Santosh Shobhan
-
'మీరు బాదకముందే చెబుతున్నా ఆరు 'నిబ్బా నిబ్బీ' లవ్ స్టోరీలు ఉన్నాయి'
బేబీ సినిమాతో డైరెక్టర్గా సాయి రాజేష్కు గుర్తింపు వచ్చినా ఆయన మొదటగా ‘హృదయకాలేయం’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తర్వాత కొబ్బరి మట్ట సినిమాను కూడా డైరెక్ట్ చేశాడు. ఆ రెండూ సినిమాలకు సంబంధించిన మీమ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి. తర్వాత కలర్ ఫోటోతో నిర్మాతగా మెప్పించాడు.బేబీ సినిమాను నిర్మాత ఎస్కేఎన్తో కలిసి సాయి రాజేష్ తెరకెక్కించాడు. ఆ సినిమా సూపర్ హిట్ అందుకుంది. మొత్తం ఆరు ప్రేమకథలు నిర్మించబోతున్నట్లు ‘బేబి’ దర్శకుడు సాయి రాజేష్ ప్రకటించారు. (ఇదీ చదవండి: దొరికిపోయిన రతిక.. మోకాళ్లపై కూర్చుని దండం పెట్టిన అమర్!) కలర్ ఫోటో,బేబీ సినిమాలు ఇప్పటికే విడుదలయ్యాయి.. మరో రెండు ప్రేమకథలు నిర్మాణంలో ఉన్నాయి. త్వరలో ఇంకో రెండు కథలు త్వరలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా కొనసాగుతున్న సాయి రాజేష్, ఎస్కేఎన్ ఇద్దరూ.. గీతా ఆర్ట్స్ కాంపౌండ్లో ఉంటూ చాలా రోజులుగా కలిసి పనిచేస్తున్నారు. అలా బేబీ హిట్తో వారిద్దరి పేర్లు సెన్సేషన్ అయ్యాయి. తాజాగా వీరి నుంచి మరో సినిమా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే.. సంతోష్ శోభన్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాకు సాయి రాజేష్ కథ, స్క్రీన్ప్లే అందిస్తుండగా.. వారి బ్యాచ్లో ఉన్న మరో స్నేహితుడు సుమన్ పాతూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బేబీ సినిమాతో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్యకు హిట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మరో తెలుగమ్మాయి.. 'బిగ్ బాస్' ఫేమ్ అలేఖ్య హారికను కథానాయకిగా పరిచయం చేయడం విషేశం. 'అమృత ప్రొడక్షన్స్' నుంచి ఇప్పటి వరకు మూడు సినిమాలు నిర్మించిగా. ఆఖరి సినిమాగా కలర్ ఫోటో వచ్చిందని సాయి రాజేష్ గుర్తు చేశారు. ఆ చిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు కూడా వచ్చింది. నేనేమీ లోకేష్ కనగరాజ్ కాదు ఆ తర్వాత తాను నిర్మాతగా సినిమాలు నిర్మించలేదని సాయి రాజేష్ ఇలా చెప్పుకొచ్చాడు. ఒక మంచి కథ వచ్చినప్పుడు నేను మళ్లీ సినిమా నిర్మించాలని అనుకున్నాను. ఈ కథ ప్రేక్షకులను మెప్పిస్తుంది. సోషల్ మీడియాలో కొందరు ఎన్ని తీస్తారురా 'నిబ్బా నిబ్బీ' లవ్ స్టోరీలు అని బాదకముందే నేనే ముందుగా చెప్తున్నాను. నాది, ఎస్కేఎన్ కాంబినేషన్లో మొత్తం 6 ప్రేమకథలు రాబోతున్నాయి. వీటిలో రెండు మీరు చూసేశారు. ఒకటి కలర్ ఫోటో.. రెండోది బేబి. రెండు నిర్మాణంలో ఉన్నాయి.. వైష్ణవి, ఆనంద్ కాంబినేషన్లో రీసెంట్గా ఒక సినిమా ప్రకటించాం. ఇప్పుడు సంతోష్, హారిక కాంబినేషన్లో ఈ సినిమా రానుంది. ఇవి కాకుండా ఇంకో రెండు లవ్ స్టోరీలు ఉంటాయి. కొందరు మాత్రం ఇదేమైనా సినిమాటిక్ యూనివర్సా.. స్టోరీలో ఏమైనా లింక్ అయ్యాయా..? సీక్వెల్ ఉంటుందా..? అంటే నేనేమీ లోకేష్ కనగరాజ్ కాదు.. ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ.. మీ అందర్నీ మెప్పించేలా ఆరు ప్రేమ కథలు ఉన్నాయి. అవి నేను, ఎస్కేఎన్ కలిసి మీకు అందిస్తున్నాం. వాటిలో ఇదీ ఒకటి. ఇది నా మనసుకు చాలా దగ్గరైన ప్రేమ కథ. ఈ ప్రాజెక్ట్లో నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఎందుకంటే డైరెక్టర్ సుమన్ పాతూరి, హారిక అలేఖ్య, కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్, సుహాస్, మేమందరం చాలా సంత్సరాలుగా స్నేహితులం. ఎస్కేఎన్, నేను చిన్నప్పటి నుంచీ ఫ్రెండ్స్. అందరం ఫ్రెండ్స్ కలిసి ఫ్రెండ్స్ కోసం చేస్తున్న సినిమా ఇది. కచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ కొట్టాలని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమా తీస్తున్నాం.' అని సాయి రాజేష్ చెప్పారు. -
'బేబి' మూవీ టీమ్ నుంచి మరో ప్రేమకథ
సంతోష్ శోభన్, అలేఖ్య హారిక జంటగా కొత్త సినిమా షురూ అయింది. సుమన్ పాతూరి దర్శకత్వంలో అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్పై ఎస్కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం ్రపారంభమైంది. తొలి సన్నివేశానికి డైరెక్టర్ చందూ మొండేటి కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో నాగచైతన్య క్లాప్ కొట్టగా, డైరెక్టర్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహించారు. డైరెక్టర్ హరీష్ శంకర్, నిర్మాత రవిశంకర్ యూనిట్కి స్క్రిప్ట్ అందించగా, హీరో సుశాంత్, దర్శకులు హను రాఘవపూడి, రాహుల్ సంకృత్యాన్ యూనిట్కి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సంతోష్ శోభన్ మాట్లా డుతూ– ‘‘ఈ సినిమాలో మంచి ప్రేమకథ ఉంటుంది’’ అన్నారు. ‘‘నా మనసుకు దగ్గరైన కథ ఇది. నేను, ఎస్కేఎన్, సందీప్ రాజ్, అలేఖ్య.. మేమంతా ఫ్రెండ్స్. ఈ సినిమా వారితో కలిసి చేస్తుండటంతో మరింత బాధ్యతగా భావిస్తున్నా’’ అన్నారు సాయి రాజేశ్. ‘‘ఈ సినిమాకు దర్శకత్వం వహించే చాన్స్ ఇచ్చిన నా ఫ్రెండ్ సాయి రాజేశ్కు థ్యాంక్స్’’ అన్నారు సుమన్ పాతూరి. ‘‘హీరోయిన్గా చేయాలనే నా కల ఈ చిత్రంతో నెరవేరుతోంది’’ అన్నారు అలేఖ్య హారిక. ‘‘తెలుగు అమ్మాయిలను ్ర΄ోత్సహించాలనే నా సినిమాల్లో తెలుగు అమ్మాయిలనే హీరోయిన్గా తీసుకుంటున్నాను’’ అన్నారు ఎస్కేఎన్. ఈ చిత్రానికి కెమెరా: అస్కర్, సంగీతం: విజయ్ బుల్గానిన్, సహనిర్మాతలు: ధీరజ్ మొగిలినేని, రమేశ్ పెద్దింటి. -
'మ్యాడ్' సినిమాలో కామెడీతో ఇచ్చిపడేశాడు.. ఈ కుర్రాడెవరో తెలుసా?
ఈ శుక్రవారం చిన్నాపెద్దా కలిపి 10 వరకు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. వాటిలో ఇంజినీరింగ్ కాలేజీ, హాస్టల్ బ్యాక్డ్రాప్ స్టోరీతో తీసిన 'MAD' మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుంది. జూ.ఎన్టీఆర్ బావమరిది హీరోగా పరిచయమైన ఈ సినిమాలో ఓ కుర్రాడు.. తన యాక్టింగ్, కామెడీతో ఇచ్చిపడేశాడు. అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. ఇంతకీ ఎవరతడు? అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ కుర్రాడి పేరు సంగీత్ శోభన్. ప్రస్తుతం టాలీవుడ్లో పలు సినిమాల్లో హీరోగా చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ శోభన్ వాళ్ల తమ్ముడే ఇతడు. ప్రభాస్తో 'వర్షం' లాంటి హిట్ సినిమా తీసిన శోభన్.. సంగీత్ నాన్న. ఇలా ఇండస్ట్రీతో చిన్నప్పటి నుంచే సంబంధం ఉంది. అలా చైల్డ్ ఆర్టిస్టుగా 2011లోనే 'గోల్కోండ హైస్కూల్' సినిమాలో యాక్ట్ చేశాడు. అందులో బొద్దుగా ఉండేది ఇతడే. అప్పుడు బ్రేక్ తీసుకుని పదేళ్ల తర్వాత ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చాడు. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7' ఎలిమినేషన్లో ట్విస్ట్.. ఐదోవారమూ అమ్మాయే!) వెండితెరపై 'మ్యాడ్' ఫస్ట్ సినిమా అయినప్పటికీ.. మూడేళ్ల క్రితమే 'ద బేకర్ అండ్ ద బ్యూటీ' అనే వెబ్ సిరీస్లో సహాయ పాత్ర చేశాడు. దీనితోపాటు త్రీ రోజెస్, పిట్ట కథలు, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ లాంటి తెలుగు వెబ్ సిరీసుల్లోనూ భాగమయ్యాడు. అలా ఓటీటీల్లో అదరగొట్టిన సంగీత్.. 'మ్యాడ్'లో అవకాశం దక్కించుకున్నాడు. దామోదర్ (డీడీ) అనే బీటెక్ చదివే కుర్రాడి పాత్రలో ఇరగ్గొట్టేశాడని చెప్పొచ్చు. త్వరలో 'ప్రేమ విమానం' అనే డైరెక్ట్ ఓటీటీ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. తన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్న సంగీత్ శోభన్.. మంచి స్క్రిప్టులు సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేస్తే మాత్రం మరో జాతిరత్నం కావడం గ్యారంటీ. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇలా కామెడీతో హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టి, సిద్ధు జొన్నలగడ్డ ఎంత క్రేజ్ తెచ్చుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాస్త కష్టపడితే సంగీత్.. ఆ లిస్టులోకి చేరడం పెద్ద విషయమేమి కాకపోవచ్చు! (ఇదీ చదవండి: ‘మ్యాడ్’ మూవీ రివ్యూ) -
రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను– సంతోష్ శోభన్
