన ఇంటికి సంబంధించి కరెంటు బిల్లు మెసేజ్ వచ్చింది.ఏకంగా రూ.4 కోట్ల కరెంటు బిల్లు జులై 24కల్లా కట్టాలని ఆ మెసేజ్లో ఉంది. అది చూసి తొలుత ఆశ్చర్యపోయి తర్వాత కంగారుపడ్డాడు. టెనెంట్కు ఫోన్ చేసి కనుక్కుంటే సాధారణంగా వాడినట్లే జూన్లోనూ విద్యుత్ వాడామని సమాధానమిచ్చాడు.దీంతో బసంత్శర్మ విద్యుత్ అధికారులకు ఫోన్ చేశాడు. వారు చెక్చేసి చూడగా ఎర్రర్ కారణంగా కంప్యూటర్ జనరేటెడ్ బిల్లులో పొరపాటు వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. బిల్లును సరిచేసి పంపడంతో బసంత్ శర్మ ఊపిరి పీల్చుకున్నాడు. -
రైల్వే ఘనకార్యం! మూడు రోజుల్లో రిటైరయ్యే ఉద్యోగి బదిలీ
న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే బిలాస్పూర్ డివిజన్కు చెందిన ఒక సీనియర్ ఇంజనీర్ విషయంలో రైల్వేబోర్డ్ ఘనకార్యం చేసింది. మరో మూడు రోజుల్లో రిటైరవుతున్న కేపీ ఆర్యను ఢిల్లీలోని నార్తర్న్ రైల్వే జోన్కు బదిలీ చేసింది. ఖంగుతిన్న ఆయన బదిలీపై నిరాశను వ్యక్తం చేస్తూ రైల్వే బోర్డు సెక్రటరీకి ఘాటు లేఖ రాశారు. బదిలీ ఆర్డర్ను ఆయన బుద్ధిలేని పనిగా పేర్కొన్నారు. బదిలీ ఉత్తర్వు ప్రకారం కేపీ ఆర్య నవంబర్ 28న హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ పోస్ట్పై నార్తర్న్ రైల్వేలో చేరాల్సి ఉంది. అయితే ఆయన పదవీ విరమణ నవంబర్ 30న ఉంది. ఈ ఆర్డర్ పైకి బాగానే మూడు రోజుల్లో రిటైరవుతున్న తనను బదిలీ చేయడంలో పిచ్చితనమే కనిపిస్తోందని ఆర్య అన్నారు. ఇది జీవితమంతా ఇండియన్ రైల్వే సంస్థకు సేవ చేసిన ఒక ఉద్యోగిని పదవీ విరమణ సమయంలో కావాలని బదిలీ చేయడమే తప్ప మరొకటి కాదు అన్నారు. దీని వల్ల పదవీ విరమణ సెటిల్మెంట్కు అంతరాయం ఏర్పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్లో హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ పోస్ట్ ఖాళీగా ఉన్నప్పటికీ, రైల్వే బోర్డు తనను నార్తర్న్ రైల్వే జోన్లో ఖాళీగా ఉన్న పోస్ట్కు బదిలీ చేసిందని ఆర్య పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. పదవీ విరమణకు ముందు కేవలం మూడు రోజులు తాను న్యూఢిల్లీలోని నార్తర్న్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయంలో పని చేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం రైల్వే శాఖ తనకు దాదాపు రూ. 3 లక్షలు చెల్లిస్తుందని, ఇది ప్రజాధనాన్ని పూర్తిగా వృధా చేయడమేనని ఆయన ఆక్షేపించారు. ఇది ప్రమోషనల్ ట్రాన్స్ఫర్గా చెబుతున్నప్పటికీ దీని వల్ల తనకు అదనపు ఆర్థిక ప్రయోజనాలేవీ అందించలేదని ఆర్య పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తనకు ఇప్పటికే ఆర్థిక ప్రయోజనాలకు అర్హత ఉన్నప్పటికీ తన పదోన్నతిని ఆరు నెలలు ఆలస్యం చేశారని ఆరోపించారు. -
ఒడిశా ప్రమాదం.. ముగ్గురు రైల్వే ఉద్యోగుల అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాదానికి సంబంధించి.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ముగ్గురు రైల్వే ఉద్యోగుల్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. జూన్ 2వ తేదీ రాత్రిపూట జరిగిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదంలో 290 మంది దాకా మృతి చెందిన సంగతి తెలిసిందే. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ దుర్ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. పలువురిని విచారించింది. ఘటనకు కారకులు అవ్వడంతో పాటు సాక్ష్యాలను ధ్వంసం చేసినందుకు అనే అభియోగాల మీదే వీళ్లను అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇవాళ మగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అరెస్ట్ అయిన వాళ్లు అరుణ్ కుమార్ మహంత, ఎండీ అమీర్ ఖాన్ , పప్పు కుమార్గా తెలుస్తోంది. వీళ్లపై హత్యకు సమానం కాని నేరపూరిత నరహత్య కింద, అలాగే.. సాక్ష్యాలను నాశనం చేసిన అభియోగాలు మోపింది సీబీఐ. ఈ ముగ్గురి చర్యలు.. ప్రమాదానికి దారితీశాయని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. తాము చేసిన పని పెనుప్రమాదానికి.. విషాదానికి దారి తీస్తుందనే అవగాహన వాళ్లకు ఉందని సీబీఐ తన నివేదికలో పేర్కొంది. ఇదీ చదవండి: ఒడిశా దుర్ఘటన.. అమీర్ ఖాన్ ఇంటికి సీల్ -
చెప్పు పోయిందని ట్విట్టర్లో ఫిర్యాదు.. రైల్వే పోలీసులు ఏం చేశారంటే!
సాక్షి,కాజీపేట: రైలు ఎక్కుతున్న సమయంలో తన చెప్పు పడిపోయిందని ఒక ప్రయాణికుడు రైల్వే ట్విట్టర్లో ఫిర్యాదు చేయగా.. రైల్వే పోలీసులు దాన్ని వెతికి అతనికి తిరిగి భద్రంగా అప్పగించారు. ఈ ఘటన ఆలస్యంగా శనివారం వెలుగు చూసింది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్కు చెందిన ఒక ప్రయాణికుడు స్థానిక రైల్వే స్టేషన్లో గురువారం హైదరాబాద్కు వెళ్లేందుకు కాకతీయ ప్యాసింజర్ ఎక్కుతుండగా.. తన చెప్పు ఒకటి జారిపడి పోయిందని ట్విట్టర్లో రైల్వేబోర్డుకు ద్వారా ఫిర్యాదు చేశాడు. దీంతో కాజీపేట రైల్వే పోలీసులు శనివారం ఘన్పూర్ వద్ద ప్రయాణికుడి చెప్పును కనుగొని తీసుకొచ్చారు. ఫిర్యాదు చేసిన ప్రయాణికుడిని పిలిపించి.. అతనికి చెప్పును అప్పగించారు. పోలీసులు తెలిపారు. -
నెలకు లక్ష జీతం.. రమ్మీకి బానిసై, కుటుంబ పరిస్థితి భారంగా మారడంతో..
సాక్షి, చెన్నై: తిరువాన్మీయూరు రైల్వే స్టేషన్లో సంచలనం రేపిన దోపిడీ కథ ముగిసింది. భార్యతో కలిసి రైల్వే ఉద్యోగి ఆడిన నాటకం గుట్టు రట్టయ్యింది. ఇంటి దొంగను అరెస్టు చేసిన పోలీసుల కటకటాల్లోకి నెట్టారు. చెన్నై తిరువాన్మీయూరు ఎంఆర్టీఎస్ రైల్వే స్టేషన్లో సోమవారం ఉదయం దోపిడీ జరిగిన విషయం తెలిసిందే. గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గురు తనను కట్టి పడేసి రూ. లక్షా 32 వేలు నగదు అపహరించుకెళ్లినట్టు రైల్వే టికెట్ క్లర్ టిక్కారామ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో కేసు ముందుకు సాగడం కష్టతరంగా మారింది. అయితే, రైల్వే స్టేషన్ మార్గంలో ఉన్న సీసీ కెమెరాల్ని పరిశీలించిన పోలీసులు విస్మయానికి గురయ్యారు. దోపిడీ జరిగిన సమయంలో ఓ మహిళ రైల్వే స్టేషన్కు వచ్చి ఆగమేఘాల మీద వెళ్లిన దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టారు. ఆమె టిక్కారామ్ భార్య సరస్వతిగా తేలింది. దీంతో ఇంటి దొంగ నాటకం గుట్టు బట్టబయలైంది. నెలకు దాదాపుగా రూ. లక్ష వరకు జీతం తీసుకుంటున్న టిక్కారామ్ ఆన్లైన్ రమ్మికి బానిస అయ్యాడు. దీంతో లక్షల చొప్పున అప్పుల పాలయ్యాడు. ఈ నెల కుటుంబ పరిస్థితి భారంగా మారడం, స్టేషన్లో సీసీ కెమెరాలు లేవన్న విషయాన్ని పరిగణించి భార్యతో కలిసి నాటకం రచించి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ దంపతుల్ని అరెస్టు చేసిన పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. -
రైల్వే ఉద్యోగులకు కేంద్రం భారీ బోనస్!
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే ఉద్యోగులకు కేంద్రం భారీ శుభవార్త తెలిపింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాలకు సమానమైన బోనస్ అందించేందుకు కేంద్ర మంత్రివర్గం నేడు ఆమోదం తెలిపింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఖజానా మీద ₹1,984.73 కోట్లు ఆర్ధిక భారం పడనుంది. సుమారు 11.56 లక్షల నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయోజనం చేకూరనుంది. "అర్హత కలిగిన నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులందరికీ(ఆర్పిఎఫ్/ఆర్పిఎస్ఎఫ్ సిబ్బంది మినహా) 2020-21 ఆర్థిక సంవత్సరానికి 78 రోజుల వేతనాలకు సమానమైన ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్(పిఎల్బి)కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది" అని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అర్హులైన రైల్వే ఉద్యోగులకు బోనస్ కింద 78 రోజులకు చెల్లించాల్సిన మొత్తం ₹17,951 అని కేంద్రం పేర్కొంది. అర్హులైన నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు పిఎల్బి చెల్లించడానికి సూచించిన వేతన లెక్కింపు పరిమితి ₹7,000/నెలకు అని తెలిపింది. (చదవండి: టీమిండియా స్పాన్సర్కు భారీ షాక్...!) "అర్హత కలిగిన రైల్వే ఉద్యోగులకు ప్రతి సంవత్సరం దసరా సెలవులకు ముందు పిఎల్బి చెల్లింపు చేయబడుతుంది. ఈ ఏడాది కూడా సెలవులకు ముందే మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు" కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. వాస్తవానికి ఫార్ములాను బట్టి 72 రోజుల వేతనాన్ని బోనస్ గా ఇవ్వాలి. కానీ ప్రధాని మోదీ, కేబినెట్ 78 రోజుల వేతనాన్ని బోనస్గా అందించి వారి ముఖాల్లో చిరునవ్వు చూడాలని ఈ నిర్ణయం తీసుకుంది. (చదవండి: టీమిండియా స్పాన్సర్కు భారీ షాక్...!) Union Cabinet approves Productivity Linked Bonus equivalent to 78 days' wage to eligible non-gazetted Railway employees (excluding RPF/RPSF personnel) for FY20-21. About 11.56 lakh non-gazetted Railway employees are likely to benefit from the decision:Union Minister Anurag Thakur pic.twitter.com/cv7IDkulZb — ANI (@ANI) October 6, 2021 -
సెక్యురిటీ గార్డు దారుణం.. మాస్కు ధరించలేదని కాల్చిపడేశాడు
లక్నో: చిన్నపాటి గొడవలకే తుపాకీతో కాల్చడం ఈ మధ్యన ఫ్యాషన్గా మారిపోయింది. తాజాగా బ్యాంకుకు వచ్చిన కస్టమర్ మాస్క్ ధరించలేదని తుపాకీతో కాల్చిపారేశాడు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని బరేలీ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. కాగా తుపాకీ తూటాలకు ఆ వ్యక్తికి తీవ్ర రక్తస్రావం కాగా.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తుపాకీతో కాల్పులు జరిపిన సెక్యూరిటీ గార్డ్ను యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్న రాజేశ్ కుమార్ తన భార్యతో కలిసి శుక్రవారం పని నిమిత్తం బ్యాంక్ ఆఫ్ బరోడాకు వచ్చాడు. ఈ నేపథ్యంలో బ్యాంకకు ఎంటరవుతున్న సమయంలో రాజేశ్ ఫేస్మాస్క్ పెట్టుకోకపోవడంతో సెక్యూరిటీ గార్డ్ అడ్డగించాడు. మాస్క్ పెట్టుకుంటేనే లోనికి అనుమతి ఇస్తానని పేర్కొన్నాడు. దీంతో రాజేశ్, సెక్యూరిటీ గార్డ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సహనం కోల్పోయిన సెక్యూరిటీ గార్డ్ తనవద్ద ఉన్న తుపాకీతో రాజేశ్ తొడపై కాల్చాడు. తీవ్ర రక్తస్రావంతో రాజేశ్ అలాగే కిందపడిపోగా.. పక్కనే ఉన్న అతని భార్య..'' నా భర్తను ఎందుకు కాల్చావు'' అంటూ పెద్దగా కేకలు వేసింది. ఇది విన్న మిగతావారు అక్కడికి వచ్చి ఇంత చిన్న విషయానికి తుపాకీతో కాలుస్తావా.. నువ్వు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది అని గార్డ్ను ఆక్షేపించారు. 27 సెకెన్ల నడివి ఉన్న ఫుటేజీ సీసీటీవీలో రికార్డు అయింది. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని గార్డ్ను అదుపులోకి తీసుకున్నారు. '' రాజేశ్ మాస్క్ ధరించలేదని.. ఆ విషయం చెప్పానని.. కానీ అతను నోటి దురుసుతో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించాడని.. నన్ను బూతులు తిట్టాడు.. దీంతో తుపాకీ చూపించి బెదిరిద్దాం అనుకున్నా.. కానీ తుపాకీ మిస్ఫైర్ అయి అతనికి తగిలింది. ఇది అనుకోకుండా జరిగింది''. అని సెక్యూరిటీ గార్డ్ పోలీసులకు వివరించాడు. చదవండి: మహిళ విషయంలో గొడవ.. పక్కా ప్లాన్తో In #Bareilly a railway employee was allegedly shot by bank guard at Junction road branch of Bank of Baroda. Reports claimed that victim was shot following an argument over not wearing mask. Victim taken to district hospital. pic.twitter.com/SzuHRpGZv5 — Arvind Chauhan (@Arv_Ind_Chauhan) June 25, 2021 -
