Twin Towers
-
నా ఉరిశిక్షను రద్దు చేయండి.. కోర్టుకు ట్విన్ టవర్స్ దాడి మాస్టర్మైండ్
వాషింగ్టన్ : అమెరికా చరిత్రలో అత్యంత విషాదాన్ని మిగిల్చిన ట్విన్ టవర్స్(twin towers) కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వేలాది మంది అమయాకుల్ని పొట్టనపెట్టుకున్న ఖలీద్ షేక్ మహమ్మద్ (Khalid Sheikh Mohammed) ఉరిశిక్ష నుంచి తనకు ఉపశమనం కల్పించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్పై విచారణ జరగకుండా జోబైడెన్ (joe biden) ప్రభుత్వం అడ్డుకుంది. ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్ ఖైదా అమెరికాలో 2001, సెప్టెంబరు 11న న్యూయార్క్లోని ట్విన్ టవర్స్పై దాడి చేసింది. ఈ దాడికి వ్యూహరచన చేసిన ఖలీద్ షేక్ మహమ్మద్ ఉరిశిక్ష నుంచి ఉపశమనం కల్పిస్తూ తనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ విచారణ జరగకుండా జోబైడెన్ ప్రభుత్వం సఫలమైంది.ముస్లిం దేశాల్లో యుద్ధాలకు అమెరికా, దాని మిత్ర దేశాలే కారణమని ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్ ఖైదా అమెరికాలో 9/11 దాడికి పాల్పడింది. ఈ దాడి ఎలా చేయాలి? విమానాల్ని ఎలా హైజాక్ చేయాలి? అనే కుట్రకు ఖలీద్ షేక్ మహమ్మద్ ప్రణాళికలు చేశాడు. మారణ హోమం తర్వాత ఖలీద్ను అమెరికా సజీవంగా పట్టుకుంది. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన జైలుగా అభివర్ణించే గ్వాంటనామో బేకు తరలించింది. నాటి నుంచి అదే జైలులో శిక్షను అనుభవిస్తున్నారు.Lawyers for Khalid Sheikh Mohammed, the accused 9/11 mastermind, are urging to proceed with a guilty plea to expedite resolution of his long-delayed case. The plea could impact sentencing terms and avoid a full trial. The case has faced extensive delays due to legal and… pic.twitter.com/qIhnfHDgXC— Monte White (@montewhiteiam) January 10, 2025ఈ కేసును గ్వాంటనామో బే కోర్టులో విచారణ కొనసాగుతోంది. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఖలీద్కు ఉరిశిక్ష విధించింది. అయితే ఆ ఉరిశిక్ష నుంచి తనకు ఉపశమనం కల్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ గతేడాది జులై తర్వాత ఇవాళ విచారణకు రావాల్సి ఉంది. అయితే ఆ పిటిషన్పై విచారణ చేపట్టకుండా కేసు దర్యాప్తు చేసేందుకు తమకు మరింత సమయం కావాలని,షెడ్యూల్ ప్రకారం గ్వాంటనామో బే కోర్టులో షెడ్యూల్ ప్రకారం పిటిషన్ చేపట్టకుండా గడువు విధించాలని త్రిసభ్య ధర్మాసనాన్ని కోరారు. అదే సమయంలో ఖలీద్ తరుఫు వాదిస్తున్న న్యాయవాదులు 20 ఏళ్లుగా కేసు విచారణలో అమెరికా మిలటరీ, అమెరికా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వాదించారు. తన క్లయింట్ ఖలీద్ కోరినట్లుగా ఉరిశిక్ష నుంచి ఉపశమనం కల్పించాలని కోరారు.ఇరుపక్షాల వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం.. చివరకు అమెరికా ప్రభుత్వ విజ్ఞప్తిని అంగీకరించింది. ప్రభుత్వ అభ్యర్థనలో వాదనలను పూర్తిగా పరిశీలించినంత కాలం మాత్రమే స్టే కొనసాగుతుందని, తుది తీర్పుగా పరిగణించరాదని నొక్కి చెప్పింది. -
9/11: చేదు జ్ఞాపకాలే అయినా పదిలంగా ఉంచేందుకు..