‘‘వందేళ్ల ఇండియన్ సినిమాల్లో ఎన్నో పాత్రలు, ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పటివరకూ చెప్పని కథ, ఎవరూ చేయని పాత్రను ఎలివేట్ చేయటం అనేది ఓ ఆర్టిస్ట్కి కొత్తగా ఉంటుంది. అలా పెళ్లి మండపంపై మిగిలిపోయేవాడి కథే ‘ప్రేమ్ కుమార్’’ అని హీరో సంతోష్ శోభన్ అన్నారు. సంతోష్ శోభన్, రాశీ సింగ్, రుచితా సాధినేని హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ్ కుమార్’.అభిషేక్ మహర్షి దర్శకత్వంలో శివ ప్రసాద్ పన్నీరు నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా సంతోష్ శోభన్ మాట్లాడుతూ–‘‘అభిషేక్ కొన్ని సినిమాల్లో నటుడిగా చేశాడు. దర్శకుడు కావాలనుకున్నప్పుడు ‘ప్రేమ్ కుమార్’ కథ రాసుకుని, చక్కగా తీశాడు. వరుసగా వరుడు, పెళ్లి వంటి సినిమాలు చేస్తున్నాను. అయితే నిజ జీవితంలో నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను (నవ్వుతూ). నేనిప్పటి వరకు మంచి డైరెక్టర్స్తో సినిమాలు చేశాను. అయితే నేను చేసిన సినిమాలన్నీ కరెక్ట్గానే ఎంచుకున్నానా? అంటే లేదనే అంటాను. ‘ప్రేమ్ కుమార్’ నాకు సరైన హిట్ ఇస్తుందనుకుంటున్నాను’’ అన్నారు. -
కుటుంబంతో కలిసి చూడొచ్చు
‘‘ప్రేమ్ కుమార్’ చిత్రం ఆద్యంతం వినోద భరితంగా కుటుంబ సమేతంగా చూసేలా ఉంటుంది. ఈ మూవీలో నేను, నా వైఫ్ అతిథి పాత్రల్లో కనిపిస్తాం’’ అని దర్శకుడు అభిషేక్ మహర్షి అన్నారు. సంతోష్ శోభన్ హీరోగా, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ్ కుమార్’. శివ ప్రసాద్ పన్నీరు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అభిషేక్ మహర్షి మాట్లాడుతూ–‘‘కొన్ని సినిమాలకు ఘోస్ట్ రైటర్గా పని చేశాను. నా దగ్గర ఉన్న ముప్పై కథల్లో ‘ప్రేమ్ కుమార్’ కథ సెట్ అయింది. ‘కుచ్ కుచ్ హోతా హై, నువ్వే నువ్వే’ సినిమాల స్ఫూర్తితో ఈ కథను రాశాను. సినిమాల్లో పెళ్లి సీన్ లో చివర్లో హీరో వచ్చి.. హీరోయిన్ పెళ్లి ఆపుతాడు. తర్వాత హీరో, హీరోయిన్లు కలిసిపోతారు. అప్పుడు ఆ పెళ్లి కొడుకు పరిస్థితి ఏంటి? చెప్పేందుకే ‘ప్రేమ్ కుమార్’ తీశాం. శివ ప్రసాద్గారికి సినిమాలపై ఎంతో ప్యాషన్ ఉంది’’ అన్నారు. -
కుటుంబంతో కలిసి చూడొచ్చు – దర్శకుడు అభిషేక్ మహర్షి
‘ప్రేమ్ కుమార్’ చిత్రం ఆద్యంతం వినోద భరితంగా కుటుంబ సమేతంగా చూసేలా ఉంటుంది. ఈ మూవీలో నేను, నా వైఫ్ అతిథి పాత్రల్లో కనిపిస్తాం’’ అని దర్శకుడు అభిషేక్ మహర్షి అన్నారు. సంతోష్ శోభన్ హీరోగా, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ్ కుమార్’. శివ ప్రసాద్ పన్నీరు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అభిషేక్ మహర్షి మాట్లాడుతూ–‘‘కొన్ని సినిమాలకు ఘోస్ట్ రైటర్గా పని చేశాను. నా దగ్గర ఉన్న ముప్పై కథల్లో ‘ప్రేమ్ కుమార్’ కథ సెట్ అయింది. ‘కుచ్ కుచ్ హోతా హై, నువ్వే నువ్వే’ సినిమాల స్ఫూర్తితో ఈ కథను రాశాను. సినిమాల్లో పెళ్లి సీన్స్ లో చివర్లో హీరో వచ్చి.. హీరోయిన్స్ పెళ్లి ఆపుతాడు. తర్వాత హీరో, హీరోయిన్లు కలిసిపోతారు. అప్పుడు ఆ పెళ్లి కొడుకు పరిస్థితి ఏంటి? చెప్పేందుకే ‘ప్రేమ్ కుమార్’ తీశాం. శివ ప్రసాద్గారికి సినిమాలపై ఎంతో ష్యాషన్ ఉంది’’ అన్నారు. -
నవ్వించే ప్రేమ్కుమార్
సంతోష్ శోభన్, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ్ కుమార్’. రైటర్ అభిషేక్ మహర్షి దర్శకత్వంలో శివ ప్రసాద్ పన్నీరు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో సంతోష్ శోభన్ మాట్లాడుతూ– ‘‘దర్శక–నిర్మాతలు నమ్మడంవల్లే ఈ సినిమా ఇంత దూరం వచ్చింది. నా సినిమాల్లో నటించిన అభిషేక్ దర్శ కుడు అవుతాడని ఊహించలేదు. భవిష్యత్లో హ్యూమర్కి తనో బ్రాండ్ అవుతాడనిపిస్తోంది. ‘ప్రేమ్కుమార్’ రెండు గంటలు నవ్వించే చిత్రమవుతుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా చూస్తున్నప్పుడు మన ఫ్రెండ్స్ గుర్తొస్తారు. బయట మనం ఎలా ఉంటామో అవే ΄ాత్రలను ఈ సినిమాలో చూస్తాం’’ అన్నారు అభిషేక్ మహర్షి. ‘‘ప్రేక్షకు లను నవ్వించాలని చేసిన సినిమా ఇది’’ అన్నారు శివ ప్రసాద్. -
వర్షం సినిమా చూశాక అమ్మలో సంతోషం.. మళ్లీ ఇప్పుడా పరిస్థితి
‘‘అన్నీ మంచి శకునములే’ కుటుంబమంతా కూర్చొని చూసే సినిమా. ఇంకా చూడనివారు థియేటర్స్కి వెళ్లి చూడండి. మా బ్యానర్లో ఇంతకుముందు వచ్చిన చిత్రాల్లానే ‘అన్నీ మంచి శకునములే’ వంటి ఓ మంచి సినిమా తీశామనే సంతృప్తి ఉంది’’ అని నిర్మాత ప్రియాంకా దత్ అన్నారు. సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. ప్రియాంకా దత్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో నిర్మాత స్వప్నా దత్ మాట్లాడుతూ–‘‘ప్రస్తుత ట్రెండ్లోనూ ఇలాంటి సినిమా తీసినందుకు గర్వంగా ఉంది. మా బ్యానర్లో నటించిన ఎన్టీఆర్, నాని, విజయ్ దేవరకొండ మంచి స్టార్స్ అయ్యారు.. అలాగే సంతోష్కి కూడా ఆ రేంజ్ వస్తుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. ‘‘సినిమా అంటే కేవలం మాస్ కాదు.. ఫ్యామిలీ అంతా చూడగలిగే సినిమా ఇది’’ అన్నారు నందినీ రెడ్డి. ‘‘20 ఏళ్ల క్రితం నాన్నగారు (డైరెక్టర్ సంతోష్) తీసిన ‘వర్షం’ సినిమా చూశాక మా అమ్మలో సంతోషం చూశాను. ఇప్పుడు ‘అన్నీ మంచి శకునములే’ మా అమ్మలో అదే ఆనందం తీసుకువచ్చింది’’ అన్నారు సంతోష్ శోభన్ . -
సీతారామం తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ ఫోన్కాల్ తనదే: హీరో
‘‘అన్నీ మంచి శకునములే..’ ట్రైలర్, టీజర్లో పాజటివ్ ఎనర్జీ కనిపించింది. ఈ సినిమాకు ‘అన్నీ మంచి శకునములే..’. ఈ చిత్రం బ్లాక్బస్టర్ అవుతుందని నమ్ముతున్నా’’ అని అన్నారు నాని. సంతోష్ శోభన్ , మాళవికా నాయర్ జంటగా నందినీరెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. మిత్రవిందా మూవీస్, స్వప్నా సినిమాస్పై ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు హీరోలు నాని, దుల్కర్ సల్మాన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో నాని ఇంకా మాట్లాడుతూ– ‘‘మంచి ఈజ్, బ్రహ్మాండమైన కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్ సంతోష్. అతన్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లుగా అనిపిస్తోంది. నందినీకి మరో నాని దొరికాడనిపిస్తోంది. ‘అన్నీ మంచి శకునములే’కి విజువల్స్, సాంగ్స్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాగా కుదిరినట్లు అనిపిస్తోంది. ప్రేక్షకులందరికీ గుర్తుండిపోయే ఓ స్పెషల్ చిత్రంగా నిలుస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు నాని. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ– ‘‘వైజయంతీ మూవీస్ నాకు ఓ ఫ్యామిలీలాంటిది. రాజేంద్రప్రసాద్గారికి నేను అభిమానిని. ‘మహానటి’కి ఆయనతో కలిసి వర్క్ చేశాను. ‘సీతారామం’ తర్వాత నాకు తొలి ఫోన్ కాల్ నందినీ రెడ్డిగారి నుంచి వచ్చింది. ‘అన్నీ మంచి శకునములే’ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘నా లైఫ్లో నేను చేసిన పెద్ద సినిమా ఇది. వీకే నరేశ్, రాజేంద్రప్రసాద్, గౌతమీ, వాసుకి, ‘షావుకారు’ జానకి, అంజు.. ఇలా వీరందరూ కలిసి నేను రాసుకున్న కథను పది రెట్లు పెంచారు. ఈ సినిమాకు లైఫ్ లైన్ సంగీత దర్శకులు మిక్కీ జే మేయర్. ఫ్యామిలీ ప్రొడ్యూసర్స్తో కలిసి వర్క్ చేసిన ఫీలింగ్ ప్రియాంక, స్వప్నాల వల్ల కలిగింది’’ అన్నారు నందినీ రెడ్డి. ‘‘సమ్మర్కు మన అమ్మమ్మగారి ఇంటికి వెళ్లొచ్చిన జ్ఞాపకంలా ‘అన్నీ మంచి శకునములే’ ఉంటుంది’’ అన్నారు స్వప్నా దత్, ప్రియాంకా దత్. ‘‘చాలాకాలం ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే చిత్రమిది’’ అన్నారు సంతోష్ శోభన్.. ‘‘వైజయంతీ మూవీస్ సంస్థను మా పిల్లలు (స్వప్నా, ప్రియాంక) సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. వీరి ఆలోచనలు అప్పట్లో నాకు రాలేదని ఈర్ష్యగా ఉంది’’ అన్నారు నిర్మాత అశ్వినీదత్. ‘‘అసలు మనం ఎందుకు పుట్టాం? హిందూ ధర్మంలో మనం సెంటిమెంట్కు ఎంత వేల్యూ ఇస్తాం. ఆ సెంటిమెంట్ వల్ల మనం ఎలా ఉన్నాం? వంటి అంశాలు ‘అన్నీ మంచి శకునములే..’లో ఉన్నాయి. ఒక అద్భుత సినిమాను చూసిన అనుభూతిని ప్రేక్షకులకు ఇస్తుందని గ్యారంటీ ఇస్తున్నాను’’ అన్నారు రాజేంద్రప్రసాద్. ‘‘పదహారు కూరల రుచుల సమ్మేళనం ఈ చిత్రం’’ అన్నారు వీకే నరేశ్. ఈ వేడుకలో దర్శకులు నాగ్ అశ్విన్, హను రాఘవపూడి, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు. -
అది నాకు బోనస్: సంతోష్ శోభన్