రైల్వే ఉద్యోగి దారుణహత్య
మల్కాజిగిరి: రైల్వే ఉద్యోగి దారుణహత్యకు గురైన సంఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం...న్యూ సంతోష్రెడ్డినగర్ కాలనీకి చెందిన మద్ది మహేశ్వరి కుమారుడు మద్ది విజయ్కుమార్(30) రైల్వే లోకోషెడ్లో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ఆరేళ్లక్రితం వైజాగ్కు చెందిన భవ్యతో వివాహం జరగ్గా, పీవీఎన్కాలనీలో నివాసముంటున్నాడు. వారంరోజుల క్రితం తల్లి మహేశ్వరికి కరోనా సోకింది. భార్యను పుట్టింటికి పంపి తల్లిని రైల్వే ఆస్పత్రిలో చేర్పించాడు. రాత్రి వేళ ఆస్పత్రికి వెళ్లి ఉదయం సంతోష్రెడ్డినగర్లోని ఇంటికి వచ్చేవాడు. శనివారం ఉదయం వైజాగ్లో ఉంటున్న సోదరి ప్రేమలతతో విజయ్కుమార్ మాట్లాడి తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత ప్రేమలత పీవీఎన్కాలనీలో ఉంటున్న మేనత్త శారదకు ఫోన్ చేసి తమ్ముడు ఏడుస్తున్నాడని, ఇంటికి వెళ్లి చూడమని చెప్పింది. ఆమె అక్కడకు వెళ్లేసరికి ఇంటి ప్రధాన ద్వారం గడియ పెట్టి ఉండడంతో లోనికి వెళ్లి చూసింది. బెడ్రూమ్లో రక్తపుమడుగులో పడిఉన్న విజయ్కుమార్ చేసి కేకలు వేసింది. ఇరుగుపొరుగువారు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలిని ఏసీపీ శ్యామ్ ప్రసాద్రావు, క్లూస్టీం బృందం పరిశీలించింది. కొబ్బరి బొండాలు నరికే కత్తిని హత్యకు ఉపయోగించడం, మెడపై బలమైన వేటు వేయడంలాంటి కోణాల్లో దర్యాప్తు చేసుకున్న పోలీసులు ఇది తెలిసినవారే చేసిన పనిగా అనుమానిస్తున్నారు. చదవండి: భార్యను చంపి.. ఆపై సెల్ఫీ తీసుకుని.. -
రేపు కూతురు బర్త్డే.. మూగ హృదయం ఆగిపోయింది..
సాక్షి, రామగుండం: అతడు పుట్టు మూగ.. నాలుగేళ్ల రైల్వే రిక్రూట్మెంట్బోర్డు నిర్వహించిన పరీక్ష ద్వారా రైల్వేలో ఉద్యోగం సాధించాడు. రామగుండం రైల్వే రెగ్యులర్ ఓవర్హాలింగ్షెడ్డులో టెక్నికల్ అసిస్టెంట్గా చేరాడు. మూడేళ్ల క్రితం మూగ యువతినే వివాహమాడి ఆదర్శంగా నిలిచాడు. వీరికి కూతురు ఉంది. కరోనా నేపథ్యంలో భార్య, కూతురును పుట్టింటికి పంపించి విధులు నిర్వహిస్తున్నాడు. వ్యక్తి మూగ అయినా అందరితో కలిసి ఉండే అతడి హృదయం గురువారం విధినిర్వహణలోనే ఆగింది. వరంగల్ రూరల్ జిల్లా మడికొండకు చెందిన బండి రంజిత్కుమార్(35) గురువారం విధుల్లో ఉండగా గుండెలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. తోటి ఉద్యోగులు రైల్వే డిస్పెన్సరీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందనడంతో కరీంనగర్లోని ప్రైవేటుఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. రేపు కూతురు తొలి జన్మదిన వేడుకలు.. రంజిత్ కూతురు మొదటి పుట్టిన రోజు శనివారం ఉంది. కరోనా దృష్ట్యా పుట్టింటికి వెళ్లిన భార్య, కూతురును శుక్రవారం రామగుండం రావాలని ఫోన్చేసి చెప్పాడు. ఇంతలోనే గుండెపోటుతో మృతిచెందడంతో భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. -
రైల్వే ఉద్యోగి ఘాతుకం.. భార్యకు కరోనా అని తెలిసి తల నరికి
పట్నా: బిహార్లో దారుణం చోటు చేసుకుంది. భార్యకు కరోనా అని తేలడంతో.. ఓ రైల్వే ఉద్యోగి ఆమె తల నరికి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత తాను కూడా బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వివరాలు.. అతుల్ లాల్ అనే వ్యక్తి రైల్వేలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో భార్యతో కలిసి పత్రకార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్నాచక్ ప్రాంతంలోని ఓం రెసిడెన్సీ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం లాల్ భార్యకు కోవిడ్ పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. దాంతో ఆగ్రహానికి గురైన లాల్ కత్తితో భార్య తల నరికి హత్య చేశాడు. ఆ తర్వాత లాల్ కూడా అపార్ట్మెంట్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. గతంలో ఢిల్లీలో ఓ వ్యక్తి అనుమానంతో భార్యను నడిరోడ్డులో కత్తితో 25 సార్లు పొడిచి దారుణంగా హత్య చేశాడు. చదవండి: వైరల్: భర్తకు కోవిడ్.. నోటి ద్వారా శ్వాస అందించిన భార్య -
సూపర్హీరో మరో ఔదార్యం, నెటిజన్లు ఫిదా
సాక్షి, ముంబై: ప్రాణాలకు తెగించి మరీ పట్టాలపై పడి పోయిన బాలుడిన కాపడిన రైల్వే పాయింట్మ్యాన్ మయూర్ షెల్కే తన ఔదార్యంతో మరోసారి రియల్ హీరోగా నిలిచారు. తనకు బహుమతిగా వచ్చిన డబ్బులో సగం భాగాన్ని తాను రక్షించిన బాలుడికి ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు. అతని కుటుంబం ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న తరువాత మయూర్ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని భావించారు. ఆ బాలుడి చదువు, సంక్షేమం నిమిత్తం కొంత సొమ్మును దానం చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో అతని పెద్దమనసుకు నెటిజనులు హ్యాట్యాఫ్ అంటున్నారు. మా మనసులను ఎన్నిసార్లు గెల్చుకుంటావ్ భయ్యా అంటూ షెల్కేకు ఫిదా అవుతున్నారు. (సూపర్ హీరోలకే హీరో: ప్రశంసలు, బంపర్ గిఫ్ట్) I'll give half of the amount, given to me as token of appreciation, for that child's welfare & education. I came to know that his family isn't financially strong. So I decided this: Mayur Shelkhe, pointsman who saved a child who fell on tracks at Vangani railway station on 17.04 pic.twitter.com/IWdacY0DFf — ANI (@ANI) April 22, 2021 pic.twitter.com/C62xQVXnCy — thejadooguy (@JadooShah) April 22, 2021 In these dark days for humanity, ray of hope 🙏 — Bharateeya (@AntiCaste_Hindu) April 22, 2021 -
సూపర్ హీరోలకే హీరో: ప్రశంసలు, బంపర్ గిఫ్ట్
-
సూపర్ హీరోలకే హీరో: ప్రశంసలు, బంపర్ గిఫ్ట్
సాక్షి, ముంబై: అత్యంత సాహసంతో బాలుడి ప్రాణాలను కాపాడిన రైల్వే ఉద్యోగిపై ప్రశంసల జల్లుకురవడమే కాదు విలువైన బహుమతులు కూడా లభిస్తున్నాయి. ప్రమాదవశాత్తూ రైల్వే ట్రాక్పై నిలిచిపోయిన బాలుడిని రక్షించిన మయూర్ షెల్కేని స్వయంగా రైల్వే శాఖమంత్రి పియూష్ గోయల్ అభినందించారు. రైల్వే మంత్రిత్వ శాఖ బహుమతిని కూడా ప్రకటించింది. తాజాగా ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ ఈ కోవలో నిలిచింది. సమయానుకూలంగా స్పందించి, ప్రాణాలను పణంగా పెట్టి మరీ బాలుడిని కాపాడి హీరోగా నిలిచిన షెల్కేకు జావా మోటార్ సైకిల్ను గిఫ్ట్గా ప్రకటించింది. మయూర్ షెల్కే ధైర్యసాహసాలు ప్రశంసనీయమంటూ క్లాసిక్ లెజెండ్స్ చీఫ్ అనుపమ్ థరేజా అభినందించారు. మొత్తం జావా కుటుంబం ఆయనను అభినందిస్తోందన్నారు. రైలు దూసుకొస్తున్నప్పటికీ బాలుడిని సురక్షితంగా కాపాడిన తీరు తమను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిందని థరేజా పేర్కొన్నారు. జావా హీరోస్ ఇనీషియేషన్లో భాగంగా ఈ అవార్డు ఇస్తున్నామన్నారు. అంతేకాదు దేశవ్యాప్తంగా ఇలాంటి హీరోలను గుర్తించి జావా హీరోస్ పేరుతో సత్కరించనున్నామని వెల్లడించారు. దీనిపై మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. మూవీల్లోని సూపర్ హీరోలను మించిన హీరోగా మెరుగైన ధైర్య సాహసాలను ప్రదర్శించారంటూ ట్వీట్ చేశారు. జావా కుటుంబంలో మనమందరం అతనికి సెల్యూట్ చేద్దామన్నారు. అలాగే క్లిష్ట సమయాల్లో ఎలా ప్రవర్తించాలో షెల్కే మనకు చూపించారంటూ ఆయన ప్రశంసించారు.(పట్టాలపై చిన్నారి..దూసుకొస్తున్న రైలు.. ఇంతలో) కాగా ఏప్రిల్ 17న వంగని రైల్వే స్టేషన్లో మయూర్ షెల్కే అత్యంత సాహసంతో బాలుడిన కాపాడిన వైనం చోటు చేసుకుంది. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాలను రైల్వే శాఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. సెంట్రల్ రైల్వేలో పాయింట్స్మన్గా పని చేస్తున్నమయూర్ షెల్కేకు రైల్వే మంత్రిత్వ శాఖ రూ.50 వేలు బహుమతిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
చిన్నారిని కాపాడిన రియల్ హీరోకు బహుమతి
ముంబై: తన ప్రాణాలను సైతం చేయకుండా చిన్నారిని కాపాడిన రియల్ హీరో మయూర్ షెల్కేను అతని తోటి సిబ్బంది, నెటిజన్లే గాక ప్రముఖుల కూడా ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఉద్యోగిని సెంట్రల్ రైల్వే అధికారులు ఘనంగా సత్కరించారు. కార్యాలయంలో షెల్కేకు ఇరు వైపుల అధికారులు, తోటి సిబ్బంది నిలబడి చప్పట్లతో అతనికి గ్రాండ్ వెల్కం పలికారు. అనంతరం షెల్కే ధైర్య సాహసాన్ని అభినందిస్తూ 50 వేల రూపాయల నగదును బహుమతిగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముంబై డివిజనల్ మేనేజర్, ఇతర రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఇదంతా చిత్రీకరించిన వీడియోను రైల్వే శాఖ అధికారిక ట్విట్టర్ లో పంచుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ, కోలీవుడ్ నటుడు మాధవన్తో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం ఆ ఉద్యోగి చేసిన సాహసాన్ని అభినందిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. మయూర్ షెల్కే ధైర్యం ఓ ప్రాణాన్ని కాపాడింది వివరాల్లోకి వెళ్లితే ముంబై వాంఘాని రైల్వే స్టేషన్ 2 వ ప్లాట్ఫాం వద్ద తల్లితో కలిసి నడుచుకుంటూ వెడుతుండగా బ్యాలెన్స్ కోల్పోయిన ఓ చిన్నారి అకస్మాత్తుగా రైల్వే పట్టాలపై పడిపోయింది. మరోవైపు అటునుంచి రైలు వేగంగా దూసుకొస్తోంది. దీంతో చిన్నారి తల్లి ఏం చేయాలో అర్థం కాక పెద్దగా కేకలు వేసింది. పట్టాలపై పడిపోయిన చిన్నారిని గమనించిన రైల్వే ఉద్యోగి మయూర్ షెల్ఖే వేగంగా కదలిలాడు. రైలుకు ఎదురెళ్లి మరీ చిన్నారిని పట్టాలమీది నుంచి ఫ్లాట్ ఫారం మీదకు తరలించాడు అంతే వేగంగా తను కూడా పట్టాల పైనుంచి తప్పుకున్నాడు. ఇదంతా కొన్ని సెకన్ల వ్యవధిలోనే జరిగింది. షెల్కే సాహసంతో క్షణాల్లో ఆ చిన్నారి ప్రాణాలు దక్కాయి. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ సాహస వీడియోను రైల్వే శాఖ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సకాలంలో స్పందించిన రైల్వే ఉద్యోగి పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ( చదవండి: పట్టాలపై చిన్నారి..దూసుకొస్తున్న రైలు.. ఇంతలో ) Shri Mayur Shelkhe the ‘real life hero’ appreciated by staff & DRM of Mumbai Division of Central Railway. 💐💐 pic.twitter.com/8fCSR6S4Vy — Ministry of Railways (@RailMinIndia) April 19, 2021 -
