Sravan Kumar
-
సుగాలి ప్రీతి కేసును వాడుకుని పవన్ రాజకీయంగా బాగుపడ్డారు : జడ శ్రావణ్కుమార్
సాక్షి,విజయవాడ: సుగాలి ప్రీతి కేసును వాడుకుని రాజకీయంగా బాగుపడ్డారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై జై భీమ్ రావు భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్ ఫైరయ్యారు. సుగాలి ప్రీతి కుటుంబ సభ్యుల మనోవేదనపై న్యూ హోప్ ఫౌండేషన్ పాటను రూపొందించింది. ఆ పాట పోస్టర్ను జడ శ్రావణ్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్కు నిబద్ధత,నిలకడలేదు. రాజకీయాల కోసమే సుగాలిప్రీతి కేసును వాడుకున్నారు. సుగాలిప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామన్నాడు.. ఏమైంది?. సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. వైఎస్ జగన్ హయాంలో ఐదెకరాల పొలం కూడా ఇచ్చారు. సీబీఐ విచారణకు జగన్ ప్రభుత్వం ఆదేశించింది.పవన్ సుగాలి ప్రీతి గురించి ఒక వెయ్యి వీడియోల్లోనైనా మాట్లాడారు. సినిమాలో డైలాగ్ లు మర్చిపోయినట్లు .. సుగాలి ప్రీతి కేసును పవన్ మర్చిపోయినట్లున్నారు. సుగాలి ప్రీతికి న్యాయం కోసం పోరాడింది నేను. నన్ను తప్పుపట్టే విధంగా జనసేన కార్యకర్తలు సీన్ క్రియేట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన కార్యకర్తలు కేసులో ఎంటరయ్యారు. సుగాలి ప్రీతి కేసును వాడుకుని పవన్ రాజకీయంగా బాగుపడ్డాడు.పవన్ను తిట్టిన వారిని అరెస్టులు చేయించారు. పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలపై స్పందించేందుకు సిద్ధంగా లేడు. తాను హామీ ఇచ్చిన సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయలేకపోయారు. పవన్కు నిబద్ధత..నిలకడ లేదు.సుగాలి ప్రీతి కుటుంబం పవన్పై నమ్మకం ఇంకా ఎన్నాళ్లు పెట్టుకుంటారో వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నా. సుగాలి ప్రీతి కేసును రాజకీయాల కోసం పవన్ వాడుకున్నాడు. పవన్ను నమ్ముకుంటే 2029లో మళ్లీ సుగాలి ప్రీతి హత్యకేసు ప్రచారాస్త్రంగా మారండం ఖాయమని’మండిపడ్డారు. -
వ్యూహమా? ప్రభాకర్రావుపై ప్రేమా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ప్రధానంగా వినిపించింది టి.ప్రభాకర్రావు పేరే. ఆ విభాగ మాజీ చీఫ్ అయిన ఈ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ట్యాపింగ్ కేసు నమోదుతో అమెరికా వెళ్లిపోయారు. ఈ కేసు దర్యాప్తు కొలిక్కిరావాలంటే ఆయన్ను వెనక్కి రప్పించడం, విచారించడం అనివార్యంగా మారింది. అయితే ఇప్పుడెందుకో పోలీసులకు ఆయనపై ప్రేమ పుట్టుకొచ్చింది. ఇదే కేసులో ఆరో నిందితుడిగా ఉండి, విదేశాల్లో తలదాచుకున్న శ్రవణ్రావును ప్రొక్లైమ్డ్ అఫెండర్గా (ప్రకటిత నేరస్తుడు) ప్రకటించాలంటూ ఇటీవల నాంపల్లి కోర్టులో పోలీసు విభాగం పిటిషన్ దాఖలు చేసింది. అయితే ప్రభాకర్రావు పేరును మాత్రం ఇందులో చేర్చలేదు. మరోపక్క పి.రాధాకిషన్రావు, భుజంగరావులకు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసు విభాగం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది మొదలు.. అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పంజగుట్ట పోలీసులు 2024 మార్చి 10 కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి సంబంధించి ప్రణీత్రావుపై నమోదైన ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం ఆరుగురిని నిందితులుగా చేర్చారు. కీలక నిందితులుగా పేర్కొంటూ అదే నెలలో అడిషనల్ ఎస్పీలు నాయిని భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీసీపీ రాధాకిషన్రావు, మాజీ డీఎస్పీ ప్రణీత్రావును అరెస్టు చేశారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు, ఓ టీవీ ఛానల్ అధినేత శ్రవణ్కుమార్ మాత్రం పరారీలో ఉన్నారు. ఈ కేసులో పోలీసులు గత జూన్లో చార్జీషీట్ దాఖలు చేశారు. అప్పట్లో ట్యాపింగ్కు గురైన వారిలో కాంగ్రెస్ నేతలు, ఓ న్యాయమూర్తి, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతోపాటు కొందరు బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారని ప్రస్తావించారు. ఇంకా విచారణ సాగుతున్నందున అదనపు చార్జీïÙట్ దాఖలు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. విచారణ ఇంకా పూర్తికాలేదంటూ... ఇప్పటికీ ప్రభాకర్రావు, శ్రవణ్కుమార్ అమెరికాలో ఉన్నారు. ట్రయల్ కోర్టు రెండుసార్లు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినా స్పందన లేదు. ఇటీవల పోలీసులు కోర్టుకు సమరి్పంచిన సీల్డ్ కవర్ నివేదికలో ప్రస్తుత హైకోర్టు న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారుల ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు ఉన్నాయి. నిందితుల వ్యక్తిగత కంప్యూటర్ల నుంచి ఫోరెన్సిక్ నిపుణులు రిట్రీవ్ చేసిన డేటాలో వీటిని గుర్తించినట్టు పేర్కొన్నారు. వీరందరి నంబర్లూ ట్యాపింగ్ అయినట్టు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ దశలో కీలక నిందితులకు బెయిల్ ఇవ్వడం విచారణను ప్రభావితం చేస్తుందని అధికారులు చెబుతున్నారు. వారి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని, వివరాలతో వాదనలు సిద్ధం చేయాలని పీపీకి పోలీసు విభాగం సూచించింది. ‘ప్రొక్లైమ్డ్ అఫెండర్’ ఒక్కరిపైనే ఎందుకు? ఒకరిని న్యాయస్థానం ప్రొక్లైమ్డ్ అఫెండర్గా ప్రకటిస్తే.. వారి ఆస్తులు జప్తు చేసే అధికారం పోలీసులకు వస్తుంది. ఇలా ఒత్తిడి తీసుకొచ్చి నిందితులను విదేశాల నుంచి రప్పించే అవకాశం ఉంటుంది. అయితే ఈ పిటిషన్ను ప్రధాన నిందితుడైన ప్రభాకర్రావుపై దాఖలు చేయకుండా, శ్రవణ్కుమార్పై దాఖలు చేయడం వెనుక ఆంతర్యం అంతు చిక్కట్లేదు. పోలీసు విభాగం ఇలా వ్యవహరించడం వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉందా? లేక వ్యూహంలో భాగమా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. -
Jada Sravan: చంద్రబాబు, లోకేష్, పవన్ మీకు నిద్ర ఉండదు..
-
టీటీడీ బోర్డు సభ్యుల నియామకంపై జడ శ్రావణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
-
టీటీడీ కాదు.. టీడీపీ బోర్డు: జడ శ్రావణ్ కుమార్
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి నేతలు చెప్పే మాటలకు చేసే పనులకు చాలా తేడా ఉందన్నారు జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్. టీటీడీని రాజకీయ పునరావాసంగా మార్చారు. ఇది టీటీడీ బోర్డు కాదు.. టీడీపీ బోర్డు అని ఆరోపించారు. క్రిమినల్ కేసులు ఉన్న వారు ట్రస్ట్ బోర్డు సభ్యులా? అని ప్రశ్నించారు.జడ శ్రావణ్ కుమార్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..‘టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై చాలా ఆరోపణలు ఉన్నాయి. క్రిమినల్ కేసులు ఉన్న వారు ట్రస్ట్ బోర్డు సభ్యులా?. ప్రశాంతి రెడ్డి, జ్యోతుల నెహ్రుపై ఐటీ ఎగవేత కేసులు ఉన్నాయి. ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై 23 కేసులు పెండింగ్లో ఉన్నాయి. బాబు అరెస్ట్ అయినప్పుడు క్యారేజీలు మోసిన మునికోటేశ్వర రావుకు పదవా?. అలివేలు మంగమ్మపై జోకులు వేసిన నర్సిరెడ్డి బోర్డు మెంబరా?. దేవాదాయ చట్టానికి విరుద్ధంగా బోర్డు సభ్యుల నియామకం జరిగింది.అలాగే, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ప్రజల డబ్బులు ఖర్చుచేశారని చెప్పిన పట్టాభి దీనికి సమాధానం చెప్పాలి. చంద్రబాబు ఇంటికి కోట్ల రూపాయలు ఎందుకు కేటాయించుకున్నారు. చంద్రబాబు నివాసం అనధికార నివాసం. అనధికార కట్టడం కూల్చివేయాలని నేషనల్ ట్రిబ్యునల్కి వెళ్తున్నాం. కరకట్ట మీద అన్ని కట్టడాలు కూలగొట్టి తీరుతాం. ముఖ్యమంత్రి నివాసం అయినా కూల్చాల్సిందే. ప్రభుత్వ ధనం వృధా అవుతుంటే సనాతన వాది, పవన్ స్టార్ ఏమయ్యాడు. పవన్ అనధికార కట్టడాలపై మౌనంగా ఉండడానికి కారణం జనసేన పార్టీ కార్యాలయానికి పర్మిషన్ లేకపోవడమే. హైడ్రా వంటి చట్టం ఆంధ్రప్రదేశ్లో అమలు అయితే ముందు పోయేది ముఖ్యమంత్రి ఇల్లు.. తర్వాత పోయేది పవన్ ఇల్లు. కూటమి నేతలు చెప్పే మాటలకు చెప్పే పనులకు చాలా తేడా ఉంది. జనవరి నుండి కాలర్ పట్టుకుని కూటమి నేతలను రోడ్లపైకి లాగుతాం అని సీరియస్ కామెంట్స్ చేశారు. -
లైవ్ లో పవన్ కళ్యాణ్ వీడియో చూపిస్తూ పరువు తీసిన జడ శ్రవణ్..
-
అమ్మాయిలపై లైంగిక వేధింపుల్లో బిజీబిజీగా కూటమి ఎమ్మెల్యేలు
-
జేసీ ప్రభాకర్ వీడియో వేసి పవన్,బాబును రఫ్పాడించిన జాడ శ్రవణ్ కుమార్
-
లడ్డు వివాదం.. రేపు సుప్రీం కోర్టులో జరిగేది ఇదే
-
నీలాంటి పాపాత్ముడు తిరుమల వెళ్తే అపచారం.. జాడ శ్రావణ్ కుమార్ ఫైర్
-
పవన్ పిచ్చికూతలకు జాడా శ్రావణ్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్
-
సాయంత్రం అయితే కోటార్ వేసేవాడు టీటీడీ మెంబెర్...? శ్రావణ్ కుమార్
-
అక్రమ కట్టడాలు కూల్చాలంటే.. చంద్రబాబు ఇంటి నుంచే స్టార్ట్ చేయాలి
-
అక్రమ కట్టడాల కూల్చివేత చంద్రబాబు నివాసం నుండే ప్రారంభం
-
బడ్జెట్ కేటాయింపులపై జడ శ్రవణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్
-
ప్రజలు అధికారం ఇచ్చింది ఇందుకా ? కూటమిపై జడ శ్రవణ్ కుమార్ ఫైర్
-
కక్షతో ఆఫీసులు కూల్చడానికా అధికారమిచ్చింది: జడ శ్రవణ్ కుమార్
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో కక్షపూరితంగా పార్టీ ఆఫీసులు కూల్చడానికా కూటమికి అధికారం ఇచ్చింది అని ప్రశ్నించారు జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రవణ్ కుమార్. అలాగే, టీడీపీ సెంట్రల్ కార్యాలయానికి పర్మిషన్ ఉందా?. ఏపీలో టీడీపీ పార్టీ కార్యాలయాలకు పర్మిషన్ ఉంటే చూపించండి అని ప్రశ్నించారు.కాగా, శ్రవణ్ కుమార్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏవైనా భవనాలను కూల్చాలనుకుంటే కోర్ట్ ఆర్డర్తో కూల్చండి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కరెక్ట్ కాదు. రూల్ ఆఫ్ లాను టీడీపీ ఉల్లంఘిస్తోంది. పార్టీ ఆఫీసులకు అనుమతి లేదని అధికారులకు ఇప్పుడు గుర్తొచ్చిందా?. అధికారులు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్లు కొమ్ము కాయడం కరెక్ట్ కాదు. ఇటువంటి చర్యల వల్ల ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పోతుంది.నాడు నారాయణ కాలేజీలను మూయించారని.. ఇప్పుడు మంత్రి అవగానే వైఎస్సార్సీపీ కార్యాలయాలు పడగొడతారా?. కోర్డ్ ఆర్డర్ ప్రకారం బిల్డింగ్ను కూల్చివేయాలి. అంటే సూర్యోదయం తర్వాత లేదా సూర్యాస్తమయంలోపు ఇలా చేయాలి. శని, ఆదివారాల్లో బిల్డింగ్స్ పడగొట్టకూడదు. అయినా కోర్ట్ ఆర్డర్ ఉండగా ఎలా కూల్చివేస్తారు?. టీడీపీ సెంట్రల్ కార్యాలయానికి పర్మిషన్ ఉందా?. టీడీపీ పార్టీ కార్యాలయాలకు పర్మిషన్ ఉంటే చూపించండి. కరకట్ట మీద ఉన్న ఏ బిల్డింగ్కి అనుమతి లేదు. వాటిని ఎందుకు పడగొట్టలేదు?. కరకట్ట మీద ఉన్న బిల్డింగ్స్ పడగొట్టాలని కోర్టులో పిటిషన్ వేస్తాం.వైఎస్సార్సీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, వైజాగ్ స్టీల్ ప్లాంట్పై ఎందుకు మోదీతో మాట్లాడలేదు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే చొక్కా పట్టుకొని అడుగుతాము. 100 వెల్ఫేర్ స్కీమ్స్ పునరుద్ధరించాలి. 95వేల ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలి.టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఎంత ప్రమాదకరమో 2029 ఎన్నికలో ఆయనకు తెలుస్తుంది. అధికారులను అరెస్ట్ చేయాలి. కలెక్టర్లను టార్గెట్ చేయాలి అనేవి మానుకోవాలి. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి చేయాలి, తరిమేయాలని అనుకుంటే కుదరదు. ప్రజలు చూస్తూ ఊరుకోరు. ప్రజల ఆలోచనలకు విలువ ఇవ్వాలి. ఏదైనా చేస్తాం అంటే చూస్తూ ఊరుకోము. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం చాలా ఇంపార్టెంట్. అధికార దాహంతో ఆ గొంతు నొక్కితే ప్రజాస్వామ్యానికి విలువ ఉండదు. ప్రజాస్వామ్యం లేకుండా నియంతృత్వం రాజ్యమేలితే నష్టం తప్పదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ఇవి మాములు కౌంటర్లు కాదు బాబు పవన్ లకు చెమటలు పట్టించిన జడ శ్రవణ్ కుమార్
-
Crime: పగలు రెక్కీ.. రాత్రికి చోరీ! తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా..