‘‘గోల్కొండ హైస్కూల్’ (2011) చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాను. ఈ సినిమాలోని నా పెర్ఫార్మెన్స్ నాకు చాలా అవకాశాలు తెచ్చిపెడుతుందనుకున్నాను. కానీ అలా జరగలేదు. ఆ తర్వాత మరికొన్ని సినిమాలు చేసినా దాదాపు నాలుగేళ్లు నాకు అవకాశాలు దక్కలేదు. ఆ తర్వాత వచ్చిన అవకాశాలు, కొన్ని కథలు కరెక్ట్ అని భావించి కొన్ని సినిమాలు చేశాను. అవి వర్కౌట్ కాలేదు. ఇక నా కెరీర్ పరంగా ‘అన్నీ మంచి శకునములే’ చిత్రం మంచి బిగ్స్క్రీన్ మూవీగా నిలుస్తుందని భావిస్తున్నాను’’ అని అన్నారు సంతోష్ శోభన్. నందినీ రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నటించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. స్వప్నామూవీస్, మిత్రవిందా మూవీస్తో కలిసి ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో సంతోష్ శోభన్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో రిషి పాత్రలో కనిపిస్తాను. ‘అలా..మొదలైంది’ చూసి నందినీరెడ్డిగారితో ఓ సినిమా చేయాలనుకున్నాను. అలాగే ఓ యాక్టర్గా నాకు తొలి అడ్వాన్స్ చెక్ ఇచ్చింది ప్రియాంకా దత్గారు. ఇలా.. వీరి కాంబినేషన్స్తో నా కెరీర్కు కావాల్సిన టైమ్లో ‘అన్నీ మంచి..’ లాంటి సినిమా వస్తుండటం లక్గా భావిస్తున్నాను. ఇక ఈ సినిమా అవుట్పుట్ బాగా రావడం నాకు బోనస్’’ అన్నారు. నేడు మదర్స్ డేని పురస్కరించుకుని శోభన్ మాట్లాడుతూ – ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లవుతోంది. నటుడిగా నాకు అవకాశాలు తగ్గినప్పుడు అమ్మ నమ్మకమే నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఆ ధైర్యంతోనే నేను సినిమాలు చేస్తున్నాను. మాకు సొంత ఇల్లు లేదు. త్వరలోనే మా అమ్మకు సొంత ఇంటిని గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను’’ అన్నారు. -
ప్రేక్షకులకు ఈ సినిమా ఓ మంచి బహుమతి
‘‘సినిమా నా ఫస్ట్ లవ్. అందుకే నటిగా మాత్రమే కాకుండా సినిమాకి సంబంధించిన పలు విభాగాల్లో పని చేశాను. ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ మరింత ఆసక్తికరంగా ఉంది. నేర్చుకోవడానికి చాలా ఉంది. నటిగా షూటింగ్స్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాను కాబట్టే ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. ఇందుకు సంతోషంగా ఉంది. ఒక రకంగా గర్వపడుతున్నాను కూడా’’ అన్నారు గౌతమి. సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. స్వప్న సినిమాస్, మిత్ర విందా మూవీస్ పతాకాలపై ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో జరిగిన విలేకర్ల సమావేశంలో గౌతమి మాట్లాడుతూ– ‘‘అన్నీ మంచి..’లో ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసే మీనాక్షీ పాత్ర చేశాను. ఓ డ్రీమ్ మదర్, వైఫ్, ఫ్రెండ్ ఎలా ఉండాలని కోరు కుంటారో అలా ఉంటుంది మీనాక్షీ పాత్ర. నా కెరీర్ తొలినాళ్లలో నేను రాజేంద్రప్రసాద్గారితో యాక్ట్ చేశాను. ఇప్పుడు ఈ సినిమాలో కలిసి నటించాను. నటన పట్ల ఆయన అంకితభావం సూపర్. వీకే నరేశ్, ‘షావుకారు’ జానకి, ఊర్వశి.. ఇలా అందరూ ఓకే సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది. అసలు.. ఇంతమంది మంచి నటీనటులను దర్శకురాలు నందినీ, నిర్మాతలు స్వప్న, ప్రియాంకాగార్లు ఓ చోటకు చేర్చి సినిమా చేయడం అద్భుతం. ప్రేక్షకులకు ఈ సినిమా మర్చిపోలేని బహుమతి. స్వీయనియంత్రణ ఉన్న దర్శకురాలు నందిని. మంచి నిర్మాతలకు ఉండాల్సిన లక్షణాలు ప్రియాంక, స్వప్నగార్లలో ఉన్నాయి. ప్రస్తుతం బోయపాటిగారి సినిమాలో నటిస్తున్నాను. రెండు వెబ్ సిరీస్లు చేస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ–‘‘మా అమ్మాయి ఫిల్మ్ మేకింగ్ చదువుతోంది. తనకు కెమెరా వెనక ఉండటం ఇష్టం’’ అని చెప్పారు గౌతమి. -
అది మా అదృష్టం
‘‘ఏ సినిమానీ చిన్న సినిమా, పెద్ద సినిమా అనలేం. ఆ తేడాలు మాకు లేవు. మంచి కథ చేయడం ముఖ్యం. ప్రాజెక్ట్ కె’ (ఇందులో ప్రభాస్ హీరో) చాలా పెద్ద ప్రాజెక్ట్. కానీ మేము ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో మొదలయ్యాం. మా జీవితం ఓ మలుపు తీసుకుంది ఆ చిత్రంతోనే. సో.. మా వరకు అది బిగ్ ఫిల్మ్. ఓ మంచి కథ చెప్పాలనే ఉద్దేశంతో ‘అన్నీ మంచి శకునములే’ సినిమా తీశాం’’ అన్నారు నిర్మాత స్వప్నాదత్. సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్తో కలిసి ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో నిర్మాతలు స్వప్నా దత్, ప్రియాంకా దత్ చెప్పిన విశేషాలు. ► ‘అన్నీ మంచి శకునములే’ రెండు కుటుంబాల మధ్య జరిగే కథ. మంచి ఎమోషనల్ మూవీ. ఆడియన్స్ కంటతడి పెడతారు. దర్శకురాలు నందిని ఈ కథ చెప్పినప్పుడు అది కున్నూర్ బ్యాక్డ్రాప్లో లేదు. కథ రీత్యా ఆ లొకేషన్స్ అవసరం కాబట్టి అక్కడ తీశాం. హిల్స్టేషన్ బ్యాక్డ్రాప్లో ఓ ఫ్యామిలీ కథ తీయాలనే ఆశ ‘అన్నీ మంచి శకునములే..’తో నెరవేరింది. ఈ సినిమా కోసం నందినీ విక్టోరియా అనే చిన్న ప్రదేశాన్ని సెట్ చేశారు. ఆడియన్స్ని మరో లోకంలోకి తీసుకెళ్లే సినిమా ఇది. ఇక ఈ సినిమాతో సంతోష్ శోభన్కు కొత్త ఇమేజ్ వస్తుందని నమ్ముతున్నాం. తన కెరీర్ మారుతుంది. నందినీ రెడ్డిగారి ‘అలా.. మొదలైంది’ చిత్రం యూత్ఫుల్ ట్రెండ్ సెట్టర్. ‘కళ్యాణ వైభోగమే’ కొత్తగా పెళ్లి చేసుకున్న జంట కథ. ‘ఓ బేబీ’ డిఫరెంట్ స్టోరీ. ఈ కోవలో ‘అన్నీ మంచి శకునములే’ చిత్రం ఓ డిఫరెంట్ ఫ్యామిలీ స్టోరీ. ఆడియన్స్కు ఈ సినిమా నచ్చుతుంది. ► దుల్కర్ పరభాష హీరో, ఖరీదైన లొకేషన్స్, మార్కెట్ ఎదురీత .. ‘సీతారామం’ సినిమా విషయంలో ఇలా ప్రతి అడుగూ ఓ సవాలే. కానీ నమ్మి చేశాం. విజయం సాధించింది. మనం నమ్మింది జరిగిందనే తృప్తి కలిగింది. ► ప్రతి సినిమాపై మాకు ఒత్తిడి ఉంటుంది. మా మనసుకు నచ్చిన కథలనే సినిమాలుగా తీస్తున్నాం. అయితే మేం ఇష్టపడి చేసిన చిత్రాలు ప్రేక్షకుల అభిరుచికి దాదాపుగా మ్యాచ్ కావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ► సినిమా ఇండస్ట్రీలో నాన్నగారు (నిర్మాత అశ్వినీదత్) 50 ఏళ్ళుగా నిలబడ్డారు. ఇప్పుడు ఆయన పిల్లలు సినిమాలు తీస్తున్నారు. ఆయన ఏ రోజూ లెక్కలు వేసుకుని సినిమాలు తీయలేదు. ఈ దారిలో మేం కూడా వెళ్తున్నాం. సినిమాల్లోకి వచ్చామంటే ప్యాషన్తోనే. లెక్కలు వేసుకుంటే సినిమాలు తీయలేం. ► అందరం చర్చించుకునే ఓ జడ్జ్మెంట్కు వస్తాం. ‘జాతిరత్నాలు’ సినిమాను నేను (స్వప్న) ఓటీటీకి అమ్మేద్దాం అన్నాను. కానీ నాగీ (‘మహానటి’ ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్), ప్రియాంక ఆ సినిమాను నమ్మారు. ‘ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది. పోతే మొత్తం పోతుంది. థియేటర్స్లో రిలీజ్ చేద్దాం’ అన్నాడు నాగీ. సినిమా మంచి హిట్ అయింది. ‘మహానటి’ని నేనెక్కువగా నమ్మాను. చాలా బాధ్యతతో ఆ సినిమా చేశాం. నాగీ నిర్ణయాలు మా బ్యానర్కు బలం. ► నిర్మాతలుగా మీరు కష్టపడుతున్నారు. నేను కూడా ఎందుకని మా చెల్లి (స్రవంతి) అన్నారు. ఇంట్లో పిల్లలు సేఫ్గా ఉన్నారు, అమ్మా, చెల్లి చూసుకుంటున్నారనే ధైర్యం ఉండబట్టే మేం సినిమాలు తీస్తున్నాం. -
తగ్గేదే లేదు, స్టార్స్ సినిమాలతో కళ్యాణం కమనీయం పోటీ!
సంతోష్ శోభన్, ప్రియ భవానీ శంకర్ జంటగా నటించిన సినిమా "కళ్యాణం కమనీయం". నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు తెలిపారు దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల. ► నేను పుట్టి పెరిగింది గుంటూరులో. చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఆసక్తి ఉండేది. చదువులు పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చి ప్రయత్నాలు ప్రారంభించాను. వారాహి సంస్థలో తుంగభద్ర చిత్రానికి పనిచేశాను. ఈ లైన్ అనుకున్న తర్వాత నా స్నేహితుడు అజయ్ కుమార్ రాజు ద్వారా యూవీ క్రియేషన్స్ లో పరిచయం ఏర్పడింది. అలా ఈ సినిమాకు అవకాశం దక్కింది. ► యూవీ లాంటి పెద్ద సంస్థలో తొలి చిత్రానికి దర్శకత్వం వహించడం అదృష్టంగా భావిస్తున్నాను. సంక్రాంతికి స్టార్స్ సినిమాలు విడుదలవుతున్నాయి. అయినా మా కంటెంట్ మీద నమ్మకం ఉంది. సినిమా చూసిన సెన్సార్ వారు కూడా మీరు క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు. ► పెళ్లైన తర్వాత మన జీవితాల్లో జరిగే ప్రతి సందర్భం కొత్తదే. అలా ఓ యువ జంట తమ వైవాహిక జీవితం ప్రారంభమయ్యాక ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? వాటి నుంచి ఏం నేర్చుకున్నారు? మళ్లీ ఆ తప్పులు చేయకుండా ఎలా సరిదిద్దుకున్నారు? అనేది అన్ని ఎమోషన్స్తో సినిమాలో చూస్తారు. మన సొసైటీలో అమ్మాయి ఫీలింగ్స్ను మా కథ ప్రతిబింబిస్తుంది. ► నా దృష్టిలో సినిమా అంటే మనల్ని మనం పోల్చుకోవాలి. "కళ్యాణం కమనీయం" అలా రిలేటబుల్ మూవీ. నా జీవితంలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనలు కూడా కథకు స్ఫూర్తినిచ్చాయి. అలా ఎవరి జీవితంలోనైనా ఇలాంటి సందర్భాలు ఎదురుకావొచ్చు. ► దర్శకుడిగా నాకు ఫేవరేట్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. ఎమోషన్ చూపించాలంటే మణిరత్నం, ఒక హైలోకి తీసుకెళ్లాలంటే రాజమౌళి, సొసైటీకి మంచి చెప్పే చిత్రాల విషయంలో శంకర్, యాక్షన్ అంటే బోయపాటి ఇలా చాలా మంది అభిమాన దర్శకులు ఉన్నారు. నాకు రొమాంటిక్ కామెడీతో పాటు యాక్షన్ జానర్ ఇష్టం. త్వరలో నా కొత్త సినిమా వివరాలు చెబుతాను. చదవండి: బిగ్బాస్ విన్నర్కు ప్రైజ్మనీతో పాటు బంగారం -
ఐటెం సాంగ్ చేయడానికి కారణం ఏంటంటే..?
-
అయి బాబోయ్ బ్రహ్మజీ ది మామూలు వెటకారం కాదు..