బాలుడిని కాపాడిన రియల్ హీరోకు బహుమతి
-
పట్టాలపై చిన్నారి..దూసుకొస్తున్న రైలు.. ఇంతలో
సాక్షి, ముంబై: ప్రమాదం ఎప్పుడు ఎలా పొంచి ఉంటుందో తెలియదు. ముఖ్యంగా రైల్వే స్టేషన్ ప్లాట్ఫాంల వద్ద ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిసి పోవడం ఖాయం. అయితే శరవేంగా అక్కడున్న రైల్వే ఉద్యోగి స్పందించడంతో రెప్పపాటు కాలంలో ఒక చిన్నారి మృత్యుముఖం నుంచి బయటపడిన వైనం పలువురి ప్రశంసంలందుకుంటోంది. సంఘటన వివరాల్లోకి వెళ్లితే ముంబై వాంఘాని రైల్వే స్టేషన్ 2 వ ప్లాట్ఫాం వద్ద నడుచుకుంటూ వెడుతుండగా బ్యాలెన్స్ కోల్పోయిన ఓ చిన్నారి అకస్మాత్తుగా రైల్వే పట్టాలపై పడిపోయింది. మరోవైపు అటునుంచి రైలు వేగంగా దూసుకొస్తోంది. దీంతో చిన్నారితో పాటు ఉన్న వ్యక్తి ఏం చేయాలో అర్థం కాక పెద్దగా కేకలు వేస్తున్నారు. పట్టాలపై పడిపోయిన చిన్నారిని గమనించిన రైల్వే ఉద్యోగి మయూర్ షెల్ఖే వేగంగా కదలిలారు. రైలుకు ఎదురెళ్లి మరీ చిన్నారిని పట్టాలమీది నుంచి తప్పించి, అంతే వేగంగా తను కూడా తప్పుకున్నారు. ఇదంతా కొన్ని సెకన్ల వ్యవధిలోనే జరిగింది. దీంతో క్షణాల్లో ప్రాణాపాయం తప్పింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డుయ్యాయి. ఈ వీడియోను దక్షిణ మధ్య రైల్వే షేర్ చేసింది. ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సకాలంలో స్పందించిన రైల్వే ఉద్యోగి పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అటు రైల్వే మాన్ మయూర్ షెల్కే సాహసంపై కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ సంతోషం వ్యక్తం చేశారు. తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ చిన్నారిని ప్రాణాలను కాపాడటం గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు. Very proud of Mayur Shelke, Railwayman from the Vangani Railway Station in Mumbai who has done an exceptionally courageous act, risked his own life & saved a child's life. pic.twitter.com/0lsHkt4v7M — Piyush Goyal (@PiyushGoyal) April 19, 2021 -
పట్టాలపై చిన్నారి..సకాలంలో స్పందించిన రైల్వే ఉద్యోగి
-
చీటీల పేరుతో రూ. 2 కోట్ల టోకరా!
సాక్షి, విశాఖపట్నం: చీటీల పేరుతో నగరంలో భారీ మోసం జరిగింది. ఓ ప్రబుద్ధుడు చీటీల పేరుతో ప్రజల్ని నమ్మించి సుమారు రెండు కోట్ల రూపాయలు టోకరా వేశాడు. దీంతో 140 కుటుంబాలు లబోదిబోమంటున్నాయి. కొణతాల లక్ష్మీమాధురీ, అప్పలరాజు దంపతులు చంద్రానగర్లో నివాసముంటున్నారు. అప్పలరాజు రైల్వే ఉద్యోగి కావడంతో స్థానికులు, బంధువులు అతని వద్ద నమ్మకంగా చీటీ వేశారు. దీంతో రైల్వేలో సీనియర్ కమర్షియల్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న అప్పలరాజు కోట్ల రూపాయలు వసూలు చేసి చేతులెత్తేశాడు. ఇటీవల భార్య లక్ష్మీమాధురీ మరణంతో చెల్లింపుల బాధ్యత తీసుకున్న అప్పలరాజు నెలలు గడుస్తున్నా పైసా కూడా చెల్లించలేదు. డబ్బుల కోసం నిలదీయగా అప్పలరాజు రాత్రికి రాత్రే ఇల్లు మారిపోయినట్టు తెలిసింది. అతని వద్ద చీటీ వేసినవారు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. -
వేధింపులు భరించలేక రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
-
సెల్ఫీ వీడియో.. రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
సాక్షి, విజయవాడ: అధికారుల వేధింపుల భరించలేక రైల్వే ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. ఆత్మహత్య చేసుకునే ముందు ఆ ఉద్యోగి సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. పురుగుల మందు తాగారు. స్థానికులు రైల్వే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడిని రాయనపాడుకు చెందిన రైల్వే కీమేన్ రాజుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా నదిలోకి దూకి మహిళ ఆత్మహత్య ఇద్దరు బిడ్డలతో కలిసి మహిళ కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. ఈ సంఘటనలో తల్లి నాగస్వరూపారాణి మృతి చెందగా, ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. వీరిని పశ్చిమగోదావరి జిల్లా మార్తాండ గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని పోలీసుల విచారణలో వెల్లడైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు పిల్లలకు ఎలాంటి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. -
4 వేలు దాటిన మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కాఠిన్యం కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. మరణాల సంఖ్య 4 వేలు దాటేసింది. వరుసగా నాలుగో రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు.. ఒక్కరోజు వ్యవధిలోనే 6,977 కేసులు బయటపడ్డాయి. ఇండియాలో ఇప్పటిదాకా ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. గత 24 గంటల్లో 154 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసులు 1,38,845కు, మరణాలు 4,021కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 77,103. కరోనా బారినపడిన వారిలో 57,720 మంది చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. అంటే రికవరీ రేటు 41.57 శాతానికి పెరిగినట్లు స్పష్టమవుతోంది. కరోనా దెబ్బతో మహారాష్ట్ర వణికిపోతోంది. ఇప్పటిదాకా ఈ మహమ్మారి వల్ల దేశంలో 4,021 మంది మరణించగా, ఇందులో 1,635 మరణాలు మహారాష్ట్రలోనే సంభవించాయి. రైల్ భవన్లో మరో ఉద్యోగికి కరోనా రైల్వేశాఖ ప్రధాన కార్యాలయం రైల్ భవన్లో పని చేస్తున్న ఓ ఉద్యోగికి తాజాగా కరోనా సోకింది. ఇదే భవనంలో కేవలం రెండు వారాల లోపే ఐదుగురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడం కలకలం సృష్టిస్తోంది. మే 19వ తేదీ దాకా విధులకు హాజరైన నాలుగో తరగతి ఉద్యోగికి కరోనా సోకినట్లు సోమవారం వెల్లడైంది. అతడితో కాంటాక్టు అయిన తొమ్మిది మందిని అధికారులు హోం క్వారంటైన్కు తరలించారు. ఒక అధికారి నుంచి మరో అధికారి వద్దకు ఫైళ్లను తీసుకెళ్లడమే ఈ నాలుగో తరగతి ఉద్యోగి పని. ఈ ఫైళ్లు రైల్వే బోర్డు చైర్మన్తోపాటు రైల్వేశాఖ మంత్రిదాకా వెళ్తుంటాయి. దీంతో అతడిద్వారా ఇంకెవరికైనా కరోనా సోకిందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. వరుసగా కరోనా కేసులు బయటపడుతుండడంతో పూర్తిస్థాయిలో శానిటైజేషన్ చేయడానికి రైల్ భవన్ను మే 14, 15వ తేదీల్లో మూసివేశారు. ఇప్పుడు నాలుగో తరగతి ఉద్యోగికి కరోనా రావడంతో రైల్ భవన్ను మే 26, 27 తేదీల్లో మూసివేయాలని నిర్ణయించారు. -
కరోనా పాజిటివ్ రావడంతో ఆత్మహత్య
లక్నో : కరోనా పాజిటివ్ అని నిర్థారణ కావడంతో ఓ వ్యక్తి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొన్ని రోజులుగా క్వారంటైన్లోనే ఉన్న ఆయనకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ అని తేలింది. దీంతో తీవ్ర మానసిక సంఘర్షణకు లోనై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం..ఉత్తరప్రదేశ్లోని తుండ్లా నివాసి అయిన రైల్వే ఉగ్యోగి (55) ఎఫ్హెచ్ మెడికల్ కాలేజీలో క్వారంటైన్లో ఉంచారు. ఇదే కాలనీకి చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ అని తేలడంతో కాలనీ లోని మిగితా ఉద్యోగులను కూడా క్వారంటైన్లో ఉంచారు. మంగళవారం నిర్వహించిన పరీక్షలో సదరు ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో మెడికల్ కాలేజీలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి బందువులకు అందిస్తామని తుండ్లా ఎస్సై కెపి సింగ్ టోమర్ తెలిపారు. -
రైల్వే ఉద్యోగి రాహుల్ బలవన్మరణం
నేరేడ్మెట్: రైల్వే ఉద్యోగి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నేరేడ్మెట్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ నర్సింహస్వామి తెలిపిన మేరకు..ఓల్డ్ నేరేడ్మెట్కు చెందిన ఎస్. రాహుల్యాదవ్(27) లాలాగూడలోని రైల్వే వర్క్షాపులో పని చేస్తున్నాడు. ఈనెల 6న భార్యతో కలిసి రాహుల్ చెంగిచెర్లలోని అత్తారింటికి వెళ్లి, శనివారం వరకు అక్కేడే ఉన్నాడు. ఆదివారం రాత్రి ఓల్డ్నేరేడ్మెట్లోని సొంతింటికి వచ్చాడు. రాత్రి భార్య ఫోన్ చేసినా స్పందించలేదు. ఆమె వెంటనే ఓల్డ్నేరేడ్మెట్లో ఉంటున్న రాహుల్ బాబాయ్ కిషన్కు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆయన వచ్చి పిలిచినా స్పందించకపోవడంతో స్థానికులతో కలిసి తలుపులు పగులకొట్టి చూడగా గదిలోని ఫ్యాన్కు చీరతో ఉరివేసుకొని రాహుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మృతి
కోల్కతా : పశ్చిమ బెంగాల్కు చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు త్రినాంకుర్ నాగ్(26) విద్యుత్ షాక్తో మృతి చెందాడు. రైల్వే ఉద్యోగి అయిన త్రినాంకుర్ రైల్వే కార్ షెడ్లో పని చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు... కోల్కతాకు చెందిన త్రినాంకుర్కు చిన్న నాటి నుంచే బ్యాడ్మింటన్ పట్ల ఆసక్తి కనబరిచేవాడు. ఈ క్రమంలోనే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పలు టోర్నీల్లో విజేతగా నిలిచాడు. ప్రస్తుతం ఇతడు రాష్ట్ర డబుల్స్ నంబర్ వన్ ర్యాంకింగ్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. కాగా స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగం పొందిన త్రినాంకుర్ ప్రస్తుతం ఈస్ట్రన్ రైల్వేస్లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రైల్వే కార్ షెడ్లో విధులు నిర్వర్తిసున్న సమయంలో హై టెన్షన్ కరెంటు తీగ తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో అతడిని బీ ఆర్ సింగ్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గొప్ప ఆటగాడిని కోల్పోయాం ‘తన ప్రతిభతో రాష్ట్రానికి ఎన్నో పతకాలు సాధించి పెట్టిన నాగ్ ఇక లేడన్న విషయం చాలా బాధకరంగా ఉంది. అతడి మరణం బెంగాల్ బ్యాడ్మింటన్కు, రాష్ట్రానికి తీరని లోటు. గొప్ప క్రీడాకరుడిని కోల్పోయాం’ అని పశ్చిమ బెంగాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధికారి బిశ్వాస్ సంతాపం వ్యక్తం చేశారు. -
ఉద్యోగిని దుస్తులు మార్చుకుంటుండగా..