9/11 Attacks: సెప్టెంబర్ 11, 2001.. ఈరోజు అమెరికా చరిత్రలోనే కాదు యావత్ ప్రపంచాన్ని కొద్దిగంటలు చీకట్లోకి నెట్టేసిన రోజు. చరిత్రలోనే ఇప్పటిదాకా రికార్డు అయిన అతిపెద్ద ఉగ్రమారణహోమది. సుమారు 11 ఎకరాల విస్తీర్ణంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాల్లోకి హైజాక్ విమానాల ద్వారా ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. ప్రత్యక్షంగా సుమారు నాలుగు వేల మంది ప్రాణాల్ని బలిగొన్నారు. ఈ దాడి తర్వాత రకరకాల గాయాలతో, జబ్బులతో చనిపోయిన వాళ్ల సంఖ్య చాలా చాలా ఎక్కువ.బాధితులకు జ్జాపకార్థంగా ట్విన్ టవర్స్ కూలిన ప్రాంతం(గ్రౌండ్ జీరో) ఒక స్మారక భవనం, మ్యూజియం ఉంటాయి. ఇక్కడ ప్రతీ ఏడాది సెప్టెంబర్ 11న ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబసభ్యులు, వారి పిల్లలు, బంధువులు నివాళులు అర్పిస్తారు. అయితే ఇలా నివాళులు అర్పించటం వారసత్వంగా కొనసాగుతోంది. ఈ ఘటన జరిగి నేటికి(బుధవారం) నాటికి 23 ఏళ్లు. స్మారక భవనం వద్ద ప్రతీ ఏడాది బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు మృతి చెందినవారి పేర్లు చదువుతూ నివాళి అర్పిస్తారు. మృతి చెందినవారి వారసులు, వారి పిల్లలు.. దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన తమవారి పేర్లు చదివి స్మరించుకోవటం ఆనవాయితీగా కొనసాగుతోంది. 23 ఏళ్లు గడుస్తున్నా.. దాడుల తర్వాత బాధితుల వారసులు వాళ్ల తాత, అమ్మమ్మ, నానమ్మలు పేర్లు స్మరించుకుంటూ నివాళులు అర్పించటం పెరుగుతోంది. అయితే గతేడాది సుమారు మొత్తం 140 మంది వారసులు దాడుల్లో మృతి చెందినవారికి నివాళులు అర్పించగా.. అందులో దాడులు జరిగిన అనంతరం పుట్టిన యువతీయువకులు 28 మంది ఉన్నారు. అయితే ఈ ఏడాది కూడా ఆ యువతీయువకులు తమవారికోసం నివాళులు అర్పించడానికి ఎదురు చూస్తున్నారు. బాధితులకు సంబంధించిన వారసులు అధికంగా వారి మేనకోడళ్లు, మేనల్లుళ్లు, మనవలు, మనవరాళ్లు ఉన్నారు. వారి వద్ద మృతి చెందినవారి కథలు, ఫొటోలు, జ్ఞాపకాలు ఉన్నాయి.9/11 దాడులకు ప్రత్యక్ష సాక్ష్యులు, బాధితులతో అనుబంధం ఉన్నవారి సంఖ్య తగ్గినా స్మరించుకోవటం తరతరాలకు కొనసాగుతుందని 13 ఏళ్ల అలన్ ఆల్డిక్కీ అంటున్నాడు. గత రెండేళ్లుగా తన తాత, అనేక మంది వ్యక్తుల పేర్లను చదివి నివాళులు అర్పించాను. ఇవాళ (బుధవారం) బాధితుల పేర్లు చదివి నివాళులు అర్పిస్తానని అన్నాడు. ట్విన్ టవర్స్ దాడుల్లో ప్రాణాలు కొల్పోయిన తన తాత అల్లన్ తారాసివిచ్ జ్ఞాపకాలను తన గదిలో భద్రపర్చుకున్నానని తెలిపాడు. దాడుల్లో మృతిచెందిన న్యూయార్క్ అగ్నిమాపక సిబ్బంది క్రిస్టోఫర్ మైఖేల్ మోజిల్లో సోదరి పమేలా యారోస్జ్, ఆమె కుమార్తె కాప్రీ.. మెజిల్లో ఫొటోను చూపిస్తూ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. బుధవారం వీరు ఆయన పేరు చదివి నివాళులు అర్పించడానికి సిద్ధం ఉన్నారు. పమేలా యారోస్జ్ తన పిల్లలకు ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలని తెలిపారు. ఈ విధంగా నాటి దాడులు, బాధితులకు సంబంధించిన జ్ఞాపకాలు రేపటి తరాలకు సజీవంగా కొనసాగనున్నాయి.