saibaba
-
ఊదీ ఏం బోధిస్తోంది..?
బాబా తన దర్శనార్థం వచ్చే భక్తుల నుంచి దక్షిణ తీసుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. కొందరి దగ్గర అయితే అడిగి మరీ తీసుకునేవారు. అలా వసూలు చేసిన మొత్తాన్ని సర్వసంగ పరిత్యాగి అయిన సాయి ఏం చేసుకుంటారనే కదా అందరి సందేహం... సాయిబాబా తన భక్తులనుంచి శ్రద్ధను, భక్తి విశ్వాసాలను దక్షిణగా కోరారు. ఎందుకంటే శ్రద్ధ, భక్తి విశ్వాసాలే ఏ పనిని చేయడానికైనా అత్యంత ఆవశ్యకాలు. అందుకే ఆయన భక్తులనుంచి శ్రద్ధ, సబూరి రూపంలో దక్షిణను అడిగి మరీ తీసుకునేవారు. వాటిని తనకిస్తే వారి జీవితాలను తీయబరుస్తానని చెబుతూ... ‘‘శ్రద్ధ, సబూరి అనే రెండు కాసులను ఎవరు దక్షిణగా సమర్పిస్తారో వారిని పరిపూర్ణంగా అనుగ్రహిస్తాను. భక్తులలోని ఉన్నతమైన శ్రద్ధాభక్తులే వారిని ఆధ్యాత్మికంగా సౌశీల్యవంతులుగా తీర్చిదిద్దుతాయి. నా పలుకులను విశ్వసించే వారు ధన్యులు’’ అని ఆయన పదే పదే బోధించేవారు. ఆయన బోధలను ఆచరించిన వారికి ఆయన అనుగ్రహంతో సకలైశ్వర్యాలు చేకూరతాయన టంలో సందేహం లేదు. తన వద్ద పోగుపడిన ధనంలో ఎక్కువభాగం దానం చేసి, మిగతా దానితో వంట చెరుకును కొనేవారు. ఈ కట్టెలను బాబానే స్వయంగా ధునిలో వేసి మండించేవారు. మసీదులో బాబా నిత్యం ధునిని వెలిగిస్తూనే ఉండేవారు. అది ఇప్పటికీ అలా మండుతూనే ఉంది. అందులో నుంచి ఉద్భవించే బూడిదనే ఊదీ అంటారు. బాబా ఆ ఊదీనే తీసి భక్తులకు ఇళ్లకు తిరిగి వెళ్లేముందు ఆశీర్వదించి వారికి అందించేవారు. ఒక్కోసారి దానితోనే వైద్యం చేసేవారు. చిటికెడు ఊదీని బాబా తన భక్తుల నుదుటిపై పెట్టారంటే వారికి సర్వ రోగాలూ నయమయేవి.ఊదీ ద్వారా భక్తులకు బాబా ఏం బోధించారంటే... ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ అశాశ్వతాలు. పంచభూతాలచే రూ΄÷ందిన మన శరీరాలన్నీ సౌఖ్యాలు అనుభవించిన తరువాత పతనమైపోయి శిథిలమై బూడిదవుతాయి. ఈ విషయాన్నే నిరంతరం గుర్తు చేసేందుకే బాబా భక్తులకు ఊదీ ప్రసాదాన్ని అందించేవారు. ఈ ఊదీ వల్లనే బ్రహ్మము నిత్యమని, ఈ జగత్తు అశాశ్వతమని, ప్రపంచంలో గల మన బంధువులు, కొడుకుగాని, తండ్రిగాని, తల్లిగాని, మనవారు కారని బాబా బోధించారు. మనం ఎందరితో ఎన్ని రకాలుగా ఎంతగా ఎన్ని బంధాలు, అనుబంధాలు పెనవేసుకున్నా, అవేవీ శాశ్వతం కావని, ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగానే వచ్చాము, తిరిగి ఒంటరిగానే వెళ్తామన్న సత్యాన్ని బోధించేవారు.ఊదీకి ఆధ్యాత్మిక విశేషమే కాదు, భౌతికప్రాముఖ్యం కూడా ఉంది. ఊదీ అనేక విధాలుగా శారీరక మానసిక రోగాలకు ఔషధంగా పనిచేసేది. రోగులకు, బాధార్తులకు స్వస్థత కలిగించేది. తాము ధరించిన ఊదీ ద్వారా భక్తుల చెవిలో నిత్యానిత్యాలకు గల తారతమ్యం, అనిత్యమైన దానిపై అభిమాన రాహిత్యం గంట మోతవలె వినిపించి, చెడుపనులు, చెడు తలంపుల నుంచి దూరం చేస్తాయి. అలాగే ఊదీ ధరించిన వారికి ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే బాబా భక్తులు తప్పనిసరిగా నుదుట విభూది ధరిస్తారు. -
డీయూ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత
ఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, ఉద్యమకారుడు, రచయిత, విద్యావేత్త జీ.ఎన్ సాయిబాబా కన్నుమూశారు. నిమ్స్లో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నక్సల్స్తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో గతంలో సాయిబాబాను అరెస్టు చేశారు. దాదాపు 9 ఏళ్లపాటు ఆయన జైల్లోనే గడపాల్సి వచ్చింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అభియోగాలపై 2014లో మహారాష్ట్ర పోలీసులు సాయిబాబాను అరెస్ట్ చేశారు. సాయిబాబా కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. 2017లో గడ్చిరోలి కోర్టు నిందితులకు జీవితఖైదు విధించగా.. ఆయన నాగ్పూర్ జైల్లో శిక్ష అనుభవించారు. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలతో బాంబే హైకోర్టు విచారణ చేపట్టింది. సాయిబాబాను నిర్ధోషిగా బాంబే హైకోర్టు ప్రకటించింది. మార్చి నెలలో నాగ్పూర్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు.సాయిబాబా 1967లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన పోలియో కారణంగా ఐదేళ్ల వయస్సు నుంచి వీల్ చైర్ను ఉపయోగిస్తున్నారు. ఆయన జైలులో ఉన్న సమయంలో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. సాయిబాబా ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని రామ్ లాల్ ఆనంద్ కళాశాలలో చాలా ఏళ్లు ఇంగ్లీష్ బోధించారు. ఆయన మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారనే కేసులో జైలుకు వెళ్లారు. దీంతో ఫిబ్రవరి 2021లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని రామ్ లాల్ ఆనంద్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవి నుండి తొలగించబడ్డారు.మావోయిస్టులతో లింకు ఉందన్న కారణంగా మహారాష్ట్ర పోలీసులు 2014లో ఢిల్లీ యూనివర్సిటీ రామ్లాల్ఆనంద్ కాలేజీ ప్రొఫెసర్ సాయిబాబాను అరెస్టు చేశారు. ఐపీసీతో పాటు ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)సెక్షన్ల కింద ఆయనపై ఛార్జ్షీట్ నమోదు చేశారు. 2017 వరకు ఈ కేసు విచారించిన గడ్చిరోలి జిల్లా సెషన్స్కోర్టు సాయిబాబాతో పాటు మరో ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. శిక్ష పడిన తర్వాత ఆయనను ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉద్యోగం నుంచి తొలగించింది.సెషన్స్కోర్టు ఇచ్చిన జీవితఖైదు తీర్పుపై సాయిబాబా అప్పీల్కు వెళ్లగా యూఏపీఏ కేసులో ప్రొసీజర్ను పోలీసులు సరిగా పాటించలేదన్నా కారణంగా బాంబే హైకోర్టు 2022లోనే సాయిబాబాపై కేసును కొట్టివేసింది. కానీ వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీల్కు వెళ్లగా అత్యున్నత కోర్టు సాయిబాబా విడుదలపై స్టే ఇచ్చింది. కేసును తిరిగి వినాలని బాంబే హైకోర్టుకే రిఫర్ చేసింది.చదవండి: డాక్టర్ల రాజీమాలు చట్టపరంగా చెల్లవు: బెంగాల్ సర్కార్ -
సాయిబాబా నిర్దోషి
సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాతోపాటు మరో ఐదుగురు నిందితులను బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ నిర్దోషులుగా ప్రకటించింది. 2017లో సాయిబాబాతో పాటు ఇతరులను దోషులుగా నిర్ధారిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై నాగ్పూర్ బెంచ్ న్యాయమూర్తులు జస్టిస్ వినయ్ జోషీ, జస్టిస్ వాల్మికి మెనెజెస్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. నిందితులపై వచ్చిన ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని, అందుకే వారిపై అభియోగాలను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం తోసిపుచ్చింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని, దేశంపై యుద్ధంపై చేసే కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ 2017 మార్చిలో సాయిబాబా, ఇతరులను మహారాష్ట్రలోని గడ్చిరోలీ సెషన్స్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. దీనిపై సాయిబాబా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 2022 అక్టోబరు 14న జస్టిస్ రోహిత్ నేతృత్వంలోని ధర్మాసనం సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి రోజు శనివారమైనప్పటికీ ప్రత్యేకంగా విచారించింది. హైకోర్టు ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. అనంతరం జస్టిస్ షా, జస్టిస్ రవికుమార్ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపి 2023 ఏప్రిల్ 19న బాంబే హైకోర్టు తీర్పును పక్కనపెట్టింది. ఈ తీర్పును మళ్లీ పరిశీలించాలని బాంబే హైకోర్టుకు పంపించింది. ఈ నేపథ్యంలో జస్టిస్ జోషీ, జస్టిస్ వాల్మికిల హైకోర్టు ధర్మాసనం విచారించి, సాయిబాబా, ఇతరులను నిర్దోషులుగా ప్రకటించింది. ప్రొఫెసర్ సాయిబాబా 2014లో అరెస్టయ్యారు. ప్రస్తుతం నాగ్పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. పదేళ్ల పోరాటం తర్వాత ఊరట దక్కింది బాంబే హైకోర్టు తీర్పు పట్ల సాయిబాబా భార్య వసంత ఆనందం వ్యక్తం చేశారు. పదేళ్ల తర్వాత ఊరట లభించిందన్నారు. సాయిబాబాకు అండగా నిలిచిన లాయర్లకు, సామాజిక కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. తన భర్త పది సంవత్సరాలు జైలులో ఉన్నారని, ఆర్థికంగా, మానసికంగా తాము ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని చెప్పారు. సాయిబాబా గురించి ప్రజలకు వాస్తవాలు తెలుసని, ఆయన పట్ల వారికి సంపూర్ణ విశ్వాసం ఉందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో మహారాష్ట్ర సర్కారు పిటిషన్ మావోయిస్టులతో సంబంధాల కేసులో మాజీ ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు మంగళవారం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. బాంబే హైకోర్టు తీర్పును కొట్టివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. సాయిబాబాతోపాటు ఇతరులను నిర్దోషులుగా నిర్ధారిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని మహారాష్ట్ర అడ్వొకేట్ జనరల్ బీరేంద్ర షరాఫ్ ఈ సందర్భంగా చెప్పారు. నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును కొంతకాలం నిలిపివేయాలని కోరుతూ హైకోర్టు ధర్మాసనం ముందు అప్లికేషన్ దాఖలు చేశారు. ధర్మాసనం స్పందిస్తూ.. న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని పునఃపరిశీలించే అధికారం ఉండదని, ఇది వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన విషయమని స్పష్టం చేసింది. అడ్వొకేట్ జనరల్ దాఖలు చేసిన అప్లికేషన్ను కొట్టివేసింది. -
ప్రొఫెసర్ సాయిబాబా కేసు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు
నాగ్పూర్: మావోయిస్టులతో లింకు ఉందన్న కేసులో జీవిత ఖైదు పడిన ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట లభించింది. ఈ మేరకు బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని నిర్ధోషులుగా పేర్కొంటూ మంగళవారం తీర్పిచ్చింది. తమకు ఈ కేసులో జీవిత ఖైదు విధిస్తూ గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సాయిబాబాతో పాటు మరో ఐదుగురు హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ అప్పీల్ను విచారించిన హైకోర్టు కింది కోర్టు తీర్పును కొట్టివేసింది. దీంతో మావోయిస్టులతో సంబంధాల కేసులో సాయిబాబాతో పాటు శిక్షపడిన మరో ఐదుగురు జైలు నుంచి విడుదలవనున్నారు. కేసు వివరాలు ఇలా.. మావోయిస్టులతో లింకు ఉందన్న కారణంగా మహారాష్ట్ర పోలీసులు 2014లో ఢిల్లీ యూనివర్సిటీ రామ్లాల్ఆనంద్ కాలేజీ ప్రొఫెసర్ సాయిబాబాను అరెస్టు చేశారు. ఐపీసీతో పాటు ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)సెక్షన్ల కింద ఆయనపై ఛార్జ్షీట్ నమోదు చేశారు. 2017 వరకు ఈ కేసు విచారించిన గడ్చిరోలి జిల్లా సెషన్స్కోర్టు సాయిబాబాతో పాటు మరో ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. శిక్ష పడిన తర్వాత ఆయనను ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉద్యోగం నుంచి తొలగించింది. సెషన్స్కోర్టు ఇచ్చిన జీవితఖైదు తీర్పుపై సాయిబాబా అప్పీల్కు వెళ్లగా యూఏపీఏ కేసులో ప్రొసీజర్ను పోలీసులు సరిగా పాటించలేదన్నా కారణంగా బాంబే హైకోర్టు 2022లోనే సాయిబాబాపై కేసును కొట్టివేసింది. కానీ వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీల్కు వెళ్లగా అత్యున్నత కోర్టు సాయిబాబా విడుదలపై స్టే ఇచ్చింది. కేసును తిరిగి వినాలని బాంబే హైకోర్టుకే రిఫర్ చేసింది. దీంతో తాజాగా అప్పీల్ విచారించిన బాంబే హైకోర్టు సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని నిర్ధోషులుగా విడుదల చేస్తూ తీర్పునిచ్చింది. ఇదీ చదవండి.. దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు -
టికెట్ ఇస్తే అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తా..