రామచంద్రపురం: రైల్వే స్టేషన్లోని ఓ గదిలో తోటి ఉద్యోగిని దుస్తులు మార్చుకుంటుండగా రహస్య కెమెరాతో చిత్రీకరించిన ఓ సూపరింటెండెంట్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం రైల్వేస్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రామచంద్రపురం రైల్వే స్టేషన్లో మహ్మద్ రియాజ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాడు. ఇదే స్టేషన్లో ఓ వివాహిత గేట్కీపర్గా సుమారు ఏడాది నుంచి విధులు నిర్వహిస్తోంది. ఇటీవల స్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్ ఎత్తివేయడంతో ఆ గదిలో మహిళా ఉద్యోగి దుస్తులు మార్చుకుని యూనిఫాం వేసుకుంటోంది. ఇది గమనించిన రియాజ్ గదిలోని ఓ ప్రదేశంలో రహస్య కెమెరాను అమర్చి చిత్రీకరణకు పాల్పడ్డాడు. గత కొంతకాలంగా ఈ తతంగం సాగుతుండగా బుధవారం గదిలో దుస్తులు మార్చుకుంటున్న సమయంలో కెమెరాకు ఉన్న చిన్న ఎల్ఈడీ బల్బు వెలుగు కనిపించడంతో అనుమానం వచ్చి తీసి చూడగా అసలు విషయం బయటపడింది. సూపరింటెండెంట్ ల్యాప్టాప్లో కెమెరాలో చిత్రీకరించిన వీడియోలను గుర్తించిన బాధితురాలు పైఅధికారులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సతీష్ తన సిబ్బందితో రామచంద్రపురం రైల్వే స్టేషన్కు చేరుకొని రహస్య చిత్రీకరణను నిర్ధారించారు. కెమెరాను, ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేసి రైల్వే డీఆర్ఎంకు నివేదిక అందించారు. డీఆర్ఎం ఆదేశాల మేరకు నిందితుడు మహ్మద్ రియాజ్ను సస్పెండ్ చేశారు. -
రైల్వే ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
లక్ష్మీపురం(గుంటూరు): గుంటూరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం వేధింపులు తాళలేక శనివారం గుంటూరు రైల్వే స్టేషన్లోని కమర్షియల్ సూపర్వైజర్ మొహమ్మద్ కరిముల్లా రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన ఘటన శనివారం రైల్వే వర్గాల్లో సంచలనం కలిగించింది. సమాచారం తెలుసుకున్న డీఆర్ఎం వి.జీ.భూమా తక్షణమే రైల్వే డీసీఈ (డివిజన్ సెక్యూరిటీ కమిషనర్) ఎలీషా, సీనియర్ ఏసీఎం అలీ ఖాన్, సంబంధిత అధికారులను జరిగిన విషయం గురించి ఆరా తీయాల్సిందిగా ఆదేశించారు. దీంతో హుటాహుటిన డీఎస్ఈ, ఏఎస్ఎం, ఆర్పీఎఫ్ సీఐ శ్రీనివాసరావు, చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ గుంటూరు రైల్వే స్టేషన్కు చేరుకుని కరిముల్లాతో మాట్లాడి బుజ్జగించే యత్నం చేశారు. తనను సీనియర్ డీసీఎం ఉమామహేశ్వరరావు ఉద్దేశపూర్వకంగానే వేధిస్తున్నారని, ఇక తాను బతకనని కరిముల్లా వారి ఎదుట కన్నీటి పర్యంతం అయ్యారు. దీంతో డీఎస్ఈ ఎలీషా సీనియర్ డీసీఎంపై తాను డీఆర్ఎంకు నివేదికను సమర్పిస్తానని కరిముల్లాకు భరోసా ఇచ్చారు. బాధితుడు మొహమ్మద్ కరిముల్లా తెలిపిన వివరాల ప్రకారం... కరిముల్లా గతంలో సీనియర్ డీసీఎం కార్యాలయంలో కమర్షియల్ ఇన్స్పెక్టర్గా వి«ధులు నిర్వర్తించారు. ఆ సమయంలో డీఆర్ఎం విజయశర్మ వద్ద సీసీగా తీసుకున్నారు. డీఆర్ఎం చెప్పిన పనులు అన్నీ చేసేవారు. అది సీనియర్ డీసీఎం కె.ఉమామహేశ్వరరావుకు నచ్చేది కాదు. డీఆర్ఎం విజయశర్మ గుంటూరు డివిజన్ నుంచి బదిలీ అయి వెళ్లినప్పటి నుంచి సీనియర్ డీసీఎం ఉమామహేశ్వరరావు కక్ష సాధింపుగా కరిముల్లాను నిత్యం వేధింపులకు గురి చేసే వారు. విజయశర్మ బదిలీ తర్వాత కరిముల్లాను బుకింగ్ ఆఫీసులోకి బదిలీ చేశారు. కరిముల్లా తాను న్యూరో సమస్యతో బాధపడుతున్నానని, బుకింగ్ ఆఫీసు నుంచి బదిలీ చేయమని సీనియర్ డీసీఎంను వేడుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో గత నెల మూడో తేదీన సీనియర్ డీసీఎం ఉమామహేశ్వరరావు తనను వేధిస్తున్నారంటూ డీఆర్ఎం వీజీ భూమాకు ఫిర్యాదుచేశారు. మెంటల్ అని చెప్పించి ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించారుఐదు నెలల క్రితం కరిముల్లా ఆరోగ్యం బాగో లేదని రైల్వే ఆసుపత్రికి చికిత్సకు వెళితే సీనీయర్ డీసీఎం ఉమామహేశ్వరరావు రైల్వే డాక్టర్లపై ఒత్తిడి చేసి తనకు న్యూరో సమస్య కాదని మతిస్థిమితం లేదని చెప్పి ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి తరలించారు. ఎర్రగడ్డ ఆసుపత్రిలో 15 రోజులు చికిత్స చేసి నాకు ఎలాంటి మతి స్థిమితం లేదని తేల్చి రిపోర్ట్ ఇచ్చారని కరిముల్లా తెలిపారు.సీనియర్ డీసీఎం వేధింపుల వలనే తాను చనిపోదామని నిర్ణయించుకున్నానని కరిముల్లా తెలిపారు. -
రైలు కింద రీపేర్ చేస్తుండగా ఒక్కసారిగా..
-
730 రోజులు లీవ్ అడిగిన ఉద్యోగి
లాహోర్: ఓ ఉద్యోగి రాసిన లీవ్ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఎందుకంటే సదురు ఉద్యోగి లీవ్ అడిగింది ఏ పది రోజులో, ఇరవై రోజులో కాదు.. ఏకంగా 730 రోజులు(అంటే రెండేళ్లు). దీనికి అతడు చెప్పిన కారణం కూడా ఆశ్చర్యకరంగానే ఉంది.. అతడు పనిచేస్తున్న శాఖ బాధ్యతలు చేపట్టిన మంత్రి ప్రవర్తన నచ్చకపోవడం వల్లనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. పాకిస్తాన్ రైల్వేస్లో మహమ్మద్ హనీఫ్ గుల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. అయితే ఇటీవల రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన షేక్ రషీద్ అహ్మద్పై కోపంతో హనీఫ్ 730 రోజుల సెలవు కోసం దరఖాస్తు చేశారు. అంతేకాకుండా తనకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కోరారు. రషీద్కు వృత్తి పట్ల నిబద్ధత లేదని, ఆయనకు రైల్వే మంత్రికి కావాల్సిన నైపుణ్యాలు లేవని, పాక్ ప్రజలకు సేవ చేసే వ్యక్తిగా తాను ఆయనతో కలిసి పనిచేయలేనని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆగస్టు 26వ తేదీన ఆయన ఈ లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొందరు హనీఫ్కు మద్దతుగా, మరికొందరు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. కాగా హనీఫ్ లీవ్ లెటర్కు ఆమోదం లభించలేదని తెలుస్తోంది. సోమవారం హనీఫ్ను చీఫ్ కమర్షియల్ మేనేజర్ పదవి నుంచి తొలగించి.. ఆ స్థానంలో అఘా వాసీమ్ను నియమించారు. హనీఫ్ సెలవు కోసం దరఖాస్తు చేసే ముందు రషీద్ ఆధ్వర్యంలో రైల్వే శాఖ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైల్వే శాఖ పనితీరుపై ఆయన అధికారులను మందలించినట్టు సమాచారం. -
పెళ్లిచూపులకు వచ్చి..
సంతబొమ్మాళి: ఒడిశాలోని బలంగిరిలో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్న గిన్ని వైకుంఠరావు(35) పెళ్లి చూపుల కోసం తన స్వగ్రామమైన నౌపడకు మూడు రోజుల క్రితం వచ్చాడు. పెళ్లి చూపులు ముగించుకుని శుక్రవారం రాత్రి నౌపడ రైల్వే స్టేషన్లో రైలులో బలంగిరి బయల్దేరారు. రాయిఘడ వద్ద వాటర్ బాటిల్ కోసం రైలు దిగాడు. కొద్దిసేపటికే రైలు బయలుదేరడంతో బోగీ ఎక్కే ప్రయత్నంలో కాలు జారి పడిపోయాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన వైకుంఠరావును రాయిఘడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. అక్కడ పోస్టుమార్టం పూర్తయిన తర్వాత శనివారం స్వగ్రామమైన నౌపడ వ చ్చి దహన సంస్కారాలు చేశారు. కుమారుడు మృతి చెందడంతో తల్లి రమణమ్మ బోరున విలపిస్తోంది. -
తిరుపతిలో రైల్వే ఉద్యోగి ఘరానా మోసం
-
ప్రాణాలు విడిచిన రైల్వే ఉద్యోగి?
ఒంగోలు: రైలులో నుంచి జారిపడి ఓ యువకుడు మృతిచెందిన ఘటన ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు రైల్వే స్టేషన్కు సమీపంలో జరిగింది. డౌన్లైన్లో జరిగిన ఈ ఘటనలో యువకుడు పడిపోయిన తరువాత మృతదేహాన్ని రైలు ఈడ్చుకువెళ్లినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. మృతదేహం కూడా ముక్కలుగా అయిపోయి చూసేందుకు భయంకరంగా మారింది. మృతుని వయస్సు 26 సంవత్సరాలు ఉండవచ్చని అంచనావేస్తున్నారు. మృతదేహం వద్ద లభించిన గుర్తింపు కార్డు ఆధారంగా కె.మణికంఠారెడ్డిగా భావిస్తున్నట్లు ఒంగోలు జీఆర్పీ ఎస్సై అహ్మద్బాషా తెలిపారు. తెలంగాణాలోని మౌలాలిలో ఉన్న జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో 5/18 బ్యాచ్లో ప్రొబెషన్ శిక్షణ పూర్తిచేసుకున్నట్లు గుర్తింపు కార్డు ద్వారా తెలుస్తోంది. యువకుడ్ని గుర్తించిన వారు ఒంగోలు జీఆర్పీ ఎస్సై సెల్ నంబర్ 9440627647ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. రైల్వే ట్రాక్ పక్కన.. మార్కాపురం రూరల్: రైల్వే ట్రాక్ పక్కన గుర్తు తెలియన వ్యక్తి మృత దేహం లభ్యమైన సంఘటన మండలంలోని గోగులదిన్నె గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ రంగ స్వామి తెలిపిన వివరాల ప్రకారం మార్కాపురం రైల్వే స్టేషన్ నుంచి కంభం వైపు వెళ్లే రహదారిలో గోగులదిన్నె గ్రామం మీదుగా వెళ్లే రైల్వే ట్రాక్ పక్కన మృత దేహం లభ్యం అయింది. మృతునికి దాదాపు 40 సంవత్సరాలుంటాయని, ఇతని వద్ద ఎటు వంటి ఆధారాలు లేవని, బ్లూ జీన్స్ ప్యాంట్తో పాటు వంకాయ కలర్ ఉన్న పుల్ హ్యాండ్స్ షర్టు ధరించి ఉన్నాడని తెలిపారు. రైలు గేటు వద్ద కుర్చుని ఉండటం వలన ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం తెలిస్తే 9908093609 నంబర్ను సంప్రదించాలన్నారు. మృత దేహాన్ని స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
యువతిని మోసం చేసిన రైల్వే ఉద్యోగి అరెస్ట్
కోనేరు సెంటర్ (మచిలీపట్నం) : ప్రేమ పేరుతో యువతిని మోసగించిన రైల్వే ఉద్యోగిని ఇనగుదురుపేట పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. సీఐ ఎస్కే నభీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బంటుమిల్లికి చెందిన జోగి హరికృష్ణ విజయవాడ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. మచిలీపట్నంలో మరదలు వరస అయిన ఓ యువతిని ప్రేమించాడు. పెళ్ళి చేసుకుంటానని నమ్మించాడు. మాయమాటలతో లొంగ దీసుకున్నాడు. శారీరకంగా అనేకమార్లు ఆమెను కలిశాడు. పెళ్ళి విషయానికి వచ్చేసరికి కట్నం కోసం అడ్డం తిరిగాడు. పది లక్షలకుపైగా కట్నం ఇస్తే తప్ప పెళ్ళి చేసుకోనని చెప్పాడు. యువతి తల్లితండ్రులు ఈ విషయాన్ని పెద్దల సమక్షంలో పెట్టి చర్చలు జరిపారు. అయినా హరికృష్ణ ఒప్పుకోలేదు. గత్యంతరం లేని బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై ఈ నెల 16న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు హరికృష్ణను మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. హరికృష్ణతో పాటు అతని తల్లితండ్రులను కూడా కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ నభీ వివరించారు. ఈ సమావేశంలో ఎస్సై కుమార్, స్టేషన్ సిబ్బంది ఉన్నారు. -
భార్య కాళ్లు చేతులు నరికి భర్తని కిడ్నాప్
సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలోని పిఠాపురంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం అర్థరాత్రి పిఠాపురం గోపాలబాబ ఆశ్రమం వద్ద కొంతమంది దుండగులు దంపతులపై దాడి చేశారు. ముమ్మడి సుబ్రమణ్యం అనే వ్యక్తి అతని భార్య సుబ్బలక్ష్మి నిద్రిస్తున్న సమయంలో దుండగులు నేరుగా ఇంట్లోకి వెళ్లి వారిపై స్ప్రే కొట్టారు. అనంతరం దుండగులు సుబ్బలక్ష్మి కాళ్లు, చేతులు అతి కిరాతకంగా నరికి, సుబ్రమణ్యంని కిడ్నాప్ చేశారు. మత్తులో ఉన్న సబ్బలక్ష్మికి స్పృహలోకి వచ్చిన తరువాత ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు బాధితురాలిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుబ్రమణ్యం బిలాస్పూర్లో రైల్వే ఉద్యోగం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భార్య కాళ్లు చేతులు నరికి భర్తని కిడ్నాప్
-
ఓ రైల్వే ఉద్యోగితో ఉన్న చనువుతోనే..
