retirment
-
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బ్యాటర్
సౌరాష్ట్ర స్టార్ బ్యాటర్ షెల్డన్ జాక్సన్ పరిమిత ఓవర్ల ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. షెల్డన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఇవాళ (జనవరి 3) ప్రకటించాడు. సౌరాష్ట్ర వికెట్ కీపర్ బ్యాటర్ అయిన జాక్సన్ మూడు ఫార్మాట్లలో (ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ,టీ20) కలిపి 11,791 పరుగులు చేశాడు. ఇందులో 31 సెంచరీలు ఉన్నాయి. 38 ఏళ్ల జాక్సన్ ప్రస్తుత విజయ్ హజారే ట్రోఫీలో తన చివరి మ్యాచ్ ఆడాడు. జాక్సన్ తన చివరి మ్యాచ్లో (పంజాబ్) 10 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 13 పరుగులు చేశాడు. జాక్సన్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కొనసాగుతానని స్పష్టం చేశాడు.జాక్సన్ లిస్ట్-ఏ క్రికెట్లో (50 ఓవర్ల ఫార్మాట్) 84 ఇన్నింగ్స్ల్లో 36.25 సగటున 2792 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. జాక్సన్కు టీ20 ఫార్మాట్లో కూడా మంచి రికార్డే ఉంది. ఈ ఫార్మాట్లో జాక్సన్ 80 మ్యాచ్లు ఆడి 1812 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.జాక్సన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా ఆడాడు. క్యాష్ రిచ్ లీగ్లో జాక్సన్ ఆర్సీబీ, కేకేఆర్ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు. జాక్సన్కు ఆర్సీబీ తరఫున ఆడే అవకాశం రానప్పటికీ 2017-2022 మధ్యలో కేకేఆర్కు తొమ్మిది మ్యాచ్ల్లో ప్రాతినిథ్యం వహించాడు. 2022 విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో మహారాష్ట్రపై చేసిన సెంచరీ (136 బంతుల్లో 133 పరుగులు) జాక్సన్ కెరీర్లో హైలైట్గా నిలిచింది. నాటి మ్యాచ్లో సౌరాష్ట్ర విజేతగా నిలిచి విజయ్ హజారే ట్రోఫీని సొంతం చేసుకుంది.జాక్సన్కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో జాక్సన్ ఇటీవలే వందో మ్యాచ్ ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో జాక్సన్ 103 మ్యాచ్లు ఆడి 46.36 సగటున 7187 పరుగులు చేశాడు. ఇందులో 21 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. జాక్సన్ వికెట్కీపింగ్లో 75 క్యాచ్లు పట్టి, రెండు స్టంపౌట్లు చేశాడు. జాక్సన్కు టీమిండియాకు ఆడే అవకాశం రాలేదు. -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్కు గుడ్ బై
పాకిస్తాన్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ బిస్మా మరూఫ్ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్కు బిస్మా మరూఫ్ రిటైర్మెంట్ ప్రకటించింది. తన నిర్ణయాన్ని మరూఫ్ సోషల్ మీడియా వేదికగా గురువారం వెల్లడించింది. "నేను చాలా ఇష్టపడే ఆట(క్రికెట్) నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను.నా 17 ఏళ్ల ప్రయాణం ఎన్నో సవాళ్లు, విజయాలు, మధురమైన జ్ఞాపకాలతో నిండి ఉంది. నా క్రికెట్ ప్రయాణంలో అరంగేట్రం నుంచి ఇప్పటి వరకు నాకు మద్దతుగా నిలిచిన అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.నాపై నమ్మకం ఉంచి, జట్టును నడిపించే బాధ్యతను తనకు అప్పగించినందుకు పీసీబీకి ప్రత్యేక ధన్యవాదాలు. చివరగా నా దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం చాలా సంతోషంగా ఉందని" బిస్మా పేర్కొన్నట్లు పీసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది.కాగా 2006లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మరూఫ్ 17 ఏళ్ల పాటు పాకిస్తాన్ క్రికెట్కు తన సేవలు అందించింది. పాకిస్తాన్ మహిళ క్రికెట్ జట్టు తరపున వన్డేలు, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటికి మరూఫ్ పేరునే ఉంది. ఆమె పాక్ తరపున 136 వన్డేల్లో 3369 పరుగులతో పాటు 44 వికెట్లు, 146 టీ20ల్లో 2893 పరుగులతో పాటు 36 వికెట్లు పడగొట్టింది.96 మ్యాచ్ల్లో పాక్ జట్టుకు కెప్టెన్గా మరూఫ్ వ్యవహరించింది. మరూఫ్ చివరగా స్వదేశంలో వెస్టిండీస్ మహిళలతో జరుగుతున్న వన్డే సిరీస్లో పాక్ జట్టు తరపున ఆడింది. విండీస్తో టీ20 సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో కూడా మరూఫ్ భాగమైంది. కానీ ఈ సిరీస్లో ఆడుతారా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. -
నేనింకా రిటైర్ కాలేదు.. రిటైర్మెంట్ కథనాలను కొట్టిపారేసిన మేరీ కోమ్
భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ రిటైర్మెంట్ ప్రకటించినట్లు ఇవాల్టి ఉదయం నుంచి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా కోమ్ ఈ ప్రచారంపై స్పందిస్తూ.. తన రిటైర్మెంట్పై వచ్చిన వార్తాల్లో ఎంత మాత్రం నిజం లేదని కొట్టిపారేసింది. తాను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదని.. ఒకవేళ ఆ నిర్ణయం తీసుకుంటే వ్యక్తిగతంగా మీడియా ముందుకు వస్తానని ఆమె తెలిపింది. ఈ మేరకు కోమ్ ప్రముఖ మీడియా సంస్థకు వివరణ ఇచ్చింది. ఇదిలా ఉంటే, 41 ఏళ్ల మేరీ కోమ్ మహిళల బాక్సింగ్లో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్గా, ఒలింపిక్ విన్నర్గా (2012 ఒలింపిక్స్లో 51 కేజీల విభాగంలో కాంస్య పతకం) నిలిచిన కోమ్.. పురుష బాక్సర్లు కూడా సాధించలేని ఎన్నో ఘనతలు సాధించి చాలా సందర్భాల్లో విశ్వవేదికపై భారత కీర్తిపతాకను రెపరెపలాడించింది. ఓవరాల్గా మేరీ కోమ్ తన కెరీర్లో 13 స్వర్ణాలు సహా మొత్తం 19 పతకాలను సాధించి బాక్సింగ్ లెజెండ్గా గుర్తింపు తెచ్చుకుంది. మేరీ కోమ్ ప్రతిభకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆమెకు 2002లో అర్జున అవార్డు, 2009లో ఖేల్ రత్న అవార్డు, 2006లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్, 2020లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందజేసింది. మేరీకోమ్ 2016లో రాజ్యసభ సభ్యురాలిగా నియమితురాలైంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ కోమ్ రింగ్లో ఎన్నో అపురూప విజయాలు సాధించి ఔరా అనిపించింది. -
24 ఏళ్లకే ఉద్యోగం.. 29 ఏళ్లకే రిటైర్మెంట్.. గూగుల్ ఉద్యోగి స్ట్రాటజీ అదిరింది!
24 ఏళ్లకే ఉద్యోగం..29 ఏళ్లకే రిటైర్మెంట్. ఆహా! జీవితం అంటే ఇది’ అని అనుకుంటున్నారా? ఐఐటీ బాంబే పూర్వ విద్యార్ధి డేనియల్ జార్జ్ (29) ఇలాగే అనుకున్నాడు. 6 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి చివరికి రిటైర్మెంట్ తీసుకున్నాడు. డేనియల్ జార్జ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిపుణుడు. 2018లో జార్జ్ ఐఐటి బాంబే నుండి బిటెక్ పూర్తి చేశాడు. 24 ఏళ్ల వయస్సు అమెరికాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో ఏడాదికి 265,000 డాలర్ల (సుమారు రూ. 2.20 కోట్లు) ప్యాకేజీతో జాబ్ సంపాదించాడు. అంత డబ్బు ఎలా ఆదా చేశాడు అతను గూగుల్లో పనిచేసే సమయంలో సంపాదించిన డబ్బును ఆదా చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో లెక్కలేసుకుని తన శాలరీని ఎంత మొత్తంలో ఆదా చేసే త్వరగా రిటైర్ అవ్వచ్చు? అనంతరం తన సొంత దేశమైన భారత్లో ఎలా నివసించవచ్చో గుర్తించాడు. అంతే అప్పటి నుంచి రిటైర్మెంట్ కోసం శాలరీని సేవ్ చేయడం మొదలు పెట్టాడు. గూగుల్లో పనిచేయడం ఓ కల గూగుల్లో పనిచేయడం ఒక కల. అదో ‘మాయా అద్భుత భూభాగం’లాంటిదని అభివర్ణిస్తూ డబ్బుల్ని ఎలా సేవ్ చేశాడో చెప్పుకొచ్చాడు. ముందుగా గూగుల్లో అపరిమిత ఆహారం, పానీయాలు, పింగ్ పాంగ్ టేబుల్స్ , వీడియో గేమ్ రూమ్లు, సాకర్ ఫీల్డ్లు, జిమ్, టెన్నిస్ కోర్ట్లు, ఫ్రీ మసాజ్ వంటి మరిన్ని సౌకర్యాలను అందించింది. వాటిని వినియోగించుకున్నాడు. కానీ అప్పుడే జార్జ్ గూగుల్లో తాను సంపాదించే జీతంలో సగానికిపైగా మొత్తాన్ని ట్యాక్స్ చెల్లిస్తున్నట్లు గుర్తించాడు. ట్యాక్స్ తగ్గించుకునేందుకు అప్పటి నుంచి జార్జ్ తన ట్యాక్స్ను తగ్గించుకోవడానికి రిటైర్మెంట్ అకౌంట్లో ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు. ఆఫీస్కి నడిచి వెళ్లడం, గూగుల్లో పని చేసే సమయంలో మూడుపూటలా అక్కడే భోజనం చేయడంతో డబ్బు ఆదా అయ్యేది. ఎప్పుడో ఒకసారి మాత్రమే ఆహారాన్ని ఖర్చు చేసినట్లు చెప్పాడు. సాధారణంగా సిలికాన్ వ్యాలీలో ఇంటి రెంట్ చాలా ఖరీదైన వ్యవహారంతో కూడుకుంది. అయినప్పటికీ, తన స్నేహితులతో కలిసి అపార్ట్మెంట్ని షేర్ చేసుకోవడం వల్ల అద్దె తగ్గిందని అన్నాడు. ట్యాక్స్ చెల్లింపులు ఎంతంటే? జార్జ్ ప్రతి సంవత్సరం పన్ను ఆదా చేసుకునేందుకు రూ.62లక్షలు పెట్టుబడి పెడుతూ వచ్చాడు. రిటైర్మెంట్ అయ్యేందుకు కావాల్సినంత మొత్తాన్ని సమకూర్చుకున్నాడు. గత ఏడాది జార్జ్ 29 ఏళ్ళ వయసులో థర్డ్ ఇయర్ ఏఐ అనే స్టార్టప్ను ప్రారంభించాడు. “ఇప్పుడు నేను జీతం సంపాదించడం గురించి ఎప్పుడూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, నేను నా కంపెనీని ప్రారంభించడం కోసం రిస్క్ చేయగలను. నా భార్య పిల్లల కోసం కావాల్సినంత సంపాదించాను. అందుకే త్వరగా రిటైర్మెంట్ తీసుకుంటున్నాను అంటూ ఆర్ధిక పాఠాలు చెబుతున్నాడు. -
ఆఫ్ఘనిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హాక్ సంచలన నిర్ణయం
ఆఫ్ఘనిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హాక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2023 వరల్డ్కప్ తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి వైదొలుగుతానని తెలిపాడు. గాయాల బారిన పడకుండా కెరీర్ను ప్రొలాంగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్స్టా వేదికగా వెల్లడించాడు. వన్డేలకు గుడ్బై చెప్పినా పొట్టి క్రికెట్కు అందుబాటులో ఉంటానని అన్నాడు. 2016లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన నవీన్ 2021లో తన చివరి వన్డే ఆడాడు. కెరీర్లో కేవలం 7 వన్డేలు మాత్రమే ఆడిన నవీన్.. 24 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. View this post on Instagram A post shared by Naveen ul haq Murid (@naveen_ul_haq) నవీన్ తన వన్డే కెరీర్లో 14 వికెట్లు పడగొట్టాడు. అతని అత్యుత్తమ గణాంకాలు 4/42గా ఉన్నాయి. నవీన్ ఐపీఎల్తో పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ ఫ్రాంచైజీ లీగ్ల్లో పాల్గొంటున్నాడు. ఐపీఎల్ 2023లో కోహ్లితో గొడవతో నవీన్ ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టులో రషీద్ ఖాన్ తర్వాత అంతటి పాపులారిటీ ఉన్న నవీన్ ఫ్రాంచైజీ క్రికెట్ కోసం తన అంతర్జాతీయ కెరీర్ను వదులుకున్నాడు. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్ జట్టు తమ రెండో వరల్డ్కప్ ఆడేందుకు నిన్ననే భారత్కు వచ్చింది. వార్మప్ గేమ్ కోసం ఆఫ్ఘన్ క్రికెటర్లు త్రివేండ్రంలో ల్యాండయ్యారు. తమ తొలి వరల్డ్కప్లో (2019) లీగ్ స్టేజ్ దాటలేని ఆఫ్ఘన్ టీమ్ ఈసారి అగ్రశ్రేణి జట్లకు షాక్ ఇచ్చి సంచలనాలు క్రియేట్ చేయాలని భావిస్తుంది. ఆఫ్ఘన్ జట్టులో నవీన్, రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ. రహ్మానుల్లా గుర్బాజ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ లాంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. వీరితో ఈ వరల్డ్కప్లో ఆఫ్ఘనిస్తాన్ సంచనాలు సృష్టించే అవకాశం ఉంది. వరల్డ్కప్లో ఆఫ్ఘనిస్తాన్ తమ తొలి మ్యాచ్ను అక్టోబర్ 7న ఆడుతుంది. ధర్మశాల వేదికగా జరిగే ఆ మ్యాచ్లో వారు బంగ్లాదేశ్ను ఢీకొంటారు. దీని ముందు వారు రెండు వార్మప్ మ్యాచ్లు ఆడతారు. సెప్టెంబర్ 29న సౌతాఫ్రికాతో, అక్టోబర్ 3న శ్రీలంకతో ఆఫ్ఘన్లు తలపడతారు. -
అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించనున్న ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం
క్రికెట్ దిగ్గజం, ఇంగ్లండ్ ఆల్టైమ్ బెస్ట్ బ్యాటర్, ఆ జట్టు మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం జరుగుతున్న కౌంటీ సీజన్ (2023) ముగిసిన అనంతరం తన నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ తరఫున టెస్ట్ల్లో అత్యధిక పరుగులు (161 టెస్ట్ల్లో 45.4 సగటున 33 సెంచరీలు, 57 అర్ధసెంచరీల సాయంతో 12472 పరుగులు) చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కిన కుక్.. 2018లోనే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినప్పటికీ.. ఆతర్వాత కంటిన్యూయెస్గా కౌంటీల్లో ఆడుతున్నాడు. కుక్ తన కౌంటీ జట్టైన ఎసెక్స్ తరఫున ప్రస్తుతం జరుగుతున్న కౌంటీ ఛాంపియన్షిప్లో ఆడుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 23 ఇన్నింగ్స్లు ఆడిన కుక్.. 36.72 సగటున శతకం, 3 అర్ధశతకాల సాయంతో 808 పరుగులు చేశాడు. కుక్ ప్రస్తుతం హ్యాంప్షైర్తో జరుగుతున్న మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ (0) పూర్తి చేశాడు. ఈ మ్యాచ్లో సెకెండ్ ఇన్నింగ్స్తో పాటు కుక్ మరో మ్యాచ్ ఆడనున్నాడు. ఈ సీజన్లో ఎసెక్స్కు ఇదే ఆఖరి మ్యాచ్. హ్యాంప్షైర్తో జరుగుతున్న మ్యాచ్లో ఆతర్వాత జరిగే మరో మ్యాచ్లో గెలిస్తే ఎసెక్స్కు ఛాంపియన్షిప్ టైటిల్ గెలిచే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం డివిజన్ వన్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఎసెక్స్.. టాప్లో ఉన్న సర్రే కంటే 15 పాయింట్లు వెనుకపడి ఉంది. ఇదిలా ఉంటే, అలిస్టర్ కుక్ ఇంగ్లండ్ తరఫున టెస్ట్ల్లో టాప్ స్కోరర్గా నిలువడమే కాకుండా టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానంలో, టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్గా పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు. -
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. 18 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై
పాకిస్తాన్ మహిళా స్టార్ క్రికెటర్ ఆయేషా నసీమ్ సంచలన నిర్ణయం నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్కు ఆయేషా నసీమ్ గురువారం రిటైర్మెంట్ ప్రకటించింది. 18 ఏళ్లకే ఆమె క్రికెట్కు గుడ్బై చెప్పడం గమనార్హం. ఇస్లాం మతంకు అనుగుణంగా మరింత పవిత్రమైన జీవితాన్ని గడపడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపింది. ఆమె తన నిర్ణయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కూడా తెలియజేసింది. ఆయేషా నసీమ్ 2020లో పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టింది. తన కెరీర్లో 33 టీ20లు, 3 వన్డేలు ఆడిన నసీమ్.. వరుసగా 369,33 పరుగులు సాధించింది. ఆయేషా నసీమ్ చివరగా పాకిస్తాన్ తరపున ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐర్లాండ్పై ఆడింది. అదే విధంగా ఈ ఏడాది జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్లో భారత జట్టుపై నసీమ్ 45 పరుగులు సాధించింది. ఆమె టీ20 కెరీర్లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఆయేషా నసీమ్ హిట్టింగ్ చేసే సత్తా కూడా ఉంది. అటువంటి ఆయేషా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడం పాకిస్తాన్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. చదవండి: ఇదేమి ఔట్రా అయ్యా.. పాకిస్తాన్ ఆటగాళ్లు అంతే! వీడియో వైరల్ -
ఐపీఎల్లో సెంచరీ సాధించిన అనామక క్రికెటర్ రిటైర్మెంట్
ఐపీఎల్ 2011లో సెంచరీ సాధించిన అనామక క్రికెటర్, నాటి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ప్లేయర్ పాల్ వాల్తాటి ఫస్ట్ క్లాస్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 39 ఏళ్ల వాల్తాటి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్కు మెయిల్ ద్వారా పంపాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించిన వాల్తాటి 2011 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్పై సెంచరీ సాధించడం ద్వారా వెలుగులోకి వచ్చాడు. అప్పటి వరకు క్రికెట్ ఫాలోయర్స్కు వాల్తాటి అంటే ఎవరో కూడా తెలీదు. సీఎస్కేతో మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన వాల్తాటి 63 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 120 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ మ్యాచ్తో రాత్రిరాత్రి హీరో అయిపోయిన వాల్తాటి, ఆతర్వాత మరో రెండు సీజన్ల వరకు (2013) ఐపీఎల్ ఆడాడు. అనంతరం యువ ఆటగాళ్ల ఎంట్రీతో క్రమంగా ఐపీఎల్ నుంచి కనుమరుగయ్యాడు. ఐపీఎల్ కెరీర్లో 23 మ్యాచ్లు ఆడిన వాల్తాటి సెంచరీ, 2 అర్ధసెంచరీల సాయంతో 505 పరుగులు చేశాడు. కెరీర్ ఆరంభంలో ఇండియా అండర్-19, ఇండియా బ్లూ, ముంబై జట్లకు ప్రాతినిధ్యం వహించిన వాల్తాటి.. 2006 తర్వాత హిమాచల్ ప్రదేశ్కు వలస వెళ్లి, అక్కడ ఫస్ట్క్లాస్ కెరీర్ ప్రారంభించాడు. కంటి చూపు కోల్పోయే ప్రమాదం నుంచి బయటపడి.. న్యూజిలాండ్లో జరిగిన 2002 అండర్ వరల్డ్కప్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో పాల్ వాల్తాటి కంటి చూపు కోల్పోయే ప్రమాదం నుంచి బయటపట్టాడు. బంగ్లా బౌలర్ సంధించిన షార్ట్ పిచ్ డెలివరీ నేరుగా వాల్తాటి కంటిపై బలంగా తాకింది. ఆ ఘటన తర్వాత వాల్తాటి చాలాకాలం పాటు కంటికి బ్యాండ్ ఎయిడ్ కట్టుకుని కనిపించాడు. -
రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ పేసర్
ఇంగ్లండ్ స్టార్ మహిళా క్రికెటర్ కేథరీన్ హెలెన్ స్కీవర్ బ్రంట్ 19 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికింది. అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగతున్నట్లు ఆమె ఇవాళ (మే 5) ప్రకటించింది. ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున బ్రంట్ చివరిసారిగా ఫిబ్రవరిలో సౌతాఫ్రికా వేదికగా జరిగిన టీ20 వరల్డ్కప్లో పాల్గొంది. 2004లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన 37 ఏళ్ల బ్రంట్.. ఇంగ్లండ్ గెలిచిన రెండు వరల్డ్కప్ల్లో, ఓ టీ20 ప్రపంచకప్లో భాగంగా ఉంది. రైట్ ఆర్మ ఫాస్ట్ బౌలర్, లోయర్ ఆర్డర్లో ఉపయోగకరమైన బ్యాటర్ అయిన బ్రంట్.. 14 టెస్ట్ల్లో 51 వికెట్లు, 184 పరుగుల.. 141 వన్డేల్లో 170 వికెట్లు, 1090 పరుగులు.. 112 టీ20ల్లో 114 వికెట్లు, 590 పరుగులు చేసింది. బ్రంట్.. టెస్ట్ల్లో 3 సార్లు, వన్డేల్లో 5 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనను నమోదు చేసింది. ఈమె ఖాతాలో 2 వన్డే హాఫ్ సెంచరీలు, ఓ టెస్ట్ అర్ధశతకం కూడా ఉన్నాయి. కెరీర్ చరమాంకం వరకు ఫాస్ట్ బౌలర్గా రాణించిన బ్రంట్.. ఇంగ్లండ్ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా నాలుగు సార్లు ఎంపికైంది. బ్రంట్.. 2009 టీ20 వరల్డ్కప్ ఫైనల్లో న్యూజిలాండ్పై అత్యుత్తమ ప్రదర్శన (3/6) కనబర్చి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుంది. బ్రంట్.. 2022 మేలో సహచర మహిళా క్రికెటర్ నాట్ స్కీవర్ను వివాహం చేసుకుంది. -
30 ఏళ్లకే కెరీర్ ముగించిన సౌతాఫ్రికా క్రికెటర్
Theunis De Bruyn: సౌతాఫ్రికా క్రికెటర్ థియునిస్ డి బ్రూన్ 30 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఆరేళ్ల కెరీర్లో కేవలం 13 టెస్ట్లు, 2 టీ20లు మాత్రమే ఆడిన డి బ్రూన్ క్రికెట్కు గుడ్బై చెప్పాలని కఠిన నిర్ణయం తీసుకున్నాడు. గతేడాది డిసెంబర్లో ఆస్ట్రేలియాపై తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన డి బ్రూన్.. ఆ తర్వాత సరైన అవకాశాలు రాక జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. టెస్ట్ల్లో 19.5 సగటున 468 పరుగులు చేసిన డి బ్రూన్ .. 2018లో శ్రీలంకపై సెంచరీ చేశాడు. ఇదే అతని కెరీర్లో ఏకైక సెంచరీ. ఇది మినహా డి బ్రూన్ కెరీర్లో కనీసం అర్ధసెంచరీ కూడా లేదు. టీ20ల్లో కేవలం 2 మ్యాచ్లు ఆడిన డి బ్రూన్.. కేవలం 26 పరుగులు మాత్రమే సాధించాడు. డి బ్రూన్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని అతని దేశవాలీ టీమ్ టైటాన్స్ వెల్లడించింది. జాతీయ జట్టుకు ప్రాతనిధ్యం వహించడాన్ని డి బ్రూన్ గౌరవంగా ఫీలవుతున్నాడని టైటాన్స్ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. డి బ్రూన్ తన ఆరాధ్య క్రికెటర్లతో డ్రెస్సింగ్ షేర్ చేసుకోవడం పట్ల చాలా గర్వంగా ఫీలవుతున్నట్లు పేర్కొంది. కాగా, డి బ్రూన్ ఇటీవల ముగిసిన సౌతాఫ్రికా టీ20 లీగ్ తొలి ఎడిషన్లో ప్రిటోరియా క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ లీగ్లో క్యాపిటల్స్ రన్నరప్గా నిలిచింది. SA20 ఇనాగురల్ లీగ్లో 238 పరుగులు చేసిన డి బ్రూన్.. ఎడిషన్ సెకెండ్ హైయెస్ట్ రన్ స్కోరర్గా నిలిచాడు. -
రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్
Eoin Morgan: ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్, ఆ దేశ పరిమిత ఓవర్ల మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇవాళ (ఫిబ్రవరి 13) ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్కు ఇదివరకే (2022 జూన్ 28) గుడ్బై చెప్పిన మోర్గాన్.. తాజాగా అన్ని ఫార్మాట్ల ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించాడు. మోర్గాన్.. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత మిడిల్సెక్స్ (ఇంగ్లండ్ కౌంటీల్లో), సౌతాఫ్రికా టీ20 లీగ్లో పార్ల్ రాయల్స్ జట్ల తరఫున కొనసాగుతున్నాడు. తాజాగా వీటి నుంచి కూడా వైదొలుగుతున్నట్లు పేర్కొన్నాడు. pic.twitter.com/1x1w0unGL2 — Eoin Morgan (@Eoin16) February 13, 2023 అయితే క్రికెట్తో తన అనుబంధం కొనసాగుతుందని స్పష్టం చేశాడు. వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా బ్రాడ్కాస్టర్లతో తన అనుబంధం కొనసాగుతుందని తెలిపాడు. తాను విడుదల చేసిన లేఖలో మోర్గాన్ ఇలా అన్నాడు. విశ్వవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ ఆడటం వల్ల చాలా నేర్చుకున్నానని, ఈ క్రమంలో చాలామంది వ్యక్తులతో జీవితకాల పరిచయం ఏర్పరచుకున్నానని తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన తర్వాత కుటుంబంతో ఎక్కువగా గడపగలుగుతున్నానని.. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇంకాస్త అధిక సమయం వారికి కేటాయించే అవకాశం ఉంటుందని అన్నాడు. తన క్రికెట్ జర్నీలో తోడుగా, అండగా ఉన్న అభిమానులకు, సహచరులకు, కుటుంబానికి మోర్గాన్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. కాగా, ఐర్లాండ్ జట్టు తరఫున అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన మోర్గాన్.. ఇంగ్లండ్ తరఫున తన 13 ఏళ్ల కెరీర్లో 225 వన్డేలు, 115 టీ20లు ఆడాడు. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ చరిత్రలో అత్యధిక మ్యాచ్లు, అత్యధిక పరుగుల రికార్డులు మోర్గాన్ పేరిటే నమోదై ఉన్నాయి. 2019లో ఇంగ్లండ్కు తొలి వన్డే ప్రపంచకప్ అందించిన 36 ఏళ్ల మోర్గాన్.. గత సంవత్సరకాలంగా ఫిట్నెస్ సమస్యలు, ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. ఏడేళ్ల పాటు ఇంగ్లండ్ కెప్టెన్గా సేవలందించిన మోర్గాన్.. కెరీర్ మొత్తంలో (ఐర్లాండ్తో కలుపుకుని) 16 టెస్ట్లు, 248 వన్డేలు, 115 టీ20లు ఆడాడు. టెస్ట్ల్లో 2 శతకాలు, 3 అర్ధశతకాల సాయంతో 700 పరుగులు, వన్డేల్లో 14 సెంచరీలు, 47 హాఫ్ సెంచరీల సాయంతో 7701 పరుగులు, టీ20ల్లో 14 హాఫ్ సెంచరీల సాయంతో 2458 పరుగులు చేశాడు. -
వన్డేలకు రిటైర్మెంట్ ఇస్తే.. టీ20ల నుంచి కూడా తప్పించారు!