సాక్షి, విశాఖపట్నం: పగలు ఆటో నడుపుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి... రాత్రి వేళ ఆ ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనర్ కాన్ఫరెన్స్ హాలులో క్రైం ఏడీసీపీ శ్రావణ్కుమార్ మీడియాకు శుక్రవారం వెల్లడించారు. రైల్వే న్యూ కాలనీ సమీప శివాలయం వీధికి చెందిన షేక్ సహీద్ ఆటో డ్రైవర్గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. పగలు అంతా నగరంలోని పలు ప్రాంతాల్లో ఆటో నడుపుతూ... ఆ సమయంలో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రెక్కీ నిర్వహించేవాడు. అనంతరం రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి వేపగుంట సమీప నాయడుతోట అప్పలనర్సయ్య కాలనీలో మున్సి లియాకత్ కుటుంబంతో నివసిస్తున్నారు. ఆయన గత ఏడాది డిసెంబర్ 27న కుమారుడి రిసెప్సన్ కోసం వేరే ప్రాంతానికి వెళ్లారు. ఆ ఇంటిని, వారి కదలికలను నిశితంగా గమనిస్తున్న షేక్ సహీద్ అదే రోజు రాత్రి ఆ ఇంటిలో చోరీకి పాల్పడ్డాడు. ఇంటి వెనక డోర్ తాళం పగలుగొట్టి 8 తులాల బంగారు ఆభరణాలు, రూ.2.30 లక్షల నగదు అపహరించుకుపోయాడు. మీడియాతో మాట్లాడుతున్న క్రైం ఏడీసీపీ శ్రావణ్కుమార్ పట్టించిన సీసీ కెమెరాలు కుమారుడి రిసెప్సన్ కార్యక్రమం తర్వాత మరుసటి రోజు డిసెంబర్ 28న ఇంటికి వచ్చిన మున్సి లియాకత్ చోరీ జరిగిందని గుర్తించి పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఏసీపీ పెంటారావు నేతృత్వంలో సీఐలు లూథర్బాబు, సింహాద్రినాయుడు, ఎస్ఐలు ఎం.రాధాకృష్ణ, డి.కాంతారావు, ఎం.గణపతిరావు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో చోరీ జరిగిన ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించగా షేక్ సహీద్ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారించగా చోరీ చేసినట్లు అంగీకరించడంతోపాటు మరో ఐదు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించాడు. ఫోర్త్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు, కంచరపాలెం పీఎస్ పరిధిలో ఒక చోరీకి పాల్పడినట్లు అంగీకరించాడు. మొత్తం 17 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.3.80 లక్షల నగదు చోరీ చేయగా... 15 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.2.45 లక్షల నగదు, ఒక బైక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు దొంగలించిన బంగారం కొనుగోలు చేస్తూ సహకరించిన పుట్టా భరత్కుమార్, బిక్కలు కళావతి, లంకా కామేశ్వరిలను పోలీసులు అరెస్ట్ చేశారు. సమావేశంలో ఏసీపీ పెంటారావు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. చదవండి: Nellore: పాపం పసివాళ్లు! అమ్మానాన్నలు కాదనుకున్న అభాగ్యులు -
రాజధాని తరలిస్తున్నట్లు చెప్పారా?
సాక్షి, మంగళగిరి: రాజధానిలో దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు మాజీ ఎమ్మెల్యే శ్రావణ్కుమార్తో సహా ఏ ఒక్క టీడీపీ నాయకుడికి లేదని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని ప్రకటించిన సమయంలో దళితులకు చెందిన అసైన్ట్, లంక, ప్రభుత్వ భూములకు రైతుల భూములతో పాటు పరిహారం ప్రకటించకుండా చంద్రబాబు బినామీలు దళితులను బెదిరించి, పరిహారం రాదని భయపెట్టి దళితుల భూములన్నింటిని తక్కువ ధరలకు కొట్టేసినప్పుడు మాజీ ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ నిద్రపోతున్నారా అని నిలదీశారు. రాజధాని తరలిస్తున్నట్లు ఎవరు చెప్పారని, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాని మరెవరైనా కాని రాజధాని తరలిస్తున్నట్లు చెప్పారా అని ప్రశ్నించారు. తాడికొండ, తుళ్ళూరులతో పాటు రాజధానిలో మంగళగిరి భాగం కాదా చెప్పాలన్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రావణ్కుమార్కు ఇప్పుడు దళితులు గుర్తుకువచ్చారా అని నిలదీశారు. అసలు రాజధానిలో దళితుల భూములన్నింటిని రాజధాని ప్రకటించేనాటికే టీడీపీ నాయకులు హస్తగతం చేసుకున్నారని, ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. రాజధానిలో ప్లాట్లు కేటాయించే సమయంలోనూ దళితులకు ప్రత్యేకంగా ప్లాట్లు కేటాయిస్తుంటే మాజీ ఎమ్మెల్యేకు కనిపించలేదా అన్నారు. ప్లాట్ల కేటాయింపులోను టీడీపీ నాయకులు వారికి నచ్చిన చోట వారికి నచ్చిన విధంగా వాస్తులు చూసుకుని మరీ ఇచ్చుకుని లాటరీ అంటూ రైతులను మభ్యపెట్టారన్నారు. రాజధాని భూములపై విచారణ కొనసాగుతుందని, పూర్తిస్థాయిలో విచారణ చేసి రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ను నిరూపిస్తామని స్పష్టం చేశారు. అన్ని వాస్తవాలను ప్రజల ముందుంచి రాష్ట్ర ప్రజలందరికీ ఒక మంచి రాజధానిని అందించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆకాంక్షించారు. -
శ్రవణ్కుమార్పై మండిపడ్డ రైతులు
సాక్షి, అమరావతి : రాష్ట్ర రాజధాని అంశం విషయంలో ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దళితుల సమావేశం పేరిట ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ హాజరుకానున్నట్లు తెలిపారు. అయితే శ్రవణ్ అక్కడికి రావడానికి ముందే ఆయన అనుచరులు ప్రభుత్వంపై విషం చిమ్ముతూ ప్రసంగించారు. ఈ క్రమంలో సమావేశ స్థలికి చేరుకున్న అసైన్డ్ భూముల రైతులు వారిని అడ్డుకుని శ్రవణ్ కుమార్ దళిత ద్రోహి అంటూ మండిపడ్డారు. నాలుగున్నరేళ్లుగా దళితుల్ని చంద్రబాబు చిత్రహింసలు పెట్టినప్పుడు శ్రవణ్ కుమార్ ఎక్కడికి పోయాడని, దళితులపై టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టినప్పుడు శ్రవణ్ కుమార్ ఏం చేశాడంటూ రైతులు ప్రశ్నించారు. జీవో నెంబర్ 41తో దళితులకు చంద్రబాబు అన్యాయం చేస్తుంటే అప్పుడు మాట్లాడని శ్రవణ్ కుమార్ ఇప్పుడు ఏం మాట్లాడతాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో దళిత రైతులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థతి నెలకొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి గొడవ సద్దుమణిగేలా చేశారు. -
మంత్రి పదవికి కిడారి శ్రవణ్ కుమార్ రాజీనామా
-
పదవికి రాజీనామా చేసిన మంత్రి
అమరావతి: మంత్రి పదవికి టీడీపీ నేత కిడారి శ్రవణ్ కుమార్ రాజీనామా చేశారు. సీఎంవోకు తన రాజీనామా లేఖను శ్రవణ్ అందజేశారు. సీఎంఓ ద్వారా రాజీనామాను గవర్నర్కు పంపారు. సుమారు 8 నెలల క్రితం మావోయిస్టులు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావును కిడ్నాప్ చేసి హత్య చేసిన సంగతి తెల్సిందే. హత్య జరిగిన తర్వాత 6 నెలల్లో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ సార్వత్రిక ఎన్నికలకు కూడా ఎక్కువ సమయం లేకపోవడంతో ఉప ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో సర్వేశ్వర రావు కుమారుడు శ్రవణ్ కుమార్కు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేరుగా తన మంత్రి వర్గంలో చోటు కల్పించారు. మంత్రి పదవి చేపట్టి 6 గడిచిపోయినా ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోవడంతో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. నిబంధనలకు లోబడే రాజీనామా: కిడారి రాజ్యాంగ నిబంధనలకు లోబడి రాజీనామా చేసినట్లు కిడారి శ్రవణ్ కుమార్ తెలిపారు. మంత్రిగా ఆరు నెలల పదవీకాలంలో 3 నెలలు ఎన్నికల కోడ్కే పోయిందని చెప్పారు. గిరిజనుడిగా తనకు మంత్రి పదవి దక్కటం సంతోషంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తనను కుటుంబసభ్యుడిగా చూసుకున్నారని వాఖ్యానించారు. తన శాఖ ద్వారా గిరిజనుల కోసం ఫుడ్ బాస్కెట్ పథకాన్ని తీసుకురావడం సంతోషకరంగా ఉందని తెలియజేశారు. 6 నెలలే పదవిలో ఉండడంపై ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. -
నారా లోకేశ్తో మంత్రి కిడారి శ్రవణ్ సమావేశం
సాక్షి, అమరావతి: గిరిజన సంక్షేమ, ప్రాథమిక విద్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి శ్రావణ్ కుమార్ గురువారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి నారా లోకేశ్తో భేటీ అయ్యారు. మంత్రి పదవికి రాజీనామా అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. కిడారి శ్రావణ్ కుమార్ పదవీ బాధ్యతలు చేపట్టి ఈనెల 10వ తేదీ నాటికి (శుక్రవారం) ఆరు నెలలు అవుతోంది. ఈ నేపథ్యంలో కిడారి శ్రావణ్ కుమార్ చేత మంత్రి పదవికి రాజీనామా చేయించాల్సిందిగా గవర్నర్ కార్యాలయ వర్గాలు సీఎంవోకు సూచించినట్టు సమాచారం. దీంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నారా లోకేశ్తో ఆయన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా శ్రావణ్ కుమార్ ఇవాళ తన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రికి సమర్పించనున్నుట్లు తెలిసింది. ఆ తరువాత గవర్నర్ ఆమోదానికి సీఎం పంపాల్సి ఉంటుంది. మొత్తానికి ఏ చట్ట సభకు ఎన్నిక కాకుండానే ఆరు నెలలపాటు మంత్రి పదవి అనుభవించిన రికార్డు మాత్రం శ్రావణ్కుమార్కు దక్కుతుంది. చదవండి: (మంత్రి కిడారితో రాజీనామా చేయించండి) -
నాడు నందమూరి హరికృష్ణ.. నేడు శ్రావణ్
ఆయన శాసనసభ్యుడు కాదు.. కనీసం నామినేటెడ్ ఎమ్మెల్సీ కూడా కాదు.. ఏ చట్టసభలోనూ సభ్యుడు కానప్పటికీ.. కనీసం రాజ్యాంగ పదవులు చేపట్టిన అనుభవమైనా లేనప్పటికీ.. ఏకంగా మంత్రి హోదాలో ఆయా సభల్లోకి అడుగుపెట్టారు.అమాత్యుడిగా అన్ని రకాల అధికారాలు.. రాజభోగాలు అనుభవించారు తప్పితే.. మంత్రిగా క్రీయాశీలంగా వ్యవహరించారా అంటే.. అదీ లేదు. పైగా యువతలతో షికార్లు, జల్సాలతో వార్తల్లోకెక్కారు. ఆయనే మంత్రి కిడారి శ్రావణ్కుమార్. సరే.. రాజ్యాంగంలో కల్పించిన అవకాశం మేరకు ఆయన్ను మంత్రిగా కేబినెట్లోకి తీసుకున్నా.. ఆరు నెలల్లోపు శాసనసభ లేదా మండలిలో ఏదో ఒకదానికి సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. కానీ ఆ రెండూ జరగకపోవడంతో మూడు రోజుల్లో కిడారివారి అమాత్యగిరీ ఊడిపోనుంది.గతంలో ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ విషయంలోనే ఇలా జరిగింది. నాడు.. 1994లో వెన్నుపోటు ఎపిసోడ్లో తనకు అండగా నిలిచినందుకు నజరానాగా చంద్రబాబు హరికృష్ణను రవాణాశాఖ మంత్రి పదవి ఇచ్చారు. కానీ చట్టసభకు మాత్రం పంపకపోవడంతో అర్నెల్లు ముగిసిన వెంటనే ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.తిరిగి ఇప్పుడు అటువంటి ఎపిసోడ్నే చంద్రబాబు నడిపారు. వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించినందుకు బహుమతిగా కిడారి సర్వేశ్వరరావును ప్రభుత్వ విప్గా నియమించారు. ఆ హోదాలో పలు ఆక్రమణలకు పాల్పడిన ఆయన్ను గత ఏడాది నక్సల్స్ హతమార్చారు. ఇదే అదనుగా వైఎస్సార్సీపీకి వీరాభిమానులుగా ఉన్న గిరిజనులను సెంటిమెంట్ అస్త్రంతో తనవైపు తిప్పుకొనేందుకు టీడీపీ అధినేత రాజకీయంగా పావులు కదిపారు. రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని కిడారి తనయుడు శ్రావణ్కుమార్కు మంత్రి పదవి కట్టబెట్టేశారు. అయితే గడువులోగా ఆయన్ను చట్టసభకు పంపడంలో మాత్రం నిర్లక్ష్యం వహించారు.