ధర్మవరం అర్బన్: ధర్మవరంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన హత్య సంచలనం రేపింది. ఓ రైల్వే ఉద్యోగితో భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని తెలుసుకున్న భర్త ఎంత వారించినా ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పాటు నిరంతరం ఫోన్లో మాట్లాడుతుండటాన్ని జీర్ణించుకోలేకనే కొడవలితో భార్యను హత్య చేసినట్లు తెలుస్తోంది. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.... గుట్టకిందపల్లికి చెందిన కురుబ గోవర్ధన్కు కందుకూరుకు చెందిన ప్రభావతిని ఇచ్చి ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేశారు. రెండేళ్లపాటు వీరి సంసారం సజావుగా సాగింది. వారికి అయిదేళ్ల కుమార్తె లాస్య ఉంది. రైల్వే పాయింట్మెన్గా ఉన్న గోవర్ధన్కు ఆరేళ్ల క్రితం రైల్వేగార్డ్గా పదోన్నతి లభించింది. ఈ క్రమంలో విధుల్లో భాగంగా దూర ప్రాంతాలకు వెళ్లే గోవర్ధన్ నాలుగురోజులు, వారానికోసారి ఇంటికొచ్చేవాడు. ఈ క్రమంలో గుట్టకిందపల్లికి చెందిన మరో రైల్వే ఉద్యోగితో ప్రభావతికి పరిచయం ఏర్పడి క్రమంగా వారి మధ్య చనువు పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసినట్లు బంధువుల ద్వారా తెలుస్తోంది. ఈ విషయంపై భార్య,భర్తల మధ్య తరచూ గొడవలు వచ్చేవి. దీంతో నాలుగేళ్లపాటు పుట్టింటికి వెళ్లిన ప్రభావతి విడాకుల వరకు వచ్చింది. చివరికి పెద్దమనుషులు, బంధువులు కల్పించుకుని ఇరువురికి సర్దిచెప్పడంతో లోక్అదాలత్లో భార్య, భర్తలు రాజీ అయినట్లు సమాచారం. అయిదు రోజుల క్రితం భర్త వద్దకు వచ్చిన ప్రభావతి బుధవారం రాత్రి భర్త ఇంటికి వచ్చే సరికి ఫోన్లో ఎవరితోనూ మాట్లాడుతున్నట్లు గమనించాడు. దీంతో ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు నీ పద్ధతి మార్చుకోవా అంటూ గొడవకు దిగాడు. గొడవ పెద్దది కావడంతో ఆగ్రహంతో గోవర్ధన్ ఇంట్లో ఉన్న కొడవలిని తీసుకుని భార్యపై దాడికి యత్నించాడు. ఆమె ఇంటి నుంచి బయటకు పరుగులు తీయగా వెంబడించి ఇంటి సమీపంలో రహదారిపైన విచక్షణారహితంగా కొడవలితో నరికి దారుణంగా హత్య చేశాడు. అర్ధరాత్రి భార్యను హత్య చేసిన అనంతరం పరారైన గోవర్ధన్ గురువారం ఉదయం పట్టణ పోలీస్స్టేషన్కు వెళ్లి గోవర్ధన్ లొంగిపోయినట్లు తెలిసింది. గోవర్ధన్ను సస్పెండ్కు రంగం సిద్ధం భార్యను దారుణంగా హత్య చేసిన రైల్వే గార్డ్ గోవర్ధన్ను సస్పెండ్ చేసేందుకు రైల్వే ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేశారు. పట్టణ పోలీసుల నుంచి ఎఫ్ఐఆర్ నకలు తీసుకున్న వెంటనే గోవర్ధన్ను సస్పెండ్ చేయనున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
అసభ్య ప్రవర్తనపై రైల్వే ఉద్యోగి అరెస్టు
రాజమహేంద్రవరం సిటీ: రైలులో ప్రయాణిస్తున్న తోటి మహిళా ప్రయాణికురాలిపై అసభ్యంగా ప్రవర్తించి, టిక్కెట్ కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించాడనే ఫిర్యాదుతో అసిస్టెంట్ టెక్నికల్ అధికారి సతీష్ను బుధవారం రాజమహేంద్రవరం ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోనికి తీసుకుని అరెస్ట్ చేశారు. అసభ్య ప్రవర్తన నేరం ఆర్పీఎఫ్ పరిధిలో కేసు నమోదుకు అవకాశం లేకపోవడంతో రెండో కేసుగా జీఆర్పీకి అప్పగించారు. ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ రామయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం రాత్రి మచిలీపట్నం–విశాఖపట్నం ప్యాసింజర్ రైల్లో ఎస్–1 బోగీలో ప్రయాణిస్తున్న చోడిశెట్టి అనూషపై అదే రైల్లో ప్రయాణిస్తున్న రైల్వే అసిస్టెంట్ టెక్నికల్ అధికారి సతీష్ అసభ్యంగా ప్రవర్తించడంతో రైల్వే టిక్కెట్ కలెక్టర్కు ఫిర్యాదు చేసిందని, ఆ విషయం అడిగేందుకు వచ్చిన టీసీపై సైతం తిరగబడటంతో తోటి ప్రయాణికుల సహాయంతో 182కు ఫిర్యాదు చేశారన్నారు. రైలు రాజమహేంద్రవరం చేరే సమయానికి ప్లాట్ఫామ్ పైకి చేరుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు అప్రమత్తమై సతీష్ను అదుపులోనికి తీసుకున్నామన్నారు. టిక్కెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న నేరానికి, టీసీపై ఎదురుదాడికి దిగిన నేరానికి ఉన్నతాధికారుల ఆదేశాలతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ రామయ్య తెలిపారు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నేరం ఆర్పీఎఫ్ పరిధిలో లేక పోవడంతో ఆ నేరాన్ని ప్రభుత్వ రైల్వే పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు జీఆర్పీ డీఎస్పీ ఎస్ మనోహరరావును వివరణ కోరగా సంఘటన జరిగిన ప్రదేశం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రాంతం లోనిదని, ముద్దాయిని అదుపులోనికి తీసుకుని భీమవరం తరలించినట్లు తెలిపారు. భీమవరం పోలీసులు కేసునమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు పంపనున్నట్లు తెలిపారు. -
అభినయ ఖిల్లా ‘జబీవుల్లా’
గుంతకల్లు: అభినయంలో అందెవేసిన చేయి రిటైడ్ రైల్వే ఉద్యోగి జబీవుల్లా. జబీవుల్లా నటనకు ప్రతి ఒక్కరు తన్మయత్వం చెందాల్సిందే. తను స్టేజీపైకెక్కితే చాలు.. అవార్డుల తన చెంతకు రావాల్సిందే. ఎన్నో నాటకాల్లో ఇప్పటిదాకా ఏకంగా 50కి పైగా అవార్డులు, ప్రశంసా పత్రాలు, షీల్డులు దక్కించుకున్నారు. తాజాగా 2017కు అనంతపురం జిల్లా స్థాయి బళ్లారి రాఘవ అవార్డు ఎంపిక కావడం గమనార్హం. ఆగస్టు 3న బళ్లారి రాఘవ అవార్డును ఆయనకు అందజేయనున్నారు. గుంతకల్లు రైల్వే డివిజన్లో కేంద్ర కార్యాలయంలో క్రాప్ట్మెన్(సీనియర్ సెక్షన్ ఇంజనీర్)గా పని చేస్తూ మూడేళ్ల క్రితం ఉద్యోగవిరమణ చేసిన జబీవుల్లా పూర్తి పేరు మహమ్మద్ ఇస్మాయిల్ జబీవుల్లా. మద్రాస్ సదరన్ మరాఠా రైల్వేస్లో డ్రైవర్గా విధులు నిర్వహించిన సయ్యద్ జబీవుల్లా బషీరున్నీషా దంపతులకు రెండవ సంతానంగా 1954 ఏప్రిల్ 8వ తేదీన తమిళనాడులోని అరక్కోణంలో జన్మించాడు. జబీవుల్లా తండ్రి ఉద్యోగ రిత్యా ఆంధ్రాకు వచ్చి స్థిరపడ్డాడు. 1970లో రెండవ తరగతి పూర్తి చేసుకున్న అనంతరం తొలిసారిగా కడప జిల్లా నందలూరులో విశ్వాత్తాపం అనే నాటకంలో ప్రతి నాయకుడి పాత్రను పోషించి నాటక జీవితాన్ని అరంభించాడు. ఈ నాటకంలో ఇతర నటనకు ఉత్తమ విలన్గా అవార్డు వచ్చింది. 1971లో గుంతకల్లులో చంద్రయ్య అనే నటుడు నిర్వహిస్తున్న రవీంద్ర ఆర్ట్స్లో చేరి ఉత్తమ కళాకారులుగా రాణించిన సీపీ రామ్మూర్తి, కోటేశ్వరరావు ఆనంద్, పంజా ప్రసాద్రావు సహకారంతో అనేక నాటకాల్లో నటించారు. ముఖ్యంగా ప్రఖ్యాత హాస్యనటుడు దివంగత గురుమూర్తి వద్ద హాస్యం నుంచి ట్రాజడీకి వెళ్లే కళను నేర్చుకున్నాడు. ఇక నాటి నుంచి అనేక హృదయ విదారక సన్నివేశాల్లో నటించి ప్రేక్షకులను రంజింపజేశారు. ప్రధానంగా రైల్వే ఉద్యోగిగా రైల్వే ఆస్తుల భద్రత, ప్రయాణీకుల రక్షణపై, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రమాదాలతో జరిగే నష్టాలు తదితర అంశాలపై అనేక నాటకాలు రచించడంతో పాటు ఏక పాత్రాభినయాలు చేసి అధికారులను మెప్పించారు. 2000లో రైలు మార్గాలపై ఉండే మనిషి కాపలా ఉండని లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద జరిగే ప్రమాదాలపై డాక్యుమెంటరీ చిత్రానికి అప్పటి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ స్పందించి ఉత్తమ నటుడిగా ప్రశంసాపత్రాన్ని అందజేశారు. చాలా అనందంగా ఉంది బళ్లారి రాఘవ అవార్డు(2017)కు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. నాటకాల్లో అభినయించడం వల్ల జీవితం ఎంతో హాయిగా గడపడంతో పాటు మంచి నడవడిక అలవడింది. – జబీవుల్లా, రిటైడ్ రైల్వే ఉద్యోగి -
కొనసాగుతున్న టీడీపీ నాయకుల దౌర్జన్యకాండ
రైల్వే క్యాటరింగ్ కార్మికుడిపై హత్యాయత్నం ధర్మవరం : ధర్మవరంలో టీడీపీ నాయకుల అరాచకాలకు అంతేలేకుండా పోతోంది. రైల్వేస్టేషన్లో వడలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న కార్మికులపై ప్రతాపం చూపిస్తూ రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారు. గురువారం రోజున రైల్వే క్యాటరింగ్కార్మికులపై దాడి చేసి, క్యాంటీన్ను ధ్వంసం చేసి ఒక రోజు కూడా గడవకనే మరోసారి దాడులకు తెగబడ్డారు. తాజాగా శుక్రవారం ఉదయం రోజు కూలి నిమిత్తం ధర్మవరం మండలం బడన్నపల్లి నుంచి రైల్వేస్టేషన్కు బయలు దేరి వస్తున్న క్యాటరింగ్ కార్మికుడు రామాంజనేయులును మార్గంమధ్యలో తారకరామాపురంలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద టీడీపీ కార్యకర్తలు అటకాయించి మారణాయుధాలతో విచక్షణా రహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు ప్రతిఘటించడంతో వారు అక్కడినుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన రామాంజనేయులును స్థానికులు ఆటోలో ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తలకు, భుజానికి తీవ్రగాయాలయ్యాయని, రక్తస్రావం అ«ధికంగా ఉందని వైద్యులు తెలపడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యులు టీడీపీ నాయకుడు కొత్తపేట ఆదితో పాటు ఆది, శేఖర్, మంజు, వెంకటేశ్, హరీష్, రషీద్, సూరీలపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడు మాట్లాడుతూ కొత్తపేట ఆదితో పాటు అతని అనుచరులు రైల్వేస్టేషన్లో తనతో పాటు ఇతర కార్మికులను పని చేయవద్దని, చేస్తే చంపుతామని బెదిరిస్తున్నారని తెలిపాడు. వారి నుంచి రక్షించాలని వేడుకున్నాడు. -
అమ్మా, నాన్న.. క్షమించండి!