Ben Stokes ODI Retirement- Eng Vs SA ODI Series: ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్, వన్డే వరల్డ్కప్-2019లో తమ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు బెన్స్టోక్స్. ఇటీవలే అతడు ఇంగ్లండ్ టెస్టు జట్టు పగ్గాలు చేపట్టి స్వదేశంలో న్యూజిలాండ్తో సిరీస్ను గెలవడంతో పాటు రీషెడ్యూల్డ్ టెస్టులో టీమిండియాను ఓడించి కెప్టెన్గా మధుర జ్ఞాపకాలు మిగుల్చుకున్నాడు. అందుకే ఇలా! అయితే, అనూహ్యంగా వన్డేలకు గుడ్బై చెబుతూ స్టోక్స్ తీసుకున్న నిర్ణయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తీరిక లేని షెడ్యూల్ కారణంగా.. మూడు ఫార్మాట్లలో ఆడటం కష్టమవుతోందన్న కారణంగానే తాను వన్డే ఫార్మాట్కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు స్పష్టం చేశాడు 31 ఏళ్ల స్టోక్స్. అంతేకాదు.. తాము కూడా మనుషులమేమని, పెట్రోల్ పోస్తే పరిగెత్తే కార్లు కాదని.. విశ్రాంతి లేకుండా ఆడటం ఎవరితరం కాదని ఇంగ్లండ్ బోర్డుకు చురకలంటించాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాసిర్ హుస్సేన్ సహా పలువురు మాజీ ఆటగాళ్లు ఐసీసీ, క్రికెట్ బోర్డుల తీరును తప్పుబడుతున్నారు. విశ్రాంతి లేకుండా ఆడిస్తే ఆటగాళ్లకు పిచ్చెక్కిపోయి ఇలాగే రిటైర్మెంట్ ప్రకటిస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ‘‘అప్పట్లో ఓసారి.. షెడ్యూల్ భయంకరంగా ఉంది.. నా వల్ల కాదని చెప్పాను. అందుకే వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాను. అయితే, ఈసీబీ నన్ను టీ20లు కూడా ఆడకుండా నిషేధం విధించింది’’ అంటూ పీటర్సన్ ఇంగ్లండ్ బోర్డు తీరును ఎండగట్టాడు. I once said the schedule was horrendous and I couldn’t cope, so I retired from ODI cricket & the ECB banned me from T20s too………….🤣 — Kevin Pietersen🦏 (@KP24) July 19, 2022 కాగా ఇంగ్లండ్ తరఫున 104 టెస్టులు, 136 వన్డేలు, 37 టీ20 మ్యాచ్లు ఆడాడు పీటర్సన్. ఈ మూడు ఫార్మాట్లలో వరుసగా 8181, 4440, 1176 పరుగులు సాధించాడు. అయితే, ఈసీబీతో అతడికి విభేదాలు తలెత్తగా బోర్డుపై తీవ్ర విమర్శలు చేసిన పీటర్సన్ ఆటకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో తాజా ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక 2013లో తన ఆఖరి వన్డే, టీ20 మ్యాచ్లు ఆడిన పీటర్సన్.. 2014లో చివరిసారిగా ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ ఆడాడు. స్టోక్స్ విషయానికొస్తే.. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో మంగళవారం(జూలై 18 )జరిగిన మొదటి వన్డే అతడికి చివరిది. ఈ మ్యాచ్లో స్టోక్స్ 5 పరుగులు మాత్రమే చేశాడు. టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్ ముగిసిన రోజు వ్యవధిలోనే ఇంగ్లండ్ ప్రొటిస్తో పోరుకు సిద్ధమైంది. వన్డేలతో పాటు టీ20, టెస్టు సిరీస్ ఆడనుంది. చదవండి: Eng Vs SA 1st ODI Series 2022: అదరగొట్టిన ప్రొటిస్ బౌలర్లు.. ఇంగ్లండ్పై దక్షిణాఫ్రికా ఘన విజయం! ఏకంగా.. 604 runs and 15 wickets on a sweltering day in Durham! Full highlights: https://t.co/AOpGzaJerX 🏴 #ENGvSA 🇿🇦 pic.twitter.com/VDjYwdNb0L — England Cricket (@englandcricket) July 20, 2022 -
టీమిండియాతో సిరీస్.. క్రికెట్కు గుడ్బై చెప్పిన విండీస్ వికెట్ కీపర్..!
వెస్టిండీస్ మాజీ కెప్టెన్,వికెట్ కీపర్ దినేష్ రామ్దిన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రామ్దిన్ తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా సోమవారం ప్రకటించాడు. దాంతో తన 17 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్కు తెరపడింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న రామ్దిన్ ఫ్రాంచైజీ టోర్నమెంట్లలో మాత్రం ఆడనున్నాడు. 2005లో వెస్టిండీస్ తరఫున అరంగేట్రం చేసిన దినేష్ రామ్దిన్.. 74 టెస్టులు, 139 వన్డేలు, 71 టీ20ల్లో తన జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అతడు తన కెరీర్లో 6 సెంచరీలతో పాటు 5734 పరుగులు సాధించాడు. రెండు సార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన విండీస్ జట్టులో రామ్దిన్ భాగంగా ఉన్నాడు. ఇక రామ్దిన్ చివరగా టెస్టుల్లో 2019లో ఆడగా.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం 2016లో చివరగా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. "అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. గత 14 ఏళ్లగా విండీస్ క్రికెట్కు ప్రాతినిథ్యం వహించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఇన్నాళ్లు మద్దుతగా నిలిచిన ట్రినిడాడ్ అండ్ టొబాగో, వెస్టిండీస్ క్రికెట్, అభిమానులకు ధన్యవాదాలు అంటూ రామ్దిన్ ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నాడు. మరో వైపు భారత జట్టు మూడు వన్డేలు, 5 టీ20ల నిమిత్తం విండీస్లో పర్యటించనుంది. చదవండి: Lendl Simmons: అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన వెస్టిండీస్ ఓపెనర్..! View this post on Instagram A post shared by 124NotOut Sports Agency (@124notout) -
మిథాలీ రాజ్ సంచలన నిర్ణయం.. ప్రపంచకప్ తర్వాత..!
భారత మహిళల జట్టు వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐసీసీ మహిళల ప్రపంచకప్-2022 తర్వాత రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే టీ20లకు మిథాలీ గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో భారత్ 4-1తేడాతో ఓటమి చవిచూసింది. అయితే అఖరి వన్డేలో గెలిచి భారత్ వైట్ వాష్ నుంచి తప్పించుకుంది. ఈ మ్యాచ్లో మంధానతో పాటు మిథాలీ, హర్మాన్ ప్రీత్ కౌర్ అర్ధ సెంచరీలతో రాణించారు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన మిథాలీ తన రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించింది. "ఈ టోర్నమెంట్ తర్వాత నేను రిటైర్మెంట్ ప్రకటిస్తాను.. నా రిటైర్మెంట్ తర్వాత జట్టు యువ క్రికెటర్లతో మరింత బలంగా మారుతుందని భావిస్తున్నాను" అని మిథాలీ పేర్కొంది. ఇప్పటి వరకు 222 వన్డేల్లో భారత తరుపున ఆడిన మిథాలీ రాజ్ 7,516 పరుగులు సాధించింది. తన కేరిర్లో 7 సెంచరీలు, 61 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: Rohit Sharma: కోహ్లి రికార్డుకే ఎసరు పెట్టిన హిట్మ్యాన్ -
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన టీమిండియా క్రికెటర్
VR Vanitha Announces Retirement: టీమిండియా మహిళా క్రికెటర్ వి ఆర్ వనిత అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని సోమవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు 31 ఏళ్ల ఈ టీమిండియా ఓపెనింగ్ బ్యాటర్ ప్రకటించింది. టీమిండియాతో తన 12 ఏళ్ల ప్రయాణాన్ని వనిత తన ట్వీట్లో వివరించింది. ఈ ప్రయాణంలో తనకు సహకరించిన వారందరికీ ధన్యావాదాలు తెలిపింది. దేశవాళీ క్రికెట్లో కర్ణాటక, బెంగాల్ జట్లకు ఆడిన వనిత.. 2014 జనవరిలో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చింది. అంతర్జాతీయ కెరీర్లో 6 వన్డేలు, 16 టీ20లు ఆడిన ఆమె.. ఓవరాల్గా 300కు పైగా పరుగులు సాధించింది. And this lovely innings comes to an END ! pic.twitter.com/ZJw9ieXHSO — Vanitha VR || ವನಿತಾ.ವಿ.ಆರ್ (@ImVanithaVR) February 21, 2022 చదవండి: ప్రపంచ నం.1 మాగ్నస్ కార్ల్సెన్కు షాకిచ్చిన 16 ఏళ్ల భారత కుర్రాడు -
క్రికెట్కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్
Tim Bresnan Announces Retirement: ఇంగ్లండ్కు తొలి టీ20 ప్రపంచకప్(2010) అందించిన జట్టులో కీలక సభ్యుడు, ఆ దేశ స్టార్ ఆల్రౌండర్ టిమ్ బ్రేస్నన్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని అతను 21 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వార్విక్షైర్ కౌంటీ సోమవారం కన్ఫర్మ్ చేసింది. 🧢 685 appearances ☝️ 1,087 wickets 🏏 12,116 runs 🏆 2 Ashes wins Congratulations to former PCA rep Tim Bresnan on a truly outstanding professional career 👏 🤝 All the best with whatever comes next, Tim - the PCA will always be here to support you. pic.twitter.com/F1D0N2gJ3V — PCA (@PCA) January 31, 2022 ఇంగ్లండ్ తరఫున 23 టెస్ట్లు, 85 వన్డేలు, 34 టీ20లు ఆడిన 36 ఏళ్ల బ్రేస్నన్.. దాదాపు 1700 పరుగులు, 205 వికెట్లు పడగొట్టాడు. అతని ఖాతాలో 4 అర్ధ సెంచరీలు, 2 ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. జాతీయ జట్టుతో పోలిస్తే కౌంటీ జట్టు వార్విక్షైర్తో ఎక్కువ అనుబంధం కలిగిన అతను.. ఫస్ట్ క్లాస్ కెరీర్లో 213 మ్యాచ్ల్లో 575 వికెట్లు, 7128 పరుగులు చేశాడు. బ్రేస్నన్ ఇంగ్లండ్ యాషెస్ గెలిచిన రెండు సందర్భాల్లో కీలకంగా వ్యవహరించాడు. Thank you for the incredible memories, @timbresnan! 🤝#OnceABearAlwaysABear 🐻#YouBears pic.twitter.com/SKHiiioix9 — Warwickshire CCC 🏏 (@WarwickshireCCC) January 31, 2022 చదవండి: Shoaib Akhtar: మాంసం తింటాం, సింహాల్లా వేటాడతాం.. అదే మాకు భారత బౌలర్లకి తేడా..! -
పది రోజుల క్రితమే రిటైర్మెంట్ ప్రకటించాడు.. ఇంతలోనే..!
కొలొంబో: 30 ఏళ్ల వయసులోనే క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి, శ్రీలంక క్రికెట్లో ప్రకంపనలకు కారణమైన భానుక రాజపక్స మాట మార్చాడు. పది రోజుల క్రితం చేసిన రిటైర్మెంట్ ప్రకటనను వెనక్కు తీసుకున్నాడు. మున్ముందు జట్టుకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు ట్విటర్ ద్వారా వెల్లడించింది. శ్రీలంక యువజన క్రీడా శాఖ మంత్రి నమల్ రాజపక్స జోక్యంతో భానుక.. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, లంక క్రికెట్ బోర్డు ప్రవేశపెట్టిన కొత్త ఫిట్నెస్ రూల్స్ను నిరసిస్తూ భానుక రాజపక్సతో పాటు మరో క్రికెటర్(దనుష్క రాజపక్స) కూడా ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం లంక క్రికెట్లో పెద్ద దుమారం రేపింది. ఈ ఇద్దరి నిర్ణయం పట్ల రాజకీయ నాయకులు, మాజీ ఆటగాళ్లు, సీనియర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ నిర్ణయంపై పునరాలోచించాలని మాజీ పేసర్ లసిత్ మలింగ ట్విట్టర్ వేదికగా ఈ ఇద్దరిని అభ్యర్ధించాడు. ఇదిలా ఉంటే, శ్రీలంక నూతన ఫిట్నెస్ మార్గదర్శకాల ప్రకారం.. ప్రతి ఆటగాడు 8.10 నిమిషాల్లో రెండు కిలోమీటర్లు పరుగెత్తాల్సి ఉంది. ఒకవేళ నిర్ధిష్ట సమయంలో పరుగు పూర్తి కాకపోతే వారి వేతనాల్లో కోత విధించబడుతుంది. చదవండి: ఇకపై ప్రతి ఏడాది భారత్, పాక్ క్రికెట్ సిరీస్లు..! -
లంక జట్టుకు ఊహించని షాక్.. యువ క్రికెటర్ సంచలన నిర్ణయం
Bhanuka Rajapaksa Retirement: శ్రీలంక క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ యువ ఆటగాడు, స్టార్ క్రికెటర్ భానుక రాజపక్స అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. ఈ మేరకు లంక క్రికెట్ బోర్డుకు లేఖ పంపాడు. లంక బోర్డు ప్రవేశపెట్టిన నూతన ఫిట్నెస్ మార్గదర్శకాల (ప్రతి ఆటగాడు 8.10 నిమిషాల్లో రెండు కిలోమీటర్లు పరుగెత్తాల్సి ఉంది. ఒకవేళ నిర్ధిష్ట సమయంలో పరుగు పూర్తి కాకపోతే వేతనాల్లో కోత పెట్టనున్నారు) కారణంగానే అతను రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది(2021) జరిగిన టీ20 ప్రపంచకప్లో శ్రీలంక తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్-3లో ఉన్న రాజపక్స.. అనూహ్య నిర్ణయం తీసుకోవడం శ్రీలంక క్రికెట్లో సంచలనంగా మారింది. కేవలం 5 వన్డేలు, 18 టీ20లు మాత్రమే ఆడిన రాజపక్స అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడంపై ఆ దేశ మాజీలు స్పందించారు. రాజపక్స.. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. కాగా, 30 ఏళ్ల రాజపక్స.. శ్రీలంక అండర్-19 జట్టులో అద్భుతాలు సృష్టించి, సీనియర్ జట్టులోకి వచ్చాడు. గతేడాది స్వదేశంలో ధవన్ సేనతో జరిగిన వన్డే సిరీస్ ద్వారా వన్డే అరంగ్రేటం చేసిన అతను.. వన్డేల్లో ఒకటి, టీ20ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. చదవండి: ఎగబాకిన రాహుల్.. దిగజారిన కోహ్లి..! -
క్రిస్ గేల్కు ఘోర అవమానం..!