-
చిరంజీవి చెప్పిన ఆ డైలాగ్ మా సినిమాకు హైప్ తీసుకొచ్చింది
‘‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ కథ హిలేరియస్గా ఉంటుంది. ట్రావెల్ బ్లాగర్స్ అయిన హీరో, హీరోయిన్ ట్రావెల్ వీడియోల చిత్రీకరణ సమయంలో ఎలాంటి ప్రమాదం ఎదుర్కొన్నారు? అనేది ఆసక్తిగా ఉంటుంది. మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకూ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అని మేర్లపాక గాంధీ అన్నారు. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మేర్లపాక గాంధీ మాట్లాడుతూ– ‘‘ఒక యూట్యూబర్ కథ చేస్తే బావుంటుందనే ఆలోచన నుంచే ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ ఐడియా వచ్చింది. ట్రావెల్ బ్లాగర్ కష్టాలు, ప్రమాదాలు, సవాళ్లను ఈ సినిమాలో చూపించాం. ఈ కథలో ప్రతి పదిహేను నిమిషాలకు ఒక చేంజ్ ఓవర్, మలుపు ఉంటుంది. సిట్యువేషనల్ కామెడీ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా ఆయా పాత్రలకు పర్ఫెక్ట్గా సరిపోయారు. ‘వాల్తేరు వీరయ్య’ టీజర్లో చిరంజీవిగారు చెప్పిన ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ డైలాగ్ మా సినిమాకి బాగా హైప్ తీసుకొచ్చింది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారు మేర్లపాక మురళిగారి కథతో ఓ సినిమా చేయాలనుంది. ‘జవాన్’ నిర్మాత కృష్ణగారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్ మెంట్లో నా తర్వాతి చిత్రాలు ఉంటాయి’’ అని చెప్పారు. -
సంతోష్లో నన్ను నేను చూసుకున్నా
‘‘నేను, సంతోష్ శోభన్.. ఇంద్రగంటి మోహనకృష్ణగారి స్కూల్ నుండే వచ్చాం. ‘గోల్కొండ హైస్కూల్’లో సంతోష్ నటన చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను.. పరిణితితో నటించాడు. సంతోష్లో నన్ను నేను చూసుకున్నానని అప్పుడే ఇంద్రగంటితో చెప్పాను’’ అని హీరో నాని అన్నారు. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 4న విడుదలకానుంది. హైదరాబాద్లో జరిగిన ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ– ‘‘సంతోష్ వరుసగా సినిమాలు చేస్తుండటం హ్యాపీ.. తనకు వరుస విజయాలు రావాలి. వెంకట్ బోయనపల్లిగారితో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది’’ అన్నారు. ‘‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ ఘన విజయం సాధించాలి’’ అన్నారు దర్శకుడు మారుతి. ‘‘నానీగారిని తొలిసారి కలిసినప్పుడు ‘నీలో నన్ను చూసుకున్నాను’ అన్నారు.. ఇప్పటి వరకూ నేను అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ అది’’ అన్నారు సంతోష్ శోభన్. ‘‘మేర్లపాక ఈ సినిమాని బాగా తీశాడు’’ అన్నారు వెంకట్ బోయనపల్లి. ‘‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ చాలా వినోదాత్మకంగా ఉంటుంది’’ అన్నారు మేర్లపాక గాంధీ. ‘‘నేను ఒత్తిడిలో ఉన్నప్పుడు మేర్లపాక గాంధీ సినిమాలే చూస్తాను’’ అన్నారు డైరెక్టర్ నందినీ రెడ్డి. ఈ వేడుకలో నటులు బ్రహ్మాజీ, సుదర్శన్, సంగీత దర్శకుడు ప్రవీణ్ లక్కరాజు పాల్గొన్నారు. -
ఇనయ, ఫైమాకు బలుపెక్కువ.. గీతూ ఇడియట్
Bigg Boss Telugu 6, Episode 57: చిట్టి ఫరియా అబ్దుల్లా డ్యాన్స్తో నేడు బిగ్బాస్ ఎపిసోడ్ పండగలా ప్రారంభమైంది. వాసి వాడి తస్సాదియ్యా అంటూ హీరోయిన్తో స్టెప్పులేశాడు మన్మథుడు నాగార్జున. లైక్ షేర్ సబ్స్క్రైబ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఫరియాతో పాటు సంతోష్ శోభన్ కూడా స్టేజీపైకి వచ్చి సందడి చేశాడు. నిన్న ఒకరు ఎలిమినేట్ అయ్యారు. మరి నేడు ఇంకెవరైనా ఎలిమినేట్ అయ్యారా? అసలేం జరిగిందనేది నేటి ఎపిసోడ్ హైలైట్స్లో చూద్దాం.. ఆర్జే సూర్యను శనివారమే డైరెక్ట్ ఎలిమినేట్ చేశాడు నాగ్. ఈరోజు అతడిని స్టేజీపైకి పిలిచాడు. హౌస్లో ఐదు ఫ్లవర్స్ ఎవరు?, ఐదు ఫైర్ బ్రాండ్స్ ఎవరు? అనేది చెప్పమన్నాడు. రేవంత్ ఫ్లవర్ అని.. ఓటమిని స్పోర్టివ్గా తీసుకోవాలని సూచించాడు. గీతూ కూడా ఫ్లవర్ అని.. నీ గేమ్ నువ్వు ఆడితే నీకు తిరుగే లేదన్నాడు. శ్రీహాన్కు గేమ్ మీద క్లారిటీ ఉందని, బాలాదిత్య మంచితనం అతడి గేమ్ను ఆపేస్తోందంటూ వారిద్దరినీ ఫ్లవర్ కేటగిరీలో చేర్చాడు. ఫైర్ కేటగిరీలో ఫైమా, ఇనయ, రాజ్, కీర్తిలను చేర్చాడు సూర్య. మొదట్లో ఇనయతో ఎక్కువ గొడవలయ్యేవని, పదేపదే తిట్టుకునేవాళ్లమని గుర్తు చేసుకున్నాడు. వెళ్లిపోతున్నా కాబట్టి నా గేమ్ కూడా నువ్వే ఆడి టాప్ 5లో ఉండాలని ఇనయకు చెప్పాడు. ఇక ఇనయ అందుకుంటూ నీకోసం మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నానంటూ కొరియన్ లవ్ సింబల్ చూపించింది. వీళ్ల సైన్ లాంగ్వేజ్ అర్థం కాక నాగార్జున నెత్తి పీక్కున్నాడు. కొంచెం కూడా నెగెటివిటీ లేని పర్సన్ రాజ్ అని కితాబిచ్చాడు సూర్య. నువ్వెలా ఆడుతున్నావో అలాగే ఆడంటూ కీర్తికి సలహా ఇచ్చాడు. తర్వాత అందరికీ వీడ్కోలు చెప్పాడు. సూర్య వెళ్లిపోగానే లైక్ షేర్ సబ్స్క్రైబ్ హీరోహీరోయిన్లు సంతోశ్ శోభన్, ఫరియా అబ్దుల్లా స్టేజీపైకి వచ్చి సందడి చేశారు. హౌస్మేట్స్తో ఒక ఫన్ గేమ్ ఆడించారు. ఎప్పటిలాగే గెస్ట్గా వచ్చిన హీరోయిన్ కోసం పాట పాడాడు సింగర్ రేవంత్. ఆ పాటతో ఫిదా అయిన ఫరియా, సంతోశ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత మరో టాస్క్ ఇచ్చారు. అందులో భాగంగా కొన్ని నేమ్ప్లేట్లను ఇంటిసభ్యులకు అంకితమివ్వాలన్నాడు నాగ్. గీతూకు రచ్చ ట్యాగ్ ఇచ్చింది మెరీనా. శ్రీహాన్ అపరిచితుడు అని కీర్తి ట్యాగ్ ఇచ్చింది. ఇనయ మహానటి అని శ్రీహాన్.. శ్రీహాన్ కన్నింగ్ అని ఇనయ చెప్పుకొచ్చారు. కీర్తి శ్వేతనాగు అంది శ్రీసత్య. బాలాదిత్య వకీల్ సాబ్ అన్నాడు రేవంత్. ఆదిరెడ్డి దొంగ అని చెప్పింది గీతూ. ఇనయకు బలుపు అని వాసంతి, రాజ్ టైంపాస్ అని ఫైమా అంది. గీతూ.. ఆడంతే అదో టైపు అన్నాడు ఆది రెడ్డి. ఫైమాకు బలుపెక్కువ అన్నాడు రాజ్. గీతూ ఇడియట్ అన్నాడు బాలాదిత్య. ఇకపోతే నామినేసన్లో ఉన్న అందరూ సేఫ్ అయిపోగా చివరగా ఆది, మెరీనా మాత్రమే మిగిలారు. ఎక్కడ ఆది ఎలిమినేట్ అవుతాడోనని గుక్కపెట్టి ఏడ్చింది గీతూ. నన్ను అర్థం చేసుకునేవాళ్లే ఉండరంటూ శోకం అందుకోగా ఆమెను ఆపడం ఎవరితరం కాలేదు. మరోవైపు మెరీనా వెళ్లిపోతే తనకు మంచిమంచి బట్టలు పంపు అని భార్యను ఆదేశించాడు రోహిత్. అయితే నాగ్ మాత్రం... నో ఎలిమినేషన్, ఇద్దరూ సేఫ్ అని ట్విస్ట్ ఇచ్చాడు. ఈ సర్ప్రైజ్తో హౌస్మేట్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. చదవండి: వరల్డ్ బిగ్గెస్ట్ ఫెమినిస్ట్.. ఫ్రీ హగ్స్ అమ్మ కోసం రూ.80 లక్షలు ఖర్చు పెట్టిన శ్రీసత్య -
ఆ లోపు పాన్ వరల్డ్ హీరోయిన్ కావాలి: ఫరియా అబ్దుల్లా
‘‘జాతిరత్నాలు’ లో నేను చేసిన చిట్టి పాత్రని అందరూ అభిమానించారు. ఈ విషయంలో ఆనందంతో పాటు బాధ్యత కూడా పెరిగింది. ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ సినిమాలో చిట్టి కాదు.. నేను చేసిన వసుధ పాత్ర మాత్రమే కనిపిస్తుంది’’ అని ఫరియా అబ్దుల్లా అన్నారు. సంతోష్ శోభన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 4న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ– ‘‘నాకు ప్రయాణం అంటే చాలా ఇష్టం. ఈ చిత్ర కథ ప్రయాణం నేపథ్యంలో ఉంటుంది. నేను ట్రావెల్ వ్లాగర్గా కనిపిస్తాను. నా నిజ జీవితంలో మొదటి విదేశీ ప్రయాణం ఈ సినిమా వల్లే జరిగింది. థాయిలాండ్లో ఒక పాట షూటింగ్ చేయడం మరచిపోలేని జ్ఞాపకం. ఈ సినిమా షూటింగ్ కోసం 20రోజులు అడవిలోనే ఉన్నాం. మొబైల్ సిగ్నల్ కూడా లేదు. ఈ మూవీలో యాక్షన్, చేజింగ్ సీన్లు కూడా ఉన్నాయి. మొత్తంగా ఈ మూవీ ‘ఖత్రోన్ కే ఖిలాడీ’ లాంటి మంచి అనుభవం ఇచ్చింది (నవ్వుతూ). ‘జాతిరత్నాలు’ సినిమాలాగానే ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. నేను హీరోయిన్గా నటించిన ‘జాతిరత్నాలు, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ చిత్రాల ట్రైలర్స్ని ప్రభాస్గారు విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నా. సంతోష్ శోభన్ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. మేర్లపాక గాంధీగారితో పని చేయడం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మరో ఐదేళ్లలో పాన్ వరల్డ్ స్థాయిలో నాకు గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. నాకు దర్శకత్వంపై ఆసక్తి ఉంది.. అందుకు మరో పదేళ్లు పడుతుంది. ప్రస్తుతం రవితేజగారితో ‘రావణాసుర’, ఓ తమిళ్ మూవీ, ఓ హిందీ వెబ్ సిరీస్లో నటిస్తున్నా’’ అన్నారు. -
‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉంటారు
సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’. బ్రహ్మాజీ, సుదర్శన్ కీలక పాత్రలు చేశారు. వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 4న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ను ప్రభాస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా సంతోష్ శోభన్ మాట్లాడుతూ– ‘‘కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు’’ అన్నారు. ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. ప్రారంభం నుంచి చివరి వరకు నవ్వుతూనే ఉంటారు’’ అన్నారు మేర్లపాక గాంధీ. ‘‘జాతిరత్నాలు’ తర్వాత అందరూ నన్ను చిట్టీ అని పిలుస్తున్నారు. ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ చూశాక నేను చేసిన వసుధ పాత్రే గుర్తుంటుంది’’ అన్నారు ఫరియా అబ్దుల్లా. ‘‘ఈ నెల 29న మా సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నాం’’ అన్నారు వెంకట్ బోయినపల్లి. నటులు బ్రహ్మాజీ, సుదర్శన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకటరత్నం పాల్గొన్నారు. -
'లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్'మూవీ ప్రమోషన్ లో ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)
-
'లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్' మూవీ ట్రైలర్ను రిలీజ్ చేసిన ప్రభాస్
సంతోష్ శోభన్, జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా హీరో,హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ (LikeShareSubscribe).మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను వెంకట్ బోయినపల్లి నిర్మించారు. నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ ప్రారంభించిన మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ను వదిలారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డిజిటల్ వేదికగా ఈ సినిమా ట్రైలర్ను లాంచ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం కామెడీగా, ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ గా సాగింది. ఈనెల 29న ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించనున్నారు. -
ఆసక్తి పెంచుతున్న సంతోష్ శోభన్ కొత్త మూవీ టైటిల్, ఫస్ట్లుక్
విభిన్న కథలను ఎంచుకుంటూ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తు వస్తున్నాడు యంగ్ హీరో సంతోష్ శోభన్. గోల్కొండ హై స్కూల్ చిత్రంలో వెండితెర ఎంట్రీ ఇచ్చిన సంతోష్ తను నేను చిత్రంలో హీరోగా మారాడు. ‘ఏక్ మినీ కథ’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకు సంతోష్ శోభన్ తాజాగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం అప్డేట్ వదిలారుమ మేకర్స్. ఈ సినిమాకు ‘లైక్ షేర్ అండ్ సబ్స్రైబ్’ అనే టైటిల్ను ఖరారు చేస్తూ ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేసింది చిత్ర బృందం. కొత్తగా ఉన్న ఈ టైటిల్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం ఈ మూవీ ఫస్ట్లుక్, టైటిల్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. చదవండి: జూ.ఎన్టీఆర్-కొరటాల చిత్రంలో అలనాటి లేడీ సూపర్ స్టార్? కాగా ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతీ రత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా నటిస్తోంది. ఇక టైటిల్తో పాటు విడుదల చేసిన ఈ ఫస్ట్లుక్ పోస్టర్లో సంతోష్ శోభన్, ఫరియా, సుదర్శన్ ముగ్గురు పైకి చూస్తూ కనిపించారు. ఇక సంతోష్కు బ్లాక్బస్టర్ హిట్ అందించిన ‘ఏక్ మినీ కథ’ చిత్రాన్ని కథ అందించిన మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అడ్వేంచరస్ ట్రావెల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నాడు. నిహారిక ఎంటర్టైనమెంట్స్ బ్యానర్పై వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. An Adventurous Travel Tale filled with Joy, Thrill & Entertainment 💯😃🤞 Presenting the First Look of 𝗟𝗜𝗞𝗘👍 𝐒𝐇𝐀𝐑𝐄 🔁 & 𝑺𝑼𝑩𝑺𝑪𝑹𝑰𝑩𝑬🔔#LSS ❤️🔥@santoshshobhan @fariaabdullah2 @MerlapakaG @vboyanapalli @Plakkaraju @Ram_Miriyala #AamukthaCreations @saregamasouth pic.twitter.com/DxX0yHaDvT — Niharika Entertainment (@NiharikaEnt) September 5, 2022 -
సమంత పరిచయం చేసిన 'శ్రీదేవి శోభన్బాబు'.. ఇంతకీ ఆ ఇల్లు ఎవరిది ?