– పూడిచెర్ల యువకుడు కాకినాడలో ఆత్మహత్య ఓర్వకల్లు: కష్టపడి చదివి రైల్వే శాఖలో ఎనిమిది నెలల క్రితం ఉద్యోగం సంపాదించిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘ అమ్మ నాన్న క్షమించండి.. నా చావుకు ఎవరూ కారకులు కాదు’ అని సూసైడ్ నోట్ రాశాడు. పూడిచెర్ల గ్రామానికి చెందిన గొల్ల వెంకటరాముడు, లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. కుమారులను ప్రయోజకులను చేయాలని వెంకటరాముడు అప్పులు చేసి చదివించాడు. అప్పుల భారంతో తమకున్న మూడు ఎకరాల భూమిని కూడా అమ్మేశాడు. తల్లిదండ్రుల కష్టాన్ని వమ్ము చేయకుండా పెద్ద కుమారుడు గోపాల్(27) ఏడాది క్రితం ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. తొలి ప్రయత్నంలోనే రైల్వేలో ఎనిమిది నెలల క్రితం ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రైల్వే విభాగంలో ట్రాక్మెన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో డిసెంబరు 31వ తేదీన పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులకు సమాచారం వచ్చింది. విషయం తెలిసిన వెంటనే కుటుంబీకులు హుటాహుటిన కాకినాడకు చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీసినా ఫలితం లభించలేదు. దీంతో గోపాల్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అక్కడి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిర్వహించారు. మంగళవారం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. ఉద్యోగం చేసి తమ కష్టాలు తీరుస్తారనుకున్న కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
కుటుంబ కలహాలతో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
చిన్నశంకరంపేట: కుటుంబ కలహాలతో వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చాకలి యాదయ్య(50) రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో గత కొన్నిరోజులుగా కుటుంబ కలహాలతో సతమతమవుతూ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
తండ్రికి పిండ ప్రదానం చేస్తూ....
విజయవాడ: కృష్ణా పుష్కరాల్లో తండ్రికి పిండ ప్రదానం చేస్తూ ఓ రైల్వే ఉద్యోగి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి అతడిని ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే అతడు మరణించాడు. ఈ సంఘటన విజయవాడలోని గొల్లపుడి ఘాట్ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. కృష్ణా పుష్కరాల్లో భాగంగా విజయవాడకు చెందిన కామేశ్వరావు (48) ఈ రోజు ఉదయం తండ్రికి పిండ ప్రదానం చేసేందుకు గొల్లపూడి ఘాట్కు వచ్చారు. తండ్రికి పిండ ప్రదానం చేస్తున్న సమయంలో తీవ్ర గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించే క్రమంలో మరణించారు. అక్కడే ఉన్న పోలీసులు అతడి వద్ద ఉన్న ఐడీ కార్డు ద్వారా రైల్వే ఉద్యోగిగా గుర్తించారు. విజయవాడలోని రైల్వే కోచ్ డిపోలో సీనియర్ సెక్షన్ అదికారిగా కామేశ్వరరావు విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కామేశ్వరరావు మరణ వార్తను అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. -
బిలియార్డ్లో రైల్వే ఉద్యోగి హవా
విజయవాడ స్పోర్ట్స్ : సికింద్రాబాద్లో జరుగుతున్న దక్షిణ మధ్య రైల్వే ఇంటర్ డివిజనల్ బిలియార్డ్ టోర్నీలో విజయవాడ డివిజన్ ఉద్యోగి ఎల్.దుర్గాప్రసాద్ విజయపరంపరను కొనసాగిస్తున్నారు. గురువారం జరిగిన బిలియార్డ్స్–09 బాల్ విభాగంలో వ్యక్తిగత చాంపియన్షిప్ను దుర్గాప్రసాద్ కైవసం చేసుకున్నారు. ఫైనల్ మ్యాచ్లో ఎల్.దుర్గాప్రసాద్ 6–2 తేడాతో పీజీ బెన్నిపై విజయం సాధించారు. అంతకుముందు జరిగిన సెమీస్లో గోవిందరాజ్రెడ్డిపై 0–6 తేడాతో దుర్గాప్రసాద్ గెలుపొందారు. -
పట్టాలపై తల పెట్టి రైల్వేఉద్యోగి..దారుణం
అడ్డగుట్ట: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ రైల్వే ఉద్యోగి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్ రైల్వే పోలీస్స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కథనం ప్రకారం...లాలాగూడ వర్క్షాప్లో కళాసిగా పని చేస్తున్న రామోళ్ల రాజేశ్వర్రావు కొంత కాలం క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఉద్యోగానికి కూడా సరిగ్గా వెళ్లలేకపోతున్నాడు. ఈ క్రమంలో జీవితం పై విరక్తి చెందిన రాజేశ్వర్ ఆదివారం ఉదయం లాలాగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ వస్తుండగా పట్టాలపై తలపెట్టి పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. -
రైల్వే కార్మికుల సమ్మె వాయిదా
- ఎన్ఎఫ్ఐఆర్ జాతీయ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య వెల్లడి హైదరాబాద్: ఏడో వేతన సంఘం ఏర్పాటుపై రైల్వే యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ రావడంతో కార్మికుల సమ్మెను వాయిదా వేసినట్లు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ జాతీయ ప్రధానకార్యదర్శి మర్రి రాఘవయ్య తెలిపారు. గురువారం కాచిగూడలోని దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ కార్యాలయంలో జరిగిన కాచిగూడ హెడ్ క్వార్టర్స్, ఐదు బ్రాంచీల కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైల్వే ఉద్యోగులు, కార్మికుల వేతనాలు, ఇతర సమస్యల పరిష్కారానికి ఏడో వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్రం ఇచ్చిన హామీతో 4 నెలలపాటు సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈలోగా సమస్యలు పరిష్కారంకాని పక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని, సమ్మె చేపడతామని ఆయన హెచ్చరించారు. రైల్వేలో విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తున్నామన్నారు. రైల్వే వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి యత్నిస్తే ఊరుకోబోమని హెచ్చరించా రు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ సంఘ్ హైదరాబాద్ డివిజన్ డిప్యూటీ డివిజనల్ కార్యదర్శి సీహెచ్ వెంకటేశ్వర్లు, నాయకులు భరణి భానుప్రసాద్, భిక్షపతి, కేవీఆర్ ప్రసాద్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లింట్లో పట్టపగలే దొంగలు పడ్డారు!
ఆదిలాబాద్ క్రైం: ఇంటికి తాళం వేసి అందరూ ఫంక్షన్ హాల్లో జరిగే వివాహ వేడుకకు వెళ్లారు. అది గమనించిన దొంగలు ఇదే సరైన సమయం అనుకున్నారేమో.. అదనుచూసి ఇంట్లో అందినకాడికి ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పట్టణంలోని రైల్వేక్వార్టర్స్లో ఉండే రైల్వే ఉద్యోగి రఘునాథ్ కూతురు వివాహం స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులంతా ఇంటికి తాళం వేసి పెళ్లి వేడుకకు వెళ్లారు. ఈ సమయంలో గుర్తు తెలియని దుండగులు తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో ఉంచిన రూ.80వేల నగదుతోపాటు మూడు తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. వివాహ వేడుక అనంతరం ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులు దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అదనపు కట్నం కోసం భర్తే హతమార్చాడని..
విజయవాడ: నగరంలోని అయోధ్య నగర్లో రైల్వే ఉద్యోగి భార్య అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. అదనపు కట్నం కోసం ఆమె భర్తే హతమార్చాడని మృతురాలి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చూరీకి తరలించగా బంధువులు ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో మార్చూరీ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రైలు కిందపడి ఉద్యోగి మృతి
కారేపల్లి: రైలు దిగబోతూ ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి చక్రాల కింద పడి మృతి చెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం ఏర్యాతండాకు చెందిన నూనావత్ రాములు (45) రైల్వేలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం మణుగూరు ప్యాసింజర్ రైలు ఎక్కిన అతడు కారేపల్లి స్టేషన్లో రైలు దిగబోతూ కాలు జారి పట్టాలపై పడిపోయాడు. రైలు అతడి పై నుంచి వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. -
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
ధర్మవరం: అనంతపురం జిల్లాలోని ధర్మవరం రైల్వేస్టేషన్లో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి.. ధర్మవరం పట్టణం కొత్తపేటకు చెందిన రైల్వే రిటైర్డ్ ఉద్యోగి నారాయణస్వామి(56)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ కల నెరవేరలేదు : రంగనాథ్