Chris Gayle: విండీస్ విధ్వంసకర యోధుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్కు ఘోర అవమానం జరిగింది. సొంతగడ్డపై టీ20లకు వీడ్కోలు పలకాలనుకున్న తన ఆకాంక్షను ఆ దేశ క్రికెట్ బోర్డు బేఖాతరు చేసింది. త్వరలో ఐర్లాండ్, ఇంగ్లండ్లతో జరగనున్న టీ20 సిరీస్ల కోసం ఎంపిక చేసిన విండీస్ జట్టులో చోటు కల్పించకుండా అతన్ని అవమానపర్చింది. ఇప్పటికే వన్డేలు, టెస్ట్లకు గుడ్బై చెప్పిన గేల్.. తన సొంత మైదానమైన సబీనా పార్క్లో తన చివరి టీ20 మ్యాచ్ ఆడి క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెబుతానని గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ సందర్భంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. విండీస్ క్రికెట్ బోర్డు తాజా నిర్ణయంతో గేల్.. తన సమీప భవిష్యత్తులో టీ20లు ఆడే అవకాశం లేదు. దీంతో అతను టీ20 రిటైర్మెంట్ అంశంపై పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విండీస్.. జనవరి 16న ఐర్లాండ్తో ఏకైక టీ20, ఆతర్వాత జనవరి 22 నుండి 30 వరకు ఇంగ్లండ్తో 5 టీ20లు ఆడనుంది. ఇదిలా ఉంటే, గేల్ తన టీ20 కెరీర్లో మొత్తం 452 మ్యాచ్ల్లో 145.4 స్ట్రైక్రేట్తో 14,321 పరుగులు సాధించి, ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పొట్టి క్రికెట్లో గేల్ 87 హాఫ్ సెంచరీలు, 22 సెంచరీలు బాదాడు. చదవండి: కోహ్లి-రోహిత్ల మధ్య విభేదాలా..? అలాంటి వార్తలు విని నవ్వుకునేవాడిని..! -
అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్న టీమిండియా స్టార్ క్రికెటర్
Harbhajan Singh Announces Retirement: వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన క్రికెట్ కెరీర్కు ముగింపు పలికాడు. శుక్రవారం అన్ని రకాల ఫార్మాట్లకు అతను రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ కలిపి 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో భజ్జీ బంతులు వికెట్లను పడగొట్టడమే కాదు... మ్యాచ్లనూ మలుపు తిప్పాయి. 1998లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన 41 ఏళ్ల ఈ పంజాబీ స్టార్ సంప్రదాయ ఫార్మాట్లో 103 టెస్టులు ఆడి 417 వికెట్లు పడగొట్టాడు. 2 సెంచరీ లతో కలిపి 2,224 పరుగులు కూడా చేశాడు. ఇటు 236 వన్డేల్లో 269 వికెట్లను చేజిక్కించుకొని 1,237 పరుగులు సాధించాడు. 28 టి20 మ్యాచ్ల్లో 25 వికెట్లను తీశాడు. ‘మంచి విషయాలకు ముగింపు ఉంటుంది. నా జీవితంలో భాగమైన క్రికెట్కు, నాపై ఎంతగానో ప్రభావం చూపిన ఆటకు నేను గుడ్బై చెబుతున్నాను. నా 23 ఏళ్ల చిరస్మరణీయ కెరీర్కు అండదండలు అందించిన వారందరికీ కృతజ్ఞతలు’ అని హర్భజన్ తన రిటైర్మెంట్ సందేశాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అందరి క్రికెటర్లలాగే నేను కూడా భారత జెర్సీతోనే ఆటకు వీడ్కోలు పలకాలని ఆశించాను. కానీ విధి నాతో మరోలా చేయించింది’ అని తెలిపాడు. 2016లో ఢాకాలో యూఏఈతో చివరిసారిగా అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడిన భజ్జీ మళ్లీ టీమిండియా జెర్సీ వేసుకోలేదు. ఈ ఏడాది భారత్లో జరిగిన తొలి అంచె ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ తరఫున మూడు మ్యాచ్లు ఆడాడు. కానీ రెండో అంచె ఐపీఎల్ కోసం వేదిక యూఏఈకి మారాక హర్భజన్ బరిలోకి దిగలేదు. All good things come to an end and today as I bid adieu to the game that has given me everything in life, I would like to thank everyone who made this 23-year-long journey beautiful and memorable. My heartfelt thank you 🙏 Grateful .https://t.co/iD6WHU46MU — Harbhajan Turbanator (@harbhajan_singh) December 24, 2021 చదవండి: భారత్లో బెట్టింగ్.. రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు -
రవీంద్ర జడేజా సంచలన నిర్ణయం.. ఇకపై !
Is Ravindra Jadeja Taking Retirement from Test cricket?: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా త్వరలో టెస్ట్ క్రికెట్కు త్వరలో గుడ్బై చెప్పనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుని వన్డే, టీ20 ఫార్మాట్లపై దృష్టి సారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్వయంగా ఈ విషయాన్ని జడేజా సహచర ఆటగాడు ఒకరు దైనిక్ జాగరణ్ పత్రికకు తెలిపారు. కాగా ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్ట్కు గాయంతో జడేజా తప్పకున్న సంగతి తెలిసిందే. ఇక మోకాలి శస్త్రచికత్స అనంతరం కోలుకోవడానికి దాదాపు 6 నెలల సమయం పడుతుంది. దీంతో దక్షిణాఫ్రికా పర్యటనకు కూడా దూరమయ్యాడు. ఈ క్రమంలో జడేజా ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా టీమిండియా తరుపున టెస్ట్ క్రికెట్లో 57 మ్యాచ్లు ఆడిన జడేజా 232 వికెట్లు, 2195 పరుగులు సాధించాడు. ఇక దక్షిణాఫ్రికా పర్యటనకు భారత టెస్ట్ జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. భారత టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ స్టాండ్బై ప్లేయర్లు: నవ్దీప్ సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, అర్జాన్ నగ్వాస్వాల్లా చదవండి: India Tour Of South Africa: భారత టెస్ట్ జట్టు ప్రకటన.. జడేజాతో పాటు మరో స్టార్ స్పిన్నర్ ఔట్ -
సగం దక్షిణాఫ్రికావాడినైతే, సగం భారతీయుడిని: ఏబీ డివిలియర్స్
మా ఇంటి వెనక అన్నయ్యలతో కలిసి క్రికెట్ ఆడటం మొదలు పెట్టిన నాటినుంచి అంతర్జాతీయ స్థాయి వరకు కూడా ఎప్పుడూ ఉరకలెత్తే ఉత్సాహంతో ఆటను ఆస్వాదించాను. అయితే ఇప్పుడు 37 ఏళ్ల వయసులో అలాంటి ప్రేరణ నాలో ఉండటం లేదు. దీనిని అంగీకరించాలి కాబట్టి బాధగా అనిపిస్తున్నా సరే, ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. క్రికెట్ ప్రపంచం నాకు ఎన్నో గొప్ప అవకాశాలు అందించింది. అయితే ఆట నుంచి తప్పుకొని కుటుంబంతో గడిపేందుకు ఇది సరైన సమయంగా అనిపించింది. నా దృష్టిలో ప్రత్యేక స్థానం ఉన్న బెంగళూరు అభిమానులకు నా కృతజ్ఞతలు. ఈ ఫ్రాంచైజీ నా జీవితాన్ని మార్చేసింది. నేను జీవితకాలం ఆర్సీబీవాడినే. ఇన్నేళ్లుగా ఐపీఎల్ కారణంగా భారత్తో నా అనుబంధం మరింత పెరిగింది. ఇక్కడ గడిపిన ప్రతీ క్షణాన్ని నేను ఆస్వాదించాను. సరిగ్గా చెప్పాలంటే నేను సగం దక్షిణాఫ్రికావాడినైతే సగం భారతీయుడిని. కాగా, మిస్టర్ 360 డిగ్రీస్గా ప్రసిద్ధి చెందిన దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్.. ఐపీఎల్ సహా అన్ని క్రికెట్ ఫార్మాట్లకు గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. -
Chris Gayle: నేనింకా రిటైర్ కాలేదు.. ఆ హడావుడి అంతా అందుకే..!
Chris Gayle Confirms That He Hasnt Retired Yet From International Cricket: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా విండీస్ విధ్వంసకర ఆటగాడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ప్రవర్తించిన తీరును చూసి.. ఈ కరీబియన్ యోధుడు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నాడేమోనని అంతా భావించారు. అయితే, ఈ అంశంపై స్పందించిన గేల్.. తానింకా రిటైర్ కాలేదని, మరికొద్ది రోజులు క్రికెట్ ఆటడల సత్తా తనలో ఉందని.. స్వదేశంలో సొంత ప్రేక్షకుల సమక్షంలోనే క్రికెట్కు గుడ్బై చెబుతానని స్పష్టం చేశాడు. అయితే, ఓ రకంగా ఇది ఆటకు వీడ్కోలు పలికినట్టేనని తికమక పెట్టాడు. ‘ప్రపంచకప్లో తనకు చివరి మ్యాచ్ కావడంతో ప్రేక్షకులతో సరదాగా వ్యవహరించానని, మరో ప్రపంచకప్ ఆడాలని ఉన్నా బోర్డు అవకాశం ఇస్తుందని అనుకోవడం లేదని తెలిపాడు. స్వస్థలం అయిన జమైకాలో తన వీడ్కోలు మ్యాచ్ ఆడేందకు బోర్డు అవకాశం ఇవ్వాలని కోరాడు. ఈ మేరకు ఫేస్బుక్ లైవ్ ద్వారా స్పందించాడు. గేల్ ఇదివరకే వన్డే, టెస్ట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన సంగతి తెలసిందే. ఇదిలా ఉంటే, ఆసీస్తో మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన గేల్ 15 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్లో అవుటయ్యాడు. గేల్ పిచ్ను వీడుతున్నప్పుడు వీడ్కోలు అన్నట్టుగా బ్యాట్ను ప్రేక్షకులు, కెమెరా వైపు చూపిస్తూ బయటకు వస్తుండగా.. సహచరులంతా బౌండరీ రోప్ వద్ద నిల్చొని గౌరవ స్వాగతం పలికారు. మరోవైపు, ఈ మ్యాచ్కు ముందే రిటైర్మెంట్ ప్రకటించిన బ్రావోకు మ్యాచ్ అనంతరం ఆసీస్ ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. చదవండి: భారత టీ20 కెప్టెన్గా ఆ ఫాస్ట్ బౌలర్ను ఎంపిక చేయండి... -
గంటల వ్యవధిలో ఇద్దరు ఆటగాళ్ల రిటైర్మెంట్ ప్రకటన
Olympic Bronze Medalist Rupinder Singh, Birendra Lakra Retired: టోక్యో ఒలింపిక్స్ పురుషుల హాకీలో భారత్ కాంస్య పతకం సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఇద్దరు స్టార్ క్రీడాకారులు గంటల వ్యవధిలో రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించారు. తొలుత డ్రాగ్ ఫ్లికర్గా పేరుగాంచిన రూపిందర్ పాల్ సింగ్ అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించగా.. గంటల వ్యవధిలో మరో స్టార్ ఆటగాడు, డిఫెండర్ బీరేంద్ర లక్రా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. రూపిందర్ గురువారం ట్విటర్ వేదికగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించగా.. బీరేంద్ర లక్రా వీడ్కోలు పలుకుతున్న విషయాన్ని ఇన్స్టా వేదికగా వెల్లడించింది. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించేందుకే రిటైర్ అవుతున్నట్లు ఈ ఇద్దరూ ప్రకటించారు. భారత హాకీకి చేసిన సేవలకు గాను హాకీ ఇండియా వీరిద్దరిని అభినందించింది. ఇదిలా ఉంటే, దేశంలో అత్యుత్తమ డ్రాగ్ ఫ్లికర్గా గుర్తింపు పొందిన 30 ఏళ్ల రూపీందర్ పాల్.. భారత్ తరఫున 223 మ్యాచ్ల్లో 119 గోల్స్ సాధించాడు. టోక్యో ఒలింపిక్స్లో జర్మనీతో జరిగిన కాంస్య పతక పోరులో అతను నాలుగు కీలక గోల్స్ సాధించి జట్టు పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక, 31ఏళ్ల బీరేంద్ర లక్రా విషయానికొస్తే.. టోక్యో ఒలింపిక్స్లో భారత హాకీ జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరించిన అతను.. 201 మ్యాచ్ల్లో 10 గోల్స్ సాధించాడు. 2014లో జరిగిన ఏషియన్ గేమ్స్లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టులో లక్రా కీలక సభ్యుడు. చదవండి: ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ బౌలర్ సరికొత్త రికార్డు.. -
ఇంగ్లండ్ అభిమానులకు షాకిచ్చిన మొయిన్ అలీ..
Moeen Ali Retires From Test Cricket: ఇంగ్లండ్ క్రికెట్ అభిమానులకు ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ మొయిన్ అలీ ఊహించని షాకిచ్చాడు. 34 ఏళ్ల వయసులోనే టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. సాంప్రదాయ క్రికెట్ నుంచి వైదొలగాలనుకున్న విషయం ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్వుడ్లతో చర్చించాకే తుది నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశాడు. మొయిన్ అలీ రిటైర్మెంట్ అంశాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) సైతం దృవీకరించింది. కాగా, 2014లో శ్రీలంకతో లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్ ద్వారా టెస్ట్ల్లో అరంగేట్రం చేసిన మొయిన్ అలీ.. ఇంగ్లండ్ తరఫున 64 టెస్ట్ల్లో 2914 పరుగులు చేయడంతో పాటు 195 వికెట్లు పడగొట్టాడు. 2019 యాషెస్ సిరీస్ తర్వాత టెస్ట్ల్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల భారత్తో జరిగిన టెస్ట్ సిరీస్లో మొయిన్ అలీ తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. చదవండి: "నువ్వు సూపరప్పా ఊతప్ప".. సీఎస్కే ప్లేయర్ క్రీడాస్పూర్తికి నెటిజన్లు ఫిదా -
క్రికెట్కు గుడ్బై చెప్పిన స్టార్ బౌలర్..