Samantha Launched Santosh Shoban Sridevi Shoban Babu Movie Teaser: ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలతో తనదైన నటనతో మెప్పిస్తున్నాడు యంగ్ హీరో సంతోశ్ శోభన్. పేపర్ బాయ్, ఎక్ మినీ కథ, మంచి రోజులొచ్చాయి సినిమాలతోపాటు 'బ్యూటీ అండ్ ది బేకర్' వెబ్ సిరీస్లో అలరించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు. వరుస సినిమాలపై దృష్టి పెట్టి కెరీర్కు మంచి రోజులు వచ్చేలా మలుచుకుంటున్నాడు. ప్రస్తుతం సంతోష్ శోభన్ నటిస్తున్న తాజా చిత్రం 'శ్రీదేవి శోభన్బాబు'. ప్రశాంత్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో గౌరి జి. కిషన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా టీజర్ను స్టార్ హీరోయిన్ సమంత బుధవారం (ఏప్రిల్ 6) సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేసింది. 'ఈరోజు మనం చెప్పుకోబోయే చిత్రం..' అంటూ వాయిస్ ఓవర్తో ప్రారంభమైన ఈ టీజర్ ఆద్యంత ఆసక్తిగా సాగింది. రేడియోలో స్టోరీ చెబుతున్నట్లుగా పాత్రలను పరిచయం చేసిన విధానం ఆకట్టుకునేలా ఉంది. సంతోష్ శోభన్, గౌరి నటన బాగుంది. 'నా ఇల్లు పట్టుకుని నీ ఇల్లు అంటావేంటీ' అని హీరో చెప్పే డైలాగ్ నవ్వు తెప్పించేలా ఉంది. టీజర్ చూస్తుంటే ఈ మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్లా అనిపిస్తోంది. కమ్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నాగబాబు, రోహిణి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మిస్తున్నారు. -
తొలి లిరికల్ సాంగ్తో 'ప్రేమ్ కుమార్' వచ్చేశాడు..
Santosh Shoban Prem Kumar Movie First Lyrical Song Out: పేపర్ బాయ్, ఎక్ మినీ కథ, మంచి రోజులొచ్చాయి సినిమాలతోపాటు 'బ్యూటీ అండ్ ది బేకర్' వెబ్ సిరీస్లో అలరించిన యంగ్ హీరో సంతోష్ శోభన్. వరుస సినిమాలపై దృష్టి పెట్టి కెరీర్కు మంచి రోజులు వచ్చేలా మలుచుకుంటున్నాడు. ప్రస్తుతం సంతోష్ శోభన్ నటిస్తున్న చిత్రం 'ప్రేమ్ కుమార్'. రాశీ సింగ్, కృష్ణ చైతన్య, రుచిత కీలక పాత్రధారులుగా నటిస్తున్న ఈ సినిమాకు అభిషేక్ మహర్షి దర్శకత్వం వహిస్తున్నారు. శివ ప్రసాద్ పన్నీరు నిర్మాత కాగా ఎస్. అనంత్ శ్రీకర్ సంగీతం అందిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ను ప్రారంభించిన ఈ మూవీ యూనిట్ తొలిపాటను విడుదల చేసింది. 'నీలాంబరం చూసి నీ కళ్లలో మేఘామృతం.. జారే నా గుండెలో' అంటూ సాగే సాంగ్ను శనివారం (ఫిబ్రవరి 5)న రిలీజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి ఆలపించిన ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ లిరిక్స్ రాశారు. మెలోడీ సాంగ్ అయిన 'నీలాంబరం' సంగీత ప్రియులను ఆకట్టుకుంటుందని నిర్మాత శివ ప్రసాద్ పన్నీరు తెలిపారు. టైటిల్ రోల్లో సంతోష్ శోభన్ కనిపిస్తాడని, పీటల మీద పెళ్లి ఆగితే ప్రేమ్ కుమార్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడన్నదే సినిమా కథ అని డైరెక్టర్ అభిషేక్ మహర్షి పేర్కొన్నారు. -
ఆ అదృష్టం అందరికి రాదు: సంతోష్ శోభన్
‘‘ఇండస్ట్రీలో ఉండగలననే ఆత్మవిశ్వాసం వచ్చింది కానీ ఇండస్ట్రీలో సెటిలైపోయామనే కాన్ఫిడెన్స్ నాకు లేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎప్పుడూ ఓ కొత్త పర్సన్కు చోటు ఉంటుంది. రిలాక్స్ అయిపోతే మన అవకాశాలు వేరే వాళ్లకు వెళతాయి. అందుకే ప్రతి రోజూ ఓ పోరాటంగానే భావిస్తాను’’ అన్నారు సంతోష్ శోభన్. మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. యూవీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్, వి సెల్యూలాయిడ్, ఎస్కేఎన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా సంతోష్ శోభన్ చెప్పిన విశేషాలు. ⇔ భయం, ఆందోళన నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది. భయానికి మన లైఫ్లో ఎంత చోటు ఇవ్వాలనే అంశాన్ని వినోదాత్మకంగా చెప్పాం. మారుతి అన్న స్టైల్ ఆఫ్ హ్యూమర్ ఈ సినిమాలోనూ ఉంటుంది. నవ్విస్తూనే ఆయన చెప్పాలనుకున్నది చెబుతారు. ⇔ నాకు ఓటీటీ, థియేటర్స్ అనే లెక్కలు లేవు. యాక్టింగ్లో నాకు టీవీ అయినా ఓకే. స్క్రిప్ట్ నచ్చితే సినిమా అయినా, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అయినా ప్రాజెక్ట్స్ చేస్తాను. నిజానికి సినిమాల్లోకి రాకముందు వెబ్ సిరీస్లు, వెబ్ షో చేశాను. కాకపోతే పెద్దగా ఎవరికీ తెలియదు. ⇔ నాకు కొంచెం సిగ్గు. లిప్లాక్ సీన్స్ నా దృష్టిలో కష్టమైనవి. కానీ నటనలో ఇదో భాగం. ఎంత నార్మల్గా, ఎంత ప్రొఫెషనల్గా డీల్ చేస్తే అంత మంచిది. మారుతిలాంటి దర్శకుడితో చేసినప్పుడు ఏ సీన్స్ అయినా ఈజీ అయిపోతాయి. డైరెక్టర్ చెప్పింది చేస్తే చాలు. ⇔ మనకు పని లేనప్పుడు మనకు ఇష్టమైన పని దొరికితే అవే మంచి రోజులు. నా లైఫ్లో స్ట్రగుల్ను కూడా ఎంజాయ్ చేసాను. ప్రస్తుతం నందినీ రెడ్డిగారి దర్శకత్వంలో, సుష్మితాగారి ప్రొడక్షన్లో, మళ్లీ యూవీ కాన్సెప్ట్స్తో సినిమాలు చేస్తున్నాను. ⇔ మా నాన్న (ప్రభాస్ ‘వర్షం’ చిత్ర దర్శకుడు శోభన్) గురించి ఇండస్ట్రీలో ఉన్న పాజిటివ్ వైబ్స్ నాపై కూడా ప్రతిబింబిస్తున్నాయి. ఇది అందరికీ దొరికే అదృష్టం కాదు. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు యాక్టింగ్ చాన్స్ వస్తే, వెళ్లమని అమ్మ అన్నారు. నా 23 ఏళ్ల వరకు ఫ్యామిలీని సపోర్ట్ చేసేంత డబ్బు సంపాదించలేదు. ఇప్పుడు నా వంతు నేను చేస్తున్నాను. నా బ్రదర్ కూడా మంచి యాక్టర్... రెండు ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యాడు. -
'ఓ బేబీ'లో సమంత లాంటి రోల్ చేయాలనుంది: మెహ్రీన్
‘‘చిన్న సినిమా, పెద్ద సినిమా.. అనే తేడాలు చూడను.. నాకు అవకాశం వచ్చిన సినిమాలన్నీ పెద్ద సినిమాలనే భావించి నటిస్తాను’’ అని హీరోయిన్ మెహరీన్ అన్నారు. సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. యూవీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ పతాకాలపై వి సెల్యూలాయిడ్, ఎస్కేఎన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా మెహరీన్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మంచి రోజులు వచ్చాయి’లో సాఫ్ట్వేర్ పద్దు పాత్రలో కనిపిస్తాను. ఇది ఓ కాలనీలో జరిగే కథ. ఇందులోని సన్నివేశాలు, పరిస్థితులను చాలామంది కోవిడ్ టైమ్లో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. సాధారణంగానే నేను ఫన్నీగా ఉంటాను. అందుకే అల్లరి సీన్స్, కామెడీ సీన్స్లో నటించడం ఈజీగా అనిపిస్తుంది. మా ఇంట్లో మా అమ్మ, నేను కరోనా బారిన పడి, కోలుకున్నాం. ‘మహానటి’లో కీర్తీ సురేశ్, ‘ఓ బేబీ’లో సమంత లాంటి పాత్రలు చేయాలని ఉంది. ప్రస్తుతం తెలుగులో ‘ఎఫ్ 3’, కన్నడలో శివరాజ్కుమార్తో ఓ సినిమా చేస్తున్నాను. మరికొన్ని తెలుగు కథలు విన్నాను.. త్వరలో వివరాలు వెల్లడిస్తాను’’ అన్నారు. -
‘మంచి రోజులోచ్చాయి’ ట్రైలర్ వచ్చేసింది
మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. కామెడీ, ఎంటర్టైన్మెంట్తో రూపొందుతోన్న ఈ మూవీ ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్, టీజర్లు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని వచ్చే నెల 4వ తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ‘మై వాట్సాప్ అంకుల్స్ అండ్ యూట్యూబ్ ఆంటీస్.. నా పేరు సంతోష్.. ఆనందానికి కేరాఫ్ అడ్రెస్.. వీడు అనేది నా ట్యాగ్లైన్’ అంటూ సంతోష్ శోభన్ తనను తాను పరిచయం చేసే సన్నివేశంతో ట్రైలర్ మొదలైంది. ఇక ‘నా కూతురు లాంటి కూతురిని కన్న ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాల్సిందే.. అంటూ అశిష్ ఘోష్ మెహ్రీన్ గురించి చెప్పే సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. కాగా ఎస్కేఎన్, వీ సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, సప్తగిరి, వైవా హర్ష, అశిష్ ఘోష్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. -
‘మంచి రోజులు వచ్చాయి’ లిరికల్ సాంగ్ వచ్చేసింది..