ఫలితంగా హరికృష్ణ మాదిరిగానే శ్రావణ్ మంత్రి పదవి ముచ్చట ఆర్నెలల్లోనే ముగిసిపోనుంది. సాక్షి, విశాఖపట్నం: గిరిజనులు 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీని అక్కున చేర్చుకున్నారు. ఆ పార్టీ తరపున బరిలో నిలిచిన వారందరినీ గెలిపించారు. అలా అరుకు నుంచి కిడారి సర్వేశ్వరరావు ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత ప్రలోభాలకు లొంగిపోయి అధికార టీడీపీలోకి ఫిరాయించారు. ప్రభుత్వ విప్ అయ్యరు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారు. అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడి మావోల ఆగ్రహానికి గురయ్యారు. పలుమార్లు హెచ్చరించినా తీరుమారకపోవడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సివేరి సోమతో కలిసి వెళ్తుండగా సర్వేశ్వరరావును గత ఏడాది సెప్టెంబర్ 23న మావోలు మట్టుబెట్టారు. రాజకీయ లబ్ధి కోసమే.. ఎస్టీ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులే గెలవడంతో గిరిజన సలహా మండలిని కూడా ఏర్పాటు చేయని, ఆ వర్గానికి చెందిన వారిని మంత్రులుగా నియమించలేకపోయిన చంద్రబా బు.. సర్వేశ్వరరావు హత్యను రాజకీయ లబ్ధికి ఉపయోగించుకున్నారు. కిడారి తనయుడు శ్రావణ్కుమార్ను తెరపైకి తెచ్చి మంత్రిగిరీ కట్టబెట్టేశారు. శ్రావణ్ చట్టసభల్లో సభ్యుడు కాదు.. పైగా ఆర్నెలల్లోనే ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో మంత్రి పదవి కట్టబెట్టడం సరికాదన్న వాదనలు వినిపించినా ఖాతరు చేయలేదు. రాజ్యాంగంలో ఉన్న అవకాశాన్ని అడ్డం పెట్టుకొని గత నవంబర్ 11న జరిగిన కేబినెట్ విస్తరణలో శ్రావణ్కుమార్కు చోటు కల్పించి గిరిజన సంక్షేమ శాఖ అప్పగించేశారు. మండలికైనా పంపలేదు చట్టసభల్లో సభ్యులు కాని మంత్రులు ఆర్నెల్లలోపు కచ్చితంగా ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంటుందని రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. ఈ విషయం తెలిసినా.. ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే, గవర్నర్, స్థానిక సంస్థలు కోటా ఎమ్మెల్సీ స్థానాలను ఎన్నికలు జరిగినా కిడారికి మాత్రం చంద్రబాబు అవకాశం ఇవ్వలేదు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో అరకు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయించారు. ఆ ఫలితాలు రాకముందే.. ఈ నెల 11కే ఆరు నెలల గడువు ముగుస్తుండటంతో మంత్రి పదవికి శ్రావన్ నీళ్లొదలాల్సిన పరిస్థితి తలెత్తింది. శ్రావణ్కుమార్తో రాజీనామా చేయించమని సీఎం చంద్రబాబుకు గవర్నర్ నరసింహన్ ఇప్పటికే సూచించారు. కిడారికి సైతం గవర్నర్ నుంచి ఆ వర్తమానం అందింది. దీంతో సభ్యుడు కాకుండానే చట్టసభల్లోకి అడుగుపెట్టి.. ఆర్నెల్లపాటు మంత్రి పదవిని అనుభవించి.. రాజీనామా చేసిన అరుదైన రికార్డు శ్రావణ్ కుమార్కు దక్కింది. నందమూరి హరికృష్ణ తర్వాత రాష్ట్రంలో ఇలా పదవి పోగొట్టుకున్న రెండోవ్యక్తి శ్రావనే. కాగా అరుకు నుంచి టీడీపీ తరపున బరిలోకి దిగిన శ్రావణ్కుమార్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఫలితాల తర్వాతైనా ఆయన చట్టసభలోకి అడుగు పెడతారా?.. ఓటమి పాలై చట్టసభ్యుడు కాని మాజీ మంత్రిగానే మిగిలిపోతారో? చూడాలి. కాగా తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును సంప్రదించిన తర్వాత రాజీనామా చేస్తానని కిడారి మీడియాకు తెలిపారు. ఆర్నెల్ల పాటు మంత్రి హోదా చెలాయించిన కిడారి రబ్బర్ స్టాంప్గానే ముద్రపడ్డారు. పైగా మంత్రి పదవిని అడ్డంపెట్టుకుని యువతులతో షికార్లు, విహార యాత్రలు, జల్సాలు చేశారన్న అపవాదు మూటగట్టుకున్నారు. -
మంత్రి కిడారితో రాజీనామా చేయించండి
సాక్షి, అమరావతి: గిరిజన సంక్షేమ, ప్రాథమిక విద్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి కిడారి శ్రావణ్కుమార్తో రాజీనామా చేయించాలని గవర్నర్ కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడినట్టు తెలిసింది. శ్రావణ్కుమార్ ఇటు అసెంబ్లీకి గాని, అటు శాసన మండలికి గాని ఎన్నిక కాకుండానే మంత్రిపదవి చేపట్టారు. రాజ్యాంగం మార్గదర్శక సూత్రాల ప్రకారం ఎవరైనా మంత్రిగా పదవి చేపట్టిన తరువాత ఏ చట్టసభకైనా (అసెంబ్లీ లేదా మండలి) సభ్యునిగా ఎన్నిక కావాల్సి ఉంది. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టి ఈనెల 10వ తేదీ నాటికి ఆరు నెలలు అవుతోంది. ఈ నేపథ్యంలో కిడారి శ్రావణ్కుమార్ చేత మంత్రి పదవికి రాజీనామా చేయించాల్సిందిగా గవర్నర్ కార్యాలయ వర్గాలు సీఎంవోకు సూచించినట్టు సమాచారం. దీంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. హడావుడి నిర్ణయంతో మంత్రి అయ్యారు నాలుగున్నరేళ్లు పాటు మంత్రివర్గంలో ముస్లింలు, గిరిజనులకు అవకాశం కల్పించని చంద్రబాబు ఎన్నికలకు ముందు కంటితుడుపు చర్యగా గత ఏడాది నవంబర్ 11వ తేదీన కిడారి శ్రావణ్కుమార్ను, ఫరూక్ను మంత్రివర్గంలో తీసుకున్నారు. ఆ తరువాత ఫరూక్కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడంతో ప్రస్తుత ప్రభుత్వ పదవీ కాలం ముగిసేంత వరకు ఆయన మంత్రి పదవికి ఢోకా లేదు. కిడారికి మాత్రం టీడీపీ ఆ అవకాశం కల్పించలేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యే పదవికి పోటీ చేసినప్పటికీ.. ఫలితాలు వెలువడలేదు. ఇదిలావుంటే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున అరకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కిడారి సర్వేశ్వరరావు ఆ తరువాత చంద్రబాబు ప్రలోభాలకు లోనై తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. గత ఏడాది సర్వేశ్వరరావును నక్సలైట్లు హతమార్చారు. విధిలేని పరిస్థితుల్లో ఆయన కుమారుడు కిడారి శ్రావణ్కుమార్ను మంత్రివర్గంలోకి తీసుకుని అతనికి గిరిజన సంక్షేమం, ప్రాథమిక విద్య, కుటుంబ సంక్షేమ శాఖలను చంద్రబాబు కేటాయించారు. ఇదిలావుంటే.. మంత్రి శ్రావణ్కుమార్ స్పందిస్తూ గవర్నర్ కార్యాలయం నుంచి ఎటువంటి సమాచారం రాలేదని, ముఖ్యమంత్రిని కలిసి ఆయన సూచన మేరకు నడుచుకుంటానని పేర్కొన్నారు. ఐతే, కిడారి గురువారం సీఎంకు రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నుట్లు తెలిసింది. ఆ తరువాత గవర్నర్ ఆమోదానికి సీఎం పంపాల్సి ఉంటుంది. మొత్తానికి ఏ చట్ట సభకు ఎన్నిక కాకుండానే ఆరు నెలలపాటు మంత్రి పదవి అనుభవించిన రికార్డు మాత్రం శ్రావణ్కుమార్కు దక్కుతుంది. -
మంత్రి పదవి కోల్పోనున్న కిడారి శ్రవణ్ కుమార్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖమంత్రి మంత్రి కిడారి శ్రవణ్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతి చెందడంతో ఆయన కుమారుడు కిడారి శ్రవణ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. గత ఏడాది నవంబర్ 11న ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే కిడారి శ్రవణ్ కుమార్ ఆరు నెలల్లోగా ఏదో చట్టసభల్లో సభ్యుడిగా ఉండాలి. ఈ నెల 10వ తేదీతో ఆరు నెలల గడువు పూర్తి కానున్న నేపథ్యంలో ఆయన చేత రాజీనామా చేయించాలని గవర్నర్ నరసింహన్ ... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. ఈ మేరకు రాజ్భవన్ అధికారులు మంగళవారం సాయంత్రం ఏపీ సర్కార్కు సమాచారం అందించింది. కాగా రాజ్యాంగం ప్రకారం మంత్రి పదవి చేపట్టి ఆరు నెలలలోపు చట్టసభల్లో సభ్యుడిగా ఎన్నిక అవ్వాల్సి ఉంటుంది. లేకుంటే పదవి కోల్పోవాల్సి ఉంటుంది. మరోవైపు ఈ విషయంపై కిడారి శ్రవణ్ కుమార్ ఇవాళ ముఖ్యమంత్రిని కలవనున్నట్లు తెలుస్తోంది. ఆయన సూచన మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. -
తాడికొండలో.. అనకొండలు..
సాక్షి, గుంటూరు: తాడికొండ నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన అవినీతి అనకొండలు పడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ సారథ్యంలో ప్రజా ధనాన్ని నిలువునా దోచుకున్నాయి. రాజధాని ప్రాంతం కావడంతో ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా భూములను కబ్జా చేశాయి. రైతుల పొలాల్లో సెంట్ల చొప్పున భూమి కాజేసి కోట్ల రూపాయలు దండుకున్నాయి. నీరు– చెట్టు పథకం పేరిట అడ్డగోలుగా చెరువులు, పంట పొలాలను తవ్వేసి మట్టిని అమ్మేసుకున్నాయి. గ్రావెల్ను సైతం కొల్లగొట్టి కోట్ల రూపాయలు గడించాయి. కమీషన్లకు కక్కుర్తి పడి అభివృద్ధి పనుల్లో నాణ్యతకు పాతర వేశాయి. ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ అండదండలతో నియోజకవర్గాన్ని అక్రమాలు, అవినీతి, అరాచకాలకు కేంద్ర బిందువుగా మార్చాయి. అక్రమంగా కాజేసిన సొమ్ము పంపకాల్లో తేడాలొచ్చి.. మింగిన ప్రజాధనం వివరాలన్నీ రోడ్డెక్కి మరీ కక్కేశాయి. మొత్తంగా నియోజకవర్గంలో సుమారు రూ.400 కోట్ల వరకు సహజ వనరులను లూటీ చేశాయి. ఇవన్నీ తెలిసినా ముడుపులు తీసుకున్న అధికారుల చేతులు నిబంధనలన్నింటినీ తమ గుప్పెట్లో పెట్టుకుని ముడుచుకుపోయాయి. రూ.200 కోట్లపైనే.. టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ అండదండలతో రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలంలో అధికార పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారు. నేటి వరకూ తుళ్లూరు మండలంలోని వివిధ గ్రామాల్లో భూకబ్జాలు, అక్రమ వసూళ్లు, మట్టి తవ్వకాల్లో రూ.200 కోట్లకుపైగా దిగమింగారు. వడ్డమాను గ్రామం ఎంపీటీసీ పిన్నక సాంబశివరావు 74/ఏ, 74/బీ అనే సర్వే నంబర్లలో సుమారు 33.7 ఎకరాల కొండ పోరంబోకు భూమిని కబ్జా చేశాడు. దీని విలువ సుమారు రూ. 20 కోట్లపైనే ఉంటుంది. పేదలకు చెందాల్సిన భూమిలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని గృహాలు నిర్మించుకున్నారు. యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు.. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎమ్మెల్యే శ్రావణ్, ఆయన అనుచరులు నియోజవకర్గంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు అక్కడ రాబందుల్లా వాలిపోయి భూమిని వశపరుచుకొని అక్రమంగా మట్టి, గ్రావెల్ తవ్వకాలను సాగిస్తున్నారు. కైలాసగిరి కొండ ప్రాంతంలో ఎమ్మెల్యే శ్రావణ్ అనుచరులు గ్రావెల్ తవ్వకాలు కొనసాగిస్తున్నారు. సర్వే నంబర్ 573లో 7 ఎకరాల 28 సెంట్ల కుంట పోరంబోకు స్థలంలో గతంలో మాజీ సైనికులు, నిరుపేదలకు ప్రభుత్వం ఇళ్లు, పంటలు వేసుకోవటానికి భూమి ఇచ్చింది. ఈ భూములపై కన్నేసిన ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ పీఏ బత్తుల సురేశ్బాబు, విశదల గ్రామానికి చెందిన ఎమ్మెల్యే సన్నిహితుడు నరేంద్ర 2018 ఫిబ్రవరి నుంచి ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతున్నారు. టిప్పర్కు రూ.1500 చొప్పున గ్రావెల్ను అమ్ముకుంటున్నారు. ఇలా రోజుకు వందల సంఖ్యలో టిప్పర్లను తిప్పుతున్నారు. ఇలా ఎమ్మెల్యే శ్రావణ్, ఆయన పీఏ, సన్నిహితుడు గ్రావెల్ అక్రమ రవాణా ద్వారా రూ.2 కోట్లకుపైగా గడించారు. లాంలో అక్రమంగా లోడింగ్ చేస్తున్న గ్రావెల్ (ఫైల్) సొసైటీ లీజులు అతిక్రమించి.. లాంలో ది లాం లేబర్ కాంట్రాక్ట్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పేరిట 60 సంవత్సరాలుగా లీజు పాలసీ నడుస్తోంది. దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించి అధ్యక్షుడిని ఎన్నుకుని సర్వే నెం. 199ఏలో 1.5 హెక్టార్ల కొండను మైనింగ్ చేసుకుంటున్నారు. సొసైటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి పరాజయం పాలవడంతో ఎలాగైనా క్వారీని సొంతం చేసుకోవాలనుకున్న నాయకులు కుటిల పన్నాగం పన్నారు. అధికారులను, అధికారాన్ని అడ్డుగా పెట్టి క్వారీని నిలిపేయించడంతోపాటు పలుమార్లు కోర్టుల్లో కేసులు వేశారు. దీంతో మూడున్నర సంవత్సరాలుగా క్వారీ మూతపడి కార్మికులు రోడ్డున పడ్డారు. అధికార పార్టీకి చెందిన నాయకులు మాత్రం యథేచ్ఛగా గ్రావెల్ను తవ్వి అమ్మకాలు జరుపుకుంటూ కాసులు వెనకేసుకున్నారు. గతంలో గ్రామానికి చెందిన ఓ మైనార్టీ నాయకుడు ఈ తంతుకు తెరలేపడంతో అధికారులు కిమ్మనకుండా కూర్చున్నారు. రాత్రివేళ యంత్రాలతో మట్టిని తవ్వి పోగుచేయడంతోపాటు లోడింగ్ చేసి గుంటూరు, లాం పరిసర ప్రాంతాలలోని వెంచర్లకు, బహిరంగ మార్కెట్లో అమ్మకాలు చేశారు. దీనిపై సొంత పార్టీ నాయకులే బహిరంగ ఆరోపణలు చేయడం, లీజుదారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో తవ్వకాలు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే అండదండలతో నెక్కల్లు గ్రామంలో ఆయన అనుచరుల అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. నెక్కల్లు గ్రామానికి ప్రధాన రహదారి వెంబడి ఉన్న సర్వే నెంబర్ 87/ఏలో తుళ్లూరు చేనేత పరపతి విక్రయ సంఘం భూమిని ఎమ్మెల్యే అనుచరుడు మేకల రవికుమార్ తన భార్య పేరు మీద నకిలీ దస్తావేజులు సృష్టించి భవనం నిర్మించుకున్నాడు. 