సెప్టెంబర్ 11, 2001 ఉదయం మొత్తం నాలుగు విమానాల్ని అల్ఖైదా ఉగ్రవాదులు హైజాక్ చేశారు. మొదటి ఫ్లైట్ అమెరికన్ ఎయిర్లైన్స్11ను.. ఉదయం 8గం.46ని.కు మాన్హట్టన్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ టవర్ను ఢీకొట్టారు. పదిహేడు నిమిషాల తర్వాత రెండో విమానం(యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 175) వరల్డ్ ట్రేడ్ సెంటర్ సౌత్ టవర్ను ఢీకొట్టింది. కేవలం గంటా నలభై రెండు నిమిషాల్లో 110 అంతస్తుల ట్విన్ టవర్స్ చూస్తుండగానే కుప్పకూలిపోయాయి. మంటలు.. దట్టమైన పొగ, ఆర్తనాదాలు, రక్షించమని కేకలు, ప్రాణభీతితో ఆకాశ హార్మ్యాల నుంచి కిందకి దూకేసిన భయానక దృశ్యాలు ఆన్కెమెరా రికార్డు అయ్యాయి. ఆ దాడులతో రెండు కిలోమీటర్ల మేర భవనాలు సైతం నాశనం అయ్యాయి. దట్టంగా దుమ్ము అలుముకుని మొత్తం ఆ ప్రాంతాన్ని పొద్దుపొద్దున్నే చీకట్లోకి నెట్టేశారు ఉగ్రదాడులు. -
కేసీఆర్ నిర్ణయం.. నూతన సచివాలయం సమీపంలో ట్విన్ టవర్స్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిపాలనకు కేంద్రమైన నూతన సచివాలయం పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చింది. రాష్ట్రస్థాయిలో కీలకమైన పనులన్నీ ఒకే చోట జరిగేందుకు మార్గం పడింది. ఇదే తరహాలో అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలోని వివిధ విభాగాధిపతుల (హెచ్ఓడీల) కార్యాలయాలను ఒకే గొడుగు కిందికి తేవాలని సీఎం కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. ఇందుకోసం కొత్త సచివాలయానికి సమీపంలో ట్విన్ (జంట) టవర్లు నిర్మించాలని.. దీనికి సంబంధించి స్థలాన్ని అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం సచివాలయంలో సీఎం సమీక్షించారు. హెచ్ఓడీల వివరాలపై ఆరా.. దేశం గర్వించేలా నిర్మించుకున్న కొత్త సచివాలయం ఉద్యోగుల విధి నిర్వహణకు అత్యంత అనువుగా ఉందని.. ఆహ్లాదకర వాతావరణంలో ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారని సమీక్షలో సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సచివాలయం ప్రారంభమై నెల రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో.. మౌలిక వసతులు, సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా హెచ్ఓడీల కార్యాలయాల కోసం ట్విన్ టవర్లను నిర్మించే అంశంపై అధికారులతో చర్చించారు. అన్ని శాఖల పరిధిలోని హెచ్ఓడీల వివరాలు, మొత్తం ఉద్యోగుల సంఖ్య, అవసరమైన స్థలం, సదుపాయాలు తదితర అంశాలపై ఆరా తీశారు. సచివాలయానికి సమీపంలో విశాలవంతమైన ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. మంచి స్థలాలను అన్వేషించాలని.. హెచ్ఓడీల అధికారులు, సిబ్బంది తరచూ సచివాలయానికి రావాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో.. సమీపంలోనే ట్విన్ టవర్లు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. స్థలం ఎంపిక పూర్తయిన వెంటనే ట్విన్ టవర్ల నిర్మాణాన్ని చేపడతామని ప్రకటించారు. ఘనంగా దశాబ్ధి ఉత్సవాలు తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా జరగాలని, ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. జూన్ 2 నుంచి రోజువారీగా నిర్వహించనున్న కార్యక్రమాల విషయంలో.. సంబంధిత శాఖలు తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి సీఎం కేసీఆర్కు వివరించారు. జూన్ 9 నుంచి కుల వృత్తులకు ఆర్థిక సాయం కుల వృత్తులకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎంబీసీ కులాలు, రజక, నాయీ బ్రాహ్మణ, పూసల, బుడగ జంగాల తదితర వృత్తి కులాలు, సంచార జాతుల ప్రజలకు దశల వారీగా రూ.లక్ష ఆర్థిక సాయం అందించి ఆదుకుంటుందని చెప్పారు. ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను మరో రెండు రోజుల్లో ఖరారు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి, మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్ గంగుల కమలాకర్ ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు వివరించారు. దీంతో దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా జూన్ 9న నిర్వహించ తలపెట్టిన సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఈ ఆర్థిక సాయం పంపిణీని ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశించారు. అమరుల స్మారకం వద్ద తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయంలో సమీక్ష అనంతరం సీఎం కేసీఆర్ లుంబినీ పార్కు స్థలంలో నిర్మిస్తున్న తెలంగాణ అమరుల స్మారకం వద్దకు చేరుకుని పనులను పరిశీలించారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ దశాబ్ధి ఉత్సవాలు ఘనంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆర్అండ్బీ అధికారులకు ఆదేశించారు. అమరుల స్మారకానికి ముందున్న విశాలమైన స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని.. విగ్రహానికి రెండు వైపులా అద్భుతమైన ఫౌంటెయిన్లతో సుందరంగా తీర్చిదిద్దాలని ఆర్అండ్బీ ఈఈ శశిధర్కు సూచించారు. దశాబ్ధి ఉత్సవాలు జరుగుతున్నన్ని రోజులు అమరుల స్మారకం వద్దకు వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా, ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కొత్త సచివాలయ నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా బీఆర్కేఆర్ భవన్ వద్ద నిర్మించిన వంతెనలను పరిశీలించారు. ఆదర్శ్నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ స్థలంలో ట్వీన్ టవర్స్? ఆదర్శ్నగర్లోని న్యూఎమ్మెల్యే క్వార్టర్స్ భవనాలను కూల్చివేసి ఆ స్థలంలో హెచ్ఓడీల కార్యాలయాల కోసం ట్వీన్ టవర్స్ నిర్మించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఈ కార్యాలయాల కోసం 40 లక్షల నుంచి 45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు అవసర మని అంచనా వేసినట్టు సమాచారం. అంతమేర భవనాల నిర్మాణానికి ఆదర్శ్నగర్ స్థలం అనువుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి త్వరలోనే తుది నిర్ణయం తీసుకోవచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. -
అక్కడ టీడీపీ, జనసేన లేవు.. సజావుగా అక్రమ కట్టడాల కూలివేత!