యువ హీరో సంతోష్ శోభన్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమా రూపొందింది. ఇందులో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్గా నటిస్తోంది. వి.సెల్యులాయిడ్, ఎస్.కె.ఎన్ బ్యానర్లో రూపొందుతున్న ఈ మూవీ నుంచి తాజాగా లిరికల్ వీడియో సాంగ్ను విడుదల చేశారు మేకర్స్. సాయిధరమ్ తేజ్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన ఈ సాంగ్ ‘సో సోగా ఉన్నాననీ .. సో స్పెషలే చేశావులే' అంటూ సాగుతోంది. Here's foot tapping melody #SoSoGa song frm #ManchiRojulochaie launched by @IamSaiDharamTejhttps://t.co/G8yIKanZyK 🎙️@sidsriram 🖊️@kk_lyricist 🎹@anuprubens@DirectorMaruthi @santoshshobhan @Mehreenpirzada @vcelluloidsoffl @SKNonline @UVConcepts_ @massmoviemakers @adityamusic pic.twitter.com/ZexQmVfhYa — BA Raju's Team (@baraju_SuperHit) August 16, 2021 అనూప్ రూబెన్స్ సంగీతం, కేకే సాహిత్యం, సిద్ శ్రీరామ్ అలాపన ఈ పాటకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యూత్ను ఆకట్టుకునే బీట్తో అనూప్ బాణీ కట్టిన ఈ పాట ‘తనువులు వేరైనా మన ఊపిరి ఒకటే .. ఊహలు ఒకటే . దారులు ఒకటే’ అంటూ సాగింది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మెహ్రీన్కు ‘మంచి రోజులు వచ్చాయి’..త్వరలోనే అనౌన్స్మెంట్
హీరోయిన్ మెహ్రీన్కు మంచి రోజులు వచ్చాయి. ఆమెకు మంచి రోజులు రావడం ఏంటి అనే కదా మీ సందేహం. మరేం లేదండి..రీసెంట్గా మెహ్రీన్ నటిస్తున్న సినిమాకు ఖరారు చేసిన టైటిల్ అది. ప్రస్తుతం ఎఫ్3 సినిమాతో పాటు మారుతి దర్శకత్వంలో మెహ్రీన్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'ఏక్ మినీ కథ' సినిమాతో యూత్లో మంచి క్రేజ్ సంపాదిచుకున్న కుర్ర హీరో సంతోష్ శోభన్తో మెహ్రీన్ జతకట్టింది. తాజాగా ఈ చిత్రానికి ‘మంచి రోజులు వచ్చాయి’ అనే టైటిట్ను ఖరారు చేశారు. ఈ మేరకు మూవీ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్స్లో సందడి చేయనుంది. విడుదల తేదీపై త్వరలోనే ప్రకటన రానుంది. నిజజీవిత పాత్రలను స్పూర్తిగా తీసుకుని యూత్ఫుల్ ఎంటర్ టైనర్గా ఈ చిత్రం రూపొందించినట్లు తెలుస్తుంది. ఎస్కేఎన్-వీ సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ప్రస్తుతం మెహ్రీన్ చేతిలో ఎఫ్3 తప్పా పెద్ద సినిమాలు లేవు. మరోవైపు 'ఏక్ మినీ కథ' సినిమాతో హిట్ కొట్టిన సంతోష్ చేతిలో నందినీరెడ్డి సినిమాతో పాటు మరో రెండు సినిమాలు ఉన్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
'అన్నీ మంచి శకునములే' అంటోన్న నందినీ రెడ్డి
'ఏక్ మినీ కథ' సినిమాతో హిట్ కొట్టిన కుర్ర హీరో సంతోష్ శోభన్. ఈ మూవీ సక్సెస్తో జోష్ మీదున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు మరో క్రేజీ మూవీతో ముందుకు వస్తున్నాడు. నందినీ రెడ్డి దర్వకత్వంలో ఓ మూవీ సైన్ చేసినట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రూమర్స్ను నిజం చేస్తూ నందినీ రెడ్డి ఈ ప్రాజెక్టును అఫిషియల్గా అనౌన్స్ చేసింది. తాను డైరెక్ట్ చేసిన ఓ బేబీ సినిమా రెండేళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తన కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేయడం సంతోషంగా ఉందని నందినీ రెడ్డి ఇన్స్టాగ్రామ్లో పేర్కొంది. ఇక ఈ సినిమాకు 'అన్నీ మంచి శకునములే' అనే క్రేజీ టైటిల్ను ఖరారు చేశారు. ఈ మేరకు మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్ . స్వప్న సినిమా, మిత్ర వింద మూవీస్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. సంతోష్ శోభన్కు జంటగా మళవిక నాయర్ హీరోయిన్గా నటించనుంది. మిక్కీ జె మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే హీరో సంతోష్ శోభన్.. మారుతి దర్శకత్వంలో ఓ ప్రాజెక్టుకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. మెహ్రీన్ హీరోయిన్గా నటించనుంది. -
Kavya Thapar: ఆల్రౌండర్ అనిపించుకోవాలని ఉంది
‘‘తెలుగులో నా తొలి సినిమా ‘ఈ మాయ పేరేమిటో’ తర్వాత మరో సినిమా చేయడానికి కొంత సమయం పట్టింది. దానికి కారణం తమిళంలో ‘మార్కెట్ రాజా ఎమ్బీబీఎస్’ అనే సినిమాతో పాటు హిందీలో ఒక సినిమా చేయడమే. ఇకపై తెలుగులో ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్లో కీలక పాత్ర చేస్తున్నాను’’ అని అన్నారు కావ్యా థాపర్. సంతోష్ శోభన్ హీరోగా కార్తీక్ రాపోలు దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించిన ‘ఏక్ మినీ కథ’లో ఆమె కథానాయికగా నటించారు. ఇటీవల ఓటీటీ ప్లాట్ఫామ్లో సినిమా విడుదలైన సందర్భంగా కావ్యా థాపర్ మాట్లాడుతూ – ‘‘ఏక్ మినీ కథ’లో జీవితంలో సౌకర్యంగా ఉండాలనుకుంటూ నిజాయతీ గల అమ్మాయి అమృత పాత్రలో నటించాను. నా పాత్రకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఈ చిత్రం బోల్డ్ కంటెంట్తో ఉంటుంది. కానీ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్న రోజులు ఇవి. ఎవర్నీ కించరపరచాలని కాదు.. అవగాహన కలిగించాలనే సంకల్పంతో తీసిన చిత్రం ఇది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘ఒక నటిగా నేను అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటున్నాను. సినిమా, వెబ్ సిరీస్ అనే తేడా చూడటం లేదు. యాక్టర్గా ఆల్ రౌండర్ అనిపించుకోవాలనుకుంటున్నాను. అందుకోసం కష్టపడతాను. ప్రస్తుతం నాకు తెలుగు అర్థం అవుతోంది. త్వరలో స్పష్టంగా మాట్లాడతాను’’ అన్నారు. -
Santosh Shobhan: నవ్వించే ప్రేమ్ కుమార్
సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘ప్రేమ్ కుమార్’ అనే టైటిల్ ఖరారైంది. అభిషేక్ మహర్షిని దర్శకుడిగా పరిచయం చేస్తూ శివప్రసాద్ పన్నీరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశీ సింగ్ హీరోయిన్. అభిషేక్ మహర్షి మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమా పతాక సన్నివేశాల్లో హీరో వచ్చి స్పీచ్లు ఇచ్చి హీరోయిన్ను పెళ్లి చేసుకుంటాడు. అయితే అదే పెళ్లి పీటల మీద ఉన్న పెళ్లికొడుకును ఎవరూ పట్టించుకోరు. అటువంటి ఓ పెళ్లికొడుకు తనకు పెళ్లి అవ్వడం లేదనే ఫ్రస్ట్రేషన్లో ఏం చేశాడనేది కథ’’ అన్నారు. శివప్రసాద్ మాట్లాడుతూ – ‘‘అభిషేక్ మహర్షి, రచయిత అనిరుధ్ కృష్ణమూర్తి చక్కటి కథ రాశారు. కథనం నవ్విస్తుంది. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. లాక్డౌన్ తర్వాత మిగతా పూర్తి చేసి, ఆ తర్వాత పరిస్థితులను బట్టి విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. -
స్పీడు పెంచిన 'ఏక్ మినీ కథ' హీరో.. ఆ డైరెక్టర్తో నెక్స్ట్ సినిమా!
'ఏక్ మినీ కథ' సినిమాతో క్రేజ్ సంపాదించుకున్న కుర్ర హీరో సంతోష్ శోభన్. ప్రస్తుతం ఈయనకు యూత్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో ఇప్పటికే ఆయనకు పలు సినీ అవకాశాలు వస్తున్నాయి. తాజాగా నందిని రెడ్డి సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు ఫిల్మ్నగర్ టాక్. ఓ బేబీతో హిట్ కొట్టిన నందినీ రెడ్డి ఆ తర్వాత ఇంతవరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేయలేదు. అయితే నాగచైతన్యతో ఓ సినిమా చేస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చినా ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇవి కాకుండా వైజయంతీ మూవీస్ బ్యానర్, గీతా అర్ట్స్ బ్యానర్లోనూ సినిమాలు చేసేందుకు నందినీరెడ్డి సైన్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం నాగచైతన్య ‘థ్యాంక్యూ’, లాల్ సింగ్ చద్దా సినిమాలతో సినిమాలతో బిజీగా ఉన్నారని, ఇవి పూర్తయ్యాకే నందినీ రెడ్డితో మూవీ ఉండనున్నట్లు సమాచారం. దీంతో ఈ గ్యాప్లో హీరో సంతోష్ శోభన్కు నందినీ కథ చెప్పినట్లు సమాచారం. 'తను నేను' .. 'పేపర్ బాయ్' సినిమాలతో గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ రీసెంట్గా 'ఏక్ మినీ కథ'తో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. దీంతో ఈ యంగ్ హీరోతోనే నందినీ రెడ్డి తర్వాతి సినిమా ఉండనుందని, త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం. చదవండి : ‘ఏక్ మినీ కథ’ హీరోకు లక్కీ ఛాన్స్.. అదే బ్యానర్లో మరో 3 సినిమాలు -
‘ఏక్ మినీ కథ’ హీరో దూకుడు.. మరో 3 సినిమాలకు సంతకం
యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ బ్యానర్. ఇటీవల ఈ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ అనే చిన్న బ్యానర్ను స్థాపించిన సంగతి తెలిసిందే. ఇందులో యూవీ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తూ.. దీని ద్వారా తొలి సినిమాగా ‘ఏక్ మినీ కథా’ నిర్మించింది. ఇటీవల అమెజాన్ ప్రైమ్లో విడుదలైన ఈ మూవీకి మంచి స్పందన వస్తోంది. ఇక యూవీ కాన్సెప్ట్స్ భవిష్యత్తులో మరిన్ని సినిమాలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది కూడా. ఈ మూవీలో హీరోగా నటించిన సంతోష్ శోభన్ ఈ బ్యానర్లో మరో మూడు చిత్రాలకు సంతకం చేశాడట. మంచి హిట్టు కోసం ఎదురుచూస్తున్న సంతోష్ శోభన్కు యూవీ కాన్సెప్ట్స్లో మరో 3 సినిమాలు చేసే అవకాశం రావడం లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. -
ఒక చిన్న కథ
‘పేపర్ బాయ్’ సినిమా ఫేమ్ సంతోష్ శోభన్, కావ్యా తప్పర్ జంటగా నటించిన చిత్రం ‘ఏక్ మినీ కథ’. కార్తీక్ రాపోలు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించడం విశేషం. హీరో ప్రభాస్ ఈ సినిమా ట్రైలర్ని తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘శోభన్ దర్శకత్వంలో వచ్చిన ‘వర్షం’ చిత్రం నా కెరీర్లో ఓ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇలాంటి విజయాన్ని అందించిన శోభన్గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. శోభన్ తనయుడు సంతోష్ నటించిన ‘ఏక్ మినీ కథ’ విడుదలవుతున్న సందర్భంగా నా స్నేహితులైన యూవీ క్రియేష¯Œ ్స నిర్మాతలకు, ఈ చిత్రబృందానికి శుభాకాంక్షలు’’ అన్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా నిర్మించిన ‘ఏక్ మినీ కథ’ ఈ నెల 27 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రవర్గాలు మాట్లాడుతూ– ‘‘యూత్ఫుల్ అండ్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం ‘ఏక్ మినీ కథ’. మా సినిమా ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ట్రైలర్లో కమెడియన్ సుదర్శన్ పంచ్ డైలాగ్లు, సంతోష్ శోభన్ పలికించిన హావభావాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి’’ అన్నారు. -
ఏక్ మినీ కథ: సామిరంగా సాంగ్ రిలీజ్
‘పేపర్ బాయ్’ సినిమా ఫేమ్ సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఏక్ మినీ కథ’. కార్తీక్ రాపోలు దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ అయిన యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా బ్యానర్స్పై రూపొందుతోన్న చిత్రమిది. కావ్యా థాపర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ‘సామిరంగా..’ అంటూ సాగే పాట విడుదల చేశారు. ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా’ లాంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి కథ అందించారు. ‘‘ఈ మధ్యే విడుదలైన ‘ఈ మాయలో..’ లిరికల్ సాంగ్కి మంచి స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన ‘సామిరంగా..’ అతి కొద్ది సమయంలోనే సోషల్ మీడియాలో విశేష స్పందన అందుకుంటూ చాట్ బస్టర్గా మారింది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు. చదవండి: సినిమాల్లోకి రంభ రీఎంట్రీ.. ఫొటోలు, ఫ్లెక్సీలతో హల్చల్! -