25 సెంట్ల విస్తీర్ణం గల ఈ భూమి రూ. 3 కోట్ల విలువ ఉంది. గ్రామంలో 24 ఎకరాల్లో ఉన్న ఊర చెరువు భూమిలో ఎమ్మెల్యే అనుచరులు దాదాపు 5 ఎకరాలు ఇప్పటికే ఆక్రమించుకుని పశువుల పాకలను నిర్మించారు. ప్రస్తుతం మరో మూడు ఎకరాలకు మట్టిని తోలి లెవల్ చేస్తున్నారు. టీడీపీ నాయకులు ఆక్రమించిన ఈ 8 ఎకరాలు రూ. 80 కోట్లపైనే విలువ చేస్తుంది. సైనికుడి భూమిని చెరబట్టారు... ఆర్మీలో పనిచేసిన కొడుకుతో తల్లి షబీరున్నీసాబీ మేడికొండూరుకు చెందిన షేక్ ఆదాం సైన్యంలో పని చేశారు. భారత్–చైనా యుద్ధంలో పాల్గొన్నారు. ఆదాంను భారత ప్రభుత్వం మెడల్స్తో సత్కరించింది. రెండు దశాబ్దాలకుపైగా భారత సైన్యంలో సేవలందించినందుకుగాను అతనికి మేడికొండూరు పోలీస్స్టేషన్ సమీపంలో సర్వే నంబర్ 347లో 2 ఎకరాల 59 సెంట్ల భూమిని 1964లో రాసిచ్చింది. ఈయనకు ఇద్దరు పిల్లలు. వీరిలో ఒకరు ఆర్మీలో పని చేశారు. మాజీ సైనికుడికి ఇచ్చిన భూమిపై ఎమ్మెల్యే శ్రావణ్ అనుచరుల కన్ను పడింది. పచ్చగా సాగవుతున్న భూమిని టీడీపీ కబ్జాకోరులు 4 సంవత్సరాల క్రితం నీరు– చెట్టు పేరుతో తవ్వేసి చెరువులో కలిపేశారు. భర్త మరణానంతరం షబీరున్నీసాబీ ప్రభుత్వమిచ్చిన భూమిని సాగు చేసుకుంటూ పొట్ట పోసుకొంటోంది. అధికార పార్టీ నేతలు భూమిని అన్యాక్రాంతం చేయడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు, ప్రస్తుత ఫిరంగిపురం మార్కెట్ యార్డు చైర్మన్ నార్నె శ్రీనివాసరావు నేతృత్వంలో జరిగిన భూకబ్జాపర్వంపై ఎదురు తిరిగినందుకు ఆదాం రెండో కుమారునిపై ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించి జైలుకు పంపారు. దేశం కోసం పోరాడిన సైనికుని కుటుంబానికి ఇంతటి కష్టమొస్తే కనీసం ఆదుకోవాల్సిన రెవెన్యూ అధికారులు సైతం పచ్చపార్టీ నేతల అడుగులకు మడుగులొత్తారు. సెంట్లు చొప్పున భూమిని కాజేశారు అనంతవరం లో ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు ఒక్కో రైతు నుంచి వారి రికార్డుల ఆధారంగా చేసుకుని సెంట్లు భూమిని కాజేశారు. 30 ఎకరాలలో ఈ విధంగా చిన్న సన్నకారు దళిత రైతుల వద్ద నుంచి ఆక్రమించుకున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేశారు. కోర్టులను ఆశ్రయించడంతో కేవలం నోటీసులు మాత్రమే జారీ చేసి రెవెన్యూ, సీఆర్డీఏ అధికారులు చేతులను దులుపుకున్నారు. టీడీపీ నేతలు కబ్జా చేసిన భూమి విలువ సుమారుగా రూ.50 కోట్ల వరకు ఉంటుంది. మట్టిని మింగేశారు రావెల–పొన్నెకల్లు గ్రామాల మధ్య చెరువులో మట్టిని మండల పార్టీ ఉపాధ్యక్షుడు దగ్గుమల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పలువురు టీడీపీ నాయకులు జన్మభూమి కమిటీ పేరిట ప్రైవేటు వెంచర్లు, ఇతర గ్రామాలకు మళ్లించి రూ. 4 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ అదే పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ కొమ్మినేని రామచంద్రరావు ఆరోపించడంతో భారీ అవినీతి తంతు బయటపడింది. 4 సంవత్సరాలలో అక్రమంగా క్వారీయింగ్ నిర్వహించి పరిమితికి మించి మట్టిని తవ్వారని, రూ.4 కోట్ల మేర మట్టిని నీరు చెట్టు పథకం పేరిట స్వాహా చేశారని పంచాయతీ వార్డు మెంబర్లే స్వయంగా ఏడుగురి సంతకాలతో కలెక్టర్కు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు దాడులు నిర్వహించి వాహనాలను సీజ్ చేశారు. పొన్నెకల్లులో నీరు– చెట్టు కింద పూడికతీత తీసిన మట్టి విక్రయాలకు సంబంధించి లెక్కల విషయంలో మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు గుర్రం ఆదినారాయణ, ప్రస్తుత మార్కెట్ యార్డు ఛైర్మన్ గుంటుపల్లి మధుసూదనరావు వర్గీయుల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తి ఎమ్మెల్యే ఎదుటే వాదోపవాదాలకు దిగారు. రూ. కోట్లు గడించారు తాడికొండ మండల కేంద్రలో నీరు–చెట్టు కార్యక్రమం పేరుతో టీడీపీ నాయకులు భారీగా మట్టిని తరలించి రూ. కోట్లు గడించారు. మట్టిని అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయం వివరాలు ఇంత వరకు బయటకు పొక్కనీయకపోవడం గమనార్హం. గ్రామ పంచాయతీలో తీర్మానం, టెక్నికల్ ఎస్టిమేట్లు లేకుండా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసి విరాళాల పేరిట రూ.6 లక్షలు అధికార పార్టీ నాయకులు వసూలు చేశారు. ఎలాంటి వేలం నిర్వహించకుండా విరాళాలు సేకరించిన వారికే దుకాణాలు కేటాయిస్తామంటూ హామీ కూడా ఇచ్చి హడావుడిగా ప్రారంభోత్సవం చేశారు. విషయం పత్రికలకు ఎక్కడంతో దాదాపు ఏడాదిన్నరగా షాపింగ్ కాంప్లెక్స్ మూతబడింది. విరాళాలను పంచాయతీ ఖాతాలో జమ చేయకుండా సొంతానికి వాడుకున్న టీడీపీ నాయకులు.. ఆ కాంప్లెక్స్కు తిరిగి ప్రభుత్వ నిధులు బిల్లులు చేయాలంటూ అధికారులను ఒత్తిడికి గురి చేస్తున్నారు. టీడీపీకి చెందిన వార్డు మెంబర్ ఇళ్ల స్థలాలను ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. అతనికి పంచాయతీకి చెందిన స్థలాలను లీజు పేరిట కట్టబెట్టారు. కంతేరులో భారీ దోపిడీ కంతేరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు సర్పంచ్ను సైతం పక్కన పెట్టి పారదర్శకత అంటూ ప్రచారం చేస్తూ సొంత వ్యక్తులను నియమించుకొని భారీగా మట్టి దోపిడీకి పాల్పడ్డాడు. ఈ నిధులకు ఆడిటింగ్ చేయించిన అనంతరం గ్రామంలో పంచాయతీ భవనం నిర్మాణం చేయిస్తానంటూ నిధులు జేబులోకి మళ్లించాక చేతులెత్తేశాడు. మట్టి వ్యవహారంపై అçప్పట్లో సర్పంచ్ భర్తకు ఓ ప్రజాప్రతినిధికి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో విషయం బయటకు పొక్కింది. రావెలలో.. తెలుగు తమ్ముళ్లు నీరు– చెట్టు పేరిట సహజ సంపదను దోచుకొని జేబులు నింపుకున్నారు. తాడికొండ మండలం రావెల గ్రామంలో అధికార పార్టీకి చెందిన మండల పరిషత్ ఉపాధ్యక్షుడు దగ్గుమల్లి శ్రీనివాసరావు నీరు– చెట్టు పథకం కింద మట్టిని అమ్ముకొని రూ. కోట్లు కొల్లగొట్టారంటూ అదే పార్టీకి చెందిన కొమ్మినేని రామచంద్రరావు మీడియా సాక్షిగా ధ్వజమెత్తారు. లాంలో మట్టి దందా నడుపుతూ ఎమ్మెల్యే శ్రవణ్ పేరు చెప్పి బెదిరింపులకు దిగుతున్నారంటూ గతంలో టీడీపీకి చెందిన ఓ వర్గం ఆందోళనకు దిగింది. పొన్నెకల్లులో మరో అడుగు ముందుకేసిన నాయకులు నీరు–చెట్టు పథకం కింద గ్రామ అవసరాలకు దానంగా ఇచ్చిన ఊర చెరువును పూడ్చి కల్యాణ మండపం నిర్మిస్తామంటూ విమర్శించారు. ఎమ్మెల్యే అండదండలతో నెక్కల్లు గ్రామంలో ఆయన అనుచరుల అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. నెక్కల్లు గ్రామానికి ప్రధాన రహదారి వెంబడి ఉన్న సర్వే నెంబర్ 87/ఏలో తుళ్లూరు చేనేత పరపతి విక్రయ సంఘం భూమిని ఎమ్మెల్యే అనుచరుడు మేకల రవికుమార్ తన భార్య పేరు మీద నకిలీ దస్తావేజులు సృష్టించి భవనం నిర్మించుకున్నాడు. 25 సెంట్ల విస్తీర్ణం గల ఈ భూమి రూ. 3 కోట్ల విలువ ఉంది. గ్రామంలో 24 ఎకరాల్లో ఉన్న ఊర చెరువు భూమిలో ఎమ్మెల్యే అనుచరులు దాదాపు 5 ఎకరాలు ఇప్పటికే ఆక్రమించుకు ని పశువుల పాకలను నిర్మించారు. ప్రస్తుతం మరో మూడు ఎకరాలకు మట్టిని తోలి లెవల్ చేస్తున్నారు. టీడీపీ నాయకులు ఆక్రమించిన ఈ 8 ఎకరాలు రూ. 80 కోట్లపైనే విలువ చేస్తుంది. కమీషన్ల దందా పెదపరిమి గ్రామంలో ఎమ్మెల్యే పేరు చెప్పుకుని టీడీపీ సీనియర్ నాయకుడు, రైతు విభాగం నేత నూతలపాటి రామారావు చేస్తున్న అవినీతి పరాకాష్టకు చేరింది. గ్రామంలో ఏ అభివృద్ధి పని చేపట్టినా ఈయన కమిషన్లు వసూలు చేస్తున్నారు. నీరు చెట్టు పథకాన్ని అడ్డుపెట్టుకుని భారీగా మట్టి అమ్ముకున్నారు. సిలార్ఖాన్ అనే కౌలు రైతు 2015 సెప్టెంబరు 21 తేదీన అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి మరణించాడు. కౌలు రైతు కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సహాయంలో వాటా ఇవ్వటానికి సిలార్ కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడంతో ఎమ్మెల్యే ద్వారా ఆ పరిహారాన్ని నిలిపి వేయించాడు. తుళ్లూరుకు చెందిన సీనియర్ నాయకుడు ఒకరు సీఆర్డీఏ అధికారులను తన చెప్పుచేతల్లో పెట్టుకుని ఉద్యోగ విరమణ చేసిన అధికారులను కొనసాగిస్తూ గ్రామ కంఠాల పరిహారాలను ఒకటికి రెండింతలు పొందుతున్నారు. నీరు–చెట్టు పథకంలో దోపిడీ రూ.100 కోట్లు భూకబ్జాలతో దండుకున్న మొత్తం రూ.200 కోట్లు గ్రావెల్ అమ్ముకున్న సొమ్ము రూ.50 కోట్లు రైతుల పొలాల్లో సెంట్ల రూపంలో కాజేసిన భూమి రూ.50 కోట్లు కైలాసగిరి కొండ ప్రాంతంలో మట్టి తరలిస్తున్న లారీలు తాడికొండలో మట్టి తరలిస్తున్న టిప్పర్లు, ట్రాక్టర్లు -
అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు
-
ఆయనకు టికెట్ ఇవ్వొద్దు; అమరావతిలో ఉద్రిక్తత
సాక్షి, అమరావతి : రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్పై సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఆయన అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శ్రావణ్ కుమార్ను వ్యతిరేకిస్తూ వెంకటపాలెం నుంచి తుళ్లూరు వరకు ఆయన వ్యతిరేక వర్గం పాదయాత్ర చేపట్టింది. ఈ క్రమంలో వెంకటపాలెం చేరుకున్న ఎమ్మెల్యే అనుకూల వర్గం పాదయాత్రను అడ్డుకుంది. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.(టీడీపీ నేతల హెచ్చరికతో ఖంగుతిన్న మంత్రులు) కాగా గత కొంతకాలంగా తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్కుమార్పై అసమ్మతి పెరిగిపోతోంది. దీనిని నివారించేందుకు ఏకంగా మంత్రులు రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆయన వ్యతిరేక వర్గం తుళ్లూరు మండలంలో శనివారం విస్తృత స్థాయిలో సమావేశాలు నిర్వహించింది. రానున్న ఎన్నికల్లో శ్రావణ్కుమార్కు టికెట్ ఇవ్వొద్దని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచరుల మద్దతు కోరారు. వెంకటపాలెం గ్రామానికి చెందిన నాయకుడు బెల్లంకొండ నరసింహారావును తమ వర్గంలోకి రావాలని చర్చలు జరిపారు. రాజధాని ప్రాంతంలో వర్గాలను తయారు చేస్తున్న ఎమ్మెల్యే చేతుల్లో పార్టీని పెట్టడం సరైంది కాదని చెప్పారు. శ్రావణ్కుమార్కు టికెట్ ఇస్తే సహకరించేది లేదని తీర్మానించుకున్నారు. స్థానిక నాయకుల మాట కాదని అధిష్టానం వ్యవహరిస్తే ఇక్కడ ఓడిస్తామని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు నరేంద్రబాబు, సుధాకర్ తరదితరుల నివాసాలలో ఈ చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే వారు మంగళవారం పాదయాత్ర చేపట్టారు. -
ఎమ్మెల్యే శ్రావణ్కుమార్పై అసమ్మతి
గుంటూరు, వెంకటపాలెం(తుళ్లూరురూరల్): తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్కుమార్పై అసమ్మతి వర్గం తుళ్లూరు మండలంలో శనివారం విస్తృత స్థాయిలో సమావేశాలు నిర్వహించింది. సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రారంభమైన ఈ సమావేశాలు వెంకటపాలెం, మందడం, వెలగపూడి, మల్కాపురం, ఉద్దండ్రాయునిపాలెం గ్రామాల్లో అర్ధరాత్రి వరకు కొనసాగాయి. రానున్న ఎన్నికల్లో శ్రావణ్కుమార్కు టికెట్ ఇవ్వొద్దని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచరుల మద్దతు కోరారు. వెంకటపాలెం గ్రామానికి చెందిన నాయకుడు బెల్లంకొండ నరసింహారావును తమ వర్గంలోకి రావాలని చర్చలు జరిపారు. రాజధాని ప్రాంతంలో వర్గాలను తయారు చేస్తున్న ఎమ్మెల్యే చేతుల్లో పార్టీని పెట్టడం సరైంది కాదని చెప్పారు. శ్రావణ్కుమార్కు టికెట్ ఇస్తే సహకరించేది లేదని తీర్మానించుకున్నారు. స్థానిక నాయకుల మాట కాదని అధిష్టానం వ్యవహరిస్తే ఇక్కడ ఓడిస్తామని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు నరేంద్రబాబు, సుధాకర్ తరదితరుల నివాసాలలో ఈ చర్చలు జరిగాయి. -