కొద్ది రోజుల క్రితం దేశరాజధానికి అల్లంత దూరంలో ఉన్న నోయిడాలోని అతి పెద్ద ట్విన్ టవర్స్ను ప్రభుత్వ యంత్రాంగాలే దగ్గరుండి కూల్చివేశాయి. ఇందుకోసం 3,700 కిలోలో పేలుడు పదార్ధాలను వినియోగించాయి. టవర్స్ నిర్మాణానికి కొన్ని ఏళ్లు పడితే వాటిని కూల్చి వేయడానికి కేవలం 9 సెకన్లు మాత్రమే పట్టింది. ఏడున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టవర్లలో 900 ఫ్లాట్స్ ఉన్నాయి. కొన్ని వందల కోట్ల రూపాయల విలువజేసే ఆస్తి ఇది. కుతుబ్ మీనార్ కన్నా పొడవైన నిర్మాణం ఇది. ఇంతటి ఆస్తిని కూల్చివేయడానికి కారణం ఒక్కటే. టవర్స్ నిర్మించిన రియల్ ఎస్టేట్ కంపెనీ అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా నిర్మాణం చేసుకుపోయింది. దాంతో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కోర్టుకు వెళ్లారు. అన్నీ విన్న అత్యున్నత న్యాయస్థానం ఈ టవర్స్ను కూల్చివేయాల్సిందేనని ఆదేశించింది. సుప్రీం తీర్పుతో ఆగస్టు 28న ఈ టవర్స్ ను కూల్చివేశారు. దీనికి రెండేళ్ల క్రితం.. కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో మారాడు గ్రామంలో అద్భుతమైన సరస్సును ఆనుకుని నాలుగు పెద్ద పెద్ద లగ్జరీ అపార్ట్మెంట్లను అధికారులు కూల్చివేశారు. 2020 జనవరి 11న అత్యంత విలాసవంతమైన ఈ అపార్ట్ మెంట్లను పేలుడు పదార్ధాలతో కూల్చివేశారు. దీనికి కారణం లేకపోలేదు. ఈ అపార్ట్ మెంట్ల నిర్మాణంలో పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కారని ఆరోపణలు ఉన్నాయి. వాటిపై ఫిర్యాదు చేసి అభ్యంతరాలు వ్యక్తం చేసినా భవన నిర్మాణాలు చేపట్టిన సంస్థ పట్టించుకోలేదు. మనల్ని ఎవరేం చేస్తారులే అని ధీమా వారిది. డబ్బుతో దేన్నయినా కొనేయచ్చన్న అహంకారం. వెరసి నిబంధనలను తొక్కి పారేసి అపార్ట్ మెంట్లు కట్టి పారేశారు. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అదే సమయంలో అపార్ట్ మెంట్లు కొనుకున్న వారు తాము జీవితాంతం కూడబెట్టిన సొమ్ముతో ఇళ్లు కొనుక్కున్నామని వాటిని కూల్చివేయవద్దని విజ్ఞప్తులు చేసుకున్నారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం కోట్లాది రూపాయల డబ్బు ఉన్నా కూడా పర్యావరణ నిబంధనలు అమలు చేయడమే ముఖ్యమని భావించింది. అందుకే ఈ అపార్ట్మెంట్లను కూల్చివేయాల్సిందిగా 2019 డిసెంబరులో తీర్పు నిచ్చింది. కొచ్చిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమకట్టడాల కూల్చివేతకు ఏడు నెలల క్రితం ఆంధ్ర ప్రదేశ్లో విజయవాడ లో కృష్ణా నది తీరాన అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించి పర్యావరణ నిబంధనలకు పాతరేసి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని సంకల్పించిన నాటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమార్కులందరికీ ఈ కూల్చివేత అనేది ఓ హెచ్చరికగా ఉండాలని భావించింది. అందుకే అంతకు ముందు అధికారంలో ఉన్న టిడిపి హయాంలో అక్రమంగా నిర్మించిన కట్టడాల్లోనే ఓ కట్టడంలో ప్రభుత్వ కార్యకలాపాలు మరో కట్టడాన్ని సాక్ష్యాత్తూ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాసంగా ఉంచుకోగా మరి కొందరు అక్రమ కట్టడాల్లో రక రకాల కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చారు. కూల్చివేత అనేది ముందుగా అక్రమంగా నిర్మించిన ప్రభుత్వ భవనంతోనే మొదలు పెట్టడం పద్ధతిగా ఉంటుంది కాబట్టి ప్రజావేదిక ను కూల్చివేశారు. దీంతో పాటే కృష్ణా కరకట్టపై అక్రమంగా నిర్మించిన కట్టడాలకు సంబంధించిన యజమానులందరికీ నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. అందులో చంద్రబాబు నాయుడు నివసిస్తోన్న లింగమనేని గెస్ట్ హౌస్ కూడా ఉంది. అంతే ఇక తెలుగుదేశం పార్టీ నేతలు వీధుల్లోకి వచ్చేసి తమపై రాజకీయ కక్ష సాధింపునకు దిగారంటూ గగ్గోలు మొదలు పెట్టింది. తమ ఆర్ధిక మూలాలు దెబ్బతీయడానికే ఈ కుట్ర అంటూ ఆరోపణలు చేసింది. దానర్ధం ఏంటి? ఈ అక్రమ కట్టడాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు వారి వందిమాగధులవేనని తేటతెల్లం అయిపోలా? చిత్రం ఏంటంటే 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినపుడు నాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ కృష్ణా నదిలో బోటులో పర్యటిస్తూ కరకట్టపై ఉన్నవన్నీ అక్రమ కట్టడాలేనని.. వాటిని త్వరలోనే కూల్చివేసి తీరతామని స్పష్టం చేశారు. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఆ తర్వాత ఏమైందో కానీ కరకట్టపై మరికొన్ని అక్రమ కట్టడాలు యధేచ్ఛగా పుట్టుకొచ్చాయి. అందులోని ఓ అక్రమ కట్టడం చంద్రబాబుకు తెగ నచ్చేసింది. అందులోనే తాను ఉంటానని అనడంతో దాని యజమాని కూడా ఉదారంగా ఓకే అనేశారు. కృష్ణా కరకట్టపై అక్రమ కట్టడాలను కూల్చి వేయడం మొదలు పెట్టిన వెంటనే సామాజిక వేత్త, వాటర్ మ్యాన్ గా పేరొందిన రాజేంద్ర సింగ్ తో పాటు పలువురు పర్యావరణ వేత్తలు ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షించారు. టిడిపి హయాంలో కృష్ణా నది గర్భంలో అక్రమంగా ఇసుక తవ్వకాలతో పాటు నదీ తీరాన అక్రమకట్టడాలు చూసి రాజేంద్ర సింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వాటిపై ఆయన ప్రశ్నించడాన్ని తట్టుకోలేకపోయిన టిడిపి నేతలు రాజేంద్ర సింగ్కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపి ఆయనపై దాడికి దిగారు. అధికారం పోయాక ఎల్లో వాయిస్లో తేడా వచ్చింది. టిడిపికి మద్దతుగా ఉండే కొందరు ఎల్లో మేథావులు అయితే అక్రమ కట్టడాలైనా కూడా కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టారు కదా..