చిలకలగూడ: అధిష్టానం ఆదేశిస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నాగులూరి సాయిబాబా అన్నారు. చిలకలగూడ సాయిలత ఫంక్షన్హాల్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టానని, ఇప్పుడు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అధిష్టానం తనకు టికెట్ కేటాయిస్తే అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తానని, వేరొకరికి టిక్కెట్ ఇచ్చినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించే వ్యక్తిగా స్థానికుడైన నాగులూరి సాయిబాబా అన్నివర్గాల ప్రజలకు సుపరిచితుడని గ్రేటర్ హైదరాబాద్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు అచ్యుత రమేష్ బాబు అన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ ప్రతినిధులు దేవుడు వెంకటేష్, ప్రవీణ్కుమార్, కమలాకర్, అరుణ్కుమార్, రాజు, కాంగ్రెస్ నాయకులు తుమ్మశ్రీను, సతీష్, ప్రమోద్, ఆంజనేయులు, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
సాయిబాబా కేసును మరోసారి విచారించండి: సుప్రీం కోర్టు
ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రోఫెసర్ జీఎన్ సాయిబాబాకు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. మావోయిస్టులతో సంబంధాలున్న కేసులో సాయిబాబాను నిర్ధోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. ఈ కేసులో మరోసారి విచారణ జరపాలని బాంబే హైకోర్టును బుధవారం ఆదేశించింది. ఈ మేరకు నాలుగు నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఎమ్ ఆర్ షా, సీటీ రవికుమార్తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. గతంలో నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు ఇప్పటికే ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నందున సముచిత ప్రయోజనాల దృష్ట్యా మరో బెంచ్ అన్ని కోణాల్లో ఒకే విధంగా విచారణ జరపాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు దాఖలైన అప్పీల్ను విచారించిన సుప్రీం కోర్టు ఈ విధంగా తీర్పు ఇచ్చింది. గతేడాది అక్టోబర్ 15న చట్ట వ్యతిరే కార్యకలాపాల చట్టం(యూఏపీఏ) కింద.. సాయిబాబా ఇతరులపై ప్రాసిక్యూషన్ చెల్లుబాటు కాదని కొట్టేసిన బాంబే హైకోర్టు.. వాళ్లను తక్షణమే విడుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు ఎన్ఐఏ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు స్పందిస్తూ.. ట్రయల్ కోర్టుల తీర్పు ప్రకారం దోషులుగా నిర్థారించిన వారి నేరాల తీవ్రతను బాంబే హైకోర్టు పరిగణలోనికి తీసుకోలేదని అభిప్రాయపడింది. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు వ్యతిరేకంగా హైకోర్టు అభ్యంతరకరమైన తీర్పు ఇచ్చిందని, దీనిపై సమగ్ర పరిశీలన అవసరమని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కాగా, ఈ కేసుకి సంబంధించిన యూఏపీఏ కింద గడ్చిరోలి కోర్టులోని విచారణ ప్రకియను చెల్లదని పేర్కొంటూ బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ అక్టోబర్ 14న ఈ కేసులో జీవిత ఖైదు పడిన సాయిబాబాను విడుదల చేసింది. అలాగే ఈ కేసుకి సంబంంధించిన మరో నలుగురిని నిర్దోషులుగా ప్రకటించింది, అయితే ఆరో నిందితుడు 2022లో చనిపోయాడు. (చదవండి: బీజేపీ యువనేత దారుణ హత్య.. వాళ్ల పనే అని కమలం పార్టీ ఎంపీ ఫైర్..) -
సాయిబాబా కాలేజీ విద్యార్థిని జయలక్ష్మికి ఎస్పీ ఫక్కీరప్ప అభినందనలు
-
అనంతపురం: సాయిబాబా కాలేజీ గొడవలో కొత్త ట్విస్ట్
-
అలరించిన చైతన్యప్రభు నాటిక
పుట్టపర్తి అర్బన్: విశ్వశాంతి కోసం పరితపించిన సత్యసాయి బాబా తన భక్త లోకాన్ని శాంతి, ప్రేమ అనే మార్గాల్లో చైతన్యపరిచి నడిపించిన మహనీయుడనే ఇతి వృత్తంతో కూడిన ‘శ్రీకృష్ణ చైతన్యప్రభు’ నాటిక అబ్బురపరిచింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాలకు చెందిన సత్యసాయి భక్త బృందం, బాలవికాస్ విద్యార్థులు శనివారం పుట్టపర్తి ప్రశాంతి నిలయం విచ్చేశారు. పర్తి యాత్ర పేరుతో విచ్చేసిన భక్త బృందం శ్రీకృష్ణుని జీవిత గాథలను సత్యసాయికి అనుకరిస్తూ పలు నృత్య నాటికలు, సంగీత కచేరీలు నిర్వహించారు. 16వ శతాబ్దంలో కృష్ణభగవానుడి ప్రియభక్తుడైన కృష్ణ చైతన్య ఇతివృత్తాన్ని అభినయించారు. -
అలరించిన ‘కృష్ణం వందే జగద్గురం’
పుట్టపర్తి టౌన్ : పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన ప్రకాశం జిల్లా సత్యసాయి భక్తులు రెండో రోజు ఆదివారం సాయికుల్వంత్ సభా మందిరంలోని సత్యసాయి మహా సమాధి వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బాల వికాస్ చిన్నారులు 55 మంది ‘కృష్ణం వందే జగద్గురం’ నృత్యరూకం ప్రదర్శించారు. శ్రీకృష్ణుడి చిన్ననాటి ఆటలు, ఆయన భక్త కోటికి చూపిన మహిమాన్విత ఘట్టాలను అద్భుతంగా ప్రదర్శించి భక్తులను అలరించారు. అనంతరం నృత్యరూపంలో పాత్రధారులైన చిన్నారులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. పర్తియాత్రలో దాదాపు 200 మంది సత్యసాయి విద్యావాహిని పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆ సేవలు అనితర సాధ్యం
సందర్భం :నేడు ప్రేమమూర్తి ఆరాధనోత్సవం ప్రేమతత్వమే విశ్వశాంతికి మూలం.. అదే సత్యసాయి బాబా అభిమతం. మానవళిని సన్మార్గం వైపు పయనింపజేసే ఆధ్యాత్మిక బోధనలు... ఆర్తించే ఆపన్నులకు అన్నీ తానై కాపాడుకుంటూ వచ్చిన సత్యసాయి కోట్లాది భక్తుల గుండెల్లో భగవంతుడిగా కొలువై ఉన్నారు. ‘నా జీవితమే నా సందేశం’ అన్న సత్యసాయి బోధ భక్తకోటి మదిలో అను నిత్యం ప్రతిధ్వనిస్తోంది. భౌతికంగా దేహం వీడి పరమపదించినా సర్వాంతర్యామిగా సత్యసాయి ప్రపంచ నలుమూలలా కొలువబడుతున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 24న సత్యసాయి ఆరాధనోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు సత్యసాయి ట్రస్ట్ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. - పుట్టపర్తి టౌన్ పూర్వం గొల్లపల్లిగా పిలవబడే పుట్టపర్తిలో ఈశ్వరాంబ, పెద్దవెంకమరాజు దంపతులకు 1926 నవంబర్ 23న సత్యసాయి జన్మించారు. బాల్యంలో సత్యనారాయణ రాజుగా పిలువబడిన ఆయన మెండైన ఆధ్యాత్మిక చింతనతో 1940లో తన 14వ ఏట సత్యసాయి బాబా అవతార ప్రకటన చేశారు. నాటి నుంచి కాషాయ వస్త్రధారిగా దేశదేశాల సంచరిస్తూ ఆధ్యాత్మికత, మానవతా విలువలను ప్రభోదిస్తూ సువిశాల భక్త సామ్రాజాన్ని నిర్మించుకున్నారు. అచిర కాలంలోనే పుట్టపర్తిని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్ది ప్రపంచ పటంలో అనంతపురం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఆర్తులను ఆదుకున్న భగవాన్ వరుస కరువులతో గుక్కెడు నీరు గగనమైపోయిన పరిస్థితుల్లో జిల్లాలోని వందలాది గ్రామాల గొంతు తడిపి దప్పిక తీర్చారు. ఉభయగోదావరి, చెన్నై నగరానికి కూడా తాగునీటిని అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రభుత్వాలు సైతం చేయలేని ఎన్నో గొప్ప కార్యక్రమాలను వందల కోట్ల రూపాయలు వెచ్చించి, అనతి కాలంలోనే పూర్తి చేసిన సత్యసాయి అపరభగీరథుడుగా కీర్తింపబడుతున్నారు. పేదలకు నయాపైసా ఖర్చులేకుండా కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు పుట్టపర్తి, వైట్ఫీల్డ్లో సత్యసాయి వైద్య సంస్థలను నెలకొల్పారు. విలువైన విద్య ఉన్నత సమాజాన్ని నిర్మింస్తుందని ఆకాంక్షించిన సత్యసాయి పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి డీమ్డ్ టు బి యూనివర్శిటీని నెలకొల్పారు. వీటితోపాటు దేశంలోని పలు ప్రాంతాలలో ప్రకృతి విలయాలకు గురై గూడు చెదిరిన వేలాది అపన్నులకు సత్యసాయి తన ట్రస్ట్ ద్వారా గూడు నిర్మించి వారి జీవితాలకు భరోసా ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా 180కి పైగా దేశాలలో సేవా సంస్థలను నెలకొల్పి ఆయా ప్రాంతాలలో సేవా కార్యక్రమాలను చేపట్టారు. మానవాళి శ్రేయస్సును కాంక్షిస్తూ తన ఆధ్యాత్మిక బోధన ద్వారా చైతన్యవంతులను చేస్తూ సన్మార్గదర్శనం చేసిన భగవాన్ తన 85 ఏట 2011 ఏప్రిల్ 24న శివైక్యం పొందారు.అప్పటి నుంచి ప్రతి ఏటా ఏప్రిల్ 24న సత్యసాయి ఆరాధనోత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు. నేటి ఆరాధనోత్సవాలు ఇలా.. ఉదయం 8 గంటలకు సాయికుల్వంత్ సభామందిరంలోని సత్యసాయి మహా సమాధి చెంత విద్యార్థుల వేదపఠనం. ఉదయం 8.10 గంటలకు సత్యసాయి విద్యార్థులు పంచరత్న కీర్తన ఉదయం 8.40 గంటలకు సత్యసాయి ట్రస్ట్ సభ్యులు నాగానంద, నిమిష్ పాండ్యల ప్రసంగం అనంతరం సత్యసాయి విద్యార్థుల సంగీత కచేరి ఉదయం 9.45 గంటలకు మహా మంగళహారతి ఉదయం 10 గంటలకు హిల్వ్యూ స్టేడియంలో మహానారాయణ సేవ సాయంత్రం సాయికుల్వంత్ సభామందిరంలో అనంత నారాయణ బృందం సాంస్కృతిక ప్రదర్శన -