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు, దిగ్గజ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించాడు. 20 ఏళ్లుగా తన క్రికెట్ ప్రయాణం అద్భుతంగా సాగిందని, ఈ క్రమంలో తనకు సహకరించి తోడుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు అంటూ మంగళవారం ట్వీట్ చేశాడు. Announcement. pic.twitter.com/ZvOoeFkp8w — Dale Steyn (@DaleSteyn62) August 31, 2021 38 ఏళ్ల స్టెయిన్ తన కెరీర్లో 93 టెస్ట్లు, 125 వన్డేలు, 47 టీ20లు ఆడి మొత్తం 699 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రొటిస్ ఫాస్ట్ బౌలర్.. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ తరఫున 95 మ్యాచ్ల్లో 97 వికెట్లు పడగొట్టాడు. కాగా, స్టెయిన్ ఈ ఏడాది జనవరిలో ఐపీఎల్ నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. అయితే, విదేశీ లీగ్లకు మాత్రం అందుబాటులో ఉంటానని ప్రకటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. చదవండి: తాలిబన్లను పొగిడిన పాక్ క్రికెటర్పై నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు -
‘పాలబుగ్గల’ పార్థివ్ రిటైర్
న్యూఢిల్లీ: సుమారు 18 ఏళ్ల క్రితం ఇంగ్లండ్లోని నాటింగ్హామ్ పిచ్పై ఒక 17 ఏళ్ల కుర్రాడితో వికెట్ కీపర్గా అరంగేట్రం చేయించినప్పుడు క్రికెట్ ప్రపంచంలో చాలా మంది ఆశ్చర్యపడ్డారు. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో గంటన్నర పాటు నిలబడి మ్యాచ్ను ‘డ్రా’వైపు మళ్లించిన అతని పట్టుదలను చూసి ప్రత్యర్థులు కూడా అభినందించకుండా ఉండలేకపోయారు. తర్వాతి రోజుల్లో భారత క్రికెట్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆ కుర్రాడే పార్థివ్ పటేల్. సుదీర్ఘ కెరీర్ తర్వాత తాను అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు పార్థివ్ బుధవారం ప్రకటించాడు. తన కెరీర్లో అండగా నిలిచిన బీసీసీఐ, గుజరాత్ క్రికెట్ సంఘానికి అతను కృతజ్ఞతలు తెలిపాడు. 2018 జనవరిలో చివరిసారిగా భారత జట్టుకు (దక్షిణాఫ్రికాపై) ప్రాతినిధ్యం వహించిన పార్థివ్... ఈ ఏడాది ఆరంభంలో సౌరాష్ట్రతో జరిగిన రంజీ ట్రోఫీ సెమీస్ మ్యాచ్లో ఆఖరిగా మైదానంలోకి దిగాడు. కీపర్గా ప్రతిభ, చక్కటి బ్యాటింగ్ నైపుణ్యం ఉన్నా... ధోని హవా కారణంగా ఎక్కువ కాలం జాతీయ జట్టుకు పార్థివ్ దూరం కావాల్సి వచ్చింది. అప్పుడప్పుడు ధోని తప్పుకోవడం వల్లో, సాహా గాయాల వల్లో కొన్ని అవకాశాలు వచ్చాయి. టీనేజర్గా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన అతను 35 ఏళ్ల వయసులో ఆట ముగించాడు. అంతర్జాతీయ క్రికెట్లో: పార్థివ్ అరంగేట్రం చేసిన నాటి నుంచి భారత్ ఆడిన 20 టెస్టుల్లో 19 మ్యాచ్లలో అతనికి అవకాశం దక్కింది. అయితే కీలక సమయాల్లో కీపర్గా చేసిన తప్పిదాలతో జట్టులో స్థానం కోల్పో యాడు. 2002లో హెడింగ్లీ, 2003– 04లో అడిలైడ్లో భారత్ సాధిం చిన విజయాల్లో భాగంగా ఉన్న పార్థివ్... 2004లో రావల్పిండిలో పాకిస్తాన్తో జరిగిన టెస్టులో ఓపెనర్గా వచ్చి 69 పరుగులు చేయడం చెప్పుకోదగ్గ ప్రదర్శన. 2012 తర్వాత పార్థివ్ వన్డేల్లో భారత్కు ప్రాతినిధ్యం వహిం చలేదు. అతను 2 అంతర్జాతీయ టి20 మ్యాచ్లు కూడా ఆడాడు. ఐపీఎల్/దేశవాళీ క్రికెట్లో: ఐపీఎల్లో పార్థివ్ ఆరు ఫ్రాంచైజీల తరఫున ఆడగా మూడుసార్లు (2010లో చెన్నై తరఫున, 2015, 2017లో ముంబై తరఫున) టైటిల్ సాధించిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. హైదరాబాద్లో జరిగిన 2017 ఫైనల్లో చివరి బంతికి సుందర్ను రనౌట్ చేసిన దృశ్యం అభిమానులు మరచిపోలేనిది. 2020లో బెంగళూరు జట్టులో ఉన్నా, ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. గుజరాత్ తరఫున అతను చిరస్మరణీయ ప్రదర్శన కనబర్చాడు. పార్థివ్ సారథ్యంలోనే గుజరాత్ మూడు ఫార్మాట్లలో (రంజీ ట్రోఫీ, విజయ్ హజారే వన్డే టోర్నీ, ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ) విజేతగా నిలవడం విశేషం. ఆరేళ్ల వయసులోనే తలుపు సందులో ఇరుక్కుపోవడంతో ఎడమచేతి చిటికెన వేలు కోల్పోయిన పార్థివ్... తొమ్మిది వేళ్లతోనే వికెట్ కీపర్గా రాణించడం చెప్పుకోదగ్గ అంశం. భారత్ తరఫున పిన్న వయసులో అరంగేట్రం చేసిన వారిలో సచిన్, పీయూష్ చావ్లా, శివరామకృష్ణన్ తర్వాత పార్థివ్ది నాలుగో స్థానం. అయితే వికెట్ కీపర్గా మాత్రం ప్రపంచ క్రికెట్ మొత్తంలో అతనే అందరికంటే చిన్నవాడు. భారత్ తరఫున పార్థివ్ 25 టెస్టుల్లో 31.13 సగటుతో 934 పరుగులు చేశాడు. ఇందులో 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కీపర్గా 62 క్యాచ్లు పట్టిన అతను 10 స్టంపింగ్లు చేశాడు. 38 వన్డేల్లో 23.74 సగటుతో 736 పరుగులు సాధించిన పార్థివ్ ఖాతాలో 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 30 క్యాచ్లు పట్టిన అతను 9 స్టంపింగ్లు చేశాడు. -
ధోని వీడ్కోలు మ్యాచ్ అక్కడే జరగాలి: సీఎం
న్యూఢిల్లీ : టీమీండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. 16 ఏళ్ల క్రికెట్ కెరీర్కు వీడ్కోలు పలుకుతూ తప్పుకుంటున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. అయితే గతేడాది న్యూడిలాండ్తో చివరి మ్యాచ్ ఆడిన ధోని ఆ తర్వాత జట్టుకు దూరంగా ఉంటూ ఏ స్థాయి క్రికెట్లో కూడా పాల్గొనలేదు. దీంతో ధోనికి గొప్పగా వీడ్కోలు పలికేందుకు అతని స్వస్థలం రాంచీలో ఓ ఫేర్వెల్ మ్యాచ్ నిర్వహించాలంటూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ బీసీసీఐని కోరారు. జార్ఖండ్ ఆతిథ్యం ఇవ్వబోయే ఈ చివరి మ్యాచ్ కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తుందని ధోనికి ఫేర్వెల్ మ్యాచ్ రాంచీలో నిర్వహించాలని కోరుతూ ఆయన లేఖ రాశారు. ‘ఇక 7వ నెంబర్ జెర్సీలో హెలికాప్టర్ షాట్లు క్రికెట్ స్టేడియంలో కనిపించవు. దేశానికి, జార్ఖండ్కు ఎన్నో గర్వించదగ్గ విజయాలను ఇచ్చిన ధోనికి గొప్పగా విడ్కోలు పలుకుదాం అంటూ’ సీఎం హేమంత్ సోరెన్ బీసీసీఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. (3 కోట్ల వ్యూస్కు చేరువలో ధోని వీడ్కోలు పాట) గతేడాది కాలంగా ధోని రిటైర్మెంట్పై ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. వన్డే ప్రపంచకప్లో సెమీ ఫైనల్ మ్యాచ్ తర్వాత ధోనీ మళ్లీ క్లబ్ స్థాయి క్రికెట్ కూడా ఆడలేదు. కోట్లాది అభిమానుల్ని నిరాశకు గురిచేస్తూ టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు. దాదాపు 16 ఏళ్ళ పాటు టీం ఇండియాకు సేవలు అందించిన ధోనీ.. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించి మరపురాని విజయాలు అందించాడు. 2007లో టి20 ప్రపంచ కప్, ఆ తర్వాత భారత అభిమానులంతా కలలు గన్న వన్డే వరల్డ్ కప్ (2011)తో పాటు 2013లో చాంపియన్ ట్రోఫీని కూడా సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. మూడు ఐసీసీ టోర్నీలను గెలిచిన ఏకైక కెప్టెన్గా నిలిచిపోయాడు. ప్రస్తుతం ధోనీ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వరకు ఐపీఎల్ 2020 జరుగనున్న సంగతి తెలిసిందే. (‘నీతోపాటు ఉన్నందుకు ఎంతో ఆనందించా ధోని’ ) देश और झारखण्ड को गर्व और उत्साह के अनेक क्षण देने वाले माही ने आज अंतराष्ट्रीय क्रिकेट से सन्यास ले लिया है।हम सबके चहेते झारखण्ड का लाल माही को नीली जर्सी पहने नहीं देख पायेंगे।पर देशवासियों का दिल अभी भरा नहीं। मैं मानता हूँ हमारे माही का एक फ़ेयरवेल मैच राँची में हो जिसका 1/2 pic.twitter.com/XFt5zBSvG8 — Hemant Soren (घर में रहें - सुरक्षित रहें) (@HemantSorenJMM) August 15, 2020 -
అంతర్జాతీయ క్రికెట్కు మహేంద్రసింగ్ ధోని గుడ్బై
-
రిటైర్మెంట్ ప్రకటించిన మిస్టర్ కూల్..