(2014లో రంగనాథ్ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ నుంచి... కొంత భాగం) రంగనాథ్ జననం :1949 మరణం :19-12-2015 సినిమాల్లోకి రాకముందు మీరు రైల్వే ఉద్యోగి. బంగారం లాంటి ఉద్యోగం రిజైన్ చేసి వచ్చానని ఎప్పుడైనా ఫీలయ్యారా? నేనసలు రిజైన్ చేయలేదు. ‘రిజైన్ చేస్తే మళ్లీ నిన్ను ఉద్యోగంలో తీసుకోరు’ అని శ్రేయోభిలాషులు చెప్పడంతో రిజైన్ చేయకుండానే సినిమాలు చేస్తూ వచ్చా. అయితే ఆఫీస్ నుంచి లెటర్లు వస్తుండేవి. చివరకు ‘నిన్ను ఉద్యోగం నుంచి ఎందుకు తీసేయకూడదు’ అని ఓ ఉత్తరం వచ్చింది. అప్పుడు ఉద్యోగానికి మంగళం పలికాను. నాకంత ధైర్యం రావడానికి కారణం... అప్పటికే నాకు నాలుగైదు హిట్లు వచ్చేశాయి. మొత్తం ఎన్ని సినిమాలు చేసుంటారు? మూడొందలకు పైచిలుకే. అందులో 60 సినిమాల్లో హీరోగా చేశాను. ఒకప్పుడు మీరు రొమాంటిక్ హీరో కదా. అప్పట్లో ఏమైనా ప్రపోజల్స్ వచ్చేవా? ఆ ఛాన్స్ లేదు. నాకు అప్పటికే పెళ్లయిపోయి, పిల్లలు కూడా పుట్టేశారు. అలా కాకపోతే మీరన్నట్లు ప్రపోజల్స్ వచ్చేవేమో! క్యారెక్టర్ ఆర్టిస్టుగా విరివిగా సినిమాలు చేస్తునప్పుడు ఓ చిత్రమైన అనుభవం ఎదురైంది. షూటింగ్ పని మీద మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చాను. ఓ గుళ్లో షూటింగ్. పేకప్ చెప్పేశారు. గబగబా కారెక్కి వెళ్లబోతున్నాను. అంతలో ‘రంగనాథ్గారూ’ అనే పిలుపు వినబడింది. ఓ మధ్యవయస్కురాలు పరుగు లాంటి నడకతో వచ్చింది. ‘ఎన్నాళ్లకు చూశానండీ’ అని ఉద్వేగానికి లోనైంది. ఆమె కంటి నిండా నీరు. ఆమె పక్కనే చిన్న పాప ఉంది. ‘అమ్మమ్మా! వెళ్దాం పదా’ అంటోంది. అంటే అప్పటికే ఆమె అమ్మమ్మ అయిపోయిందన్నమాట. నేను హీరోగా చేస్తున్న రోజుల్లో ఆమె నా అభిమాని అని అర్థం చేసుకున్నా. ‘ఆటోగ్రాఫ్’ అంది. పెన్ తీసి, ‘కాగితం ఏది’ అన్నాను. ‘నా చేతి మీద పెట్టండి’ అంది. ఇప్పటికీ నన్ను ఇంతలా అభిమానించేవారున్నారా అని నాకు ఆశ్చర్యమేసింది. నా జీవితంలో మరిచిపోలేని సంఘటన అది. అసలు మీలో సాహిత్యాభిమానం ఎలా మొదలైంది? ఎలిమెంటరీ స్కూల్ చదువుకునే రోజుల్లో... మా తెలుగు మాస్టారు శబ్దాలంకారంలో పోతన రాసిన ‘అడిగెదనని కడువడిజను’ పద్యం చెబుతు న్నారు. ఇదేదో బాగుందే అనిపించింది. వెంటనే అదే పంథాలో ‘అత్తగారి పెత్తనంబు... నెత్తిమీద నొత్తుచుండ, తత్తరిల్లి బిత్తరిల్లి, చెంతనున్న కత్తినెత్తి.. నెత్తిమీద మొత్త చూచె.. కొత్తనైన కొడలమ్మి’ అని రాసిచ్చాను. అందరూ మెచ్చుకున్నారు. నాలో అంతర్లీనంగా తెలీని ప్రతిభ ఏదో దాగుందని అప్పుడే అర్థమైంది. తర్వాత గేయాలు రాశాను, కథలు రాశాను. సినిమా ఇండస్రీ ్టకొచ్చాక ‘రత్తాలు రాంబాబు’ షూటింగ్కి బెంగళూరు వెళ్లా. అక్కడ నుంచి నటి జయంతి గారి మేకప్మేన్ రాజగోపాల్గారితో పరిచయమేర్పడింది. ఇద్దరం కారులో వెళ్తుంటే శ్మశానంపై రాసిన ఓ హిందీ పాట పెట్టుకొని ఇన్వాల్వ్ అయిపోయి మరీ వింటున్నాడాయన. ‘ఏంటని’ అడిగాను. సాహిత్యంలోని ఆ సొగసు హిందీ పాటల్లోనే ఉంటుందని, మన పాటలు ఎందుకూ పనికిరావని అన్నాడు ఉద్వేగంతో. తెలుగు సాహిత్యంలో సొగసు ఉండదని అనగానే... నాకు కోపం నషాళానికి అంటింది. ఇంటికి వెళ్లగానే అదే శ్మశానంపై ‘పిలుస్తోంది.. పిలుస్తోంది, వల్లకాడు పిలుస్తోంది’ అంటూ ఎనిమిది పేజీల కవిత రాశాను. తీసుకెళ్లి అతనికి వినిపించాను. తెలుగు సాహిత్యాన్ని కించపరచొద్దని గట్టిగా చెప్పాను. తను కూడా తప్పు ఒప్పుకున్నాడు. మళ్లీ ఆయనే ప్రోత్సహించడంతో మరో రెండు పుస్తకాలు రాశాను. నేను రాసిన పుస్తకాలు బయటకు రావడానికి కారణం మాత్రం హీరో చిరంజీవే. పుస్తకాలు తీసుకురమ్మని విపరీతంగా బలవంతం చేశాడు. దాంతో నాలుగు పుస్తకాలు విడుదల చేశాను. నా స్క్రిప్ట్తో, శివాజీరాజా హీరోగా డెరైక్ట్ చేసిన ‘మొగుడ్స్-పెళ్లామ్స్’ చిత్రంలో 2 పాటలు కూడా రాశా. మీ సీనియర్స్లో మీకు ఎవరంటే ఇష్టం? నేను అక్కినేని అభిమానిని. ఆయనతో పాటు ఎన్టీయార్ ఎలానూ ఉంటారు. వారిద్దరూ తెలుగు సినిమాకు నరనారాయణులు. చిన్నప్పుడు యాక్షన్ సినిమాలు బాగా చూసేవాణ్ణి. అప్పుడు ఎన్టీఆర్ నా ఫేవరెట్ హీరో. కళాశాలకు వెళ్లాక... ప్రేమకథల్ని ఇష్టపడటం మొదలుపెట్టా. అలా.. ఏఎన్నార్ ఫ్యాన్గా మారాను. నాటకాలు వేస్తున్న రోజుల్లో... స్టేజ్ మీద అచ్చం అక్కినేనిగారిలా నటించేవాణ్ణి. హీరో అయ్యాక కూడా కొన్నాళ్లు ఆ ప్రభావం పోలేదు. తర్వాత్తర్వాత నాకంటూ ఓ స్టయిల్ అలవరుచుకున్నాను. ఆర్టిస్టుగా డ్రీమ్ కేరక్టర్ ఏదైనా ఉందా? రావణాసురుడి పాత్ర చేయాలని ఎదురు చూశా. కానీ ఆ కల నెరవేరలేదు. ఇప్పుడొచ్చినా చేయలేని పరిస్థితి. ఎందుకంటే దానికి తగ్గ బాడీ లేదు. -
రైల్వే ఉద్యోగికి ఉరి శిక్ష
బ్యాంకాక్: థాయిలాండ్లో ఓ రైల్వే ఉద్యోగికి ఉరి శిక్ష పడింది. ఆ దేశంలో సంచలనం సృష్టించిన ఓ మైనర్ బాలిక రేప్, హత్య కేసులో గతంలోనే కింది స్థాయి కోర్టు ఉరి శిక్ష విధించగా ఆ తీర్పునే సమర్థిస్తూ పైస్థాయి కోర్టు మరోసారి దానిని స్పష్టం చేసింది. దీంతో అతడిని త్వరలో ఉరి తీయనున్నారు. వాంచాయి సాయింఖావో అనే బ్యాంకాక్కు చెందిన 23 ఏళ్ల రైల్వే ఉద్యోగి స్లీపర్ కోచ్లో విధులు నిర్వర్తిస్తుండేవాడు. గత ఏడాది జూలై 5న అదే రైలులో 13 ఏళ్ల బాలిక తన బెర్త్పై నిద్రిస్తుండగా గత ఏడాది జూలై 5న లైంగిక దాడి జరిపాడు. అనంతరం ఆ బాలికను రైలు నుంచి తోసేశాడు. ఈ ఘటన దేశంలో పెను సంచలనం సృష్టించగా కేసును ది హువా హిన్ ప్రావిన్సియల్ కోర్టు విచారించి ఉరి శిక్షను ఖరారు చేసింది. దీంతో అతడు పై స్థాయి కోర్టును ఆశ్రయించినా కోర్టు కింది స్థాయి కోర్టునే సమర్థించింది. -
యజమాని నగలు కాజేసిన వ్యక్తి అరెస్టు
గుంటూరు: ఆశ్రయం ఇచ్చిన యజమాని నుంచి నగలు కొట్టేసి పారిపోయిన వ్యక్తిని గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్కు చెందిన గాదంశెట్టి కుమార్ రైల్వే ఉన్నతోద్యోగి. ఆయన వద్ద మంగళగిరికి చెందిన చిరుమామిళ్ల వెంకటరమణ అనే వ్యక్తి కేర్టేకర్గా పనిచేస్తున్నాడు. ఈనెల 9వ తేదీన కార్యాలయం పని నిమిత్తం కుమార్తోపాటు వెంకటరమణ కూడా గుంటూరులోని డివిజినల్ రైల్వే మేనేజర్ కార్యాలయం వద్దకు కారులో వచ్చాడు. కుమార్ ఏమరుపాటుతో ఉండగా ఆయన వద్ద ఉన్న రూ.లక్ష విలువైన 40 గ్రాముల బంగారు ఆభరణాలున్న సంచిని తీసుకుని పరారయ్యాడు. బాధితుని ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన గుంటూరు పోలీసులు.. నిందితుడు ఆదివారం స్థానిక బృందావనం వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా అదుపులోకి తీసుకున్నారు. -
స్వాతి హత్య కేసులో వీడని మిస్టరీ
శృంగవరపుకోట: సంచలనం రేపిన రైల్వే ఉద్యోగిని స్వాతి హత్యకేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. హత్య ఎవరు.. ఎందుకు చేశారన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్న పోలీసులకు సరైన ఆధారాలు లభ్యం కాక కేసు కొలిక్కి రాలేదు. పట్టణంలోని స్థానిక రైల్వేస్టేషన్ పరిధిలో ట్రాక్షన్ సబ్స్టేష న్లో పనిచేస్తున్న ఉద్యోగిని చిట్టిమోజు స్వాతి సోమవారం రాత్రి హత్యకు గురైన విషయం పాఠకులకు విదితమే. స్వాతి హత్యపై పలుకోణాల్లో దర్యాప్తు సాగుతోంది. హంతకులు స్థానికులా.. బయటి నుంచి వచ్చారా.. హత్యకు ఎన్ని రోజుల నుంచి పథక రచన చేశారు. అంత కిరాతకంగా చంపాల్సినంత కక్ష ఎవరికి ఉంది.. ఆమెతో కలిసి పనిచేసినవారు, బంధువులు, ఉన్నత స్థాయి ఉద్యోగులు, గతంలో స్వాతి పనిచేసిన ప్రాంతాల్లో ఆమెకు ఉన్న స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇలా అన్ని వర్గాల వారిని విచారించేందుకు, సెల్ఫోన్ కాల్డేటా సేకరణ, సంఘటనా స్థలంలో సేకరించిన వేలిముద్రలు, రక్తం శాంపిల్స్ పరిశీలన వంటి అంశాలైపై 10 బృందాలు పనిచేస్తున్నాయి. సబ్స్టేషన్ పరిసరాలపై అవగాహన, డ్యూటీలో ఇద్దరు మహిళలు తప్ప ఎవరూ ఉండరన్న విషయం తెలిసిన వ్యక్తులే హత్యకు పాల్పడి, కేసును పక్కదోవ పట్టించేందుకు కొన్ని నగలు తీసుకునిపోయారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సమాచారం చెప్పండి.. సీసీఎస్ డిఎస్సీ చక్రవర్తి నేతృత్వంలో ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్ఐల నేతృత్వంలో 10 టాస్క్ఫోర్స్ బృందాలు, సివిల్, జి.ఆర్.పి.ఎఫ్, ఆర్.పి.ఎఫ్ బృందాలు హత్య కేసు మిస్టరీని ఛేదించటానికి పనిచేస్తున్నాయని ఎస్.కోట సీఐ లక్ష్మణమూర్తి చెప్పారు. హత్యకు సంబంధించి ఏ చిన్న సమాచారం తెలిసినా స్థానిక పోలీసు అధికారులకు చెప్పి సహకరించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచటంతోపాటు వారికి నగదు పారితోషికం ఇస్తామని చెప్పారు. రైల్వే అధికారుల తీరుపై విమర్శలు రైల్వే ఉద్యోగిని స్వాతి హత్యకు పరోక్షంగా రైల్వే అధికారులే కాారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఊరి చివర ఎటువంటి రక్షణ లేకుండా, సెక్యూరిటీ గార్డు, అలారం లేని చోట రాత్రి వేళ నిర్దయగా మహిళలకు డ్యూటీలు వేయటం రైల్వే అధికారుల పైశాచికత్వానికి నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు. డే డ్యూటీ వేయాలని, స్టేషన్లో బాత్రూమ్ కూడా లేదని, రక్షణ కరువయిందని అర్జీలు పెట్టుకుని మొత్తుకున్నా రైల్వే అధికారులు పట్టించుకోకపోవటం వల్లనే స్వాతి దారుణ హత్యకు గురైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
స్వైన్ ఫ్లూ భయం