సాయిబాబాకు ప్రాణాపాయం
ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా అడవిబిడ్డల హక్కుల గురించి మాట్లాడారు. దళితులపై అకృత్యాల గురించి గొంతెత్తి నినదించారు. రాజ్యం పౌరుల సర్వ హక్కులనూ హరించి వేస్తుంటే చూస్తూ ఊరుకోక పోవడమే ఆయన నేరం. ‘‘సాయిబాబాని మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో నాగ్పూర్ సెంట్రల్ జైల్లో కలిసాను. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు కనిపించింది. ఆయన ప్రాణానికే ప్రమాదం ఉందనిపించింది. జైలు అధికారులు ఎటువంటి వైద్య సౌకర్యాలను, అందిం చడం లేదు. పైగా తప్పుడు వైద్య నివేదికలనిచ్చి, ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్టు నమ్మబలుకుతు న్నారు. సాయిబాబా బీపీ కూడా నార్మల్గా లేదు. లాయర్ల ద్వారా పంపిన మందులను సైతం అత్య వసర పరిస్థితుల్లో మాత్రమే ఆయనకు అందిస్తు న్నారు. గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు కిడ్నీల్లో రాళ్ళు, ఛాతీ నొప్పి, శ్వాస సంబంధమైన సమస్యతో పాటు గాల్బ్లాడర్లో, పాంక్రియాటిక్ నొప్పులు, ఆయనను తీవ్రంగా బాధిస్తున్నాయి. ప్రాసై్టట్ సమస్య వల్ల మూత్ర విసర్జన కూడా కష్ట సాధ్యం అవుతోందని చెప్పారు. ఒకనెల జైలు జీవితంలో మూడుసార్లు తీవ్రమైన పాంక్రియాటిక్ నొప్పి వచ్చింది. వైద్యుల సలహా మేరకు ప్రతి రోజు ఆయన గుండె సంబంధమైన పాంక్రియా టిక్ నొప్పికి సంబంధించిన మందులు వాడాలని సూచిం చినప్పటికీ ఆ మందులను ఇంత వరకు ఆయనకు అందించలేదు. ఇంత అనారోగ్యం కారణంగా ఆయన జైల్లో ఇచ్చే ఆహారాన్ని తీసుకోలేక పోతున్నారు. బయట జరుగుతున్న ఘట నలకు సంబం«ధించిన వార్తలను చదివే, చూసే అవ కాశాన్ని ఇవ్వడం లేదు. అరుదుగా పత్రికలు ఇచ్చి నప్పటికీ ఉద్యమ వార్తలను కత్తిరించి ఇస్తున్నారు. నేను స్వయంగా రాసిన ఉత్తరాలను కూడా ఆయనకు అందించడం లేదు. రాజ్యం సాయిబాబా జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టింది. తక్షణమే ఆయనను ఢిల్లీ జైలుకి తరలించాలి. లేదా హైదరాబాద్కి తరలించి సరైన వైద్యం అందించాలి.’’ ‘‘చేతులకు చెప్పులేసుకొని సైకిల్ మీద వెళ్తుంటే ఆశ్చర్యంగా చూసేదాన్ని. 15 ఏళ్ళప్పుడేర్పడిన మా పరిచయం ప్రేమగా ఎదిగి సమానత్వం దిశగా ఎదు గుతున్న క్రమంలో ఈ సమాజంలో ఆదివాసీలపై, దళితులపై, స్త్రీలపై, మైనారిటీలపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ అవే చెప్పులు తొడిగిన చేతుల్తో ఎన్నో వేదికలెక్కారు సాయిబాబా. ఈ సమాజం మార్పుకోసం ఎంతో తపించారు. అడవి బిడ్డల హక్కుల గురించి మాట్లాడారు. దళితులపై అకృత్యాల గురించి గొంతెత్తి నినదించాడు. పౌరు లను రక్షించాల్సిన రాజ్యమే వారి సర్వహక్కులనూ హరించి వేస్తుంటే చూస్తూ ఊరుకోకుండా ఉండడమే ఆయన చేసిన నేరమయ్యింది. ‘‘90 శాతం వైక ల్యంతో ఉన్నా ఆయనపట్ల ఉదారంగా వ్యవహరిం చలేం. ఆయన మేధోపరంగా గొప్పవాడు. నిషేధిత మావోయిస్టు్ట పార్టీకి సలహాదారుడు. కాబట్టి ఆయన కీశిక్ష సరిపోదు అంటూ గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఆయనకి కఠిన శిక్షను విధించింది. ఇదెక్కడి న్యాయం?’’ అని ఈ నెల మూడవ తేదీన హైదరా బాద్లో జరిగిన సాయిబాబా, తదితరుల విడుదల సభలో మాట్లాడాను. ప్రొఫెసర్ సాయిబాబా, ప్రశాంత్ రాహి (జర్న లిస్ట్), హేమ్ మిశ్రా (జెఎన్యులో పరిశోధక విద్యార్థి), పాండు నరోత్, మహేశ్ టిర్కిలకు జీవిత శిక్ష వేసింది. వీరితో పాటు విజయ్ టిర్కికి 10 సంవ త్సరాల జైలు శిక్షను విధించింది, భారతదేశంపై యుద్ధం చేయడానికి కుట్ర పన్నారనీ, నిషేధిత మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయనీ, వీరి పైన మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోపణ. మరో మనిషి సాయం లేకుండా కదల్లేని మనిషి ఏ ప్రభుత్వాన్ని కూల్చడానికైనా చేసే కుట్ర ఏముంటుంది? సాయిబాబాని ఇంటినుంచి ఓ ఇసుకబస్తాని విసిరేసినట్టు పోలీసు వాహనంలో విసిరేస్తే వీల్ చైర్ విరిగిపోయింది. ఆ విరిగిపోయిన కుర్చీలో కదల్లేని స్థితిలో 72 గంటల పాటు పోలీసులు బంధించి తీసుకెళ్ళారు. మధ్యలో మూత్ర విసర్జన అత్యవసరమని చెప్పినా అనుమతించకుండా అత్యంత అమానవీయంగా పోలీసులు వ్యవహ రించారు. సాయిబాబాకి మందులివ్వ కుండా, కనీసం కదలనైనా లేని వ్యక్తిని అత్యంత వేడిగా ఉండే నరకప్రాయ మైన అండాసెల్లో ఉంచడం ద్వారా ఈ ప్రభుత్వం ఏం సాధించదల్చుకుందో అర్థం కాదని మేధావులు వాదిస్తున్నారు. ‘‘అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని కలిసే అవకాశాన్ని సైతం ఇవ్వకుండా నన్నూ, నా కుమార్తెను వే«ధిస్తున్న స్థితి తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోంది. ఉదయం ములాఖత్కి పెట్టు కుంటే సాయంత్రం 5గంటల 45 నిముషాలకు లోప లికి పిలుస్తారు. అది కూడా జాలీ ములాఖత్. మధ్యలో గ్లాస్, ఆ తర్వాత జాలీ. అంత దూరంలో ఆయన్ను కూర్చోబెడతారు. తను నించుంటే తప్ప నేను చూడలేను. కానీ తను నించోలేడు. మూడు చక్రాల బండిలో తను, అంత దూరంలో నేను. కనీసం మాట్లాడింది వినిపించదు. ఎలాగోలా ఆయన్ను దూరం నుంచి చూసే ప్రయత్నంలో ఉండగానే 6 గంటలకు టకటకమని కొట్టుకుంటూ వచ్చి టైం అయిపోయిందని తరిమేస్తారు’’. సాయి బాబా విడుదల కోసం ప్రపంచ దేశాల నుంచి 20,000 ఉత్తరాలొచ్చాయని ప్రభుత్వమే చెప్పింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్తో సహా ప్రపంచ మేధావు లంతా సాయిబాబా విడుదలను కోరుతున్నారు. ప్రభుత్వం సాయిబాబాపై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకొని, ఆయన్ను, అయనతో పాటు అరెస్టయిన వారందరినీ విడుదల చేయాలి. ఇది ప్రజాస్వామికవాదుల డిమాండ్ కూడా. -వసంత, ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా సహచరి -
'ఆయన జైల్లోనే చనిపోతారేమో'
హైదరాబాద్: దళితులు, ఆదివాసీలు, మైనార్టీల గురించి మాట్లాడితే.. ప్రభుత్వం వారిపై నక్సల్స్ అనే ముద్ర వేస్తోందని విరసం నేత వరవరరావు ఆరోపించారు. భావప్రకటనా హక్కును కాలరాస్తోందని అన్నారు. మంగళవారం బాగ్లింగంపల్లిలోని తెలంగాణ ప్రజా ఫ్రంట్ కార్యాలయంలో రాజకీయ ఖైదీల విడుదల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దవయసు కావడంతో అనేక వ్యాధులకు గురైన సాయిబాబాకు సరైన మందులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. చత్తీస్గఢ్లోని పోలీసు బలగాల మారణకాండను ప్రపంచానికి తెలియజేయడానికి వెళ్లిన టీడీఎఫ్ నాయకులను పోలీసులు అక్కడే నిర్భందించారని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. టీపీఎఫ్ అధ్యక్షుడు నలమాస కృష్ణ మాట్లాడుతూ... ఈ నెల 23న బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సాయంత్రం 6 గంటలకు రాజకీయ ఖైదీల విడుదల పోరాట వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