‘మిస్టర్ కూల్’ మళ్లీ టీమిండియా జెర్సీలో కనిపించడు... భారత క్రికెట్ను అత్యున్నత స్థాయికి చేర్చిన నాయకుడిని ఇక అంతర్జాతీయ ఆటలో చూసే అవకాశం మళ్లీ రాదు... అద్భుత విజయాలు సాధించినా, పరాజయపు అవమానాలు ఎదుర్కొన్నా ఒకే తరహాలో స్థితప్రజ్ఞత చూపించిన మహేంద్ర సింగ్ ధోని తన ఆటను ముగిస్తున్నట్లు ప్రకటించాడు. 16 ఏళ్ల కెరీర్కు వీడ్కోలు పలుకుతూ తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్తో ధోని తన చివరి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఏడాది కాలంగా అతను జట్టుకు దూరంగా ఉంటూ ఏ స్థాయి క్రికెట్లో కూడా ఆడలేదు. ఈ ఏడాది టి20 ప్రపంచకప్ ఆడవచ్చని ఇటీవలి వరకు వినిపించినా...కరోనా కారణంగా ఈ టోర్నీ ఏడాది పాటు వాయిదా పడటంతో ఇక తప్పుకునేందుకు సరైన సమయంగా ఎమ్మెస్ భావించాడు. ఇప్పుడు ఐపీఎల్ మాత్రం మహి మెరుపులు చూసేందుకు అవకాశం ఉంది. 350 వన్డేల్లో ధోని 50.57 సగటుతో 10,773 పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 73 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 98 అంతర్జాతీయ టి20 మ్యాచ్లలో 37.60 సగటుతో అతను 1,617 పరుగులు చేశాడు. 2007లో టి20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో వన్డే చాంపియన్స్ ట్రోఫీని గెలిపించిన ధోని మూడు ఐసీసీ టోర్నీలు సాధించిన ఏకైక కెప్టెన్గా నిలవడం విశేషం. ధోని 2014 డిసెంబర్లోనే టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఏడాది విరామమిచ్చి... గత సంవత్సర కాలంలో ధోని రిటైర్మెంట్పై ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. వన్డే ప్రపంచ కప్లో సెమీ ఫైనల్ మ్యాచ్ తర్వాత అతను మళ్లీ క్లబ్ స్థాయి క్రికెట్ కూడా ఆడలేదు. అయితే అంతర్జాతీయ క్రికెట్నుంచి తప్పుకోవడంపై తన వైపు నుంచి ఎలాంటి స్పష్టత లేకపోగా సెలక్టర్లు కూడా నేరుగా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా దాటవేత ధోరణిని అవలంబించారు. ఆ సమయంలో పరిస్థితి చూస్తే అతను కచ్చితంగా ఆస్ట్రేలియాలో టి20 ప్రపంచ కప్ ఆడతాడని అనిపించింది. కెప్టెన్ కోహ్లి మాటలు వింటున్నప్పుడు కూడా వరల్డ్ కప్లో ధోని అనుభవం అక్కరకు వస్తుందనే భావం కనిపించింది. అయితే కరోనా వచ్చి అంతా మార్చేసింది. ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో యూఏఈలో ఐపీఎల్ జరుగుతున్నా... దాని వల్ల ధోనికి వ్యక్తిగతంగా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. టి20 వరల్డ్ కప్ 2021 నవంబర్కు వాయిదా పడింది. అప్పటి వరకు అంటే సంవత్సర కాలం పాటు ఆటను, ఫిట్నెస్ను కాపాడుకోవడంతో పాటు టీమిండియా సభ్యుడిగా ఉండే ఒత్తిడిని ఎలాగూ భరించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆటగాడిగా ధోని కొత్తగా సాధించాల్సిన విజయాలు, అందుకోవాల్సిన లక్ష్యాలులాంటివి ఏమీ లేవు. సరిగ్గా చూస్తే గత సంవత్సర కాలంలో ఎప్పుడైనా ధోని రిటైర్ కావచ్చని వినిపించింది. కానీ అతను మాత్రం తనదైన శైలిలో చివరి బంతి వరకు మ్యాచ్ను తీసుకెళ్లినట్లుగా ఇప్పుడు అధికారికంగా రిటైర్మెంట్ను ప్రకటించాడు. రనౌట్తో మొదలై రనౌట్తో ముగించి... చిట్టగాంగ్లో బంగ్లాదేశ్తో ఆడిన తన తొలి అంతర్జాతీయ మ్యాచ్లో ఏడో స్థానంలో బరిలోకి దిగిన ధోని ఒకే ఒక బంతిని ఎదుర్కొని ‘సున్నా’కే రనౌట్గా వెనుదిరిగాడు. న్యూజిలాండ్తో ఆడిన ఆఖరి వన్డేలో కూడా 50 పరుగులు చేసిన అనంతరం గప్టిల్ అద్భుత త్రోకు అతను రనౌట్ అయ్యాడు. -
లిన్ డాన్ గుడ్బై
బీజింగ్: రెండు దశాబ్దాలు బ్యాడ్మింటన్ను ఏలిన చైనా విఖ్యాత షట్లర్ లిన్ డాన్ ఆటకు గుడ్బై చెప్పాడు. శనివారం తన కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రత్యర్థులకే కాదు... బ్యాడ్మింటన్కే ‘సూపర్ డాన్’గా చిరపరిచితుడైన లిన్ సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ‘2000 నుంచి 2020 వరకు ఇరవై ఏళ్లు ఆటలో కొనసాగిన నేను జాతీయ జట్టుకు గుడ్బై చెప్పాలనుకుంటున్నాను. ఇలా చెప్పడం నాకు చాలా క్లిష్టమైనా తప్పలేదు. నాకు ఇప్పుడు 37 ఏళ్లు. నా శారీరక సామర్థ్యం. గాయాలతో ఒకప్పటిలా నేను మా జట్టు సహచరులతో కలిసి పోరాడలేను. ఆటపై కృతజ్ఞత ఉంది. పైబడిన వయసుతో ఇబ్బంది ఉంది. అందుకే ఇక కుటుంబానికే అంకితమవ్వాలనుకుంటున్నా. జీవితంలో నాకిది కొత్త పోటీ’ అని వెటరన్ లిన్ డాన్ చైనా సోషల్ మీడియా యాప్ ‘వైబో’లో పోస్ట్ చేశాడు. ఆటనే ప్రేమించిన తను అంకితభావంతో నాలుగు ఒలింపిక్స్ ఆడానని చెప్పాడు. ఇన్నేళ్లుగా బ్యాడ్మింటనే లోకమైన తాను ఇలా రిటైర్మెంట్ చెబుతానని ఎప్పుడు అనుకోలేదని అన్నాడు. ర్యాంకింగ్ కంటే ఎక్కువగా ఆడటంపైనే దృష్టిపెట్టిన తనకు శారీరకంగా ఎన్నో సవాళ్లు ఎదురైనట్లు తెలిపాడు. ‘ఆటలో నన్ను ఉత్సాహంగా పోటీపడేలా స్ఫూర్తి పెంచిన నా మేటి ప్రత్యర్థులకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని లిన్ డాన్ తనకెదురైన పోటీదారులను గౌరవించాడు. మేరునగధీరుడు... 666 మ్యాచ్లలో విజయాలు... 66 టైటిల్స్...ఇదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో డాన్ సాధించిన ఘనత. గ్లోబ్లోని దేశాలన్నీ చుడుతూ అతను టైటిళ్లన్నీ పట్టేశాడంటే అతిశయోక్తి కాదు. చైనీస్ సూపర్స్టార్ కచ్చితంగా చాంపియనే. ఏళ్ల తరబడి... దశాబ్దాలు తలపడి ఎవరికీ అనితర సాధ్యమైన టైటిళ్లన్నీ అతనొక్కడే సాధించాడు. రెండు సార్లు ఒలింపిక్ చాంపియన్. ఐదు సార్లు ప్రపంచ చాంపియన్. ఐదు సార్లు ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్. మరో ఐదుసార్లు ఆసియా గేమ్స్ విజేత. ఇంకో ఐదు సుదిర్మన్ కప్ విజయాలు. థామస్ కప్లో అరడజను బంగారు పతకాలు. 4 ఆసియా చాంపియన్షిప్ స్వర్ణాలు. 2 ప్రపంచకప్ విజయాలు. ఈ వేటలో రన్నరప్ రజతాలు, కాంస్యాలు చెప్పుకుంటూ పోతే డాన్ పతకాల జాబితా చాంతాడంత ఉంది. 2004లోనే వరల్డ్ నంబర్ వన్ అయ్యాడు అన్ని గెలుస్తూపోతూ 28 ఏళ్లకే ‘సూపర్ గ్రాండ్ స్లామ్’ సాధించాడు. అంటే బ్యాడ్మింటన్ చరిత్రలో ఉన్న 9 మేజర్ టైటిళ్లను సాధించిన ఏకైక షట్లర్గా చరిత్రకెక్కాడు. ఒలింపిక్ చాంపియన్షిప్ (2008, 2012) నిలబెట్టుకున్న తొలి, ఒకేఒక్క బ్యాడ్మింటన్ ఆటగాడు కూడా లిన్ డానే! 2004లో జరిగిన ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ ఫైనల్లో ఇతని దెబ్బకు తలవంచిన పీటర్ గేడ్... చైనీస్ ఆటగాడిని ఉద్దేశిస్తూ ‘సూపర్ డాన్’గా కితాబిచ్చాడు. తర్వాత్తర్వాత అదే పేరు స్థిరపడిపోయేలా తన రాకెట్తో బ్యాడ్మింటన్ లోకాన్నే రఫ్ఫాడించాడు. 2002లో తన తొలి టైటిల్ సాధించినప్పటినుంచి ప్రతీ సంవత్సరం అతను కనీసం ఒక్క టోర్నీలోనైనా విజయం సాధించడం విశేషం. బ్యాడ్మింటన్లో దిగ్గజ చతుష్టయంగా గుర్తింపు తెచ్చుకున్న నలుగురిలో చివరగా డాన్ రిటైరయ్యాడు. మిగతా ముగ్గురు లీ చోంగ్ వీ, తౌఫీక్ హిదాయత్, పీటర్ గేడ్లతో పోలిస్తే సాధించిన ఘనతల ప్రకారం లిన్ డాన్ అందరికంటే గ్రేట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. -
ధోనికి ఆ హక్కు ఉంది
న్యూఢిల్లీ: గత రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసిన అంశం మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్. అయితే ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ధోనికి ఎప్పుడు రిటైర్ కావాలో ఒకరు చెప్పాల్సిన పని లేదని భారత మాజీ కోచ్ గ్యారీ కిర్స్టెన్ ఘాటుగా వ్యాఖ్యానించాడు. ‘ఆటకు తాను అనుకున్నప్పుడే రిటైర్మెంట్ ఇచ్చే హక్కు ధోనికి ఉంది. అతను సాధించిన ఘనతలతో ఆ స్థాయికి చేరుకున్నాడు రిటైరయ్యే సమయం వచ్చిందంటూ అతనికి ఎవరూ చెప్పాల్సిన పని లేదు. అతనో అద్భుతమైన క్రికెటర్. ధోని మేధస్సు, శాంతం, శక్తి, అథ్లెటిక్స్ నైపుణ్యం, వేగం అతన్ని అందరిలో ప్రత్యేకంగా నిలుపుతాయి. ఆధునిక యుగం దిగ్గజ క్రీడాకారుల్లో ధోని ఒకరు’ అని కిర్స్టెన్ ధోనికి కితాబిచ్చాడు. -
పాక్ మహిళా స్టార్ క్రికెటర్ సనా మీర్ వీడ్కోలు
కరాచీ: పాకిస్తాన్ మహిళల క్రికెట్లో స్టార్ ప్లేయర్గా గుర్తింపు పొందిన మాజీ కెప్టెన్ సనా మీర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంది. తన 15 ఏళ్ల కెరీర్లో 34 ఏళ్ల సనా మీర్ పాకిస్తాన్ తరఫున 120 వన్డేలు, 106 టి20 మ్యాచ్లు ఆడింది. 2009 నుంచి 2017 మధ్య 137 మ్యాచ్ల్లో ఆమె పాక్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించింది. ‘రిటైర్మెంట్కు ఇదే సరైన సమయంగా నేనే భావిస్తున్నాను. నా క్రికెట్ ప్రయాణంలో అండగా నిలిచిన జట్టు సభ్యులకు, ప్రేక్షకులకు నా ధన్యవాదాలు’ అని సనా తెలిపింది. వన్డేల్లో 1,630 పరుగులు చేసిన ఆమె 151 వికెట్లు కూడా తీసింది. తద్వారా పాక్ తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచింది. ఇక టి20 ఫార్మాట్లో 802 పరుగులు సాధించిన ఆమె 89 వికెట్లు పడగొట్టింది. -
ఫిలాండర్ కూడా...
జొహన్నెస్బర్గ్: సీనియర్లు దూరమై ఇప్పటికే దిక్కు తోచని స్థితిలో కనిపిస్తున్న దక్షిణాఫ్రికా క్రికెట్కు మరో దెబ్బ తగిలింది. స్టెయిన్, మోర్నీ మోర్కెల్ దూరమయ్యాక పేస్ బౌలింగ్ భారాన్ని మోస్తున్న సీనియర్ వెర్నాన్ ఫిలాండర్ కూడా టెస్టు క్రికెట్కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు. త్వరలో స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగే టెస్టు సిరీస్ తర్వాత అతను రిటైర్ కానున్నాడు. తొలి టి20 ప్రపంచకప్తో పాటు 30 వన్డేలు కూడా ఆడినా... టెస్టు స్పెషలిస్ట్గానే ఫిలాండర్కు ఎక్కువ గుర్తింపు దక్కింది. 12 ఏళ్ల కెరీర్లో ఫిలాండర్ 60 టెస్టుల్లో 22.16 సగటుతో 216 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 13 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం విశేషం. సఫారీ జట్టు చిరస్మరణీయ టెస్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ స్వింగ్ బౌలర్, ఆ దేశం తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు. ఇటీవల తరచూ గాయాలబారిన పడుతుండటంతో 34 ఏళ్ల ఫిలాండర్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత 18 నెలల్లో ఫిలాండర్ 6 టెస్టులు మాత్రమే ఆడగలిగాడు. కొన్నాళ్ల క్రితమే అతని ఫిట్నెస్ను మాజీ కెప్టెన్, ప్రస్తుతం దక్షిణాఫ్రికా బోర్డు డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ ప్రశ్నించడంతో ఫిలాండర్ కెరీర్పై చర్చ మొదలైంది. -
అందుకే రిటైర్మెంట్పై ధోని వెనకడుగు!