‘పేపర్ బాయ్’ మూవీ రివ్యూ
టైటిల్ : పేపర్ బాయ్ జానర్ : రొమాంటిక్ ఎంటర్టైనర్ తారాగణం : సంతోష్ శోభన్, రియా సుమన్ , తాన్య హోపే సంగీతం : భీమ్స్ సిసిరొలియో రచన : సంపత్ నంది దర్శకత్వం : జయశంకర్ నిర్మాత : సంపత్ నంది, రాములు, వెంకట్, నరసింహా మాస్ మసాలా చిత్రాల దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సంపత్ నంది నిర్మాతగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తను నేను ఫేం సంతోష్ శోభన్ హీరోగా సంపత్ నంది నిర్మాణంలో జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ పేపర్ బాయ్. ఈ సినిమా ట్రైలర్పై మహేష్ బాబు, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు ప్రశంసలు కురిపించటంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. మరి ఆ అంచనాలను పేపర్ బాయ్ అందుకున్నాడా..? సంతోష్ శోభన్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడా..? సంపత్ నంది నిర్మాతగా విజయం సాధించాడా..? కథ ; రవి (సంతోష్ శోభన్) బీటెక్ చదివినా కుటుంబ పరిస్థితుల కారణంగా పేపర్ బాయ్గా పనిచేస్తుంటాడు. తన లాంటి ఆలోచనలే ఉన్న ధరణి (రియా సుమన్) అనే పెద్దింటి అమ్మాయిని ఇష్టపడతాడు. రవి మంచి తనం విలువలు గురించి తెలుసుకున్న ధరణి కూడా రవిని ఇష్టపడుతుంది. కూతురి ప్రేమకు గౌరవమిచ్చిన ధరణి తల్లిదండ్రులు తమ అంతస్తును పక్కన పెట్టి ఆటో డ్రైవర్ కొడుకు, పేపర్ బాయ్ అయిన రవితో పెళ్లికి ఓకె చెప్తారు. కానీ అనుకోని పరిస్థితుల్లో రవి, ధరణి దూరమవుతారు. వారి విడిపోవడానికి కారణాలేంటి..? వీరి ప్రేమకథకు ముంబైలో ఉండే మేఘ (తాన్యా హోపే)కు సంబంధం ఏంటి..? రవి, ధరణిల ప్రేమకథ ఎలా ముగిసింది..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; రెండో సినిమానే ఎంతో బరువైన పాత్రను ఎంచుకున్న సంతోష్ శోభన్ ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. లవర్ బాయ్గా కనిపిస్తూనే ఎమోషనల్ సీన్స్లో కంటతడి పెట్టించాడు. బాధ్యత గల కుర్రాడి పాత్రలో కనిపించిన సంతోష్ ఫుల్ మార్క్స్ సాధించాడు. హీరోయిన్ రియా సుమన్ హుందాగా కనిపించారు. నటన పరంగానూ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్లో రియా చూపించిన ఎమోషన్స్ సూపర్బ్. తాన్య హోపే తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఇతర పాత్రలో విద్యుల్లేఖ రామన్, మహేష్, బిత్తిరి సత్తి, అభిషేక్ కాసేపు నవ్వించే ప్రయత్నం చేశారు. విశ్లేషణ ; పేదింటి అబ్బాయి.. పెద్దింటి అమ్మాయిని ప్రేమించటం అనే కాన్సెప్ట్ తెలుగు సినిమాకు హిట్ ఫార్ములా. ఇప్పటికే ఇలాంటి కథతో చాలా సినిమాలు వచ్చాయి. అయితే అదే కథను కొత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు జయశంకర్. సంపత్ నంది రచన సినిమాకు హెల్ప్ అయ్యింది. కవితాత్మకంగా సాగే సంభాషణలు ఆకట్టుకుంటాయి. భీమ్స్ సంగీతం, సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం సరిగ్గా కుదిరాయి. అయితే సినిమాను ఇంట్రస్టింగ్ పాయింట్తో మొదలు పెట్టిన దర్శకుడు ఆ టెంపోను కంటిన్యూ చేయటంలో కాస్త తడబడ్డాడు. నెమ్మదిగా సాగే కథనం ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. అదే సమయంలో కథతో సంబంధం లేని కామెడీ సీన్స్ కథనంలో స్పీడ్ బ్రేకర్లలా మారాయి. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫి సినిమాకు కలర్ ఫుల్ లుక్ తీసుకువచ్చింది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; సంతోష్ శోభన్, రియా సుమన్ నటన నేపథ్య సంగీతం మాటలు మైనస్ పాయింట్స్ ; నెమ్మదిగా సాగే కథనం కథకు అడ్డుపడే కామెడీ సీన్స్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
ట్రైలర్, సినిమా చూసి బాగుందన్నా
‘‘బన్ని ఓ సారి ‘పేపర్ బాయ్’ ట్రైలర్ పంపి చూడమన్నాడు. చూసి చాలా బాగుందన్నా. తర్వాత మెహర్ రమేశ్ వచ్చి ఈ సినిమా చూడమంటే చూసి, చాలా బాగుంది అన్నాను. మీరు ఈ సినిమాని రిలీజ్ చేస్తారా? అన్నాడు మెహర్ రమేశ్. ఇండస్ట్రీనే నమ్ముకున్న సంపత్నందిలాంటి వ్యక్తి ఓ కథ రాసుకుని మరో డైరెక్టర్కి అవకాశం ఇచ్చి, మంచి సినిమా చేసినప్పుడు మా సంస్థ ద్వారా విడుదలైతే ప్రేక్షకులకు బాగా రీచ్ అవుతుందనే విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. సంతోష్ శోభన్, రియా సుమన్, తన్య హోప్ హీరోహీరోయిన్లుగా జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పేపర్ బాయ్’. సంపత్ నంది, వెంకట్, నరసింహ నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. హైదరాబాద్లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఫంక్షన్లో డైరెక్టర్ వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘పేపర్ బాయ్’ హక్కులను అల్లు అరవింద్గారు తీసుకున్నారని చెప్పగానే సినిమా చాలా పెద్ద హిట్ అని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే అరవింద్గారి జడ్జ్మెంట్పై నాకు అపారమైన నమ్మకం ఉంది. ఇప్పుడు ఇది పెద్ద సినిమా’’ అన్నారు. ‘‘చిన్న సినిమా నిర్మాతలకు ఉండే కష్టాలేంటో నాకు తెలుసు.‘ పేపర్ బాయ్’ లాంటి చిన్న సినిమాకు గీతా ఆర్ట్స్ వంటి పెద్ద ప్లాట్ఫామ్ దొరికింది. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు డైరెక్టర్ సుకుమార్. ‘‘అరవింద్గారు రిలీజ్ చేస్తున్నారనగానే ఇదొక మంచి సినిమా అనే గుర్తింపు వచ్చింది. ఆయనకు మా సినిమా గురించి చెప్పిన మెహర్ రమేశ్ అన్నకు జీవితాంతం రుణపడి ఉంటా’’ అన్నారు సంపత్ నంది. ‘‘ఈ సినిమా కోసం ఏడాదిగా కష్టపడుతున్నాం. గీతా ఆర్ట్స్వారు మా సినిమాను తీసుకోవడం వల్ల ఈ కష్టం మరచిపోయాం’’ అన్నారు జయశంకర్. దర్శకులు మెహర్ రమేశ్, కల్యాణ్ కృష్ణ, సంతోష్ శోభన్ తదితరులు పాల్గొన్నారు. -
సంతోష్కు వర్షంలాంటి హిట్ రావాలి
ప్రభాస్ కెరీర్లో తొలి బ్లాక్బస్టర్ చిత్రం ‘వర్షం’. ఆ చిత్రదర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్ హీరోగా నటించిన చిత్రం ‘పేపర్ బాయ్’. రాములు, నరసింహులు, వెంకట్తో కలసి దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రాన్ని నిర్మించారు. జయశంకర్ దర్శకుడు. ఈ చిత్రం ట్రైలర్ని వీక్షించిన అనంతరం, చిత్రబృందానికి ప్రభాస్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘వర్షం’ చిత్రంతో నాకు హిట్ వచ్చినట్లే ‘పేపర్ బాయ్’ సంతోష్ శోభన్కు కూడా మంచి విజయం ఇవ్వాలి. ట్రైలర్ బాగుంది. విజువల్స్ చాలా బావున్నాయి. నేను నటించిన ‘బిల్లా’ చిత్రానికి కెమెరామెన్గా పనిచేసిన సౌందర్యరాజన్ ఈ చిత్రానికి కెమెరామెన్గా పనిచేయటం ఆనందంగా ఉంది. గీతా ఆర్ట్స్ లాంటి మంచి సంస్థ ‘పేపర్బాయ్’ సినిమా హక్కులను సొంతం చేసుకోవటం మరో మంచి విషయం’’ అన్నారు . ఈ నెల 31న ఈ చిత్రం విడుదలవుతున్న విషయం తెలిసిందే. -
ఫుల్ పాజిటివ్
సంతోష్ శోభన్, రియా సుమన్ జంటగా జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పేపర్ బాయ్’. సంపత్ నంది కథను అందిస్తూ, రాములు, వెంకట్, నరసింహులతో కలిసి నిర్మించారు. ఈ నెల 31న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ను గీతా ఆర్ట్స్ బ్యానర్ సొంతం చేసుకుంది. అల్లు అరవింద్, ‘బన్నీ’ వాసు, దర్శకుడు మెహర్ రమేశ్లకు ప్రత్యేకంగా షో వేసి చూపించారు చిత్రబృందం. ‘‘సినిమా నచ్చిన వెంటనే అల్లు అరవింద్గారు రిలీజ్ రైట్స్ను ఫ్యాన్సీ రేట్కు సొంతం చేసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ట్రైలర్కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సినిమాకు మంచి పాజిటివ్ వైబ్ ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, కెమెరా: సౌందర్ రాజన్. -
వారం రోజులు ముందుగానే వస్తున్నాం
సంతోష్ శోభన్, రియా సుమన్ జంటగా జయశంకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘పేపర్ బాయ్’. తాన్యా హోప్ కీలక పాత్ర చేశారు. దర్శకుడు సంపత్ నంది, రాములు, వెంకట్, నరసింహులు నిర్మించారు. ఈ సినిమా టైటిల్ సాంగ్ ‘ఓయ్ ఓయ్...పేపర్ బాయ్’ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాశారు. భీమ్స్ స్వరకర్త. ప్రముఖ సంగీత దర్శకుడు చంద్రబోస్ ఈ పాటను పాడటం విశేషం. ఈ సినిమాను ముందు అనుకున్నట్లుగా సెప్టెంబర్ 7న కాకుండా ఈ నెల 31న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం తెలిపారు. సంపత్ నంది మాట్లాడుతూ – ‘‘టీజర్, ట్రైలర్లతో పాటు ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసేందుకు రోడ్ ట్రిప్ ప్లాన్ చేశాం. పేపర్ బాయ్స్ ఉన్నంత కాలం ఈ పాట ఉంటుంది. పాట పాడిన చంద్రబోస్గారికి, టీమ్ అందరి తరఫున థ్యాంక్స్’’ అన్నారు. ‘‘టెన్షన్ పడేంత టైమ్ కూడా లేదు. వారం రోజులు ముందే వస్తున్నాం. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉంది’’ అన్నారు సంతోష్ శోభన్. చంద్రబోస్గారిని అనుసరిస్తున్న శిష్యుల్లో నేను, కాసర్ల శ్యామ్ కూడా ఉన్నాం. ఈ సినిమా టైటిల్ సాంగ్ పాడినందుకు చంద్రబోస్గారికి థ్యాంక్స్’’ అన్నారు భీమ్స్. ‘‘నేను లిరిక్స్ అందించిన పాటకు చంద్రబోస్గారు గాత్రం అందించడం నా వరం. నా అదృష్టంగా భావిస్తున్నా. సంపత్ నంది మంచి డైలాగ్స్ రాశారు’’ అన్నారు కాసర్ల శ్యామ్. ఈ కార్యక్రమంలో నిర్మాత నరసింహులు, డైరెక్టర్ జయశంకర్, కెమెరామెన్ సౌందర రాజన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆగస్ట్ 31న రాబోతోన్న ‘పేపర్ బాయ్’
మాస్ డైరెక్టర్ సంపత్ నంది అందించిన కథతో రాబోతోన్న సినిమా పేపర్ బాయ్. తాజాగా విడుదల చేసిన టీజర్కు మంచి స్పందన వచ్చింది. టీజర్తోనే ఆకట్టుకుంటోన్న ఈ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించింది చిత్రబృందం. సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేసేందుకు వినూత్న పద్దతిలో ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టింది. సంతోష్ శోభన్ హీరోగా, ప్రియాశ్రీ, తాన్యా హోప్ హీరోయిన్స్గా.. సంపత్నంది టీమ్ వర్క్స్పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 31న విడుదల కానున్నట్టు ప్రకటించారు. అందరికీ ఈ సినిమా రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు నుండి రోడ్ ట్రిప్ ప్లాన్ చేశారు. సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ఇంటింటికి తిరిగి పేపర్ వేసి అందర్నీ కలవబోతున్నారు. ఈ సినిమాకు జయశంకర్ దర్శకత్వం వహించారు. -
తొలి ప్రేమ గుర్తొస్తుంది