పుట్టపర్తి టౌన్ : సత్యసాయిపై తమకున్న కృతజ్ఞతను చాటుతూ సత్యసాయి విద్యాసంస్థల ప్రశాంతి నిలయం క్యాంపస్ పీజీ విద్యార్థులు, సంగీత కళాశాల విద్యార్థులు ఆదివారం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలు భక్తులను అలరించాయి. సత్యసాయి మహాసమాధి చెంత విద్యార్థులు సుమారు గంట పాటు సంగీత కచేరి నిర్వహించారు.చక్కటి భక్తిగీతాలతో విద్యార్థులు భక్తులను మైమరపింపజేశారు. విద్యార్థుల బ్యాస్బ్యాండ్ వాయిద్యంతో సాయికుల్వంత్ సభా మందిరం మార్మోగింది. పిదప భరత నాట్య కచేరితో విద్యార్థులు ఆహూతులను ఆలరించారు. చక్కటి నృత్యభంగిమలతో,సుమధుర స్వరాల నడుమ విద్యార్థులు నాట్య కచేరీ భక్తులను మంత్రముగ్దులను చేసింది. -
లోక కల్యాణం కోసమే సాయి అవతరణ
పుట్టపర్తి టౌన్ : లోక కల్యాణం కోసమే సత్యసాయి అవతరించారని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్జే రత్నాకర్రాజు అన్నారు. పట్టణంలోని పెద్దవెంకమరాజు కల్యాణ మండపంలో శనివారం సత్యసాయి పూర్వవిద్యార్థులు సాయి బోధనలు, మానవతా విలువలతో కూడిన బోధన అన్న అంశంపై ఉపాధ్యాయులు, యువతకు వర్క్షాప్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రత్నాకర్రాజు హాజరై ప్రసంగించారు. విద్యతోనే సమాజంలో వెలుగులు నింపవచ్చని నమ్మిన సత్యసాయి విలువైన విద్యను అందించేందుకు కృషి చేశారన్నారు.దేశీయంగా 105 సత్యసాయి విద్యాసంస్థలు నడుస్తున్నాయని, వీటి ద్వారా 65 వేల మందికి పైగా విద్యాబుద్ధులు పొందారన్నారు. బాల్యం నుంచే మానవతా విలువులు, ఆధ్యాత్మికతను పెంపొందించే లక్ష్యంతో బాలవికాస్ విద్యా విధానాన్ని రూపొందించారని, దేశీయంగా బాలవికాస్ శిక్షణను మూడు లక్షల మంది విద్యార్థులు పొందుతున్నారని, 20 వేల మంది వలంటీర్లు విద్యార్థులకు శిక్షణనిస్తున్నారన్నారు. జనవరి 7, 8న ప్రశాంతి నిలయంలో బాలవికాస్ స్నాతకోత్సవం కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అనంతరం విలువలు, ఆధ్యాత్మిక, సృజనాత్మకతను పెంపొందించే పాఠ్యపుస్తకాలను వివిధ మండలాల విద్యాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు రత్నాకర్రాజు అందజేశారు. అంతకుమునుపు సత్యసాయి పూర్వవిద్యార్థులు, యువత, ఉపాధ్యాయులు పట్టణంలో సత్యసాయి బోధనలను చాటుతూ ర్యాలీ నిర్వహించారు. పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు తదితర మండలాల చెందిన ఉపాధ్యాయులు, యువత వర్క్షాప్లో పాల్గొన్నారు. -
సీనియర్ హీరోలే నాకు స్ఫూర్తి!
కొత్తపేట : సీనియర్ హీరోల స్ఫూర్తి, నాన్న కోరికతో సినిమా రంగంలో ప్రవేశించినట్టు వర్ధమాన హీరో యలమంచిలి రేవంత్ అన్నారు. నాడు సీనియర్ ఎన్టీఆర్ 'లవకుశ' ఆధారంగా బాలకృష్ణతో 'శ్రీరామరాజ్యం'ను నిర్మించిన యలమంచిలి సాయిబాబా తన కుమారుడు రేవంత్ హీరోగా ‘ఇంటింటా అన్నమయ్య’ చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం త్వరలో విడుదల కానుంది. శ్రీశైలంలో షిర్డీసాయిబాబా ఆలయం ప్రాంగణంలో నెలకొల్పేందుకు రేవంత్ తాత, ఎస్ఈడబ్ల్యూ కన్స్ట్రక్షన్స్ అధినేత యలమంచిలి నాగేశ్వరరావు పంచలోహ విగ్రహం రూపకల్పనను కొత్తపేటలోని ప్రముఖ శిల్పి డి.రాజ్కుమార్ వుడయార్కు అప్పగించారు. బుధవారం ఆ విగ్రహం నమూనా పరిశీలనకు వచ్చిన రేవంత్ విలేకరులతో మాట్లాడుతూ సాయిబాబా మూవీస్ బ్యానర్పై తండ్రి నిర్మించిన ‘ఇంటింటా అన్నమయ్య’లో అన్నమయ్య కీర్తనలను ప్రజల్లోకి తీసుకువెళ్ళే గాయకుడి పాత్రను పోషించానన్నారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రంలో హీరోయిన్గా అనన్య (జర్నీ ఫేం), ఇతర ముఖ్య పాత్రలను బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి తదితరులు పోషించారని, సంగీతం కీరవాణి సమకూర్చారని చెప్పారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో తన ద్వితీయ చిత్రం 'రాజా మీరు కేక' నిర్మాణ ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ చిత్రంలో సోబిత హీరోయిన్ కాగా తారకరత్న విలన్ రోల్ పోషిస్తున్నారని తెలిపారు. తాను ఒక్కో తరహా పాత్రల్లో ఒక్కో హీరోను అభిమానిస్తానని, అలా సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున,బాలకృష్ణ తదితరుల స్ఫూర్తితో సినీ రంగానికి వచ్చానన్నారు. ఫిబ్రవరి 24న తాత జన్మదినోత్సవం సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. విగ్రహం చాలా బాగా వచ్చిందని శిల్పి రాజ్కుమార్ను అభినందించారు. -
ఓం సాయి..శ్రీసాయి..
- ఘనంగా దత్తజయంతి వేడుకలు – భక్తులతో కిటకిటలాడిన సాయిమందిరాలు కర్నూలు (న్యూసిటీ/కల్చరల్) దత్త జయంతిని పురస్కరించుకుని జిల్లాలోని సాయిబాబా ఆలయాల్లో ఓం సాయి.. శ్రీసాయి.. జయ జయ సాయి నామస్మరణ మార్మోగింది. తెల్లవారుజామునే మహిళలు కుటుంబసమేతంగా ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవిష్ణు సహస్ర నామావళి మంత్రాలను పఠించారు. గురు చరిత్ర పారాయణం చేశారు. అంతకు ముందుగా వేద పండితుల వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామి విగ్రహాలకు అభిషేకం చేసి, పట్టు వస్త్రాలు, పూజలతో అలంకరణ చేశారు. కర్నూలు నగరంలో పవిత్ర తుంగభద్ర నది ఒడ్డున వెలసిన దక్షిణ షిరిడి శ్రీసాయిబాబా, బాలాజీ నగర్, బుధవారపేట, అశోక్నగర్, వినాయక ఘాట్, కృష్ణారెడ్డి నగర్లలోని సాయిబాబా ఆలయాలు భక్తజనంతో కిటకిటలాడాయి. బిర్లాగేట్ సమీపంలోని శంకర మందిరరంలో షిరిడీసాయి జీవిత చరిత్రపై ప్రముఖ వాగ్గేయకారులు ఈమని రామకృష్ణప్రసాద్ మధురమైన గీతాలు వినిపించారు. సంగీత విభావరికి నాగరాజు, గోపాల్, శిరీష, వాయిద్యా సహకారం అందించారు. ఆలయ కమిటీలు, దాతల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. -
'కూంబింగ్ పేరుతో భయపెడుతున్నారు'
న్యూఢిల్లీ: పోలీసులు అదుపులో ఉన్న మావోయిస్టు అగ్రనేత ఆర్కేను వెంటనే కోర్టులో హాజరుపరచాలని హక్కుల కార్యకర్త, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా డిమాండ్ చేశారు. ఏవోబీ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని అన్నారు. ఏవోబీలో జరిగిన ఎన్ కౌంటర్ పై న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చూస్తూ బుధవారం జంతర్ మంతర్ వద్ద ప్రజాసంఘాలు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏవోబీ ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కూంబింగ్ పేరుతో గిరిజనులను పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కూంబింగ్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. -
'బహిరంగ చర్చకు రండి’
హైదరాబాద్: సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్వామి స్వరూపానంద వివాదం రోజురోజుకు ముదురుతోంది. సాయిబాబా పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకొని బహిరంగ చర్చకు రావాలని హైదరాబాద్ సాయి భక్త సమాజం స్వామికి సవాల్ విసిరింది. రేపు బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో జరగబోయే సాయి భక్తుల సమ్మేళనానికి రావాలని అక్కడ ఈ విషయం పై చర్చించుకుందామని హైదరాబాద్ సాయిభక్త సమాజం ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. -
20న గురురామ్రతన్జీ రాక
కర్నూలు(న్యూసిటీ): నగరంలోని శ్రీసాయిబాబా దేవస్థానంలో ఈనెల 20వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు శ్రీసిద్ధయోగి గురురామ్రతన్జీ చేత సాయి ప్రవచానాల కార్యక్రమం నిర్వహిస్తామని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి నందిరెడ్డి సాయిరెడ్డి తెలిపారు. అనంతరం సాయిబాబా సత్సంగం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి సాయిబాబా భక్తులు హాజరు కావాలన్నారు. -