సాక్షి, చెన్నై: స్వైన్ ఫ్లూ భయం రాష్ట్రంలో మళ్లీ నెలకొంది. చెన్నైలో ఓ వ్యక్తి మరణించడంతో ఎక్కడ ఈ ఫ్లూ ప్రబలుతుందోనన్న ఆందోళన జనంలో మొదలైంది. స్వైన్ ఫ్లూ ప్రవేశించిన సమాచారంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. 1.5 లక్షల డామ్లీ ఫ్లూ మాత్రల్ని, ఫ్లూ నివారణ వ్యాక్సిన్లను సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఏడాదిన్నర క్రితం స్వైన్ ఫ్లూ విలయతాండవం చేసింది. ఆరోగ్య శాఖ చేపట్టిన పకడ్బందీ చర్యలతో ఆ పేరు కాస్త తెర మరుగైంది. అయినా, అప్పుడుప్పుడు స్వైన్ ఫ్లూ పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి. తాజా సీజన్లో వర్షాలు సమృద్ధిగా పడడంతో ఎక్కడ అంటు రోగాలు ప్రబలుతాయోనన్న బెంగతో అప్రమత్తంగానే వ్యవహరించారు. అయితే, దక్షిణ తమిళనాడులో విష జ్వరాలు, అతి సారా వంటి రోగాలు ప్రబలడంతో వాటి కట్టడి లక్ష్యంగా ఆరోగ్య శాఖ పరుగులు తీస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తున్న వేళ ఆ తాకిడి చెన్నైకి పాకినట్టుంది. రైల్వే ఉద్యోగి ఒకరు స్వైన్ ఫ్లూతో మరణించిన సమాచారం ప్రజల్లో మళ్లీ ఆందోళనను రేకెత్తిస్తున్నది. ప్రజల్లో బయల్దేరిన భయంతో ఈ జ్వరం బారిన ఎవరూ పడకుండా, ఈ ఫ్లూను ఆరంభ దశలోనే తరిమికొట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది.అప్రమత్తం : స్వైన్ఫ్లూ బారిన పడి మరణించిన రైల్వే ఉద్యోగి మన్నడికి చెందిన శ్రీనివాసన్గా గుర్తించారు. ఈ దృష్ట్యా, ఆయన నివాసం ఉంటున్న పరిసరాల్లో జ్వరంతో బాధ పడుతున్న వాళ్లెవరైనా ఉన్నారా..? అని పరిశీలించే పనిలో వైద్యాధికారులు పడ్డారు. ఆయన కుటుంబీకులకు సైతం పరీక్షలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ఆయా ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల అధికారుల ద్వారా ప్రజల్ని అప్రమత్తం చేసే విధంగా ప్రచార కార్యక్రమాలకు సిద్ధం అవుతున్నారు. ఈ వ్యాధి లక్షణాల్ని వివరిస్తూ, అప్రమత్తంగా ఉండాలని, తక్షణం వైద్య చికిత్సలు తీసుకోవాలని పిలుపునిచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. అలాగే, ఈ ఫ్లూ భయం జనంలో రెట్టింపు అయినా, ఫ్లూ తీవ్రత పెరిగినా తక్షణం వైద్య చికిత్సతోపాటుగా మందుల్ని సరఫరా చేయడానికి తగ్గ ఏర్పాట్లు చేశారు. ఆరోగ్య శాఖ చేతిలో లక్షన్నర మందికి ఉపయోగపడే డామ్లీ ఫ్లూ మాత్రలు, వ్యాక్సిన్లు సిద్ధంగా ఉండడం విశేషం. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ ప్రవేశించకుండా తరిమి కొట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు ఆరోగ్య శాఖ అధికారి ఒకరు వివరించారు. ప్రజల్లోను చైతన్యం రావాలని, జ్వరం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, ఈ జ్వరం పక్క వారికి వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తీవ్ర జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, గొంతు నొప్పి జలుబు ఈ ఫ్లూ లక్షణాలుగా వివరించారు. ఈ లక్షణాలు ఎవరిలోనైనా కనిపిస్తే తక్షణం చికిత్స పొందాలని సూచించారు. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ లేదని, అయితే, ఆ వ్యక్తికి ఆ జ్వరం ఎక్కడ సోకిందోనన్న విచారణ వేగవంతం చేశామన్నారు. పక్క రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ ఉన్న దృష్ట్యా అక్కడి నుంచి ఎవరైనా ఇక్కడికి వచ్చినా, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోని వైద్యాధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. -
బకింగ్హాం కెనాల్లో రైల్వే ఉద్యోగి గల్లంతు
దుగ్గిరాల/తెనాలి రూరల్: తెనాలి పట్టణానికి చెందిన ఓ రైల్వే ఉద్యోగి దుగ్గిరాల లాకు వద్ద కృష్ణా పశ్చమ ప్రధాన కాలువలో సోమవారం గల్లంతయ్యాడు. ఆదివారం నిర్వహించుకున్న మీలాదున్ నబీకి సంబంధించిన పూలను నీటిలో నిమజ్జనం చేసే ప్రయత్నంలో కాలుజారి పడిపోయినట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలి గంగానమ్మపేటలోని సాయి అపార్ట్మెంటులో నివాసం ఉంటున్న పట్టణానికి చెందిన షేక్ ఫరీద్బాషా (34) రైల్వే డ్రైవర్గా విజయవాడలో పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి బైక్పై విజయవాడవెళ్తూ, మార్గంమధ్యలో దుగ్గిరాల పాతలాకు వద్ద ఆగాడు. లాకు తూముల వద్ద కాలువ కట్టపై బైక్, అతని బ్యాగు ఉంచి కాలువ ఒడ్డుకు వెళ్లాడు. పూలు కాలువలో వదులుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలోపడి గల్లంతయ్యాడు. కాలువ నీటిలో మునిగిపోతూ రక్షించండంటూ ఆర్తనాదాలు చేశాడని, సమీపంలో పురుషులు ఎవ్వరూ లేకపోవడంతో రక్షించలేకపోయారని స్థానిక మహిళలు చెప్పారు. విషయం తెలిసిన ఏఎస్ఐ సుభాని, సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని మోటారుసైకిల్, బ్యాగును స్వాధీనపరచుకుని, కాలువ వెంట కొంతదూరం గాలించారు. అయినా ఫలితం లేకపోయింది. బ్యాగ్లో రెండు సెల్ఫోన్లు, యూనిఫాం దుస్తులు, డ్యూటీకి సంబంధించిన మూడు పుస్తకాలు, రెండు పేపర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్లో ఉన్న నంబర్ల ఆధారంగా తెనాలిలోని వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, అపార్టుమెంటులో నివాసం ఉంటున్న పలువురు దుగ్గిరాల చేరుకున్నారు. కాలువ వెంట గాలింపు చర్యలు ప్రారంభించారు. తోటి ఉద్యోగి కాలువలో గల్లంతయ్యాడన్న విషయం తెలుసుకున్న పలువురు రైల్వే ఉద్యోగులు సంఘటనాస్థలానికి చేరుకుని ఆవేదన వ్యక్తం చేశారు. కేసునమోదు చేసి విచారిస్తున్నట్లు దుగ్గిరాల ఏఎస్ఐ సుభాని తెలిపారు. గల్లంతైన ఫరీద్బాషాకు భార్య హర్షదున్నీసా, మూడేళ్ల కుమారుడు తాజ్బాషా ఉండగా, తల్లిదండ్రులు షేక్ ఖాదర్వలి, నజీరున్నీసాలతో కలసి గంగానమ్మపేటలోని సాయి అపార్టుమెంటులో నివాసం ఉంటున్నట్లు బంధువులు చెప్పారు. -
శ్రమకు సలామ్
సగటు నగరవాసికి సిటీలోని రూట్లు ఎంత క్లియర్గా తెలుసో.. ఏ మూలన ఏ గుంత ఉందో కూడా అంతే బాగా తెలుసు. గతుకుల దారిలో ముక్కుతూ మూల్గుతూ జర్నీ చేస్తాడే తప్ప.. వాటిని బాగుచే సే బాధ్యత ప్రభుత్వానిదనుకుంటాడు. కానీ, మన దారిని మనమే బాగు చేయాలనే ఆలోచన వచ్చిన వ్యక్తి ఒకరున్నారు. సిటీలో ఆయన వెళ్లే దారిలో గుంత కనిపిస్తే చాలు దాన్ని పూడ్చకుండా కదలరు. ఆరుపదుల వయసు దాటిన ఆ పెద్దాయన పేరు బాలగంగాధర తిలక్. రైల్వే ఉద్యోగిగా రిటైర్ అయిన ఆయన గుంతలు పూడ్చడం కోసం ప్రత్యేకంగా ‘శ్రమదాన్ ఫౌండేషన్’ను ప్రారంభించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇప్పుడు అమెరికా వెళ్లిపోతున్నారు. దూరదేశానికి వె ళ్తున్నా.. తన ఫౌండేషన్ ద్వారా గుంతల పూడ్చివేత కార్యక్రమం కొనసాగుతుందంటున్న బాలగంగాధర తిలక్ను ‘సిటీప్లస్’ పలకరించింది. నేను హైదర్ షా కోట గ్రామంలో ఉండేవాడిని. 2010 జనవరి 18న ఉదయం ఆఫీస్కు బయల్దేరాను. ముందురోజు రాత్రి వర్షం కురవడంతో రోడ్డంతా బురదమయమైంది. గుంతలో నీరు మడుగులు కట్టింది. ఎంత జాగ్రత్తగా నడిపినా సరే కారు చక్రం మడుగులో పడడం.. బురదనీరు స్కూల్కు వెళ్తున్న పిల్లలపై చిందడం జరిగిపోయాయి. అప్పుడు ఆందోళనగా కారు ఆపా. పిల్లలతో పాటు తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలనుకున్నా. అప్పటికే వారు ఓ రకంగా చూసిన చూపులు నన్ను కదిలించాయి. మర్నాడే ఆరు ట్రక్కుల మట్టితో శ్రామికులను పెట్టి గుంతలను పూడ్చా. అదే పిల్లలు వచ్చి కృతజ్ఞతలు తెలపడం ఎప్పటికీ మరచిపోలేను. మరెన్నో ఘటనలు.. ఇవే కాదు గుంతలు పడి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాద మరణాలు నన్ను మరింత ఆలోచింపజేశాయి. ప్రభుత్వం కోసం ఎదురుచూడకుండా ఈ గోతులను ఎవరైనా పూడ్చేస్తే రోడ్డు ప్రమాదాలు జరిగేవి కాదు కదా అనిపించింది. అప్పటి నుంచి రోడ్డు మీద ఎక్కడ గొయ్యి కనిపించినా పూడ్చటమే పనిగా పెట్టుకున్నాను. నా కారు డిక్కీలో చిన్న పలుగు, పార, చేతికి వేసుకోవడానికి గ్లవుజ్లు సిద్ధంగా ఉంటాయి. 1,070 గుంతలు.. గతంలో హైదరాబాద్ రోడ్లపై ఎక్కడ చూసినా గుంతలు కనిపించేవి. రెండు నెలల క్రితం అనారోగ్యం కారణంగా అమెరికాలో స్పిరిట్ కమ్యూనికేషన్స్లో సిస్టమ్ ఇంజనీర్గా పనిచేస్తున్న నా కుమారుడు రవికిరణ్ వద్దకు వెళ్లా. రెండు నెలల కిందట సిటీకి వచ్చాను. నేను తిరిగి అమెరికా రానేమోనని అనుకున్న నా కుమారుడు కూడా నాతోపాటే ఇక్కడికి వచ్చాడు. అయితే రోడ్లపై గుంతలు చూడగానే మళ్లీ పలుగు, పారా పట్టుకున్నాను. జేఎన్టీయూ రోడ్డు వద్ద గొయ్యిల్ని, గచ్చిబౌలి ఫ్లైఓవర్ గుంత పూడ్చాను. దీంతో నేను పూడ్చిన గుంతల సంఖ్య 1,070కి చేరింది. ఇప్పుడు నేను నా కొడుకుతో కలసి మళ్లీ యూఎస్ వెళ్తున్నా. ఇంతటితో ఆగొద్దు.. నేనిక్కడ లేకున్నా, నా ఫౌండేషన్ తరఫున వాలంటీర్లు ఎక్కడ గుంతలు కనిపించినా శ్రమదానం చేస్తారు. ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల మా కుటుంబసభ్యులు నన్నీ పని చేయవద్దంటున్నారు. అయితే ఈ పనిని మాత్రం ఫౌండేషన్ కొనసాగించేలా ప్రణాళిక రూపొందించాం. గుంతలు లేని హైదరాబాద్ను చూడాలనేదే నా కల. అది త్వరలోనే నెరవేరుతుందనుకుంటున్నా. దీనికి జీహెచ్ఎంసీ సహకారం ఉండాలి. బాలగంగాధర తిలక్ -
రైలు కింద పడి ట్రాక్మన్ ఆత్మహత్య
సామర్లకోట, న్యూస్లైన్ : భార్యాబిడ్డలకు దూరంగా, ఒంటరిగా నివసిస్తున్న ఓ రైల్వే ఉద్యోగి శనివారం స్థానిక రైల్వే స్టేషన్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు, సహ ఉద్యోగులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా కాజీపేటకు చెందిన సీహెచ్ సత్యనారాయణ(52) గత 15 ఏళ్లుగా సామర్లకోటలో పని చేస్తున్నాడు. గ్యాంగ్మన్గా విధుల్లో చేరిన ఇతడికి స్పెషల్ ట్రాక్మన్గా పదోన్నతి లభించింది. ఇతడికి భార్య రమ, కుమారుడు శ్రావణ్, కుమార్తె శిరీష ఉన్నారు. ఇటీవల కుమార్తెకు వివాహం చేశాడు. కుమారుడు ఇంజనీరింగ్ చదువుతుండడంతో భార్య రమ, శ్రావణ్ కాజీపేటలో నివసిస్తున్నారు. దీంతో స్థానిక రైల్వే క్వార్టర్సలో సత్యనారాయణ ఒంటరిగా ఉంటున్నాడు. శనివారం విధులకు హాజరుకావాల్సిన సత్యనారాయణ.. తెల్లవారుజామున రైల్వే స్టేషన్లోని మూడో నంబరు ప్లాట్ఫాం పట్టాలపై సామర్లకోట నుంచి రాజమండ్రి వైపు వెళుతున్న రైలు కింద పడి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనలో అతడి తల, మొండెం, చేతులు వేరయ్యాయి. సత్యనారాయణకు కుటుంబ సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ లేవని, అందరితోను కలిసిమెలిసి ఉండే అతడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అర్ధం కావడం లేదని సహ ఉద్యోగులు తెలిపారు. రైల్వే ఎస్సై గోవిందరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.