సంపత్ నంది టీమ్ వర్క్స్ , బిఎల్ఎన్ సినిమాస్, ప్రచిత్ర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘పేపర్ బాయ్’. సంతోష్ శోభన్, రియా సుమన్ జంటగా నటించిన ఈ చిత్రానికి జయశంకర్ దర్శకుడు. భీమ్స్ సిసిరేలియో సంగీతాన్ని అందించారు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్లో జరిగింది. సెప్టెంబరు 7న సినిమా విడుదలవుతుంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఈ చిత్రం ట్రైలర్ను చూసి యూనిట్ను అభినందించారు. పేపర్బాయ్గా పనిచేసే రవి, బాగా రిచ్ ఫ్యామిలీలోని అమ్మాయి ధరణిల ప్రేమకథే ఈ సినిమా. ఈ సందర్భంగా జరిగిన విలేఖరుల సమావేశంలో దర్శకుడు–చిత్రనిర్మాతల్లో ఒకరైన సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘మా చిత్రం టీజర్కు 36 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. మేం మంచి సినిమా తీశామని గట్టిగా నమ్ముతున్నాను. ‘పేపర్బాయ్’ మంచి ప్రేమకథ. ఈ సినిమాలో నాతో పాటు ఉన్న రాములు, వెంకట్, నరసింహాకు థ్యాంక్స్. వాళ్లు ఈ సినిమాకు వెన్నెముకలా నిలబడ్డారు’ అన్నారు. దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ – ‘‘సంపత్ నంది చెప్పిన కథ విన్న వెంటనే కనెక్ట్ అయిపోయాను. ఈ విషయంలో నన్ను నమ్మినందుకు సంపత్గారికి థ్యాంక్స్’’ అన్నారు. హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ– ‘సంపత్ నంది గారితో పనిచేయటం నాకు చాలా ప్రత్యేకంతో పాటు మంచి అనుభవం కూడా. సినిమాను అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను’’ అన్నారు. హీరోయిన్ రియా సుమన్ మాట్లాడుతూ– ‘‘దరణి‘ పాత్రలో నటించాను నేను. ఈ పాత్ర కోసం నన్ను నమ్మినందుకు దర్శకుడు జయశంకర్కు థ్యాంక్స్. కెమెరామెన్ సౌందర్యరాజన్గారు మంచి విజువల్స్ అందించారు. ‘పేపర్బాయ్’ సినిమా అందరికీ తమ ఫస్ట్లవ్ను గుర్తు చేసే మంచి ప్రేమకథ’’ అన్నారు. సంగీత దర్శకుడు భీమ్స్ మాట్లాడుతూ – ‘‘ముందుగా నాకు సినీ జీవితాన్నిచ్చిన సంపత్ నందికి కృతజ్ఞతలు. ఈ సినిమాకు ఆత్మ ఆయనే. మీడియా పర్సన్ సురేశ్ ఉపాధ్యాయ్ ఈ చిత్రంలో మూడు పాటలు రాశారు. చిన్న సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. -
‘పరిచయమైంది పుస్తకాలు.. దగ్గరైంది అక్షరాలు’
‘ఏమైంది ఈవేళ’ సినిమాతో దర్శకుడిగా టాలెంట్ చూపించాడు సంపత్ నంది. రచ్చ, బెంగాల్ టైగర్ సినిమాలతో మాస్ డైరెక్టర్గా నిరూపించుకున్నాడు. డైరెక్టర్గానే గాకుండా నిర్మాతగానూ సక్సెస్ అయ్యేందుకు ట్రై చేస్తున్నాడు. గతంలో ఆది హీరోగా ‘గాలిపటం’ సినిమాను నిర్మించిన సంపత్ నంది...తాజాగా ‘పేపర్ బాయ్’ ను నిర్మిస్తున్నారు. సంతోష్ శోభన్ (‘వర్షం’ దర్శకుడు శోభన్ తనయుడు) హీరోగా నటించిన ‘పేపర్ బాయ్’ అందంగా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. సంపత్ నంది అందించిన కథ తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ట్రైలర్లో డైలాగ్లు ప్రేక్షకులకు నచ్చేలా ఉన్నాయి. ‘నాకు పరిచయమైంది పుస్తకాలు.. దగ్గరైంది అక్షరాలు’, ‘ప్రేమంటే ఆక్సిజన్లాంటిది అది కనిపించదు.. కానీ బతికిస్తుంది’ లాంటి డైలాగ్లు బాగున్నాయి. భీమ్స్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునేలా ఉంది. సంపత్నంది టీమ్ వర్క్స్పై వస్తోన్న ఈ సినిమాకు జయ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. -
‘పేపర్ బాయ్’ ట్రైలర్
-
పడ్డాడండి ప్రేమలో మరి
‘గోల్కొండ హైస్కూల్’తో బాల నటుడిగా పరిచయమైన సంతోష్ శోభన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పేపర్ బాయ్’. జయశంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రియా సుమన్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటించారు. సంపత్ నంది టీమ్ వర్క్స్, బీఎల్ఎన్ సినిమా, ప్రచిత్ర క్రియేషన్స్ పతాకాలపై సంపత్ నంది, రాములు, వెంకట్, నరసింహ నిర్మించిన ఈ సినిమాని సెప్టెంబర్ 7న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా నా తొలి చిత్రమిది. ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రేమలో పడిన తర్వాత ఏం జరిగిందన్నదే చిత్రకథ. దర్శకుడు సంపత్ నంది ఈ సినిమాకి చక్కని కథ అందించారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, టీజర్కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. టీజర్కు 2.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి’’ అన్నారు. పోసాని కృష్ణమురళి, అభిషేక్ మహర్షి, విద్యుల్లేఖా రామన్, జయప్రకాశ్ రెడ్డి, సన్నీ, మహేశ్ విట్టా తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సౌందర రాజన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళి మామిళ్ల. -
పేపర్ బాయ్ లవ్ స్టోరీ
‘‘ఒక అమ్మాయి, ఓ పేపర్ బాయ్ మధ్య జరిగే ప్రేమ కథే ‘పేపర్ బాయ్’. ఈ చిత్రంలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమా. అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. కెమెరామెన్ సౌందర్య రాజన్ మంచి విజువల్స్ అందించారు. భీమ్స్ మ్యూజిక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఆగస్టులో సినిమా విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత సంపత్ నంది అన్నారు. సంతోష్ శోభన్ హీరోగా, రియా, తాన్య హోప్ హీరోయిన్లుగా జయశంకర్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘పేపర్ బాయ్’. సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్లో ప్రచిత్ర క్రియేషన్స్, బిఎల్ఎన్ సినిమాపై సంపత్ నంది నిర్మించారు. ఈ సినిమా టీజర్ను రియల్ పేపర్ బాయ్ అఖిల్ చేత విడుదల చేయించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ– ‘‘నేను చేసిన షార్ట్ ఫిల్మ్ చూసి సంపత్గారు డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు. అందుకు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటా. సింపుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రమిది. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘గోల్కొండ హైస్కూల్’తో బాల్య నటుడిగా నన్ను ఆదరించారు. ఇప్పుడు ‘పేపర్ బాయ్’గా మీ ముందుకు వస్తున్నా, ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో అందరూ కొత్తవారే’’ అన్నారు సంతోష్ శోభన్. నిర్మాత నరసింహ, కథానాయిక రియా పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళి మామిళ్ల. -
‘తను- నేను’లో హీరోగా చేసింది శోభన్ కొడుకే
‘వర్షం’ సినిమా డెరైక్టర్ శోభన్ గుర్తున్నారు కదూ! ఆయనకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనుకున్న సమయంలో అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు శోభన్ ప్రస్తావన ఎందుకంటే - ఇటీవల విడుదలైన ‘తను- నేను’లో హీరోగా చేసింది శోభన్ కొడుకే. ఆ అబ్బాయి పేరు సంతోష్ శోభన్. అతను హీరోగా మారడం వెనుక తల్లి సౌజన్య ప్రోత్సాహం ఉంది. తన కొడుకు భవిష్యత్తు గురించి, భర్త జ్ఞాపకాల గురించి సౌజన్య ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. కొడుకుని హీరోగా తెరపై చూడకుండానే శోభన్గారు వెళ్లిపోయారు... కచ్చితంగా మీకు బాధ ఉండే ఉంటుంది... ఆ బాధను మాటల్లో చెప్పలేనండి. మొదటిసారి సంతోష్ని తెరపై చూసినప్పుడు ఆనందం, ఆయన చూడలేక పోయారే అనే బాధ కలిగింది. అదో ఎమోషనల్ మూమెంట్. దర్శకుడిగా శోభన్గారు రెండే సినిమాలు చేశారు. అనుకున్నంత స్థాయికి ఎదగలేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఉండి ఉండేవేమో..? ఉండేవి. అయినా వాటిని మేం ఖాతరు చేయలేదు. ఎందుకంటే సినిమానే ప్రాణంగా బతికారాయన. అందుకే ఇబ్బందులను ఫేస్ చేశాం. మరి.. అలాంటి ఇబ్బందులు ఉంటాయని తెలిసి కూడా సంతోష్ని సినిమా రంగంలోకి పంపించడం రిస్క్ అనిపించడంలేదా? లేదు. ఎందుకంటే సినిమా అంటే నాకు గౌరవం. ఇబ్బందులనేవి ఎక్కడైనా ఉంటాయ్. ఫేస్ చేయాలి. మా సంతోష్కి చాలా మెచ్యుర్టీ ఉంది. ఒడుదొడుకులను తట్టుకునేంత మానసిక పరిపక్వత ఉంది. శోభన్గారు ఉన్నప్పటి జీవితం.. లేనప్పటి జీవితం గురించి? ఆయన లేని లోటు భర్తీ చేయలేనిది. ‘అనగనగా ఓ శోభన్ ఉండేవాడు. ఫలానా సినిమాలకు రచయితగా చేసేవాడు. ‘బాబీ’, ‘వర్షం’ సినిమాలకు డెరైక్షన్ చేశాడు’ అని ఇతరులు ఆయన గురించి ఏదో జస్ట్ అలా చెప్పుకోవడం నాకిష్టం లేదు. ఆయన ఎప్పటికీ గుర్తుండిపోవాలన్నది నా కోరిక. నా ఇద్దరు కొడుకుల ద్వారా అది సాధ్యపడుతుంది. ‘శోభన్ కొడుకు హీరో అయ్యాడట’ అని అందరూ చెప్పుకుంటుంటే నా కళ్లు చెమర్చాయి (ఉద్వేగానికి గురవుతూ). హీరోగా మొదటి రోజు కెమెరా ఫేస్ చేసినప్పుడు సంతోష్ తన తండ్రిని గుర్తు చేసుకున్నాడా? గుర్తు చేసుకున్నాడు. షూటింగ్కి వెళ్లొచ్చిన తర్వాత ‘అమ్మా.. మేకప్మ్యాన్కీ, డెరైక్షన్ డిపార్ట్మెంట్వాళ్లకూనాన్న తెలుసట. అందరూ నాన్న గురించి బాగా చెప్పారు’ అన్నాడు. పిల్లలను మీ భర్త ఎలా చూసుకునేవారు? ప్రాణంగా చూసుకునేవారు. దోమలు కుట్టినా భరించేవారు కాదు. ఇంట్లో దోమలున్నాయ్.. ఏం చేస్తున్నావని నన్ను అరిచేవారు. ‘నాక్కనిపించని దోమలు మీకెలా కనిపిస్తున్నాయ్’ అనేదాన్ని. శోభన్గారు చనిపోకముందు మీరు జాబ్ చేసేవారా? హౌస్వైఫ్ని. పధ్నాలుగేళ్లు ఇంటిపట్టునే ఉన్నాను. ఆయన చనిపోయాకే జాబ్ మొదలుపెట్టాను. శోభన్గారు చనిపోయిన తర్వాత భరత్ ఠాకూర్గారి యోగా స్కూల్లో ఇన్స్ట్రక్టర్గా చేశాను. నాలుగేళ్లు అక్కడ చేశాక మెరీడియన్ స్కూల్లో ఓ రెండేళ్లు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో చేశాను. మెరీడియన్ స్కూల్స్ కర్నూలు ఎంపీ బుట్టా రేణుకగారివి. రెండేళ్లుగా ఆవిడకు పీఏగా చేస్తున్నాను. కర్నూలులోనే ఉంటాను. హైదరాబాద్లో మా అమ్మగారు, అన్నయ్య కుటుంబం ఉంటారు. పిల్లల్నిద్దర్నీ వాళ్లే చూసుకుంటారు. నేను వచ్చి వెళుతుంటాను. ఓకే... ఒక తల్లిగా మీ అబ్బాయి నటన చూసి ఏమనిపించింది? షాకయ్యాను. అంత బాగా నటిస్తాడనుకోలేదు. సినిమా చూసినవాళ్లందరూ హీరోగా పనికొస్తాడని అభినందించారు. అనుకోకుండా హీరో అయ్యాడు కాబట్టి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడానికి కుదర్లేదు. అందుకని డ్యాన్స్ విషయంలో ఫెయిల్ అవుతానేమోనని భయపడేవాడు. మేనేజ్ చేసేశాడు. ఇప్పుడు డ్యాన్స్ కూడా నేర్చుకుంటున్నాడు. సంపూర్ణమైన హీరో అనిపించుకోవడానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నాడు. సంతోష్ హీరో కావడం ద్వారా మా కల నెరవేరింది. కుర్రాడు బాగున్నాడు.. టాలెంటెడ్ అని మొదటి సినిమాతోనే అనిపించుకున్నాడు. రామ్మోహన్గారు తన నుంచి మంచి నటన రాబట్టుకున్నారు. ఓ తల్లిగా మా అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. -
ఆ ఫీలింగ్ మంచి కిక్ ఇస్తోంది
‘వర్షం’ హిట్ ప్రభాస్ కెరీర్ని మంచి మలుపు తిప్పిన విషయం తెలిసిందే. ఆ సినిమా తీసింది దర్శకుడు శోభన్. మహేశ్ బాబుతో ‘బాబి’ సినిమా తీసిందీ ఆయనే. 2008లో శోభన్ ఆకస్మికంగా చనిపోయారు. తండ్రి కన్న కలలను నిజం చేస్తూ, శోభన్ తనయుడు సంతోష్ శోభన్ ఇప్పుడు ‘తను-నేను’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. స్వీయదర్శకత్వంలో పి. రామ్మోహన్ నిర్మించిన ఈ చిత్రం నేడు తెర మీద కొస్తోంది. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ -‘‘రామ్మోహన్గారు తీసిన ‘గోల్కొండ హైస్కూల్’ సినిమాలో ఓ ముఖ్యపాత్ర చేశాను. ఆయన డెరైక్షన్లోనే హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. నేను బెంగుళూరులో చదువుకున్నాను. వేసవి సెలవుల్లో హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ సినిమా స్క్రిప్ట్ ఇచ్చి చదవమన్నారు. చదువుతున్నప్పుడే మంచి స్క్రిప్ట్ అనిపించింది. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికీ రీచ్ అవుతుంది. అవికా గోర్ గురించి చెప్పాలంటే నటన విషయంలో ఆమె నా కన్నా సీనియర్. కానీ నా లాంటి కొత్త హీరోతో నటించడానికి ఒప్పుకోవడం చాలా గొప్పగా అనిపించింది. సినిమాల మీద పిచ్చి ప్రేమ మా నాన్నగారి నుంచే నాకు వచ్చింది. త్రివిక్రమ్, ప్రభాస్, రవితేజ, ప్రభుదేవా వంటి సినీ ప్రముఖులు నాకు బెస్ట్ విషెస్ చెప్పడం ఆనందంగా ఉంది. ఫస్ట్ కాపీ చూసి హీరోలు నాని, రాజ్తరుణ్ బాగుందని మెచ్చుకున్నారు. మహేశ్బాబు నా సినిమా గురించి ట్వీట్ చేశారు. ఆయనకు నేను తెలుసు అనే ఫీలింగ్ నాకు మంచి కిక్ ఇస్తోంది. వీళ్లు నాకిచ్చిన సపోర్ట్ మర్చిపోలేను’’ అన్నారు.