అలరించిన సంగీత కచేరి
పుట్టపర్తి టౌన్ : సత్యసాయిని కీర్తిస్తూ బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల సత్యసాయి భక్తులు నిర్వహించిన సంగీత కచేరి భక్తులను అలరించింది. పర్తి యాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన బీహార్, జార్ఖండ్ భక్తు లు ప్రశాంతి నిలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు సత్యసాయిపై భక్తితో సుమారు గంట పాటు నిర్వహించిన కచేరితో సాయికుల్వంత్ సభా మందిరం మా ర్మోగింది. అనంతరం భక్తులు సత్యసాయి సమాధిని దర్శించుకున్నారు. -
వైభవంగా సాయినాథుడి నగరోత్సవం
నెల్లూరు(బందావనం) : గురుపూర్ణిమ మహోత్సవాలను పురస్కరించుకుని స్థానిక ట్రంకురోడ్డు, గాంధీబొమ్మ సమీపంలోని శ్రీషిర్డీసాయిబాబా మందిరం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి సాయినాథుడి నగరోత్సవ వైభవంగా జరిగింది. విశేషపుష్పాలంకరణలో, సర్వాలంకారశోభితంగా కొలువుదీరిన స్వామివారిని మంగళవాయిద్యాలతో, భజనలు, కోలాటాలు, వివిధ సాంస్కతిక ప్రదర్శనలు, బాణసంచావేడుకల నడుమ నగరోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గాంధీబొమ్మ మీదుగా ట్రంకురోడ్డు, ఏసీ సెంటర్, సంతపేట నాలుగుకాళ్ల మండపం,చిన్నబజార్, పెద్దబజార్, బారకాసు, వీఆర్ కళాశాల సెంటర్, కో–ఆపరేటివ్ సెంట్రల్బ్యాంక్ మీదుగా సాగింది. మందిరం కార్యవర్గసభ్యులు మన్నెం అమరనాథ్రెడ్డి, పైడిపాటి సుధాకర్రావు, కొల్లి శ్యాంసుందర్రెడ్డి, దువ్వూరి జయమ్మ, బి.మోహన్రావు పర్యవేక్షించారు. కాగా ఉదయం సాయినాథుడికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, అష్టోత్తర సహస్రనామ, విశేషపూజలు, హారతులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుందని సభ్యులు తెలిపారు. -
సాయిబాబాను అడ్డుకోవడం తగదు
- ప్రొఫెసర్ హరగోపాల్ సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు బేషరతు బెయిల్ పొందిన హక్కుల కార్యకర్త, సహాయ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను తిరిగి విధుల్లో చేర్చుకోకుండా రామ్లాల్ కళాశాల యాజమాన్యం అడ్డుకోవడాన్ని ‘కమిటీ ఫర్ డిఫెన్స్.. రిలీజ్ ఆఫ్ డాక్టర్ సాయిబాబా’ చైర్మన్ ప్రొఫెసర్ జి.హరగోపాల్, హనీబాబు ఎం.టీ మంగళవారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. విధుల్లో చేరేందుకు అనుమతి కోరుతూ సాయిబాబా కళాశాల ప్రిన్సిపాల్కు లేఖ రాశారని... మహారాష్ట్రలో నమోదైన క్రిమినల్ కేసు పరిష్కారమయ్యే వరకు సస్పెన్షన్ అమలులో ఉంటుందని ప్రిన్సిపాల్ బదులిచ్చారని వారు తెలిపారు. తదుపరి ఆదేశాల వరకు సాయిబాబా ప్రవేశంపై నిషేధం కొనసాగుతుందని పేర్కొనడం దారుణమన్నారు. అణచివేతకు గురైనవారి హక్కుల కోసం పోరాడుతున్న సాయిబాబాను నేరారోపణతో భయపెట్టేందుకు కళాశాల యాజమాన్యం ప్రయత్నించినట్లు లేఖలో వాడిన పరుష పదజాలం ద్వారా తెలుస్తోందన్నారు. -
'సొంత నిర్ణయాల వల్లే డిప్యూటీ సీఎంను తొలగించారు'
సీఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబ హన్మకొండ : సీఎం కేసీఆర్ మంత్రులను రిమోట్ ద్వారా నడిపిస్తున్నారని, మంత్రులు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారని సీఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబ విమర్శించారు. వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న రెండో ఏఎన్ఎంలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యునెటైడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయూస్ యూనియన్ ఆధ్వర్యంలో హన్మకొండలో రెండో ఏఎన్ఎంలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. దీక్ష చేస్తున్న వారిని ఆయన శనివారం కలుసుకుని అనంతరం మీడియాతో మాట్లాడారు. డాక్టర్ అయిన లక్ష్మారెడ్డి వైద్య, ఆరోగ్యశాఖమంత్రిగా, విద్యావేత్త కడియం శ్రీహరి విద్యాశాఖ మంత్రిగా, పంచె కట్టిన వ్యవసాయదారుడు పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్నా, వీరు స్వేచ్చగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించినట్లు ఎక్కడ తమను తొలగిస్తారనే భయం మంత్రులలో నెలకొందన్నారు. అందుకే ఎలాంటి నిర్ణయాల జోలికి వెళ్లకపోవడమే మంచి అనే ఆలోచనతో పాటు సీఎం కేసీఆర్కు భజన చేస్తే చాలు అన్నట్లుగా రాష్ట్ర మంత్రులున్నారని విమర్శించారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా డాక్టర్ ఉన్నా వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు న్యాయం జరగడం లేదన్నారు. రాష్ట్రంలో ఆందోళనలు, ధర్నాలు నిత్యకృత్యమయ్యాయని, ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. గుడ్డి ప్రభుత్వం మేల్గొనేలా పోరాటాలు చేస్తామని సాయిబాబ పేర్కొన్నారు. -
ఎన్ఎఫ్సీ ఛైర్మన్గా కళ్యాణ క్రిష్ణన్
హైదరాబాద్: అణు ఇంధన రంగంలో విశేష సేవలందిస్తోన్న హైదరాబాద్లోని అణు ఇంధన సంస్థ (ఎన్ఎఫ్సీ) ఛైర్మన్, సీఈవోగా ప్రముఖ శాస్త్రవేత్త కళ్యాణ క్రిష్ణన్ నియమితులయ్యారు. రెండేళ్ల పదవికాలం ముగియడంతో ఎన్ఎఫ్సీ ఛైర్మన్, సీఈవోగా వ్యవహరించిన ఎన్.సాయిబాబ బుధవారం పదవివిరమణ పొందారు. ఎన్ఎఫ్సీ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా వ్యవహరిస్తున్న జీ కళ్యాణకృష్ణన్కు ఎన్ఎఫ్సీ కొత్త సీఈవోగా బాధ్యతలు అప్పగించారు. అణు ఇంధన ఉత్పత్తిలో ఎన్ఎఫ్సీ ప్రపంచ రికార్డు నెలకొల్పడంలో కళ్యాణ క్రిష్ణ తనవంతు కృషి చేశారు. 1980 ఆర్ఈసీ(ప్రస్తుత ఎన్ఐటీ-వరంగల్)లో కెమికల్ ఇంజనీరింగ్లో పట్టాపుచ్చుకున్నారు. అనంతరం ముంబైలో ట్రైనింగ్ స్కూల్ ఆఫ్ బార్క్(బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్)లో(24వ బ్యాచ్)లో చేరి న్యూక్లియర్ ఇంజనీరింగ్లో ప్రావీణ్యం పొందారు. రాజస్తాన్లో కోటాలోని అణు ఇంధన సంస్థలో హెవీ వాటర్ బోర్డులో పని చేశారు. ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్ల(ఐఐసీహెచ్ఈ)ల సభ్యుల్లో కళ్యాణ క్రిష్ణన్ ఒకరు. జిర్కోనియం కాంప్లెక్స్ ప్రాజెక్టు డైరెక్టర్గా కళ్యాణ క్రిష్ణన్ చేసిన కృషికిగానూ డీఏఈ ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించారు. -
ఢిల్లీ యూనివర్సిటీ ప్రొపెసర్ సాయిబాబాతో ఫేస్ టూ ఫేస్
-
ఆయనకు ఎన్నాళ్లీ ఖైదు?
సందర్భం ఢిల్లీ యూనివర్సిటీ అధ్యాప కుడు, విప్లవ ప్రజాస్వామిక వేదిక సహాయ కార్యదర్శి ప్రొఫెసర్ సాయిబాబాను సరిగ్గా ఏడాది క్రితం మే 9, 2014న కాలేజీలో పరీక్షలు నిర్వహించి వస్తున్న సమ యంలో దారికడ్డంపడి కళ్ళకు గంతలు కట్టి ఎత్త్తుకుపోయి నాగపూర్ కేంద్ర కారాగారంలో ‘అండా సెల్’ అని పిలిచే గాలీ వెలుతురు సోకని ఇరుకు గదిలో నిర్బంధించారు. మావోయిస్టులతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్త్తున్నాడని ఆరోపణ చేసి అత్యంత అమానవీయ పరిస్థితుల్లో నాగపూర్ సెంట్రల్ జైల్లో పడవేశారు. ఆయనపై పెట్టిన సెక్షన్లు రాజకీయ విశ్వాసాలను, అస మ్మతిని నేరంగా పరిగణిస్తాయి. నేరం నిరూపించి ముద్దాయికి శిక్ష నిర్ణయించడం కాకుండా, నేరారోపణకు గురైన వ్యక్తే తాను నిర్దోషినని నిరూపించుకునేవరకూ శిక్షను అమలు చేయవచ్చు. ఆ శిక్ష కూడా ఎంత అమా నుషంగా ఉంటుందో సాయిబాబా కేసే ఉదాహరణ. ఆయనకు శారీరక వైకల్య సమాన అవకాశాల చట్టం ప్రకారం చక్రాల కుర్చీ కదలికలకు కావల్సిన సౌకర్యాలు ఇవ్వలేదు. మనిషి సహకారం లేనిదే కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిని పట్టించుకోకుండా ఒంటరి ఖైదులో ఉంచారు. ఆయనకు 90 శాతం అంగ వైకల్యంతో పాటు తీవ్ర రక్తపోటు, గుండె జబ్బు, భుజాల నరాల క్షీణత, వెన్నెముక నొప్పి ఉన్నాయి. జైల్లో మందులు, ఆహారం నామమాత్రంగా కూడా లేవు. బైటి నుండి కుటుంబ సభ్యులు, మిత్రులు పంపించినా నిరాకరిస్త్తున్నారు. ఆయన ప్రత్యేక పరిస్థితి దృష్టిలో పెట్టుకునైనా బెయిల్ ఇవ్వమని న్యాయవాదులు పలుమార్లు చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం, పోలీసుల ఒత్తిడి వల్ల హైకోర్టు కూడా నిరాకరించింది. రోజురోజుకూ ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. ఈ స్థితిలో సాయిబాబా, ఆయ నకు చట్టపరంగా అందవలసిన కనీస సౌకర్యాలు, మం దులు, వైద్యం కోసం ఏప్రిల్ 11న జైల్లోనే నిరాహార దీక్ష మొదలు పెట్టాడు. 