టీడీపీ నేతల హెచ్చరికతో ఖంగుతిన్న మంత్రులు
సాక్షి, గుంటూరు: తాడికొండ నియోజకవర్గం టీడీపీలో నెలకొన్న విబేధాలపై చర్చలు జరిపిన మంత్రులకు గట్టిషాక్ తగిలింది. తాడికొండ టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్కుమార్పై నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నేతలు గతకొంత కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విబేధాలపై దృష్టి పెట్టిన టీడీపీ అధిష్టానం.. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం నేతలతో చర్చలు జరిపే బాధ్యతలను మంత్రులు ప్రతిపాటి పుల్లరావు, నక్కా ఆనంద్బాబులకు అప్పగించింది. అధిష్టానం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంతో చర్చలు జరిపిన మంత్రులు.. వారి హెచ్చరికతో ఖంగుతిన్నారు. సమస్యల ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని మంత్రులు కోరగా.. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం నేతలు తీవ్రంగా స్పందించారు. శ్రావణ్కుమార్కు ఈ సారి ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వద్దన్నదే తమ ఏకైక డిమాండ్ అని వారు మంత్రులకు తెల్చిచెప్పారు. గత ఎన్నికల్లో తామే చందాలు వేసుకుని శ్రావణ్కుమార్ను గెలిపించామని గుర్తుచేశారు. ఈ సారి మళ్లీ శ్రావణ్కుమార్కు టికెట్ ఇస్తే మాత్రం తామే దగ్గరుండి ఓడిస్తామని హెచ్చరించారు. దీంతో ఈ విబేధాలను పరిష్కరించడం మంత్రులకు తలనొప్పిగా మారినట్టు సమాచారం. -
ప్రోటోకాల్ రగడ
గుంటూరు రూరల్: తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిధిలోని వర్శిటీ కార్యక్రమాల్లో తనకు కనీసం ఆహ్వానం లేకుండా, సమాచారం కూడా ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాల్లో తన పేరును సైతం ఏర్పాటు చేయడంలేదని తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. లాంఫాం వ్యవసాయ పరిశోధనా స్థానంలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన విత్తన శుద్ధి గిడ్డంగి ప్రారంభోత్సవం, శాటిలైట్ పరిశోధనా స్థానం శంకుస్థాపన కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం తనకు ఎందుకు ఇవ్వలేదని ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ వర్శిటీ వీసీ డాక్టర్ దామోదర్నాయుడుతో వాగ్వి వాదానికి దిగారు. తనకేమీ సంబంధంలేదని, జిల్లా కలెక్టర్ ప్రోటోకాల్ ప్రకారమే అందరికీ సమాచారం ఇచ్చామని, అదేవిధంగా శిలాఫలకాన్ని ఏర్పాటు చేశామని వీసీ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. మంత్రి సోమిరెడ్డి కల్పించుకుని ఇరువురికి సర్ధి చెప్పాడు. దీంతో వివాదం సద్దు మణిగింది. గుంటూరు రూరల్: రైతులకు అధునాతన పద్ధతుల ద్వారా వ్యవసాయంలో నైపుణ్యతలు పెంపొందించేందుకు ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు, శాస్త్రవేత్తలు ఎల్లప్పుడూ కృషి చేస్తారని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తెలిపారు. లాంఫాం వ్యవసాయ పరిశోధనా స్థానంలోని వర్శిటీ ప్రాంగణంలో నూతన పరిశోధనా భవనం సముదాయానికి శంకుస్థాపన, విత్తన శుద్ధి గిడ్డంగి ప్రారంభోత్సవం శుక్రవారం జరిగాయి. మంత్రి మాట్లాడుతూ రూ. 50 లక్షలతో అధునాతన పద్ధతిలో విత్తన శుద్ది కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా గంటకు రెండు టన్నుల వరకు విత్తనాలు, అపరాలు శుద్ధి చేయవచ్చని చెప్పారు. నూతనంగా నిర్మిస్తున్న శాటిలైట్ అగ్రికల్చర్ పరిశోధనా స్థానాన్ని రూ 1.75 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. డిజిటలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ సెంటర్ను రూ. 64 లక్షలతో ఏర్పాటు చేస్తున్నామని, అగ్రికల్చర్ మార్కెట్ ఇంటలిజెన్స్ సెంటర్ను రూ. కోటి ఐదు లక్షలతో ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. వర్శిటీ వీసీ డాక్టర్ వి. దామోదర్నాయుడు, వర్శిటీ శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు. -
మంత్రి తీరుతో ఉపాధ్యాయుల మనస్తాపం
విశాఖపట్నం , పాడేరు: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల హెచ్ఎంల డ్రాయింగ్ అధికారాలు ఏటీడబ్ల్యూవోలకు బదలాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన 132 జీవో రద్దు కోసం ఆందోళన చేస్తున్న ఆందోళనపై సాక్షాత్తూ గిరిజన సంక్షేమ, వైద్యారోగ్యశాఖ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఉపాధ్యాయుల్ని తీవ్ర మనస్తాపానికి గురి చేశాయి. ఈ 132 జీవోను రద్దు చేయాలని ఏపీ గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఐటీడీఏల వద్ద రెండు రోజుల నుంచి రిలే దీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పాడేరు ఐటీడీఏ వద్ద ఉపాధ్యాయుల రిలే దీక్షా శిబిరాన్ని మంత్రి శ్రావణ్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా విధులను వదిలిపెట్టి ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టడాన్ని మంత్రి తప్పుబట్టారు. పాఠశాలల్లో బోధన జరగకపోతే విద్యార్థుల భవిష్యత్ ఏమవుతుందని, పరీక్షల తరుణంలో ఆందోళన చేయడం సరికాదన్నారు. వారం రోజుల్లో 132 జీవో సమస్యను పరిష్కరిస్తామని, దీక్షలు విరమించాలని మంత్రి శ్రావణ్ అన్నారు. ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టడం బాధ్యతారాహితమనే భావం మంత్రి మాటల్లో వ్యక్తమైంది. దీంతో ఉపాధ్యాయ సంఘ నేతలు ఆవేదనకు గురయ్యారు. మంత్రి హామీతో దీక్షలు విరమించాలా వద్దా అనే విషయంపై సాయంత్రం వరకు తీవ్ర తర్జనభర్జనలు పడ్డారు. ఆగస్టులో వచ్చిన 132 జీవోను రద్దు చేయాలని హెచ్ఎంలకు డ్రాయింగ్ అధికారాలు యథాతథంగా కొనసాగించాలని నాలుగు నెలల నుంచి సచివాలయం చుట్టూ తిరుగుతున్నామని, గిరిజన సంక్షేమ ఉన్నతాధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని కలిశామని, గతనెలలోనే మంత్రి శ్రావణ్ దృష్టికి తీసుకు వెళ్లినా ఫలితం లేకపోయిందని ఉపాధ్యాయ సంఘ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ జీవో జారీ అయిన తర్వాత 3 నెలల పాటు నిలుపుదల(అబియాన్స్)లో ఉందన్నారు. ఇతర యాజమాన్యలకు నిలుపుదల కొనసాగిస్తూనే డిసెంబర్ నుంచి తమకు ఈ 132 జీవోను అమల్లోకి తెచ్చారని దీంతో తాము ఆందోళన చేపట్టామని గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు తెలిపారు. ఈ జీవో మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు వేతనాలు కూడా పొందలేదన్నారు.132 జీవో రద్దు విషయంలో మంత్రి శ్రావణ్, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిల మధ్య ఆదిపత్యపోరు జరుగుతోందని, రాజకీయ లబ్ధికోసం పాకులాడుతున్నారని బాహాటంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం దీక్షా శిబిరం వద్దకు మంత్రి చేరుకున్న కొద్ది సేపటికే ఎమ్మెల్యే కూడా వచ్చారు. దీక్ష విరమింపజేసిన క్రెడిట్ దక్కించుకోవాడానికి ఇద్దరూ తాపత్రయపడ్డారని కొందరు ఉపాధ్యాయులు చర్చించుకున్నారు. మంత్రి, ఎమ్మెల్యే హామీతో ఉపాధ్యాయులు తాత్కాలికంగా దీక్ష విరమించారు. -
తాడికొండ టీడీపీలో ముసలం
గుంటూరు: తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ తీరుపై నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఇప్పటికే పార్టీని నిమోజకవర్గంలో మూడు గ్రూపులుగా చీల్చి విభజించి పాలించు అన్న చందగా వ్యవహరిస్తున్నారని రగిలిపోతున్నారు. సమస్యను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో అసమ్మతి వర్గం నాయకులంతా ఏకమయ్యారు. కమిటీగా ఏర్పడి మళ్లీ శ్రావణ్కుమార్కు టికెట్ ఇస్తే ఓడిస్తామని అంటున్నారు. ఈ మేరకు ఇటీవల ఫిరంగిపురం మండలం అమీనాబాద్లో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం సమావేశమై తిరుగుబాటుకు సిద్ధమైంది. సమస్యను చిన్నబాబు దృష్టికి తీసుకెళ్లాలని నాయకులంతా నిర్ణయించారు. విభేదాలు, వర్గాలు ఏర్పడిందిలా... తుళ్లూరు మండలంలో స్థానికంగా ఉంటున్న జెడ్పీ వైస్ చైర్పర్సన్ పూర్ణచంద్రరావు వర్గానికి చెందిన వారు ఇసుక విక్రయాలు ప్రారంభించారు. అప్పట్లో ఎమ్మెల్యే వారికి సహకరించారు. కొద్ది రోజుల తర్వాత ఇసుక విక్రయాలు నిలపేయాలని ఆదేశాలు రావడంతో పూర్ణచంద్రరావు వర్గం ఎమ్మెల్యేకు దూరమైంది. తాడికొండ మండలంలో డిస్టిలరీ కమిటీ చైర్మన్ పదవి పూర్ణచంద్రరావు సూచించిన వ్యక్తికి కాకుండా.. ఎమ్మెల్యే తనకు అనుకూలంగా ఉన్న వారికి ఇచ్చారు. ఇక్కడా రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. అన్ని చోట్లా అదే తీరు ఇటీవల తాడికొండ బస్టాండ్ సెంటర్లో పంచాయితీ నిధులతో నిర్మించిన గదులను ఎమ్మెల్యే తనకు అనుకూలంగా ఉన్న వారికి ఇవ్వాలని యత్నించారు. అయితే గదులు కేటాయించిన లబ్ధిదారుల నుంచి రూ 1.5 లక్షలు వసూలు చేసి ఆ డబ్బును ఎమ్మెల్యే వర్గం తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో వ్యతిరేక వర్గం వారు గదుల కేటాయింపును అడ్డుకున్నారు. మేడికొండూరు మండలంలో ఎమ్మెల్యే అనుకూల వర్గీయులు ప్రభుత్వ పథకాల్లో తమ వారికి ప్రాధాన్యమివ్వడంతో రెండు నెలల క్రితం సిరిపురానికి చెందిన ఎంపీటీసీలు ఇందిర, ప్రశాంతి రాజీనామాకు సిద్ధపడ్డారు. కొద్ది నెలల క్రితం ఫిరంగిపురం మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని తాను కోరిన వ్యక్తికి ఇవ్వాలని మేడికొండూరు జెడ్పీటీసీ సాంబశివరావు ఎమ్మెల్యేను కోరారు. దీనికి ఎమ్మెల్యే నిరాకరించారు. దీంతో తన పదవికి రాజీనామా చేస్తూ జెడ్పీ సీఈవోకు సాంబశివరావు అప్పట్లో లేఖ అందజేశారు. నాలుగేళ్ల క్రితం ఫిరంగిపురం మండలం అమీనాబాద్ గ్రామానికి చెందిన బత్తుల ప్రసాద్ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అయన ఎమ్మెల్యేకు దూరమయ్యారు. మంత్రి లోకేష్బాబుతో ఈయనకు సన్నిత సంబంధాలు ఉన్నాయి. రెండేళ్ల క్రితం ఫిరంగిపురం మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని ఎమ్మెల్యే తనకు అనుకూలమైన ముస్లిం నేతకు అప్పగించారు. దీంతో స్థానిక టీడీపీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యేకు దూరమయ్యారు. మళ్లీ టికెట్ ఇస్తే సహకరించం. ఇటీవల అమీనాబాద్లో నిర్వహించన అసమ్మతి నేతల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రానున్న ఎన్నికల్లో శ్రావణ్కుమార్కు సహకరించబోమని స్పష్టం చేశారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిని నిలుపుతామని భీష్మించారు. ఈ విషయాన్ని లోకేష్(చిన్నబాబు) దృష్టికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు. -
అన్నను చంపేసి...ఇంట్లోనే పూడ్చేశాడు