న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ విషయంలో రోజుకో వార్త హల్చల్ చేస్తోంది. ప్రస్తుతానికి రిటైర్మెంట్ ఆలోచన లేదని, భారత జట్టు భవిష్యత్తు ప్రణాళికల్లోకూడా తాను భాగం కానని, మేనేజ్మెంట్ వ్యూహాలకు అనుగుణంగా యువ ఆటగాళ్లను సిద్ధం చేసుకోవచ్చని ఎమ్మెస్కే ప్రసాద్కు ధోని స్పష్టం చేసినట్లు సోమవారం వార్తలు షికారు చేశాయి. అయితే రిటైర్మెంట్ విషయంలో ధోని వెనుకడుగు వేయడానికి కారణం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లినేనని తాజా సమాచారాన్ని బట్టి తెలస్తోంది. వాస్తవానికి ప్రపంచకప్ అనంతరమే ధోని ఆటకు గుడ్బై చెప్పాలని భావించాడని, కానీ కోహ్లి విన్నపం మేరకు ఆగాడని భారత కెప్టెన్ సన్నిహితుడు ఒకరు మీడియాకు తెలిపారు. ‘ఇంత అత్యవసరంగా రిటైర్మెంట్ తీసుకోవద్దనే కోహ్లి విన్నపంతోని ధోని తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ధోనికి ఎలాంటి ఫిట్నెస్ సమస్యల్లేవని, అతను 2020 టీ20 ప్రపంచకప్ వరకు కొనసాగగలడని కోహ్లి భావిస్తున్నాడు. అతని సేవలు అవసరమైనప్పుడు జట్టుకు ఉపయోగపడుతాడనే యోచనలో ఉన్నాడు. ఈ సమయంలో వికెట్ కీపర్గా రిషభ్ పంత్ను సిద్ధం చేయాలనుకుంటున్నారు. పంత్ గాయపడ్డా.. ఫామ్ కోల్పోయినా.. ప్రత్యామ్నయంగా ధోని ఉపయోగపడుతాడని, అలాంటప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగదు.’ అని కోహ్లి భావిస్తున్నట్లు అతని సన్నిహితుడు పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే ధోని భారత జట్టు భవిష్యత్తు ప్రణాళికల్లో భాగం కానని ఎమ్మెస్కే ప్రసాద్కు చెప్పాడన్నారు. రాబోయే రెండు నెలలు ప్రాదేశిక సైన్యం (టెరిటోరియల్ ఆర్మీ)లో పని చేయాలని భావించిన ధోని.. విండీస్ పర్యటనకు దూరంగా ఉంటానని చెప్పిన విషయం తెలిసిందే. -
ధోని రిటైర్మెంట్.. గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: టీమిండియా వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని తన కెరీర్ చరమాంకంలో ఉన్నాడని, ప్రస్తుత పరిస్థితిపై ఉద్వేగానికి లోనవ్వకుండా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ సూచించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ధోని రిటైర్మెంట్ వ్యవహారంపై స్పందించారు. ధోని కెప్టెన్గా ఉన్న సమయంలో కుర్రాళ్లకు ఎక్కువగా చాన్సులు ఇచ్చేవాడని తెలిపారు. ఆస్ట్రేలియాతో జరిగిన ఓ సిరీస్లో సెహ్వాగ్, సచిన్లతో పాటు తనను కూడా పక్కనబెట్టాలనుకున్నాడని గంభీర్ వెల్లడించారు. యువ ఆటగాళ్ల కోసమే ఆ నిర్ణయం తీసుకున్నాడని వివరించారు. తదుపరి ప్రపంచకప్ కోసం అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ను సిద్ధం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని గంభీర్ చెప్పుకొచ్చారు. భవిష్యత్తు వికెట్ కీపర్గా రిషభ్ పంత్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లేక మరే యువ ఆటగాడికైనా విడివిడిగా అవకాశాలిచ్చి పరీక్షించాలని సూచించారు. ఒక్కొక్కరికి ఏడాదిన్నర పాటు అవకాశం ఇచ్చి ఎవరు బాగా ఆడితే వారిని తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. మహేంద్రసింగ్ ధోని అత్యత్తమ కెప్టెన్ అన్న గంభీర్.. గెలిస్తే క్రెడిట్ అంతా అతనికివ్వడం ఓడితే నిందించడం సరికాదన్నారు. ‘గణంకాలు చూస్తే ధోని అత్యుత్తమ కెప్టెన్. కానీ అంతమాత్రాన మిగతా కెప్టెన్లు గొప్పవారు కాదని కాదు. సౌరవ్ గంగూలీది అద్భుతమైన కెప్టెన్సీ. అతని సారథ్యంలోనే మనం విదేశాల్లో గెలుపునందుకున్నాం. విరాట్ కోహ్లి కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్, ఆసీస్లో టెస్ట్ సిరీస్ గెలిచాం. ధోని రెండు ప్రపంచకప్లు తీసుకురావడం నిజం. కానీ ఆ గెలుపు క్రెడిట్ను కెప్టెన్గా అతనొక్కనికే ఇవ్వడం.. ఓడినప్పుడు నిందించడం మాత్రం సరైంది కాదు. ప్రపంచకప్లు, చాంపియన్స్ ట్రోఫీ ధోని తీసుకురావచ్చు. కానీ ఇతర కెప్టెన్లు కూడా ఆటపరంగా జట్టును అత్యున్నత స్థానానికి తీసుకెళ్లారు.’ అని గంభీర్ అభిప్రాయపడ్డారు. -
క్రికెట్కు హైదరాబాద్ అల్లుడు గుడ్బై
లండన్ : పాకిస్తాన్ క్రికెటర్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ అంతర్జాతీయ వన్డేలకు వీడ్కోలు పలికాడు. సీనియర్ ఆటగాడనే ట్యాగ్తో ఈ ప్రపంచకప్లో చోటు దక్కించుకున్న మాలిక్ దారుణ ప్రదర్శనతో విమర్శలపాలయ్యాడు. మూడు మ్యాచ్లే ఆడిన అతను 8, 0, 0 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్తో శుక్రవారం జరిగిన మ్యాచ్తో మెగాటోర్నీలో పాక్ కథ ముగిసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో మాలిక్కు చోటుదక్కకపోయినప్పటికి ఆటగాళ్లు అతనికి ఘనంగా వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ ‘క్రికెట్ వరల్డ్కప్’ అధికారిక ట్వీటర్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది. ఇక అంతకు ముందు మాలిక్ సైతం ట్విటర్ వేదికగా అంతర్జాతీయ వన్డేల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. ‘ఈ రోజు అంతర్జాతీయ వన్డేలకు వీడ్కోలు పలుకుతున్నాను. నాతో ఆడిన ఆటగాళ్లు, శిక్షణ ఇచ్చిన కోచ్లు, కుటుంబ సభ్యులు,మిత్రులు, మీడియా, స్పాన్సరర్స్, ముఖ్యంగా నా అభిమానులకు ధన్యవాదాలు. లవ్ యూ ఆల్.’ అని ట్వీట్ చేశాడు. షోయబ్ మాలిక్ తన చివరి వన్డే మాంచెస్టర్ వేదికగా భారత్పై ఆడాడు. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ 89 పరుగుల(డక్వర్త్లూయిస్) తేడాతో ఓడిపోయింది. మాలిక్ ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్లో గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. 1999లో తొలి వన్డే ఆడిన మాలిక్ 20 ఏళ్ల కెరీర్లో 287 వన్డేల్లో పాక్కు ప్రాతినిధ్యం వహించాడు. 34.55 సగటుతో 7,534 పరుగులు చేశాడు. 39.19 సగటుతో 158 వికెట్లు పడగొట్టాడు. 20 ఏళ్లపాటు పాక్ క్రికెట్కు సేవలందించిన మాలిక్కు యావత్ క్రికెట్ ప్రపంచం శుభాకాంక్షలు తెలుపుతోంది. మాజీ క్రికెటర్లు, అభిమానులు ట్విటర్ వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. రెండో ఇన్నింగ్స్ అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నారు ‘ప్రతీ కథకు ఓ ముగింపు ఉంటుంది. కానీ జీవితంలో ప్రతి ముగింపుకు ఓ కొత్త ఆరంభం కూడా ఉంటుంది. మాలిక్ 20 ఏళ్లు నీ దేశం గర్వించేలా ఆడావు. అలాగే ఎంతో గౌరవం, వినయంతో నీ ఆటను కొనసాగించావు. నీవు సాధించిన ప్రతి మైలురాయి పట్ల నేనెంతో గర్వపడ్డా.’ అని సానియా మీర్జా ట్వీట్ చేసింది. 2010 ఏప్రిల్ 12న వివాహబంధంతో సానియా- మాలిక్లు ఒక్కటైన విషయం తెలిసిందే. ‘Every story has an end, but in life every ending is a new beginning’ @realshoaibmalik 🙃 u have proudly played for your country for 20 years and u continue to do so with so much honour and humility..Izhaan and I are so proud of everything you have achieved but also for who u r❤️ — Sania Mirza (@MirzaSania) July 5, 2019 -
మిథాలీ వీడ్కోలు పలకనుందా?
ముంబై : మహిళా క్రికెట్లో తనకుంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న టీమిండియా స్టార్ బ్యాటర్ మిథాలీ రాజ్ టీ20 క్రికెట్కు వీడ్కోలు పలికే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్లో ఈ హైదరాబాదీ స్టార్ బ్యాటర్కు తుది జట్టులో చోటు దక్కని విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు, మాజీ క్రికెటర్లు భగ్గుమన్నారు. అయితే ఈ అవమానాన్ని మిథాలీ తట్టుకోలేకపోతుందని, టీ20 క్రికెట్కు వీడ్కోలు పలకాలనే యోచనలో ఉన్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వాస్తవానికి మిథాలీ ఈ ప్రపంచకప్ టోర్నీలో అద్భుతంగా రాణించింది. రెండు మ్యాచ్ల్లో అర్థశతకాలతో మెరిసి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. గ్రూప్ దశలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి మ్యాచ్కు గాయం కారణంగా ఆమెకు విశ్రాంతినిచ్చారు. ఇంగ్లండ్తో జరిగిన సెమీస్ మ్యాచ్లోను ఆమెను ఎంపిక చేయలేదు. ఈ మ్యాచ్లో భారత మహిళలు మిథాలీని పక్కన పెట్టినందుకు భారీ మూల్యమే చెల్లించుకున్నారు. దారుణంగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఇక సెమీస్ మ్యాచ్లో చోటు దక్కకపోవడంతో మిథాలీ చాలా బాధపడిందని ఆమె వ్యక్తి గత కోచ్ మీడియాకు తెలిపారు. సెమీఫైనల్ రోజు ప్రాక్టీస్ ముగిసిన తర్వాత ఆమె ఆడటం లేదని చెప్పారని పేర్కొన్నారు. ఇప్పటి వరకైతే మిథాలీ నోట వీడ్కోలు మాట రాలేదు కానీ.. ఈ టోర్నీ ముందు ఆమె ఇదే తన చివరి టీ20 వరల్డ్కప్ అని వ్యాఖ్యానించడం ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ప్రపంచకప్ విజయంతో ఘనంగా వీడ్కోలు పలకాలనుకున్న ఆమెకు ఘోర అవమానం జరగడంతో తట్టుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. 35 ఏళ్ల మిథాలీ.. వన్డేల్లో 51.17 సగటులో అత్యధికంగా 6550 పరుగుల చేసింది. గత 20 ఏళ్లుగా భారత మహిళా క్రికెట్లో రాణిస్తున్న ఆమెను ఆదర్శంగా తీసుకొని ఎందరో క్రికెట్ వైపు అడుగులేస్తున్నారు. అలాంటి మిథాలీకి ఈ తరహా అవమానం జరగడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. -
క్రికెట్కు మునాఫ్ పటేల్ వీడ్కోలు
న్యూఢిల్లీ: భారత పేస్బౌలర్ మునాఫ్ పటేల్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. 2011 వరల్డ్కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన మునాఫ్ ఆ తర్వాత గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. 2006లో ఇంగ్లండ్పై టెస్టు అరంగేట్రం చేసిన అతను మొత్తం 13 టెస్టుల్లో 35 వికెట్లు... 70 వన్డేల్లో 86 వికెట్లు... 3 టి20ల్లో 4 వికెట్లు తీశాడు. వరల్డ్కప్ గెలిచిన ఏడాదే ఇంగ్లండ్తో చివరి అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడిన మునాఫ్ ఆ తర్వాత తిరిగి జట్టుకు ఎంపిక కాలేదు. ‘ఇప్పటి వరకు చాలామందితో కలిసి ఆడాను. వారిలో ధోని తప్ప దాదాపు అందరూ తప్పుకున్నారు. మిగతావారు ఆడుతూ నేను రిటైర్మెంట్ ప్రకటిస్తే ఎక్కువ బాధ ఉండేది. ఇక వైదొలగాల్సిన సమయం వచ్చేసింది’ అని 35 ఏళ్ల మునాఫ్ పేర్కొన్నాడు. -
19 ఏళ్ల ప్రస్థానం ముగించి...
1999 సెప్టెంబర్ 22–26... రంగన హెరాత్ తన తొలి టెస్టు ఆడిన తేదీలు. గత 19 ఏళ్లుగా అతను అలసట లేకుండా అంతర్జాతీయ క్రికెట్లో వేల సంఖ్యలో బంతులు వేస్తూనే ఉన్నాడు. కొత్త మిలీనియం ప్రారంభానికి ముందు అరంగేట్రం చేసి ఇప్పటి వరకు టెస్టు క్రికెట్ ఆడుతున్నవారిలో హెరాత్ ఆఖరివాడు. ఒకనాడు మురళీధరన్ నీడలోనే ఉండిపోయిన అతను, మురళీధరన్ తప్పుకున్న తర్వాత తనదైన ప్రత్యేకత కనబర్చి శ్రీలంక క్రికెట్లో ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్నాడు. నేటి నుంచి గాలేలో ఇంగ్లండ్తో జరిగే తొలి టెస్టు 40 ఏళ్ల హెరాత్ ముదియన్సెలగే రంగన కీర్తి బండార (హెచ్ఎంఆర్కేబీ) హెరాత్కు ఆఖరి టెస్టు మ్యాచ్ కానుంది. సాక్షి క్రీడా విభాగం : శ్రీలంక జట్టులో మురళీధరన్ ఉన్నంత వరకు 22 టెస్టులు 37.88 సగటుతో హెరాత్ కేవలం 71 వికెట్లు పడగొట్టాడు. రెండో స్పిన్నర్గా జట్టులో కొనసాగుతున్నా, కొన్ని అద్భుత ప్రదర్శనలు ఉన్నా అతడిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కచ్చితత్వంతో సుదీర్ఘ స్పెల్ల పాటు బౌలింగ్ చేసి బ్యాట్స్మన్పై ఒత్తిడి పెంచడమే అతని పనిగా ఉండేది. ఇలాంటి స్థితిలో టన్నులకొద్దీ వికెట్లు మాత్రం మురళీ ఖాతాలోకి వెళ్లిపోయేవి. అయితే ఏనాడూ తన అసంతృప్తిని ప్రదర్శించని రంగన... మురళీ తప్పుకున్న తర్వాత తనెంత విలువైన ఆటగాడినో చూపిస్తూ చెలరేగిపోయాడు. ఆ తర్వాత ఆడిన 70 టెస్టుల్లో కేవలం 26 సగటుతో ఏకంగా 359 వికెట్లు తీయడం హెరాత్ స్వయంప్రకాశాన్ని చూపిస్తుంది. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో 10వ స్థానంలో (430 వికెట్లు) ఉన్న హెరాత్ ఎడంచేతి వాటం వారిలో అత్యంత విజయవంతమైన బౌలర్ కావడం విశేషం. తొలి పదేళ్లలో 14 టెస్టులు మాత్రమే దక్కడంతో దాదాపు కెరీర్ ముగిసిపోయిన దశలో ఇంగ్లండ్లో మైనర్ లీగ్లు ఆడుకునేందుకు హెరాత్ వెళ్లిపోయాడు. అలాంటి స్థితిలో 31 ఏళ్ల వయసులో 2009లో అనూహ్యంగా వచ్చిన మరో అవకాశంతో హెరాత్ జట్టులో పాతుకుపోయాడు. తన సత్తాను ప్రదర్శిస్తూ జట్టులో కొనసాగగలిగాడు. 35 ఏళ్ల వయసు దాటిన తర్వాతే అతను 230 వికెట్లు తీయడం మరో చెప్పుకోదగ్గ విశేషం. ఇతర బౌలర్లతో పోలిస్తే హెరాత్ను ప్రత్యేకంగా నిలబెట్టే అంశం నాలుగో ఇన్నింగ్స్లో అతను తీసిన వికెట్ల సంఖ్య. చివరి ఇన్నింగ్స్లో ప్రత్యర్థిని పడగొట్టి మ్యాచ్ను గెలిపించడంలో తనకెవరూ సాటి రారన్నట్లుగా హెరాత్ ఏకంగా 12 సార్లు ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాతి స్థానంలో ఉన్న మురళి 7 సార్లే ఆ ఘనత నమోదు చేయగలిగాడు! దీనిపై స్పందిస్తూ ‘అవన్నీ సొంతగడ్డపై స్పిన్కు బాగా అనుకూలమైన పిచ్లు. ముఖ్యంగా నాలుగో ఇన్నింగ్స్లో బంతి బాగా టర్న్ అవుతుంది. రికార్డులకు పిచ్లు కూడా కారణం’ అంటూ చెప్పుకోవడం హెరాత్కే చెల్లింది. శ్రీలంకలోనే కాకుండా 2011లో డర్బన్లో అద్భుత బౌలింగ్తో 9 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా గడ్డపై లంక తొలి టెస్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించడం అతని కెరీర్లో చిరస్మరణీయ జ్ఞాపకం. ఘనతలపరంగా చూస్తే కావాల్సినంత పేరు ప్రఖ్యాతులు రాకపోయినా, స్టార్ బౌలర్గా గుర్తింపు లేకపోయినా తన పనేంటో తాను చేసుకుంటూ పోయిన హెరాత్ వివాదాలకు దూరంగా ఆటకు గుడ్బై చెబుతున్నాడు. తాను తొలి టెస్టు ఆడిన, బాగా అచ్చొచ్చిన గాలే మైదానంలో (99 వికెట్లు) చివరి టెస్టులో హెరాత్ మరో ఐదు వికెట్లు తీస్తే హ్యాడ్లీ, బ్రాడ్, కపిల్లను దాటి ఏడో స్థానంతో కెరీర్ ముగిస్తాడు. శ్రీలంక గీ ఇంగ్లండ్; తొలి టెస్టు (గాలే) ఉదయం గం. 10 నుంచి సోనీ సిక్స్లో ప్రత్యక్ష ప్రసారం -
టీమిండియాపై అరుదైన ఫీట్!