14 నాటికి రెండుసార్లు స్పృహ కోల్పోయాడు. చివరికి 16వ తేదీ రాత్రి 11 గంటలకు మళ్ళీ స్పృహ కోల్పోయి పరిస్థితి దిగజారుతున్నప్పుడు ఆయనకు బలవంతంగా సెలైన్ ఎక్కించి భారీ బందోబస్తు నడుమ నాగపూర్ వైద్య కళాశాల ఆసుపత్రికి పంపించారు. కోర్టు ఆయనకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని ఆదేశించింది. ఏప్రిల్ 17న ఆసుపత్రిలో దీక్ష విరమించాక ఒక్క రోజు తిరక్కుండానే మళ్ళీ ఆయన్ని అండా సెల్లో నిర్బంధించారు. పేద రైతు కుటుంబంలో పుట్టిన సాయిబాబాకు అయిదేళ్ళ వయసు నుండే పోరాటం మొదలయ్యింది. పోలియో తన శరీరంపై దాడిచేసి ఆయన నడుము కింది భాగమంతా చచ్చుబడేలా చేసింది. అమలాపురం దగ్గర పల్లెటూరులో మట్టి రోడ్లపై తన రెండు చేతులతో దేహాన్ని ఈడ్చుకుంటూ మొదలు పెట్టిన ప్రయాణం కాలేజీ చదువు నాటికి మలుపు తిరిగింది. తన శారీరక అనారోగ్యంకన్నా దేశాన్ని పట్టి పీడించే దోపిడీ అసమా నతలు ఎన్నో రెట్లు తీవ్రమైనవని అర్థం చేసుకున్నందుకే ఆయన చక్రాల కుర్చీలో దేశమంతా పీడితుల వెంట తిరిగాడు. ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ఎన్నో రచనలు చేశాడు. ఆలిండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం ఆంధ్ర ప్రదేశ్ కమిటీ కార్యదర్శిగా ఆ తర్వాత జాతీయ కార్య దర్శిగా ప్రపంచీకరణ విధానాలకు వ్యతిరేకంగా అవి శ్రాంతంగా పనిచేశాడు. అంతర్జాతీయ వేదికల్లో పోరాడే ప్రజలకు బాసటగా నిలిచాడు. ఆయన కష్టాలను లెక్క చేయ లేదు. నిర్బంధాలకు వెరవలేదు. ఆ చక్రాల కుర్చీని చూసి బంగారపు కుర్చీ భయపడుతోందని ఒక హిందీ కవి రాశాడు. అక్రమ అరెస్టు, తప్పుడు కేసులు మోపడమే కాక విచారణ ైఖదీగా ఉన్న మనిషి పట్ల, అదీ తీవ్రమైన అనారోగ్యమూ, శారీరక వైకల్యమూ ఉన్న మనిషి పట్ల చట్టాలనూ, కోర్టు ఆదేశాలనూ ఉల్లంఘించి, హింసకు గురిచేస్తున్న రాజ్య దుర్మార్గాన్ని ఖండిస్తూ, ఆయన విడుదల కోసం ప్రజాసంఘాలు డా.జి.ఎన్.సాయి బాబా విడుదల పోరాట కమిటీగా ఏర్పడి ఆందోళన చేస్తున్నాయి. అయితే ప్రజాస్వామిక నిరసనను ఏ మాత్రం భరించలేని తెలంగాణ రాష్ర్టప్రభుత్వం మే 9న జరుపతలపెట్టిన ర్యాలీకి అనుమతి నిరాకరించింది. చివరికి ఇందిరా పార్క్ వద్ద పరిమిత ప్రజాస్వామ్యాన్ని మాత్రమే అనుమతించారు. సాయిబాబాను జైల్లోనే అంతం చేసే కుట్ర జరుగుతోందని అనుమానం ప్రజాసంఘాలకు కలుగుతోంది. అదే జరిగితే ప్రభుత్వం ఎట్లాగు ప్రధాన దోషి అవుతుంది, అయితే ఆ పాపంలో ప్రశ్నించని సభ్య సామా జానికీ భాగస్వామ్యం ఉండదా? (వ్యాసకర్త విరసం కార్యదర్శి) ఫోన్: 8179913123 -
జైలులో నా భర్త హత్యకు కుట్ర
డీయూ ప్రొఫెసర్ సాయిబాబా భార్య వసంత సాక్షి, న్యూఢిల్లీ:‘‘ నాగపూర్ కేంద్ర కారాగారంలో ఉన్న నా భర్తను హత్య చేయడానికి పోలీసులు కుట్ర పన్నుతున్నారు. ఆయనకు పౌష్టిక ఆహారం ఇవ్వడం లేదు. మందులు, వైద్యసేవలు అందించడం లేదు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించి చనిపోయేలా వ్యవహరిస్తున్నారు. ఈ చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి’’ అని ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా భార్య వసంత విన్నవించారు. సాయిబాబాను జైలు నుంచి విడిపించడానికి మద్దతుగా నిలిచేందుకు ఏర్పాటైన కమిటీ సభ్యులతో కలసి వసంత గురువారం ఇక్కడి ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజ్యహింసలో భాగంగా జుడీషియల్ కస్టడీలో ఉన్న తన భర్తను భౌతికంగా నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన సాయిబాబాను సంఘవిద్రోహకుడిగా చిత్రీకరించి ఏడాది క్రితం అరెస్టు చేసి నాగపూర్ సెంట్రల్ జైలుకు తరలించారని అన్నారు. 90 శాతం అంగవైకల్యం ఉన్న వ్యక్తిని అరెస్టు చేయకూడదని సీఆర్పీసీ సెక్షన్ చెబుతోందని కానీ, దానిని ఉల్లంఘించి సాయిబాబాను జైలు పెట్టారని ధ్వజమెత్తారు. ప్రజల హక్కులను కాపాడాల్సిన మానవ హక్కుల కమిషన్లు అధికారపక్షం చేతిలో పతనమయ్యాని విమర్శించారు. సాయిబాబా బెయిలుపై విడుదల కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. సాయిబాబా తల్లి సూర్యావతి మాట్లాడుతూ ఆదివాసీల బాగుకోసం పనిచేసిన తన కుమారుడిని పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని వాపోయారు. సామాజికవేత్త అరుంధతిరాయ్, డీయూ ప్రొఫెసర్లు మాట్లాడుతూ ఆపరేషన్ గ్రీన్ హంట్కు వ్యతిరేకంగా పోరాడినందుకే సాయిబాబాపై ప్రభుత్వం కక్షకట్టిందని చెప్పారు. ఊచకోతలు, హత్యలు, కరుడుకట్టిన నేరస్తులు దర్జాగా బెయిల్పై బయట తిరుగుతుండగా, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబాకు బెయిల్ ఇవ్వకపోవడం మానవహక్కులను కాలరాయడమేనని విమర్శించారు. -
సాయిబాబగుడిలో దొ౦గతన౦
-
షిరిడి సాయిబాబాపై వ్యాఖ్యలు.. జోక్యానికి సుప్రిం నిరాకరణ
-
సాయిబాబా విగ్రహంపై దాడి
-
మాంసం తినే సాయి.. హిందూ దేవుడెలా?
షిరిడీ సాయి దైవత్వాన్ని శంకరాచార్య స్వరూపానంద సరస్వతి మరోసారి ప్రశ్నించారు. అల్లాను కొలుస్తూ.. మాంసం తినే సాయి బాబా హిందూ దేవుడు ఎలా అవుతారని ఆయన అన్నారు. సాయి భక్తులు కూడా సనాతన దేవుళ్ల బొమ్మలతో సొమ్ము చేసుకున్నారని, వాళ్లు మన దేవుడి బొమ్మలు ఉపయోగించకపోతే వాళ్లకు ఎవరూ ఏమీ ఇవ్వరని చెప్పారు. ప్రజలకు ఎవరిని కావాలంటే వారిని కొలుచుకునే హక్కు, స్వేచ్ఛ ఉన్నాయని.. అయితే సాయిబాబా తనను తాను దేవుడిగా చెప్పుకొనే ప్రయత్నం చేయడం మాత్రం తమకు ఆమోదయోగ్యం కాదని స్వరూపానంద అన్నారు. తాము కేవలం ఐదుగురు దేవుళ్లనే ఆమోదిస్తామని, వేరే ఎవరైనా తమను తాము అక్కడ పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఆమోదించేది లేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రోద్బలంతోనే తాను సాయిబాబాపై గళమెత్తానన్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. తాను రాజకీయవాదిని కానని స్పష్టం చేశారు. మరోవైపు నాగా సాధువులు కూడా శంకరాచార్యకు మద్దతుగా నిలిచారు. శంకరాచార్యను ఎవరైనా అవమానిస్తే తాము వీధుల్లో నిరసనకు దిగుతామని హెచ్చరించారు. ఈ అంశాన్ని వారు ఆధ్యాత్మిక యుద్ధంగా కూడా చెప్పారు. -
స్వామి స్వరూపానందపై కేసు నమోదు
షిర్డీ : షిర్డీ సాయిబాబా దేవుడు కాదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ద్వారకా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతిపై మంగళవారం పోలీసులు కేసు నమోదు అయ్యింది. షిర్డీ సాయిబాబాపై వ్యాఖ్యలతో, లక్షలాదిమంది భక్తుల మనోభావాలను, మత విశ్వాసాలను గాయపరిచారన్న ఫిర్యాదు మేరకు స్వరూపానంద సరస్వతిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నితిన్ కోటే అనే స్థానికుడి ఫిర్యాదు మేరకు భారతీ శిక్షాస్మతిలోని 295(ఏ), 298 సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చేసినట్లు షిర్డీ పోలీస్ ఇన్స్పెక్టర్ రామ్ సూర్యవంశి చెప్పారు. -
సాయిబాబా దేవుడు కాదా?...