కర్నూలు : జోళదరాశి గ్రామంలో ఓ వ్యక్తి తమ్ముడి చేతిలో హతమైన ఘటనలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ శ్రీనివాసరెడ్డి సమాచారం మేరకు.. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఎద్దుల ఇసాక్, యోహాన్, కంబగిరి రాముడు అన్నదమ్ములు. యోహాన్కు భారతి, రాజు(22), వసంత సంతానం. కంబగిరిరాముడుకు దేవేంద్రకుమార్, శ్రావణ్కుమార్ సంతానం. పిల్లలు చిన్న వయస్సులో ఉండగానే యోహాన్, ఆయన భార్య దానమ్మ మృతి చెందటంతో కంబగిరిరాముడు తన పిల్లలతోపాటు అన్న పిల్లల పోషణ బాధ్యతను తీసుకున్నాడు. ఆరవ తరగతి వరకు చదువుకున్న రాజు, శ్రావణ్కుమార్ పేదరికం నేపథ్యంలో చదువుకు స్వస్తి చెప్పి గౌండా పనిచేస్తూ కాలం వెల్లదీస్తున్నారు. రెండేళ్ల క్రితం రాజు పాణ్యం మండలం కౌలూరులో ఉంటున్న అక్క, బావల వద్దకు వెళ్లి అక్కడే పనిచేసుకునేవాడు. ఏడాది క్రితం కంబగిరి రాముడు అక్కడికి వెళ్లి రాజును ఇంటికి పిలుచుకొచ్చాడు. అప్పటి నుంచి రాజు స్వగ్రామంలోనే ఉంటూ గౌండా పనికి వెళుతున్నాడు. మద్యానికి బానిసైన శ్రావణ్కుమార్ అన్నతో తరుచూ గొడవ పడేవాడు. ఇటీవల రాజు కొత్త బైక్ కొన్నాడు. విషయం తెలుసుకున్న తమ్ముడు గురువారం రాత్రి పూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చి బైక్ విషయంలో అన్నతో తీవ్రస్థాయిలో ఘర్షణ పడ్డాడు. ఈ ఘర్షణలో పక్కన ఉన్న కట్టెతో అన్న తలపై బలంగా కొట్టడంతో రాజు అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఇంట్లో పూడ్చి పరారీ రాజు మృతి విషయం బయటకు పొక్కకుండా శ్రావణ్కుమార్ ఇంట్లోనే బండ పరుపు తొలగించి గొయ్యి తీసి మృతదేహాన్ని పూడ్చి ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే పరారయ్యాడు. ఆదివారం ఉదయం అన్నను చంపిన విషయాన్ని నంద్యాలలో ఉంటున్న తల్లి ఇంద్రావతికి నిందితుడు ఫోన్ ద్వారా తెలియజేశాడు. భయాందోళనకు గురైన ఆమె వెంటనే విషయాన్ని శివవరంలో ఉన్న బంధువులకు తెలిపింది. వారు జోళదరాశిలోని హతుడి బంధువులకు సమాచారం చేరవేయడంతో తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు ఇసుక కుప్ప కన్పించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆళ్లగడ్డ డీఎస్పీ చక్రవర్తి, కోవెలకుంట్ల సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ మోహన్రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. పోలీస్స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు హత్య జరిగిన విషయం పోలీసులకు తెలిసిపోవడంతో నిందితుడు నేరుగా కోవెలకుంట్ల పోలీస్స్టేషన్లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. హంతకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్యకు దారి తీసిన పరిస్థితులపై విచారణ ప్రారంభించినట్లు సమాచారం. -
ఏసీబీ వలలో ఇరిగేషన్ డీఈ
బాన్సువాడ టౌన్/పెర్కిట్/ఆర్మూర్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఇరిగేషన్ డీఈ శ్రావణ్కుమార్రెడ్డి వద్ద ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే అభియోగంతో శనివారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. బాన్సువాడలోని ఇరిగేషన్ కార్యాలయం, డీఈ అద్దె ఇంట్లో, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఆయన తల్లిదండ్రులు నివాసం ఉండే ఇంట్లో, హైదరాబాద్లో అతని నివాసంపై ఏక కాలంలో దాడులు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ నియోజక వర్గంలో ని కోటగిరి, వర్ని, రుద్రూర్ మండలాల ఇరిగేషన్ డీఈగా విధులు నిర్వహిస్తున్న శ్రావణ్కుమార్రెడ్డికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే అభియోగంపై నిజామాబాద్లో కేసు నమోదైంది. శనివారం తెల్లవారు జాము నుంచి డీఈ ఆస్తులపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బాన్సువాడ బస్డిపో సమీపంలో ఉన్న ఓ అద్దె ఇంట్లో శ్రావణ్కుమార్రెడ్డి నివాసముంటున్నాడు. ఇంట్లోనే ఉన్న డీఈని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సాయికృపా నగర్లో ఉన్న ఇరిగేషన్ కార్యాలయంలో కరీంనగర్ రేంజ్ ఏసీబీ సీఐ వెంకటేశ్వర్లు, సంగారెడ్డి సీఐ గంగాధర్ ఆధ్వర్యంలో సోదా లు చేశారు. రికార్డులను పరిశీలించారు. కంప్యూటర్, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం కోస్లీ గ్రామంలో కొనుగోలు చేసిన రూ. 33 లక్షల విలువ గల ప్లాట్ పత్రాలు, రూ. 37 వేల నగదును అద్దె ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్నారు. గదిలో ఉన్న ల్యాప్టప్ను పరిశీలించారు. డీఈతో పాటు జూనియర్ అసిస్టెంట్ అజీమొద్దీన్ను అదుపులోకి తీసుకుని విచారించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని శ్రావణ్ కుమార్ రెడ్డి తల్లిదండ్రులు నివసించే ఇంటికి వేకువజామున ఐదు గంటలకు ఏసీబీ అధికారులు చేరుకున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు సోదాలు నిర్వహించారు. సోదాల్లో శ్రావణ్ కుమార్ రెడ్డి పేరు మీద అంకాపూర్లో ఏడున్నర ఎకరాల భూమి ఉన్నట్లు దస్త్రాలు లభ్యమయ్యాయి. అధికారులు దస్త్రాలను సీజ్ చేశారు. అలాగే శ్రావణ్ కుమార్ రెడ్డి తల్లి ఇందిర దేవి బ్యాంకు లాకరును అధికారులు తెరిచి చూశారు. లాకర్లో 30 తులాల బంగారు ఆభరణాలుండగా అవి తమ పూర్వీకుల నుంచి సంక్రమించాయని ఇందిరాదేవి అధికారులకు తెలిపారు. కాగా అధికారులు లాకర్ను ఫ్రీజ్ చేశారు. అలాగే హైదరాబాద్లోనూ తనిఖీ నిర్వహించారు. మొత్తం రూ. 5.50 కోట్ల ఆస్తులు గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. సోదాల్లో లభించిన ఆస్తుల వివరాలను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు ఏసీబీ ఆదిలాబాద్ ఇన్స్పెక్టర్ కాశయ్య తెలిపారు. దాడుల్లో కరీంనగర్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ మరో ముగ్గురు సిబ్బంది పాల్గొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే దాడులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏకకాలంలో దాడులు నిర్వహించాం. అంకాపూర్లో శ్రావణ్ కుమార్ రెడ్డికి ఏడున్నర ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించాం. అలాగే ఆయన తల్లి ఇందిర దేవి బ్యాంకు లాకర్లో 30 తులాల నగలు లభ్యమయ్యాయి. లాకర్ను ఫ్రీజ్ చేశాం. ఆస్తికి సంబంధించిన దస్త్రాలను సీజ్ చేశాం. సోదాల్లో లభ్యమైన ఆస్తుల వివరాలను డీజీపీ కార్యాలయానికి నివేదిస్తాం. – కాశయ్య, ఏసీబీ ఇన్స్పెక్టర్, ఆదిలాబాద్ -
పరిశ్రమల శాఖ పనితీరుపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్
గుంటూరు: పరిశ్రమల శాఖ పనితీరుపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. పారిశ్రామిక ప్రగతి నివేదిక ఇచ్చి మూడేళ్లైనా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనితీరు మూలంగా పరిశ్రమలన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయని శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. బ్యాంకులు సైతం ఎగ్గొట్టేవారికే రుణాలిస్తున్నాయన్నారు. పరిశ్రమల శాఖ, బ్యాంకుల పనితీరు మారాలని శ్రవణ్ కుమార్ సూచించారు. -
చెల్లెలి ప్రేమ పెళ్లి.. అన్నయ్య విషాదాంతం
తూప్రాన్(మెదక్): పాతికేళ్లకే కుటుంబానికి పెద్ద దిక్కుగా మారి ఒక్కగానొక్క చెల్లెలికి ఘనంగా పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేసిన అన్నయ్యకు చెల్లి ప్రేమ పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చింది. దీంతో మనస్తాపానికి గురైన అన్న రైలు కిందపడి తనువు చాలించాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని బ్రాహ్మణపల్లి రైల్వే గేట్ వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. తూప్రాన్కు చెందిన శ్రావణ్కుమార్ కంప్యూటర్ ఆపరేటర్గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు భుజానికెత్తుకొని బతకు బండిని లాగిస్తున్నాడు. ఈ క్రమంలో తన ఒక్కగానొక్క చెల్లెలికి ఘనంగా పెళ్లి చేయాలనుకొని మంచి సంబంధం చూశాడు. ఈనెల 20 నిశ్చితార్థానికి ఏర్పాట్లు పూర్తిచేశాడు. ఈ సమయంలో ఆదివారం సాయంత్రం శ్రావణ్కుమార్ చెల్లెలు తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకొని పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు శ్రావణ్ను స్టేషన్కు పిలిపించి మాట్లాడారు. అల్లారుముద్దుగా చూసుకున్న చెల్లెలు తన పరువు తీసిందని భావించిన శ్రావణ్ అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఈ రోజు ఉదయం రైల్వే గేట్ వద్ద మృతదేహం పడి ఉందనే సమాచారంతో అక్కడికి వెళ్లిన కుటుంబసభ్యులు శ్రావణ్ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రబీకి సిద్ధం కండి
మరో 20 రోజుల్లో సీజన్ శనగ, కంది, సోయ, ఆముదం తదితరాలకు అనుకూలం గజ్వేల్ ఏడీఏ శ్రావణ్కుమార్ సలహాలు, సూచనలు గజ్వేల్: ఖరీఫ్.. రైతుల ఆశలను అడియాసలు చేసింది. అదను సమయంలో వర్షాలు లేక మొక్కజొన్నతో పాటు ప్రధాన పంటలన్నింటికీ భారీ నష్టం సంభవించింది. వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల సాగు 3.72లక్షల హెక్టార్లకే పరిమితమైంది. వర్షాలు అనుకున్న స్థాయిలో కురిస్తే నిజానికి 5.5లక్షల హెక్టార్లు సాగులోకి వచ్చేది. కానీ పరిస్థితి భిన్నంగా మారింది. ఉన్న పంటలు కూడా సక్రమంగా లేకపోవడం రైతులను ఆందోళన కలిగిస్తుంది. ఇలాంటి తరుణంలో రైతులు మరో 20రోజుల తర్వాత ‘రబీ’కి సిద్ధం కావాల్సి ఉంది. ప్రస్తుత సీజన్లో వేయదగిన పంటలు, వాటి యాజమాన్య పద్ధతులపై గజ్వేల్ ఏడీఏ శ్రావణ్కుమార్ (సెల్ : 7288894469) సలహాలు, సూచనలు అందించారు. శనగ అక్టోబర్ నుంచి నవంబర్ 30 వరకు ఈ పంటను విత్తుకోవచ్చు. ఎకరాకు 24-26 కిలోల విత్తనం అవసరముంటుంది. అదే విధంగా 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఇందుకోసం అవసరముంటుంది. ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తుంది. ఇవే కాకుండా జ్యోతి, అన్నెగిరి, శ్వేత, క్రాంతి, ఐసీసీవీ-10 రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రైతులు విధిగా రైజోబియం కల్చర్తో విత్తన శుద్ధి చేపట్టాలి. కంది అక్టోబర్లో ఈ విత్తనాన్ని విత్తుకోవచ్చు. ఎకరాకు 4-5కిలోల విత్తనం అవసరముంటుంది. 12కిలోల నత్రజని, 20కిలోల బాస్వరం మోతాదులో రెండు పర్యాయాలు వేయాల్సి వుంటుంది. ఎల్ఆర్జీ-30, సీ-11, అభయ, ఐసీపీఎల్ 85063తోపాటు పలు రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సోయచిక్కుడు అక్టోబర్ నెలలో విత్తనం వేయాల్సి వుంటుంది. ఎకరాకు 20-24 కిలోల విత్తనం అవసరముంటుంది. 12కిలోల నత్రజని, 24కిలోల భాస్వరం, 16కిలోల పొటాష్ అవసరముంటుంది. మార్కెట్లో ప్రస్తుతం హార్డీ, జేఎస్-335, మ్యాక్స్ 58/201/పీకే 472/ఎల్ఎస్బీ-1, మోనెట్టా. డైథేన్, థైరమ్ 3గ్రాములు కిలో విత్తనం చొప్పున వేసి శుద్ధి చేయాలి. నువ్వులు డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు విత్తనాలు వేసుకోవచ్చు. ఎకరాకు 2-2.5 కిలోల విత్తనం అవసరముంటుంది. 16కిలోల నత్రజని, 24కిలోల బాస్వరం, 12కిలోల పొటాష్ వేసుకోవాలి. రాజేశ్వరీ, వైఎల్ఎం-17, పూసోబోల్డ్, క్రాంతి, సీత, వరుణ, కష్ణ రకాల విత్తనాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. పొద్దుతిరుగుడు అక్టోబర్ నుంచి నవంబర్ నెలాకరు వరకు ఈ విత్తనాలను వేసుకోవచ్చు. ఎకరాకు సాధారణ రకాలు 2.4-3.2, హైబ్రిడ్ రకాలయితే 2-2.4 కిలోల విత్తనం అవసరముంటుంది. ఇందుకోసం 26కిలోల నత్రజని, 24కిలోల బాస్వరం, 12కిలోల పొటాష్ వేయాల్సి వుంటుంది. ఈజీ68414, మోర్డాన్, కో-1, ఏపీఎస్హెచ్-11, ఎంఎస్ఎఫ్హెచ్-8, 17, కేబీఎస్హెచ్-1, బీఎస్హెచ్-1 రకాలు మార్కెట్లో దొరుకుతాయి. 25-35 టన్నుల ఎరువు వాడాలి. కలుపు నివారణకు పైరు మొలకెత్తకముందే 15కిలోల ఫ్లూకోరాలిన్ చల్లాలి. విచ్చుకునే దశ, గింజలు ఏర్పడే దశలో నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. ఆముదం అక్టోబర్ నుంచి నవంబర్ 15వరకు విత్తనాలు వేసుకోవచ్చు. ఎకరాకు 5-6కిలోల విత్తనం అవసరముంటుంది. 16కిలోల నత్రజని, 16కిలోల భాస్వరం, 8కిలోల పొటాష్ వేసుకోవాలి. అరుణ, భాగ్య, సౌభాగ్య, 48-1, గౌచ్1, క్రాంతి, హరిత, కిరణ్, జ్యోతి, జ్వాల, జీసీహెచ్-4, డీసీహెచ్-32 రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కాఫ్టాన్ లేదా థైరమ్తో విత్తన శుద్ధి చేపట్టాలి. 2టన్నుల పశువుల ఎరువును వాడితే మంచింది. దనియాలు అక్టోబర్ నుంచి నవంబర్ వరకు విత్తనాలను వేసుకోవాల్సి వుంటుంది. ఎకరాకు 6కిలోల విత్తనం అవసరముంటుంది. 12కిలోల నత్రజని, 16కిలోల భాస్వరం, 8కిలోల పొటాష్ వేసుకోవాలి. ఎకరానికి 4టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. -
లింగాకర్షక బుట్టల ఏర్పాటు