లండన్ : భారత్తో జరుగుతున్న చివరి టెస్ట్లో ఇంగ్లండ్ ఓపెనర్ అలిస్టర్ కుక్ అరుదైన గణంకాలను నమోదు చేశాడు. ఈ మ్యాచ్తో ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ క్రికెట్ కెరీర్కు గుడ్బై చెబుతున్న విషయం తెలిసిందే. అయితే భారత్పైనే అరంగేట్రం చేసిన కుక్ చివరి మ్యాచ్ కూడా అదే జట్టుతో ఆడటం విశేషం. అరంగేట్ర మ్యాచ్లోనే సెంచరీతో చెలరేగిన కుక్.. చివరి మ్యాచ్లోనూ సెంచరీ సాధించాడు. తద్వారా అరంగేట్ర, కెరీర్ చివరి టెస్టులోనూ సెంచరీ చేసిన ఐదో క్రికెటర్గా గుర్తింపు పొందాడు. గతంలో రెగీ డఫ్ (ఆస్ట్రేలియా), పోన్స్ఫర్డ్ (ఆస్ట్రేలియా), గ్రెగ్ చాపెల్ (ఆస్ట్రేలియా), అజహరుద్దీన్ (భారత్) ఈ ఘనతను సాధించారు. రెగీ డఫ్ 1902లో ఇంగ్లండ్పై అరంగేట్ర మ్యాచ్లో (32,104) పరుగులు చేశాడు. చివరి మ్యాచ్ అదే ఇంగ్లండ్పై 1905లో (146, రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయలేదు) చేశాడు. బిల్ పోన్స్ఫర్డ్ 1924లో ఇంగ్లండ్పై అరంగేట్ర మ్యాచ్లో (110,27).. చివరి మ్యాచ్(1934)లో అదే ఇంగ్లండ్పై (266,22) పరుగులు సాధించాడు. గ్రెగ్ చాపెల్ ఇంగ్లండ్పై (1970) అరంగేట్ర మ్యాచ్లో (108 పరుగులు, రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయలేదు).. చివరి మ్యాచ్(1984)లో పాకిస్తాన్పై (182, రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయలేదు) పరుగులు చేశాడు. అజహరుద్దీన్ ఇంగ్లండ్పై అరంగేట్ర మ్యాచ్ (1984)లో (110, రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయలేదు).. లాస్ట్ మ్యాచ్(2000)లో దక్షిణాఫ్రికాపై (9,102) పరుగులు సాధించాడు. ఇక 2006లో భారత్పై నాగ్పూర్లో తన తొలి టెస్ట్ ఆడిన కుక్ అందులోనూ (60,104 నాటౌట్), అర్ధశతకం, శతకం సాధించాడు. ఇప్పుడు చివరి మ్యాచ్లోనూ(71,147)లతో అదే గణంకాలను పునరావృతం చేశాడు. ఇలాంటి అరుదైన ఫీట్ నమోదు చేసిన ఏకైక క్రికెటర్ కుక్ ఒక్కడే కావడం గమనార్హం. టాప్-5లో కుక్.. టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కుక్ (12,472) పరుగులతో ఐదో స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఎడమ చేతివాటం బ్యాట్స్మన్గా కుక్ రికార్డు నెలకొల్పాడు. సంగక్కర (శ్రీలంక–12,400) పేరిట ఉన్న రికార్డును అతను తిరగరాశాడు. అత్యధిక పరుగుల జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 15921 తొలి స్థానంలో ఉండగా.. రికీ పాంటింగ్ (13378), జాక్వస్ కల్లీస్(13289), రాహుల్ ద్రవిడ్ (13288)లు కుక్ కన్నా ముందున్నారు. ‘‘గడిచిన ఈ నాలుగు రోజులు నిజమా.. కలనా అనిపిస్తోంది. ఇక్కడున్న నా స్నేహితులు కొంత మంది గత నాలుగురోజులుగా నన్ను ట్రీట్ చేసిన విధానం అత్యద్భుతం. ఇక నా బ్యాటింగ్ చివరి ఓవర్స్లో నా అభిమానుల పాటలు చాలా ప్రత్యేకం’’ - అలిస్టర్ కుక్ చదవండి: ఓటమి అంచున కోహ్లి సేన -
అప్పుడే నా రిటైర్మెంట్! - యువరాజ్
సాక్షి, స్పోర్ట్స్ : 2019 ప్రపంచకప్ తర్వాతే రిటైర్మెంట్పై ఓ నిర్ణయం తీసుకుంటానని టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పష్టం చేశారు. గతేడాది జూన్లో చివరిసారిగా అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడిన యువరాజ్ జట్టులో స్థానం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్పై వస్తున్న ప్రశ్నలపై యూవీ ఓ స్పోర్ట్స్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. ‘ఐపీఎల్ కోసం ఎదురు చూస్తున్నా. 2019 ప్రపంచకప్కు ఎంపికవ్వడానికి ఉపయోగపడే ఈ టోర్నీ నాకెంతో ముఖ్యం. నేను 2019 వరకు క్రికెట్ ఆడాలనుకుంటున్నాను. ఏదైమైనా నా రిటైర్మెంట్ నిర్ణయం 2019 తర్వాతే ప్రకటిస్తా. నా కెరీర్ తొలి 6-7 ఏళ్లు అద్భుతంగా సాగింది. కానీ గొప్ప ఆటగాళ్లు ఉండటంతో టెస్టు మ్యాచ్లో అవకాశాలు రాలేదు. అవకాశం వచ్చినప్పుడు క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నాను. ఏ సమయానికి ఏం జరుగుతుందో తెలీదు. ఏది మన చేతుల్లో లేదు. నేనిప్పుడు కేవలం నా ఆటపైనే దృష్టి సారించాను.’అని యువీ చెప్పుకొచ్చాడు. ఇక దక్షిణాఫ్రికా గడ్డపై కోహ్లి సేన విజయంపై స్పందిస్తూ.. ఆటగాళ్లు గొప్ప ప్రదర్శన ఇచ్చారని, ముఖ్యంగా విరాట్ కెప్టెన్గా ముందుండి నడిపించాడని కొనియాడాడు. స్పిన్నర్లు కుల్దీప్, చాహల్లు అద్భుతంగా రాణించారని చెప్పుకొచ్చారు. అండర్-19 ప్రపంచకప్ సాధించిన యువ ఆటగాళ్లకు ఐపీఎల్ చక్కని వేదికని ఈ సిక్సర్ల సింగ్ చెప్పుకొచ్చాడు. ఈ టోర్నీని ఆస్వాదిస్తూ.. మరింత రాటుదేలుతారని యువీ అభిప్రాయపడ్డాడు. -
ఘనంగా ఆర్జేడీ ఉద్యోగ విరమణ
వైవీయూ: డిగ్రీ కళాశాలల ప్రాంతీయ సంయుక్త సంచాలకులు డాక్టర్ కె. మల్లేశ్వరి ఉద్యోగ విరమణ సన్మానసభ ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ సన్మానసభలో పలువురు వక్తలు ఆమె సేవలను కొనియాడారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పి. సుబ్బలక్షుమ్మ మాట్లాడుతూ అధ్యాపక వృత్తిని ఎంతో బాధ్యతగా భావించి సేవలందించారని కొనియాడారు. ప్రభుత్వ పురుషుల కళాశాల ప్రిన్సిపల్ డా. ఎన్. సుబ్బనరసయ్య మాట్లాడుతూ అధ్యాపకురాలుగా బోధనావృత్తిలోకి ప్రవేశించి పలు పదోన్నతులు పొంది ఆర్జేడీగా ఉద్యోగ విరమణ చేయడం సంతోషకరమన్నారు. చిత్తూరు పీవీకేఎన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆనంద్రెడ్డి, కర్నూలు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సి.వి. రాజేశ్వరి, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.వి. శివారెడ్డి, ఏపీ ఎన్జీఓ నాన్టీచింగ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ బ్రహ్మానందరెడ్డి తదితరులు ఆమె సేవలను కొనియాడారు. అనంతరం సన్మాన గ్రహీత మల్లేశ్వరి మాట్లాడుతూ తన ఉద్యోగ జీవితంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అధ్యాపక వృత్తి ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. అనంతరం ఆమెను ఎన్జీఓ నాయకులు, అధ్యాపక బృందం, బోధనేతర సిబ్బంది ఘనంగా సన్మానించారు. వైవీయూ పాలకమండలి సభ్యులు డా. ఎస్. రామచంద్రయ్య, డీన్ ఆచార్య జి. సాంబశివారెడ్డి, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. -
రీటా.. హ్యాట్సాఫ్!
రీటా.. హ్యాట్సాఫ్! – 11 ఏళ్లు సేవలందించిన పోలీసు జాగిలం – ఘనంగా రిటైర్డ్మెంట్ ఫంక్షన్ చిత్తూరు (అర్బన్) : ఇక్కడ రిటైర్డ్మెంట్ ఫంక్షన్ జరుపుకుంటున్న ఈ జాగిలం పేరు రీటా. జిల్లా పోలీసుశాఖలో ఎన్నో కేసులను ఛేదించేందుకు సహకరించింది. 2005లో జన్మించిన రీటా గ్రేహండ్స్ యూనిట్లో 2009 వరకు సేవలు అందించింది. 2009 నుంచి 2016 వరకు జిల్లాలో డాగ్స్వా్కడ్ బృందంలో ఉంది. 11 ఏళ్లపాటు అనేక కేసుల పరిష్కారానికి తోడ్పడింది. ఆదివారం ఈ జాగిలానికి వీడ్కోలుసభ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు దీని సేవలను గుర్తుచేసుకున్నారు. అలాగే రీటా సంరక్షకుడిగా ఉన్న శ్రీహరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ రమణయ్య, ఆర్ఐ సుజుద్దిన్, జిల్లా డాగ్ స్క్వాడ్ , క్లూస్ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు. -
అంతర్జాతీయ క్రికెట్కు మరో క్రికెటర్ గుడ్బై
కరాచి: పాకిస్థాన్ క్రికెటర్ ఇమ్రాన్ ఫర్హాత్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. పాకిస్థాన్ టెస్టు జట్టుకు ఓపెనర్గా సేవలందించిన ఈ లెఫ్ట్ హ్యండ్ బ్యాట్స్మెన్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ను 2013లో ఆడాడు. దుబాయ్లో జరగనున్న మాస్టర్స్ ఛాంపియన్స్ లీగ్(ఎంసీఎల్)లో పాల్గొననున్న నేపథ్యంలో ఫర్హాత్ రిటైర్మెంట్ నిర్ణయం తసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్థాన్ తరపున 40 టెస్ట్లు, 58 వన్డేలు, 7 టీట్వంటీ మ్యాచ్లకు ఫర్హాత్ ప్రాతినిథ్యం వహించాడు. మాస్టర్స్ లీగ్లో పాల్గొనే క్రీడాకారులు అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకోవాలని పాక్ క్రికెట్ బోర్డు పెట్టిన నిబంధన కారణంగా ఫర్హాత్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు బుధవారం బోర్డు అతనికి నో అబ్జెక్షన్ లెటర్ ఇచ్చింది. లీగ్లో తన సహచర ఆటగాళ్లు మహ్మద్ యూసుఫ్, అజార్ మహ్మద్, యాసిర్ హమీద్, నవీద్ రానా, సక్లైన్ ముస్తాక్లతో కలిసి ఫర్హాత్ పాల్గొననున్నాడు. -
వన్డేలకు గుడ్ బై చెప్పిన మరో క్రికెటర్
ఇంగ్లండ్ క్రికెటర్ ఇయాన్ బెల్ వన్డేలకు గుడ్ బై చెప్పాడు. టెస్టులపై మరింత శ్రద్ధ పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు మీడియాకు తెలిపాడు. చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాపై యాషెస్ సిరీస్ గెలుచుకున్నతర్వాత.. టెస్టుల నుంచి రిటైర్ అవుతాడనే వార్తలు వినిపించినా.. చివరికు వన్డేల నుంచి మాత్రమే తప్పుకున్నట్టు బెల్ ప్రకటించాడు. యాషెస్ సిరీస్ ముగిశాక కోచ్ ట్రెవర్ బేలిస్, కెప్టెన్ అలెస్టర్ కుక్తో సంప్రదించిన అనంతరం టెస్టులకు గుడ్ బై చెప్పేందుకు ఇది సరైన సమయం కాదని తెలిపాడు. వన్డే కెరీర్లో 161 మ్యాచ్ల్లో 5416 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు బెల్ కావడం విశేషం. వన్డేల్లో 37.87 సగటుతో నాలుగు సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు చేశాడు. 115 టెస్టులు ఆడిన బెల్ 43 సగటుతో 22 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు సాధించాడు.