వివాదాలు కొనితెచ్చుకోవడంలో రాజకీయ నాయకులతో ప్రస్తుతం బాబాలు పోటీ పడుతున్నారు. తాజాగా ద్వారక శంకరాచార్య స్వరూపానంద సరస్వతి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తాను సాధువునన్న సంగతి మర్చిపోయి ఇటీవలే ఓ పాత్రికేయుడిపై చేయి చేసుకున్న స్వామివారు... ఈసారి ఏకంగా షిర్డీ సాయిబాబానే టార్గెట్ చేశారు. షిర్డీ సాయిబాబు దేవుడు కాదని, మనిషిని దేవుడిగా పూజించవద్దంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా షిర్డీసాయి దేవుడు కాడని, ఆయనకు ఆలయాలు కట్టడం సరికాదని సెలవిచ్చారు. పనిలో పనిగా హిందువులను విభజించేందుకే అంతర్జాతీయ శక్తులు బాబాను సీన్లోకి తెచ్చాయని స్వరూపనంద సరస్వతి వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మంలో విష్ణువుకు సంబంధించి కలియుగంలో 24 అవతారాలను చెప్పారని, కల్కి, బుద్ధ తప్ప ఇతర అవతారాల గురించి చెప్పలేదని, స్వరూపనంద సరస్వతి చెప్పుకొచ్చారు. మనిషిని దేవుడుగా కొలవడం తప్పని ఆయన స్పష్టం చేశారు. హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీకగా సాయిబాబాను గుర్తించడానికి కూడా ఆయన నిరాకరించారు. కాగా స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యలపై సాయి భక్తులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్వరూపానంద ప్రచారం కోసమే ఈ వివాదాన్ని తెరమీదకు తెచ్చారని మండిపడుతున్నారు. కాగా స్వరూపానంద సరస్వతి గతంలోనూ వార్తల్లో నిలిచారు. నరేంద్ర మోడీని విమర్శించిన బీహార్ సీఎం నితీష్ కుమార్తో కలిసి విరాట్ రామాయణ్ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొని చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి స్వరూపానంద సరస్వతి తన నోటి దురుసుతో మరోసారి పతాక శీర్షికలకు ఎక్కారు. -
ఈసెట్కు 11 వేల మంది
నేడే పరీక్ష.. నగరంలో రెండు జోన్లు..14 కేంద్రాలు నిమిషం లేటైనా అనుమతించం: కన్వీనర్ సాయిబాబు సాక్షి, సిటీబ్యూరో: ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈసెట్)-2014కు నగరంలో 14 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. శనివారం జరిగే ఈ పరీక్షకు 11,687 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పాలిటెక్నిక్ డిప్లమో పూర్తిచేసిన వారు ఈసెట్లో ర్యాంకు సాధించి నేరుగా బీటెక్ రెండో సంవత్సరంలో అడ్మిషన్ పొందవచ్చు. ఉన్నత విద్యామండలి తరపున ఈ పరీక్షను కాకినాడ జేఎన్టీయూ నిర్వహిస్తోంది. పరీక్ష నిర్వహణకు నగరాన్ని రెండు (హైదరాబాద్ 1,2)జోన్లుగా విభజించారు. హైదరాబాద్-1 జోన్లోని 3 కేంద్రాల్లో 6,155 మంది, జోన్-2లోని 11 కేంద్రాల్లో 5,532 మంది పరీక్ష రాయనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒం టి గంట వరకు పరీక్ష జరుగుతుంది. జోన్-1 కోఆర్డినేటర్గా జేఎన్టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ యాదయ్య, జోన్-2 కోఆర్డినేటర్గా ఓయూ సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ గోపాల్నాయక్ వ్యవహరిస్తారు. నిమిషం లేటైనా అనుమతించం ఈసెట్కు నిమిషం ఆలస్యంగా వచ్చినా అభ్యర్థులను అనుమతించబోమని కన్వీనర్ డాక్టర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు. అలాగే మధ్యాహ్నం ఒంటి గంట కంటే ముందు అభ్యర్థులను పరీ క్ష హాలు నుంచి బయటకు పంపబోమన్నారు. 9.15 గంటల నుంచే పరీక్ష కేం ద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తారు. అభ్యర్థులు ఫొటో అతికించిన ఆన్లైన్ దరఖాస్తు కాపీ, హాల్టికెట్తో పాటు నీలి, నలుపు రంగు బాల్పాయింట్ పె న్నులు తెచ్చుకోవాలి. కాలుక్యులేటర్లు, సెల్ఫోన్లు, తెల్లకాగితాలు వంటివి అనుమతించరు. ఓఎంఆర్ షీట్లో సమాధానాలను ఒక సారి గుర్తించాక వాటిని మార్చేందుకు వీల్లేదు. వాటిని చెరిపేందుకు ఎరైజర్, వైట్నర్లు వాడరాదని ఆయన సూచించారు. -
నక్సల్స్ సంబంధాలపై ప్రొఫెసర్ అరెస్టు
ఏపీకి చెందిన సాయిబాబాను అదుపులోకి తీసుకున్న మహారాష్ర్ట పోలీసులు మావోయిస్టు పార్టీతో సంబంధాలపై ఆధారాలున్నాయన్న అధికారులు హైదరాబాద్: మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణపై ఆంధ్రప్రదేశ్కు చెందిన ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను మహారాష్ట్ర పోలీ సులు అరెస్టు చేశారు. గత ఆరు నెలల్లో అనేకమార్లు ప్రశ్నించిన మీదట ఆయ న్ను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం సాయిబాబాను అరెస్టు చేశామని, ఢిల్లీ కోర్టు అనుమతితో అతడిని గడ్చిరోలికి తీసుకువస్తామని మహారాష్ట్ర డీఐజీ రవీంద్ర కదమ్ చెప్పారు. నిషేధిత తీవ్రవాద సంస్థ సీపీఐ-మావోయిస్టు సభ్యుడిగా వారికి అనేక రకాలుగా సాయిబాబా సహాయపడుతున్నారని ఆరోపించారు. మావోయిస్టుపార్టీలో కొత్త వారిని చేర్పించడంలో కూడా ప్రొఫెసర్ హస్తముందన్నారు. సాయిబాబా అరెస్ట్ను ఢిల్లీ పోలీసులు ధ్రువీకరించారు. ఇదివరకే ఆయన కంప్యూటర్ను పోలీసులు స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపారు. అందులోని కొన్ని ఫైల్స్ మావోయిస్టులతో అతని సంబంధాలను ధ్రువపరుస్తున్నాయని డీఐజీ చెప్పారు. మావోల కోసం పని చేస్తున్న ఓ సంస్థను సాయిబాబా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి హేమంత్ మిశ్రా అరెస్టు అనంతరం సాయిబాబా పేరు వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్ అడవుల్లో ఉన్న మావోయిస్టులకు, ప్రొఫెసర్కు మధ్య తాను కొరి యర్గా వ్యవహరిస్తున్నట్లు హేమంత్ అంగీకరించినట్లు పోలీసువర్గాలు తెలిపాయి. మావో నేతలు కోబాడ్గాంధీ, బచ్చా ప్రసాద్ సింగ్, ప్రశాంత్ రాహీలు కూడా సాయిబాబా పేరును వెల్లడించినట్లు చెప్పారు. ఈ ఆరోపణలను సాయిబాబా ఖండించారు. నల్లమిల్లి నుంచి ఢిల్లీకి... అమలాపురం టౌన్, ప్రొఫెసర్ గోకరకొండ సాయిబాబా అరెస్ట్తో తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో కలకలం రేగింది. సాయిబాబా సొంతూరు అమలాపురం పట్టణాన్ని ఆనుకుని ఉన్న నల్లమిల్లి గ్రామం. సామాన్య కుటుంబానికి చెందిన సాయిబాబా వికలాంగుడు. చిన్నతనం నుంచి సౌమ్యునిగా, చదువులో చురుగ్గా ఉండేవాడని గ్రామస్థులు చెప్పారు. అతని తండ్రి సత్యనారాయణ ఎంతో కష్టపడి సాయిబాబాను చదివించారన్నారు. సైకిల్పై అమలాపురంలోని ఎస్కేబీఆర్ కళాశాలకు తీసుకెళ్లి సాయిబాబా ఉన్నత చదువులు పూర్తి చేయించారన్నారు. తండ్రి చనిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయిన సాయిబాబా అక్కడే డిగ్రీ పూర్తి చేసి, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ చేశారు. సీఫెల్ నుంచి డాక్టరేట్ పొందారు. ఆ సమయంలోనే ప్రేమించిన యువతిని కులాంతర వివాహం చేసుకున్నారు. ఇంట్లోకి చొరబడి ఎత్తుకెళ్లారు: సాయిబాబా భార్య వసంత న్యూఢిల్లీ: పోలీసులు ఇంట్లోకి చొరబడి తన భర్తను ఎత్తుకెళ్లారని సాయిబాబా భార్య వసంత ఆరోపించారు. అబూజ్మడ్లో పోలీసులు చేపట్టిన గ్రీన్ హంట్కి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నందునే అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన రెవల్యూషనరీ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఆర్డీఎఫ్) సంయుక్త కార్యదర్శి ప్రొఫెసర్ సాయిబాబాను బేషరతుగా విడుదల చేయాలని ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు వరవరరావు, కార్యదర్శి రాజ్కిషోర్, విరసం కార్యద ర్శి వరలక్ష్మి డిమాండ్ చేశారు. -
ఏసీబీ వలలో డ్రాఫ్ట్స్మెన్
ఏసీబీ వలలో డ్రాఫ్ట్స్మెన్ కాజీపేట, : కలెక్టర్ భూముల కొలతలు, రికార్డుల కార్యాలయం మళ్లీ రికార్డుల్లోకెక్కింది. పదవీ విరమణ బెనిఫిట్స్ మంజూరు చేసేందుకు లంచం అడిగిన ఇద్దరు అధికారులు ఇటీవల ఏసీబీకి చిక్కి జైలుపాలయ్యూరు. ఆ సంఘటన మరువక ముందే... మంగళవారం సేత్వార్ పహాణీ కోసం వచ్చిన యువకుడి వద్ద మామూళ్లు తీసుకుంటూ అదే కార్యాలయంలో ఏసీబీకి మరో ఉద్యోగి రెడ్హ్యాండెడ్గా పట్టుబడడం జిల్లాలో చర్చనీయూంశంగా మారింది. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా కథనం ప్రకారం... చిట్యాల మండలం చింతకుంట్ల రామయ్యపల్లె గ్రామానికి చెందిన మొక్కిరాల జనార్దన్రావు ఓ కేసు నిమిత్తం భూముల కొలతలు, రికార్డుల కార్యాలయంలో సేత్వార్ పహాణీ, టీపన్ కోసం ఇటీవల రూ.600 చలాన్గా చెల్లించాడు. ధ్రువీకరణ పత్రాల కోసం సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ సాయిప్రసాద్ వద్దకు వెళ్లాడు. పత్రాలు కావాలంటే రూ.2,500 ఇవ్వాలని సదరు ఉద్యోగి పట్టుబట్టడంతోపాటు 15 రోజులుగా కార్యాలయం చుట్టూ తిప్పించుకున్నాడు. దీంతో విసుగు చెందిన జనార్దన్రావు ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఏసీబీ అధికారులు పకడ్బందీ ప్లాన్తో రంగంలోకి దిగారు. జనార్దన్రావుకు డబ్బులు ఇచ్చి కార్యాలయూనికి పంపిం చారు. వాటిని సాయిప్రసాద్ తీసుకుంటుండగా... అప్పటికే అక్కడ మకాం చేసిన అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. సాయిప్రసాద్ను అదుపులోకి తీసుకుని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. దాడుల్లో సీఐలు సాంబయ్య, బాపూరెడ్డితోపాటు సిబ్బంది పాల్గొన్నారు. మూడు రోజులుగా మకాం అవినీతి నిరోధక శాఖ అధికారులను మూడు రోజుల క్రితం జనార్దన్రావు కలిసి ఫిర్యాదు చేయగానే.... కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై వారు అక్కడే మకాం వేసి ఆరా తీసినట్లు తెలిసింది. అధికారి వేధింపులు నిజమేనని ఫోన్ ద్వారా నిర్ధారణ చేసుకున్న ఏసీబీ అధికారులు మినీ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో నిఘా తీవ్రం చేశారు. బాధితుడితో మంగళవారం ఫోన్ చేయించి... సదరు అధికారి కార్యాలయంలోనే ఉన్నట్లుగా నిర్ధారణకు వచ్చారు. మారువేషంలో అక్కడే తచ్చాడుతూ సారుుప్రసాద్ లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నాలుగు నెలల్లో ముగ్గురు ఉద్యోగులు నాలుగు నెలల్లో ఒకే కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. పదవీ విరమణ చేసిన తోటి ఉద్యోగి చిన్నరాంలు సెటిల్మెంట్ డబ్బుల బిల్లుల కోసం వెళితే సర్వే ఇన్స్పెక్టర్ రాథోడ్ సుదర్శన్, ఏడీ సమీనాబేగం లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీని ఆశ్రరుుంచగా... గత ఏడాది అక్టోబర్ 3వ తేదీన వారు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. తాజాగా రూ.2,500 లంచం తీసుకుంటూ సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ సాయిప్రసాద్ ఏసీబీ అధికారులకు చిక్కడం ఆ శాఖ ఉద్యోగుల్లో కలకలం సృష్టిస్తోంది. -
4న విజయవాడలో ఆమరణ దీక్ష
విద్యుత్ జేఏసీ కన్వీనర్ సాయిబాబా సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సెక్టార్లో పనిచేస్తున్న 37వేలమంది కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 4న విజయవాడలో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు విద్యుత్ జేఏసీ కన్వీనర్ సాయిబాబా ప్రకటించారు. హైదరాబాద్ ఏపీఎన్జీవో భవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఏపీట్రాన్స్కో, డిస్కంలు, ఏపీ జెన్కోల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఏళ్లతరబడి పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేకుండా, చాలీచాలని వేతనాలతో బతుకులీడుస్తున్న కార్మికుల న్యాయమైన డిమాండ్ కోసం ఈనెల 28న‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని కూడా చేపట్టామని చెప్పారు. ప్రభుత్వం స్పందించకుంటే ఫిబ్రవరి 6నుంచి రాష్ట్రంలోని 23జిల్లాలకు చెందిన కాంట్రాక్టు కార్మికులంతా సమ్మెబాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కాంట్రాక్టు కార్మికుల ఆందోళనకు ఏపీఎన్జీవోలు, ఇతర ఉద్యోగ సంఘాల నుంచి మద్ధతును కోరుతున్నట్లు ఆయన చెప్పారు. 3న విద్యుత్ సబ్స్టేషన్ల ముట్టడి విద్యుత్ కోతలకు నిరసనగా వచ్చే నెల 3న విద్యుత్ సబ్స్టేషన్లను ముట్టడించాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పిలుపునిచ్చింది. విద్యుత్ కోతల వల్ల నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, ఓట్ల కోసం 9 గంటలు, ఆచరణలో 3 గంటలా? అని ప్రభుత్వ తీరును ప్రశ్నించింది. శనివారమిక్కడ రైతు సంఘం రాష్ట్ర సమితి సమావేశం రాష్ట్రంలో రైతుకు కష్టాలపై స్పందిస్తూ ఈ మేరకు తీర్మానించింది. సంఘం అధ్యక్షురాలు పశ్య పద్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నేతలు కొల్లి నాగేశ్వరరావు, సీపీఐ శాసనసభాపక్ష నాయకుడు గుండా మల్లేష్, కె.రామకృష్ణ, రావుల వెంకయ్య పాల్గొన్నారు. -
కారులో దిగిన బాబా!
తమ కష్టాలు తీర్చేందుకు కలియుగంలో మానవ రూపంలో అవతరించిన భగవంతుని ప్రతిరూపంగా షిర్డీ సాయినాధుని భక్తులు కొలుస్తుంటారు. బాబాను నమ్మిస్తే తమ ఈతిబాధలన్నీ రూపుమాపుతాడని బలంగా విశ్వసిస్తుంటారు. అలాంటి వారికి మరింత నమ్మకం కలిగించే ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. జహీరాబాద్లోని షిర్డీ సాయిబాబా ఆలయంలో జరిగిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.. జహీరాబాద్ ఈడెన్ కాలనీలోని షిర్డీ సాయి మందిరం దగ్గర ఈ నెల 10న ఉదయం 9 గంటల సమయంలో ఓ కారు వచ్చి ఆగింది. అందులో నుంచి సాయిబాబా వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి దిగాడు. నేరుగా గుడిలోకి నడుచుకుంటూ వెళ్లి పూజారితో మాట్లాడాడు. సాయికి హారతివ్వమని కోరాడు. అనంతరం హారతి కళ్లకు అద్దుకున్నాడు. ఆలయ ప్రాంగణంలో ఆయన తిరుగాడాడు. భక్తులతో ముచ్చటించాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇంతకీ ఆరా తీస్తే.. అతను తెనాలికి చెందిన సాధువుగా గుర్తించారు. ఆ దృశ్యాలను మీరే చూడండి. -
భయపెట్టిన భల్లూకం
హుజూరాబాద్, న్యూస్లైన్ : హుజారాబాద్ పట్టణంలోకి గురువారం ఓ ఎలుగుబంటి ప్రవేశించి కలకలం సృష్టించింది. స్థానిక సాయిబాబా ఆలయ సమీపంలో నివసించే ఆలేటి శ్రీను ఇంటి ఆవరణలో ఉన్న వేపచెట్టుపై వేకువజామున ఓ భారీ భల్లూకం దర్శనమిచ్చింది. గమనించిన పలువురు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఉదయం 7 గంటలకే సీఐ శ్రీనివాస్, తహశీల్దార్ సురేశ్ అక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. చుట్టూ గృహాలు ఉండడంతో ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా అటవీశాఖ అధికారులకు విషయా న్ని చేరవేశారు. దీంతో సబ్ డీఎఫ్వో అనిల్కుమార్ ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది వచ్చారు. చెట్టుపై నుంచి ఎలుగుబంటి కిందకు వచ్చే సూచనలు కనిపించకపోవడంతో ఫారెస్ట్ రెస్క్యూ టీమ్ ను రంగంలోకి దించారు. వారు ప్రజలందరికీ హె చ్చరికలు చేస్తూ పటిష్టమైన వలలు అమర్చారు. ఒకవేళ ఎలుగుబంటి చెట్టుదిగితే ఇళ్లలోకి వెళ్లకుండా వలలతో ప్రత్యేక దారిని పొలాల వరకు ఏర్పాటు చేశారు. అయినా సాయంత్రం 5 గంటల వరకు అది కిందకు దిగకపోవడంతో జంతువులకు మత్తు ఇంజక్షన్ వేసే వైద్యనిపుణుడిని పిలి పించారు. మత్తు ఇంజెక్షన్ వే స్తే చెట్టుపైనుంచి కిందపడి ఎలుగు చనిపోయే అవకాశాలున్నాయని తర్జనభర్జన పడ్డారు. విషయం తెలుసుకున్న ప్రజలు దానిని చూసేందుకు తండోపతండాలుగా తరలివచ్చారు. కుక్కలు తరమడం తో ఎలుగుబంటి ఇలా వచ్చి చెట్టెక్కి ఉండవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 9.20 గంటలకు చెట్టు దిగిన ఎలుగుబంటి అధికారులు ఏర్పాటుచేసిన దారి గుండా కాకుండా పట్టణంలోకి ప్రవేశించి 9.40 గంటలకు ప్రభుత్వాస్పత్రి ఆవరణలోకి వెళ్లింది. రెస్క్యూ టీమ్, అటవీశాఖ, పోలీసులు, రెవెన్యూ అధికారులు దానికోసం వెతుకుతున్నారు. అధికారుల కంటబడకపోవడంతో ఆస్పత్రిలోని రోగులు భయభ్రాంతులకు గురవుతున్నారు. -
నేడు సమరం
కాగజ్నగర్, న్యూస్లైన్ : సిర్పూర్ పేపర్ మిల్లు(ఎస్పీఎం) గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు అంతా సిద్ధమైంది. బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం కాగజ్నగర్ పట్టణంలోని హెచ్ఆర్డీ హాలులో పోలింగ్, కౌంటింగ్ చేపట్టనున్నారు. బరిలో ఏడు యూనియన్లు ఉండగా, ప్రధాన పోటీ ఐదు యూనియన్ల మధ్యే ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు పోటీ పడుతుండటంతో ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎస్పీఎం మజ్దూర్ యూనియన్(సీఐటీయు) తరఫున రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబు పోటీలో ఉన్నారు. బీఎంఎస్ అనుబంధ ఎస్పీఎం వర్క ర్స్ యూనియన్ నుంచి బీఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్లోల భట్టాచార్య పోటీలో ఉన్నారు. హెచ్ఎంఎస్ అనుబంధ ఎస్పీఎం తెలంగాణ వర్కర్స్ యూనియన్ నుంచి టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహారెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన సోమవారం కాగజ్నగర్కు వచ్చి బహిరంగ సభ నిర్వహించి కార్మికులను కలుస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. ఈయన తరపున ఎమ్మెల్యేలు కావేటి సమ్మయ్య, వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలక్ష్మి ప్రచారం నిర్వహించారు. ఎస్పీఎం నేషనల్ వర్కర్స్ అసోసియేషన్ నుంచి ఐఎన్టీయుసి జాతీయ నేత జి.సంజీవరెడ్డి పోటీ చేస్తుండగా, ఈయన సోమవారం కాగజ్నగర్కు వచ్చి ఎస్పీఎం గేటు వద్ద కార్మికులను కలిసి అక్కడే నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఈయన తరఫున మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆయన వర్గీయులు ప్రచారం నిర్వహించారు. సిర్పూర్ తెలుగునాడు కార్మిక పరిషత్ నుంచి మాజీ ఎంఎల్సీ ప్రేంసాగర్రావు వర్గీయుడు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పోటీలో ఉన్నారు. ఈయన గెలుపు కోసం ఆదివారం ప్రేంసాగర్రావు కాగజ్నగర్లో కార్మికులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈయన తరఫున డీసీసీ నాయకులు విశ్వప్రసాద్, ఆసిఫాబాద్ మాజీ ఎంపీపీ బాలేశ్గౌడ్తోపాటు స్థానిక నాయకులు ప్రచారం నిర్వహించారు. ఎస్పీఎం ఎంప్లాయీస్ యూనియన్ నుంచి ఐఎన్టీయుసీ రాష్ట్ర అధ్యక్షురాలు రాపెల్లి విజయలక్ష్మి పోటీ చేస్తున్నారు. ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి ఎస్పీఎం మిల్లులో బుధవారం జరిగే ఎన్నికలకు మిల్లు యాజమాన్యం, కార్మికశాఖ అధికారులు పూర్తి ఏర్పాట్లను చేశారు. మిల్లులోని సైకిల్ స్టాండ్లో నాలుగు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. ఒ క్కో బూత్లో 400 నుంచి 440 మంది ఓటర్లు ఓటును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికల ఏర్పాట్లను డిప్యూటీ లేబర్ కమిషనర్ దండపాణి, కాగజ్నగర్ సహాయ కార్మికశాఖాధికారి మజ రున్నీసాబేగం పరిశీలించారు. మిల్లు యాజమాన్యం తరపున మిల్లు ఉపాధ్యక్షుడు బీసీ శర్మ, సీనియర్ పర్సనల్ మేనేజర్ డీటీ చౌదరి, అసిస్టెంట్ మేనేజర్ ఉదయ్కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల సందర్భం గా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ సురేశ్బాబు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
నవంబర్ 9,రాత్రి 9 గంటలకు పేలుస్తామని వార్నింగ్
-
తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తే నిరవధిక సమ్మె: సాయిబాబా
నెల్లూరు, న్యూస్లైన్: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రక్రియపై ఒక్కఅడుగు ముందుకు వేసినా నిరవధిక సమ్మెకు దిగుతామని సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు సాయిబాబా హెచ్చరించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నెల్లూరులోని విద్యుత్ భవన్ ఎదుట రహదారిపై శనివారం వంటా,వార్పు నిర్వహించారు. అనంతరం గంగిరెద్దులతో కలసి ఆటపాటలతో ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ‘అక్కా అక్కా పనబాక అక్కా, రోశయ్య తాతా’ అంటూ సీమాంధ్ర మంత్రులు, ఎంపీలపై పాడిన పాట అందరినీ ఉత్సాహపరచింది. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ, విద్యుత్ ఉద్యోగుల 72 గంటల సమ్మెకు సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కేవలం 72 గంటల సమ్మెకే రాష్ట్రం అంధకారంగా మారిం దని, ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించు కోవాలని చెప్పారు. ఈ నెల 16, 17 తేదీల్లో సీమాంధ్ర జిల్లాల జేఏసీలు సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తాయని వెల్లడించారు. నిరవధిక సమ్మెలో కాంట్రాక్ట్ ఉద్యోగులను భాగస్వాములు చేస్తామన్నారు. సిమ్కార్డులను వెనక్కి తీసుకోనున్నట్టు చెప్పారు.