గజ్వేల్: వరిలో కాండం తొలుచు పురుగు నివారణకు లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలని గజ్వేల్ ఏడీఏ శ్రావణ్కుమార్ సూచించారు. గురువారం గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లి గ్రామంలో రైతు నరేందర్రెడ్డికి చెందిన వరి పొలంలో కాండం తొలుచు పురుగు నివారణకు లింగాకర్షక బుట్టలను మండల వ్యవసాయాధికారి ప్రవీణ్ సమక్షంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రావణ్కుమార్ మాట్లాడుతూ లింగాకర్షక బుట్టల్లో ఉన్న ఆడ రెక్కల పురుగులు మగ రెక్కల పురుగులను వాసనతో ఆకర్షించి బుట్టలో పడేలా చూస్తాయని పేర్కొన్నారు. దీని వల్ల కాండం తొలుచు పురుగు ఉదృతి తగ్గుతుందని వెల్లడించారు. ఈ బుట్టలను రైతులు వరి పొలంలో ఏర్పాటు చేసుకుంటే మంచి ఫలితాలుంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ అధికారి గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘టేకు’సాగుతో లాభాలే
వృక్షాల్లో అత్యంత విలువైనది సాగుపై అవగాహన అవసరం గజ్వేల్ ఏడీఏ శ్రావణ్కుమార్ సలహాలు, సూచనలు గజ్వేల్: కలపకు అనువైన వృక్షాల్లో ‘టేకు’ కీలకమైంది. అత్యంత విలువైందిగా ఈ వృక్షానికి పేరుంది. తమకు అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాల్లో రైతులు టేకు సాగు చేసుకుని ఏటా మంచి ఆదాయం పొందవచ్చని గజ్వేల్ ఏడీఏ శ్రావణ్కుమార్ (సెల్ నెం : 7288894469) సూచిస్తున్నారు. సాగు విధానాలపై ఆయన అందించిన సలహాలు, సూచనలివి... టెక్టోనా గ్రాండీస్ ఈ రకం వృక్షాలు సాధారణంగా నవంబర్ నుంచి మే వరకు ఆకులు రాల్చి, ఏప్రిల్ నుంచి జూన్లో కొత్త ఆకులు తొడుగుతాయి. ఆకులు పెద్దవిగా, దళసరిగా గుమ్మడి ఆకులవలే గరుకుదనం కలిగిఉంటాయి. జూలై-ఆగస్టులో పూతకు వచ్చి, నవంబర్-జనవరి మధ్యన విత్తనాలు తయారవుతాయి. సిల్వర్ కల్చర్ ఈ రకం టేకు చెట్టుకు ఎక్కువ సూర్యరశ్మి అవసరం. అనావృష్టి, ఎక్కువ చలిని తట్టుకునే శక్తిని ఈ చెట్టుకు ఉండదు. ఒక మాదిరిగా గాలి వేగాన్ని తట్టుకుంటుంది. ఈ మొక్కలను పశువులు మేయవు. కానీ విరిగినట్లయితే పక్కనుండి పిలకలు పెట్టే శక్తి ఎక్కువగా ఉంటుంది. వీటిలో బలమైన ఓ పిలక ఉంచి మిగిలిన వాటిని తీసివేయాలి. దేశవాళీ రకాలు నీలాంబర్ టేకు: దీనినే మలబారు టేకు అని కూడా అంటారు. కేరళాలోని సముద్ర తీరప్రాంతంలో ఇది ఉత్పత్తి అవుతుంది. అదిలాబాద్ టేకు: తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 7వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వాసం, జామాయిల్తో పాటు పద్ధతి ప్రకారం పెంచుతున్నారు. సీపీటీ టేకు: ఈ రకం మధ్యప్రదేశ్లో ఉత్పత్తి అవుతుంది. దెండ్లీ టేకు: కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాల్లో పెంచబడే రకం. దీన్ని నార్త్ కర్ణాటక టేకు అని కూడా అంటారు. గోదావరి టేకు: ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాల్లో ఉత్పత్తి అయ్యే రకం. మైసూర్ టేకు: మైసూర్ జిల్లాలో ఉత్పత్తి అయ్యే టేకు రకం దిగుమతి చేసుకునే అవకాశమున్న మరికొన్ని రకాలు మయన్మార్, బర్మాటేకు, ఘనా టేకు, కొలంబియా టేకు(దక్షిణ అమెరికా), జావా టేకు(ఇండోనేషియా, థాయ్లాండ్), మలేషియా టేకు. పునరుత్పత్తి విత్తనాల నుంచి సహజ పునరుత్పత్తి చేయవచ్చు. స్టంప్ లేదా టిష్యూ కల్చర్ మొక్కల ద్వారా కృత్రిమ పునరుత్పత్తి చేయవచ్చు. విత్తనాల సేకరణ పక్వానికి వచ్చిన పండ్ల నుంచి విత్తనాలను సేకరించాలి. భూమిపై రాలిన విత్తనాలను పోగు చేసి శుభ్రం చేయాలి. విత్తన శుద్ధి విత్తనాలను వేడినీటిలో 2-4గంటల వరకు ఉంచి, ఆపై విత్తనాలు చల్లబడ్డాక విత్తుకోవాలి. లేదా విత్తనాలను ప్రతి రోజు రాత్రి నానబెట్టి పగలు ఎండబెట్టాలి. ఇలా 15-20రోజులు చేసి ఆ తర్వాత నారుమడిలో విత్తుకోవాలి. లేదా విత్తనాలను గోనే సంచిలో వేసి గుంతలో పూడ్చి 10 రోజుల వరకు ప్రతిరోజు నీరు పోసి ఆ తర్వాత నారుమడిలో విత్తుకోవాలి. లేదా విత్తనాలను పేడ నీళ్ల పేస్టులో 15రోజులుంచి ఆ తర్వాత విత్తుకోవాలి. లేదా విత్తనాలను 2-3 వారాల వరకు పగలు ఎండలోనూ, రాత్రి నీటిలో ఉంచి ఆ తర్వాత విత్తుకోవాలి. ఇదీ కాకపోతే విత్తనాలను సల్ఫ్యూరిక్ ఆమ్లంలో 15 నిమిషాలు ఉంచి ఆ తర్వాత శుభ్రంగా కడిగి విత్తుకోవాలి. నారు మడుల తయారీ, నాటే విధానం శుద్ధి చేసిన విత్తనాలను 6మీటర్ల పొడవు, 1మీటరు వెడల్పుగల నారు మడుల్లో ఫిబ్రవరి-మే మధ్య కాలంలో విత్తుకోవాలి. అలా మొలిచిన మొక్కలను ఒక ఏడాదిపాటు పెరగనీయాలి. మొక్కలను పీకి స్టంప్లను తయారు చేయాలి. వేరు భాగాల్లోని పక్క వేర్లను పదునైన కత్తితో తీసివేయాలి. స్టంప్లను జూలై నెలలో 3/1.3 మీటరు దూరంలో వాలుకు అడ్డంగా నాటాలి. లేదా స్టంప్లను పాలథిన్ సంచులలో 6 నెలలు పెంచి నాటవచ్చు. ఎకరాకు వెయ్యి మొక్కలు నాటాలి. ఎరువులు ప్రతి పాదులో స్టంప్ నాటిన రెండు నెలల తర్వాత 4కిలోల పశువుల ఎరువు వేయాలి. అలాగే సంచులలో పెంచిన మొక్కలు నాటే గుంతల్లో 4కిలోల పశువుల ఎరువుతో పాటు 50 గ్రాముల్లో 3శాతం లిండేన్ పొడిని వేసి నాటుకోవాలి. మొదటి ఏడాది డీఏపీ ఒక్కో మొక్కకు 150గ్రాములు రెండు దఫాలుగా జూలై నుంచి డిసెంబర్ నెలల మధ్యలో ఇవ్వాలి. రెండో ఏడాది డీఏపీ 300గ్రాములు రెండు దఫాలుగా జూలై నుంచి డిసెంబర్ మధ్యలో వేయాలి. మూడో ఏడాది డీఏపీ 400 గ్రాములు ఒక దఫా జూలై నెలలో వేయాలి. నీటి యాజమాన్యం మొక్కలు నాటగానే 4రోజులు... రోజు విడిచి రోజు నీరు పోయాలి. ఆపైన వర్షాలు లేనప్పుడు 15-20రోజులకోసారి నీరు ఇవ్వాలి. వేసవి కాలంలో 10-15 రోజులకోసారి నీరు ఇవ్వాలి. అలా కనీసం 2-3 సంవత్సరాల వరకు వేసవిలో నీరు ఇవ్వాలి. డ్రిప్ పద్ధతిలోనూ నీరు పెట్టుకోవడం శ్రేయస్కరమే. -
'అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి'
గుంటూరు: రాజధాని ప్రాంత రైతులతో సక్రమంగా వ్యవహరించడం లేదని సీఆర్డీఏ అధికారులపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. రైతులకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమాచారాన్ని తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. నేతల వల్లనే సమస్యలు వస్తున్నాయని చెప్పడంతో అధికారులపై ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వారం రోజుల్లో రైతుల సమస్యలను పరిష్కరించాని ఆదేశించారు. -
పెళ్లికిముందే వరకట్న కాటు: యువతి బలి
ఆత్మకూరు: పెళ్లి కాకముందే వరకట్న వేధింపులు ఒక నిండు జీవితాన్ని బలి తీసుకున్నాయి. నిశ్చితార్థం సమయంలో కట్నకానుకలు మాట్లాడుకున్నారు. పెళ్లిలో ఒప్పుకున్న కట్నం నగదు మొత్తం ఇవ్వాలంటూ ఓ యువకుడు వేధించగా.. ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. వరంగల్ జిల్లా ఆత్మకూరులో గు రువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు. ఆత్మకూరుకు చెందిన మార్త శంకర్-రమ దంపతుల ఏకైక కుమార్తె రోజారాణి(21) పీజీ, బీఈడీ పూర్తి చేసింది. ఆమెకు నా లుగు నెలల క్రితం దుగ్గొండి మండలం మైసంపల్లెకు చెందిన ఎంఫార్మసీ పూర్తిచేసిన బిట్ల శ్రావణ్కుమార్తో వివాహం నిశ్చయించారు. వీరు బంధువులే. నిశ్చితార్థ సమయంలో రూ. 5 లక్ష లు ఇచ్చిన రోజారాణి తల్లిదండ్రులు రూ. 2 లక్షలు వివాహం సమయంలో, ఆ తర్వాత కొం తకాలానికి రూ. 6 లక్షలు ఇస్తామని ఒప్పుకున్నా రు. అలాగే, ఈనెల 18న పెళ్లి ముహూర్తం కూ డా నిశ్చయించారు. అయితే, పెళ్లి సమయంలో మొత్తం కట్నం ఇవ్వాలని, లేకుంటే పెళ్లి ఆపుతానని శ్రావణ్కుమార్ తరచూ ఫోన్లో ఆమెను వేధించసాగాడు. గురువారం ఇరువర్గాల వారు పెళ్లి దుస్తుల కోసం హన్మకొండకు వెళ్లారు. చెప్పులు కొనుక్కునేందుకు శ్రావణ్, రోజారాణి వెళ్లగా, అక్కడ కూడా డబ్బుల విషయంలో ప్రస్తావించాడు. దీంతో మనస్తాపానికి గురైన రోజారాణి గురువారం అర్ధరాత్రి తర్వాత ఇంటిపైకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పం టించుకుంది. బాధ భరించలేక అరుస్తూ డాబా పైనుంచి కిందకు దూకగా.. స్థానికులు, తల్లిదండ్రులు ఆమెను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ శుక్రవారం మృతి చెందింది. అయితే, కట్నం డబ్బు కోసం శ్రావణ్ వేధించడం వల్లే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి చేసిన శంకర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చంద్రబాబు ఇచ్చే ఏసీ రూమ్స్ అవసరం లేదు!
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని భూసేకరణపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు చంద్రబాబు ఏసీ రూమ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని.. భూములను యథావిధిగా ఉంచితే తామే ఏసీ రూమ్స్ ను ఏర్పరచుకోగలమని వారు స్పష్టం చేశారు. సోమవారం జిల్లాలోని లింగాయపాలెంలో వైఎస్సార్ సీపీ రైతు, కూలీ హక్కుల పరిరక్షణ కమిటీ పర్యటనలో రైతులు తీవ్రంగా స్పందించారు. సెంటు భూము లేని కౌలు రైతులు ఎంతో కష్టపడి 10 ఎకరాలు సంపాదింఇచన విజయగాథలు తుళ్లురు మండలంలో ఉన్నాయన్నారు. 'చంద్రబాబు ఏసీ రూమ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మాకు ఏసీ గదుల్లో పడుకునే శక్తి ఉంది' అని వారు పేర్కొన్నారు. ఆ స్థాయిలో ఆదాయ వనరులు తెచ్చుకునే శక్తి ఇక్కడి రైతులకు ఉందని రైతులు కరాఖండిగా తేల్చిచెప్పారు. సింగపూర్ మనకు అవసరమా?కిలో కూరగాయలు కొనుక్కునే శక్తి మనకు అవసరమా?రైతులు ప్రశ్నించారు. ఇక్కడ భూములను పాడు చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని.. ఇక్కడ రాజధాని కడితే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూరగాయల ధరల పెరుగుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్ ను నియంత్రించే శక్తి ఇక్కడ రైతులకు ఉందని.. ఇంత సస్య శ్యామలంగా ఉండే భూములను ఎందుకు ఎంచుకున్నారో తమకు తెలియడం లేదన్నారు. రాజధాని భూసేకరణ ప్రాంతాల్లో ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడుతోందని రైతులు ఎద్దేవా చేశారు. సంపద సృష్టించే శక్తి ఉన్న రైతులు ఇక్కడ ఉన్నారని.. నదికి ఆనుకుని ఉన్న భూములను వదిలేయాలని కోరుతున్నామన్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధోరణి ఉందన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్క చినుకుకూడా పడలేదని..ఆ సమయంలో కరవు రాజ్యాన్ని ఏలిందన్న సంగతిని రైతులు గుర్తు చేసుకున్నారు. చిన్న రైతులను నష్టపరిచే ప్రతిపాదనలను ప్రభుత్వం తీసుకొస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. -
రాయపూడిలో రాజధాని భూముల రభస!
-
రాయపూడిలో రాజధాని భూముల రభస!
గుంటూరు: తుళ్లూరు మండలం రాయపూడిలో రాజధాని భూముల సేకరణపై జరుగుతున్న అభిప్రాయ సేకరణ సమావేశంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అభిప్రాయ సేకరణలో తమను ఎందుకు మాట్లాడనివ్వరని కొందరు రైతులు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ అనుచరులు రైతులకు అడ్డు తగిలారు. వారితో వాగ్వాదానికి దిగారు. ప్రశ్నించిన రైతులపై ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యం చేశారు. రైతులు తమ సమస్యలు చెప్పకుండా, వారి కోరికలు తెలియజేయకుండా అడ్డుపడ్డారు. ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులను కూడా వారు దుర్భాషలాడారు. ** -
అభిప్రాయసేకరణ సమావేశం రసాభాస!
గుంటూరు: గుంటూరు జిల్లాలో రాజధాని ఏర్పాటు కోసం భూసేకరణకు సంబంధించి అభిప్రాయ సేకరణ కోసం నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. లింగాయపాలెం వెళ్లిన తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, రాజమండ్రి లోక్సభ సభ్యుడు మాగంటి మురళీమోహన్లపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకూలంగా ఉన్న రైతులతో మాత్రమే మాట్లాడిస్తున్నారని, వ్యతిరేకించే రైతుల సమస్యలు ఎందుకు వినరని రైతులు ప్రశ్నించారు. ఏకపక్షంగా వ్యవహరించవద్దని వారు చెప్పారు. భూసమీకరణను వ్యతిరేకిస్తూ స్థానిక రైతులు ఘోరావ్ చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ** -
కట్టుకున్న భార్యే.. పొట్టన బెట్టుకుంటుందనుకోలే..
శివునిపల్లి(స్టేషన్ఘన్పూర్ టౌన్) : పెద్దలు, కుటుంబ సభ్యుల మాటను కాదని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యే తమ కుమారుడిని పొట్టన పెట్టుకుంటుందని అనుకోలేదని ఆ దంపతులు కన్నీరుమున్నీరయ్యూరు. నమ్మించి.. మట్టుబెట్టిందని శాపనార్థాలు పెట్టారు. శివునిపల్లికి చెందిన కుసుమ సత్తెమ్మ, రాజమౌళి దంపతుల కుమారుడు శ్రావణ్కుమార్(33) హైదరాబాద్లో ఈ 9న భార్య చేతిలో హత్యకు గురయ్యూడు. అతడి మృతదేహాన్ని సోమవారం రాత్రి స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. మృతుడి తల్లిదండ్రులు, సోదరుడి కథనం ప్రకారం.. శ్రావణ్కుమార్ సుమారు ఎనిమిదేళ్ల క్రితం ఇదే గ్రామానికి చెందిన అమృత నర్సింహారావు, విజయ దంపతుల కుమార్తె పావనిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సమయంలో బీటేక్ ఫైనలియర్ చదువుతున్న అతడిని తల్లిదండ్రులు ఎంటెక్ చదివించారు. అనంతరం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తూ భార్యతో కలిసి హైదరాబాద్లో ఉంటున్నాడు. వారికి కుమారుడు అభినవ్, కుమార్తె వశిష్ట ఉన్నారు. హైదరాబాద్ వనస్థలిపురం బాలాజీనగర్లో బ్యాంకు రుణం తీసుకుని ఇల్లు నిర్మించుకోవడంతోపాటు ఫైనాన్స్లో కారు కొనుగోలు చేశారు. కాగా ఏడాది క్రితం అతడిని కళాశాల యూజమాన్యం ఉద్యోగంలో నుంచి తొలగించింది. దీంతో కుటుంబం గడవడం కష్టంగా మారడంతోపాటు ఏడు నెలల క్రితం దంపతుల మధ్య గొడవలు జరిగాయి. దీంతో మనోవేదనకు గురైన శ్రావణ్కుమార్ తన పిల్లలను తీసుకుని శివునిపల్లిలో తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. మూడు నెలల క్రితం పిల్లలు కావాలని ఇంటికి వచ్చిన భార్య పావని పాపను తీసుకుని తిరిగి హైదరాబాద్ వెళ్లింది. పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచారుుతీలు కాగా ఇద్దరు కలిసి శివునిపల్లిలో ఉండాలని వారు నిర్ణరుుంచారు. అందుకు పావని అంగీకరించలేదు. దీంతో అతడు ధర్మసాగర్ మండలం రాంపూర్ వీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరాడు. కుమారుడిని ఘన్పూర్లోని హోలీక్రాస్ పాఠశాలలో చేర్పించి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలోనే పావని హైదరాబాద్లోని పోలీస్స్టేషన్లో అతడిపై ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత దీపావళి పండుగ మరుసటి రోజు ఇంటికి వచ్చిన పావని తాను మారిపోయానని, అంతా కలిసి ఉందామని చెప్పడంతో శ్రావణ్కుమార్ నమ్మాడని తల్లిదండ్రులు తెలిపారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి వేములవాడకు వెళ్లొచ్చారని, హైదరాబాద్లో ఉన్న ఇంటిని అమ్మేందుకని ఈ నెల 8న హైదరాబాద్కు వెళ్లిన కొడుకు తిరిగిరాలేదని వారు విలపించారు. ఈ నెల 9న రాత్రి హైదరాబాద్ నుంచి పోలీసులు ఫోన్ చేసి శ్రావణ్ చనిపోయినట్లు చెప్పారని వాపోయూరు. శ్రావణ్ను భార్య, అత్త పథకం ప్రకారం హతమార్చారని, వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. -
భర్తను గొంతునులిమి హతమార్చిన భార్య
-
భర్తను గొంతునులిమి హతమార్చిన భార్య
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్లోని బాలజీనగర్లో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తాళికట్టిన భర్తనే హతమార్చిందో భార్య. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానికంగా నివాసం ఉంటున్న శ్రవణ్ కుమార్, పావని దంపతుల మధ్య గత కొద్దికాలంగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. దాంతో భర్త వేధింపులకు విసిగిపోయిన పావని... శ్రవణ్ కుమార్ను గొంతునులిమి హతమార్చింది. కాగా శ్రవణ్ కుమార్ గత కాలంగా మద్యం సేవించి భార్య పావనిని మానసికంగా, శారీరకంగా వేధిస్తుండేవాడని, దాంతో వేసారిన ఆమె ఈ హత్య చేసినట్లు సమాచారం. వనస్థలిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితురాలిని విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రసాయనేతర సస్యరక్షణ
వరిని ఆశించే క్రిమికీటకాల నివారణ వరినాట్లు వేసిన తర్వాత 30 రోజులకు 10కిలోల వేప పిండిని లేదా కానుగ పిండిని పొడి చేసి ఎకరం పొలంలో చల్లాలి. ఇది గొంగలి పురుగులను నివారిస్తుంది. వేప ఆకులను కట్టగా కట్టి ఎకరం పొలంలో పలు ప్రదేశాల్లో 10 చోట్ల పెట్టడం ద్వారా కూడా ఈ పురుగులను తరిమివేయవచ్చు. 5కిలోల ఆముదం గింజలను పెనంపై వేయించి, పొడి చేసి, దీనికి తగువిధంగా నీరు కలిపి పేస్టు(ముద్ద)గా తయారు చేయాలి. - దీన్ని మట్టి కుండలో ఉంచి ఎకరా పొలంలో 5, 6చోట్ల పెట్టాలి. ప్రతి పది రోజులకోసారి పేస్టును మారుస్తుండాలి. మట్టి కుండలపై మూత పెట్టకూడదు. ఇది రెక్కల పురుగులను ఆకర్శించడానికి ఎరగా ఉపయోగపడుతుంది. వరి పొలాల్లో నిండా నీరు పెట్టడం వల్ల నేలల్లో దాగి ఉన్న డింబక, కోశస్థ దశ క్రిములు బయటకు రావడంతో పక్షలు వీటిని తినేస్తాయి. దీనికోసం ఎకరం పొలంలో నాలుగైదు చొప్పున పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. వరి ఈనిన తర్వాత టీ ఆకారంలో కర్రలను క ట్టి పొలంలో అక్కడక్కడ పాతాలి. వీటిపై వాలే పక్షులు పంటలను పాడు చేసే పురుగులను తినేస్తాయి. లీటరు కిరోసిన్(గ్యాస్నూనె)లో అర కిలో వెళ్లుల్లిని రాత్రంతా నాబెట్టాలి. ఉదయం దీనికి పావు కిలో అల్లం, పావుకిలో పచ్చిమిర్చిని కలిపి తగినంత నీటిని వేసుకుని దీన్ని పేస్టుగా నూరుకోవాలి. దీనిలో కొన్ని మిరపకాయలు వేసి తగినంత నీటితో కలిపి పేస్టుగా చేసుకోవాలి. దీన్ని 60లీటర్ల నీటిలో కలిపి ఎకరం పైరుపై పిచికారీ చేయాలి. మిడతలు, నల్ల నల్లులు, తాటాకు తెగులు నివారణ పొలంలోని పలు ప్రదేశాల్లో కొన్ని జిల్లేడు ఆకులను ఒకదానిపై ఒకటి పేర్చాలి. వీటి ప్రభావం వల్ల మితడత లు, నల్లనల్లు, తాటాకు తెగులు నుంచి పంటలను కాపాడుకోవచ్చు. ఎకరానికి 10-15 కిలోల విప్ప పిండి లేదా వేప చెక్కలతో పదిహేను రోజులకు ఒకసారి పొలంలో పొగబెట్టాలి. 5లీటర్ల కిరోసిన్ను 30లీటర్ల నీటిలో కలిపి సాయంత్రం వేళల్లో పొలంలో స్రే చేస్తే చేలకు హానిచేసే పురుగులు నివారించబడుతాయి. పిండి నల్లి, ఎర్ర నల్లి నివారణ వేపగింజల పొడిని ఒక గుడ్డ సంచిలో రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఆ సంచిని పిండగా వచ్చిన కషాయాన్ని వడబోసి 50-60 లీటర్ల నీటిలో కలిపి ఎకరం పైరుపై పిచికారీ చేస్తే ఫలితం కనిపిస్తుంది. గింజలు మగ్గే దశలో ఆశించే కంపు నల్లి నివారణ సైకస్ పువ్వును 5-10 ముక్కలుగా చీల్చి కర్రలకు కట్టి ఎకరా పొ లంలో 15-20చోట్ల ఉంచితే చిన్న, పెద్ద కంపు నల్లులు ఆ పూల వాసన భరించలేక నివారించడుతాయి. 3 శాతం వేప నూనె ద్రా వకాన్ని గానీ, 5శాతం వేప గింజల కషాయాన్ని గానీ కంకి ఏ ర్పడే దశలో స్ప్రే చేస్తే ఈ కంపు నల్లి బెడదను నివారించవచ్చు. -
చేవెళ్ల డిగ్రీ కళాశాలలో జాబ్మేళా
చేవెళ్ల రూరల్, న్యూస్లైన్: చేవెళ్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం పూర్వ విద్యార్థులకు యురేకా ఫోర్బ్స కంపెనీ జాబ్మేళా నిర్వహించింది. పలువురు విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంది. ఉన్నత చదువులు చదివి నిరుద్యోగులుగా ఉన్న విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడిందని కళాశాల ప్రిన్సిపల్ శ్రావణ్కుమార్ అన్నారు. కళాశాలలో చదువుకుని, ఆ తర్వాత ఖాళీగా ఉన్నవారికి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. జాబ్మేళాకు హాజరైన విద్యార్థులు యురేఖ ఫోబ్స్ కంపెనీ ప్రతినిధులు అయ్యప్ప, ఎండీ రఫీయోద్దీన్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎంపికైన వారు డిసెంబర్ 2వతేదీలోపు జాబ్లో జాయిన్ కావాలని వారు చెప్పారు. కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్ కొందరు విద్యార్థినులు కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. పలు రకాల సాంప్రదాయ వంటకాలను ఇందులో ఉంచారు. ఫుడ్ఫెస్టివల్లో వంటకాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు వెంకటరమణ, శ్రీలక్ష్మి, జ్యోతీర్మయి, సుజాత పాల్గొన్నారు. -
తెలంగాణను అడ్డుకుంటే మహాయుద్ధమే: శ్రవణ్కుమార్
శామీర్పేట్, న్యూస్లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంకులు కల్పించినా, ఆంక్షలు పెట్టినా మహాయుద్ధం చేపడతామని టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రవణ్కుమార్ హెచ్చరించారు. శుక్రవారం అలియాబాద్లోని సంగీత్ ఫంక్షన్హాల్లో టీఆర్ఎస్ మండలస్థాయి కార్యకర్తలకు శిక్షణ తరగతుల్లో ఆయన ప్రసంగించారు. సీమాంధ్రుల ఒత్తిడికి లొంగి హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించినా, వెనుకంజ వేసినా మహోద్యమానికి కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, టీడీపీల ద్వంద్వ వైఖరిని ప్రజలకు విడమర్చి చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేయాలనే నిర్ణయం వెనుక ఈ ప్రాంతం పైన, ప్రజల పైన ప్రేమతో కాదని, ఎన్నికల్లో లబ్ధికోసమేననే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కాంగ్రెస్లో టీఆర్ఎస్ విలీనం గాని, ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ ఎలాంటి త్యాగాలు చేసిందో ప్రజలకు వివరించాలని, పార్టీ పటిష్టానికి కృషి చేయాలని సూచించారు. టీఆర్ఎస్ సుదీర్ఘ పోరాటం, వెయ్యిమంది తెలంగాణవాదుల అత్మ బలిదానాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతోందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. అనంతరం ప్రొఫెసర్ శ్రీధర్ మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో టీఆర్ఎస్ కీలకపాత్ర పోషించాల్సి ఉంటుందని, రాబోయే ఎన్నికల్లో పార్టీ సొంతంగా పోటీ చేసి అత్యధిక స్థానాలు గెలుపొందాల్సి ఉంటుందని సూచించారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుతో గెల్చిన సర్పంచ్లు, వార్డు సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు స్వప్న, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సుధీర్రెడ్డి, మాజీ ఎంపీపీ పల్లె సీతారాములుగౌడ్, టీఆర్ఎస్ శామీర్పేట్, మేడ్చల్, కీసర మండలాల పార్టీ అధ్యక్షులు విష్ణుగౌడ్, భాస్కర్, రవికాంత్, టీఆర్ఎస్ యూత్ మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి చాప భాస్కర్, మండల యూత్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు మురళిగౌడ్ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన ధూంధాంలో జవహర్నగర్ ఆకాశరామన్న కళామండలి సభ్యులు తెలంగాణ గేయాలు, జానపద నృత్యాలతో సభికులను ఆకట్టుకున్నారు. -
‘టీ మంత్రుల వల్లే సీఎం విభజన వ్యతిరేకవాదం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రాంత మంత్రుల అలసత్వం వల్లే ముఖ్యమం త్రి కిరణ్కుమార్రెడ్డి విభజనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ మండిపడింది. పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు దాసోజ్ శ్రవణ్ మంగళవారం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. మంత్రివర్గంలో చర్చించకుండా ముఖ్యమంత్రి ప్రభుత్వ పరంగా జీవోఎంకు నివేదికలు ఇవ్వడం అప్రజాస్వామికమన్నారు. సీఎం రాష్ట్రంలో రెం డు ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచుతున్నారని, రాష్ట్ర అంతర్గత భద్రతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి సొంత ప్రాంతమైన చిత్తూరు జిల్లాలో ఉగ్రవాదులుంటే రాష్ట్ర ఇంటిలిజెన్స్ పసిగట్టలేకపోయిందని.. తమిళనాడు ఇంటిలిజెన్స్ చెప్పిన తరువాతే తెలిసిందన్నారు. పరిస్థితి అలా ఉంటే విభజన జరిగితే ఉగ్రవాదం వస్తుందని కిరణ్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. -
బైక్ కోసం విద్యార్థి హత్య
కోహీర్, న్యూస్లైన్ : పైసాపైసా కూడబెట్టి ఎంతో ఇష్టంగా కొన్న మోటార్ సైకిల్పై మోజు తీరకనే ఓ విద్యార్థి హత్యకు గురయ్యాడు. పుల్కల్ ఎస్ఐ రమేష్ కథనం మేరకు.. పుల్కల్ మండలం శివంపేటకు చెందిన కిష్టయ్య, శివమ్మ దంపతుల రెండో కుమారుడైన శ్రావణ్కుమార్ (19) సంగారె డ్డిలోని శ్రీనిధి కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. పేదవారైన తన తల్లిదండ్రులను కష్టపెట్టకుండా కష్టపడి సంపాదించి 15 రోజుల క్రితం టీవీఎస్ స్పోర్ట్స్ మోటారు సైకిల్ను కొన్నాడు. ఇదిలా ఉండగా అవసరం నిమిత్తం కొండాపురం మండలం హరిదాస్పూర్కు చెందిన మిత్రుడు దశరథ్సింగ్ను డబ్బు అడిగాడు. అయితే తన వద్ద డబ్బులు లేవని తన అన్న వరసకు అయిన బానో త్ రాందాస్ వద్ద ఇప్పిస్తానని చెప్పడంతో ఇద్దరూ కలిసి బైక్పై హరిదాస్పూర్ వెళ్లారు. అక్కడ కూడా వారికి డబ్బు దొరకలేదు. కర్ణాటక రాష్ట్రం బోనస్పూర్ తండాలోని తన బంధువుల వద్ద డబ్బులు ఇప్పిస్తానని రాందాస్ శ్రావణ్కుమార్కు చెప్పాడు. దీంతో ముగ్గురూ కలిసి గత శనివారం బైక్పై బోనస్పూర్ వెళ్లారు. అక్కడ కూడా వారికి డబ్బులు దొరకలేదు. దీంతో బోనస్పుర్లో మద్యం సేవించి సాయంత్రం అదే మోటార్ సైకిల్పై తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో రాందాస్కు శ్రావణ్కుమార్ను చంపి బైక్ను అమ్మి సొమ్ము చేసుకోవాలని దుర్బుద్ధి కలిగింది. ఈ విషయాన్ని వరుసకు తమ్ముడైన దశరథ్సింగ్కు తెలిపాడు. ఇందుకు దశరథ్ ఒప్పుకోలేదు. రాందాస్ ఒత్తిడి చేయడంతో సరేనన్నాడు. దీంతో శ్రావణ్ను మాటల్లో పెట్టి రోడ్డుకు దూరంగా అడవిలోకి తీసుకెళ్లారు. అనంతరం ఇరువురూ కలిసి శ్రావణ్కుమార్ గొంతు నొక్కి చంపేశారు. అనంతరం బైక్ను బోనస్పూర్కు తీసుకెళ్లి విక్రయించే ప్రయత్నంచేశారు. వారి ప్రయత్నం విఫలమైంది. దీంతో చేసేది లేక ఆదివారం స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో కోహ ర్ మండలంలోని కవేలి క్రాస్ రోడ్డు వద్ద పోలీసుల కంట పడ్డారు. వారు బైక్కు సంబంధించిన పత్రాలు అడగడంతో చూపించలేకపోయారు. దీంతో పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. శ్రావణ్కుమార్ బైక్ను తమ వద్ద ఉంచి ఎటో వెళ్లాడని వాహనం పత్రాలు కావాలని శ్రావణ్కుమార్ అన్న శ్రీశైలానికి దశరథ్ ఫోన్ చేశాడు. అనుమానంతో శ్రీశైలం పుల్కల్ పోలీసులను ఆశ్రయించాడు. దశరథ్ను పోలీసులు తమదైన శైలిలో విచారించగా హత్య చేసిన విషయం బయటికి వచ్చింది. నిందితుల సమాచారం మేరకు.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. -
చిల్లర మాటలకు చిరునామా కిరణ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. చిల్లర మాటలకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి చిరునామా అని వ్యాఖ్యానించారు. పీలేరులో కూడా సొంతంగా గెలవలేని పరిస్థితి కిరణ్దని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి ఒక్క ఎమ్మెల్యే మద్దతు కూడా లేదని శ్రవణ్ అన్నారు. ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన సోమవారమిక్కడ మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవికి కిరణ్ కుమార్ రెడ్డి అనర్హుడని విమర్శించారు. తెలంగాణపై అసెంబ్లీకి తీర్మానం రాదని... కేవలం బిల్లు మాత్రమే వస్తుందని శ్రవణ్ కుమార్ అన్నారు.