వాటిని ఏదో ఒక పనికి వాడుకోవాలి తప్ప కూల్చివేయడం ఏంటి అంటూ చెత్త లాజిక్ ఒకటి తెరపైకి తెచ్చారు. కొన్ని కోట్లతో కట్టిన ప్రజావేదిక కన్నా.. అక్రమ కట్టడాల కన్నా కూడా కృష్ణా నదికి అక్రమ కట్టడాల వల్ల జరిగిన నష్టం కొన్ని వేల కోట్లకు పైనే ఉంటుందన్న స్పృహ వారిలో లేదు. అసలు పర్యావరణం అంటేనే అది తమకి సంబంధంలేని విషయం అన్నట్లుగానే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తూ వచ్చారు. నొయిడాలో ట్విన్ టవర్స్ను పేల్చినపుడు వందల కోట్ల రూపాయల ఆస్తులను ధ్వంసం చేయడం ఏంటి? అని అక్కడి ప్రతిపక్షాలు గొడవ చేయలేదు. అసలు ఎందుకు కూల్చివేస్తున్నారు? అని ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ ప్రజాసంఘం కానీ ప్రశ్నించలేదు. ఇది రాజకీయ కక్షసాధింపేనని ఆ టవర్స్ నిర్మించిన కంపెనీతో అంటకాగే రాజకీయ పార్టీలు ఆరోపించలేదు. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం, జనసేన వంటి బాధ్యతారహిత రాజకీయ పార్టీలు లేవు కాబట్టి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇపుడు మన పొరుగునే ఉన్న కర్ణాటక ప్రభుత్వం కూడా నిబంధనలకు విరుద్ధంగా చెరువులు, నాలాలు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయాలని డిసైడ్ అయ్యింది. ప్రత్యేకించి బెంగళూరు నగరాన్ని తాజాగా భారీ వర్షాలు వరదలు ముంచెత్తడంతో చెరువులు, పార్కుల కబ్జాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడి కార్పొరేట్ కార్యాలయాలు కొలువు తీరిన బహుళ అంతస్థుల భవనాలకు అధికారులు నోటీసులు జారీ చేసి కూల్చివేత పనులు మొదలు పెట్టారు. అదృష్టం ఏంటంటే బెంగళూరు లో టిడిపి, జనసేన వంటి పార్టీలు లేవు కాబట్టి కూల్చివేతలపై ఎలాంటి రాజకీయాలు లేకుండా సజావుగా సాగుతున్నాయి. -
నోయిడా ట్విన్ టవర్స్- ఏపీ ప్రజావేదిక.. రెండూ కరెక్టేనా!
ఉత్తరప్రదేశ్లోని నోయిడా వద్ద రెండు భారీ ట్విన్ టవర్స్ను కూల్చివేసిన ఘట్టం దేశ వ్యాప్తంగా అందరిని ఆకర్షించింది. సుమారు నలభై అంతస్తుల భవనాన్ని కేవలం తొమ్మిది సెకన్లలోనే కూల్చేవేయడం ఒక ముఖ్యమైన అంశం అయితే, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు మరో ప్రధాన అంశం. సుప్రీంకోర్టు ఇచ్చింది కనుక ఈ ఆదేశాలు వివాదాస్పదం కాలేదు. రాజకీయ పార్టీలు దీనిపై విమర్శలకు దిగలేదు. అక్రమ భవనం అని కోర్టు నిర్థారించింది. అంతకు ముందు గత ఏడాది కేరళలోని కొచ్చి వద్ద నదీతీర ప్రాంతంలో నిర్మించిన మరో భారీ బహుళ అంతస్తుల భవంతిని కూడా సుప్రీం ఆదేశాల మేరకు కూల్చివేయవలసి వచ్చింది. ఈ ఘట్టాలు దేశానికి ఒక మంచి సందేశం ఇచ్చాయనే చెప్పాలి. చదవండి: పవన్ కల్యాణ్ని తిట్టిస్తున్నారని చంద్రబాబు చెప్పడం దేనికి సంకేతం? తాత్కాలికంగా కొంతమంది వ్యక్తులకు ఈ పరిణామం అసౌకర్యం కలిగించినా, భవిష్యత్తులో బిల్డర్లు ఇలాంటి అక్రమాలకు పాల్పడడకుండా ఉండడానికి ఇది ఆస్కారం ఇస్తుంది. విశేషం ఏమిటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అక్రమ సౌధం నేలకూలింది అన్న శీర్షికతో వార్తలు ఇచ్చిన ఈనాడు, తదితర టీడీపీ మీడియా సంస్థలు, ఏపీలో అక్రమ నిర్మాణాలు తొలగిస్తే మాత్రం విధ్వంసం అని ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై బురదచల్లే యత్నం చేశాయి. విజయవాడ సమీపంలోని ఉండవల్లిలో కృష్ణా కరకట్టను ఆనుకుని పలు భవనాలు వెలిశాయి. అవన్ని కోస్టల్ రెగ్యులేషన్ చట్టాన్ని ఉల్లంఘించి నిర్మించినవే. ప్రైవేటు వ్యక్తులే కాకుండా ప్రభుత్వం కూడా ఏకంగా ప్రజావేదిక పేరుతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్లో ఒక అక్రమ నిర్మాణం చేశారు. దీనికి ఎలాంటి అనుమతులు లేవు. అధికారులు వద్దని సలహా ఇచ్చినా చంద్రబాబు పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం నదీని అనుకుని ఎలాంటి నిర్మాణాలు జరగరాదు. దానికి నిర్దిష్టదూరంలోనే నిర్మాణాలు ఉండాలి. అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. చివరికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు చంద్రబాబే స్వయంగా ఒక అక్రమ నిర్మాణంలో బస చేశారు. కొందరు పర్యావరణ వేత్తలు వచ్చి దీనిపై అభ్యంతరం చెప్పినా, వారిపై నిర్భంధాలు విధించారే కాని, చేసిన తప్పును సరిదిద్దుకోలేదు. ఓటుకు నోటు కేసు తర్వాత హైదరాబాద్ నుంచి అకస్మాత్తుగా విజయవాడకు వెళ్లిపోయిన చంద్రబాబు, లింగమనేని రమేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారికి చెందిన అతిథి గృహ భవనంలో మకాం చేశారు. దీనికి ప్రతిగా ఆయనకు రాజధాని భూముల పూలింగ్లో మినహాయింపులు ఇచ్చి లాభం చేశారన్న అభియోగం ఉంది. అది వేరే విషయం. చంద్రబాబు ఈ ఇంటిలో దిగడానికి కొన్ని నెలల ముందు ఆయన క్యాబినెట్లోని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణానదిలో వరదను పరిశీలించడానికి వెళ్లి, ఈ అక్రమ నిర్మాణాలను గమనించి వీటన్నిటిని తమ ప్రభుత్వం కూల్చివేస్తుందని అప్పట్లో ప్రకటించారు. తీరా సీన్ కట్ చేస్తే ఏకంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న టీడీపీ అధినేతే అలాంటి అక్రమ భవనం ఒకదానిలో దిగేసరికి ఉమా కూడా సైలెంట్ అయిపోయారు. తన ఇంటి వద్ద సదుపాయంగా ఉంటుందని భావించి ప్రజావేదిక పేరుతో ఒక కన్వెన్షన్ హాల్ తరహాలో నిర్మించుకున్నారు. 2019లో టీడీపీని ఓడించి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్రెడ్డి ఈ ప్రజావేదికలో ఒక సదస్సు పెట్టి, ప్రభుత్వమే అక్రమ నిర్మాణం చేయడం ఏమిటని ప్రశ్నించి దానిని కూల్చివేయాలని ఆదేశించారు. అంతే: చంద్రబాబుతో సహా, పలువురు టీడీపీ నేతలు, వారికి వంత పాడే మరికొన్ని ఇతర పార్టీల నేతలు ఇంకేముంది విధ్వంసం అంటూ ప్రచారం చేశారు. ప్రజావేదిక కూల్చి ఏడాది అయిందంటూ మరోసారి ఒక కార్యక్రమం నిర్వహించారు. ఇదొక్కటే కాదు. ఏపీలో ఎక్కడ అక్రమ కట్టడం ఉన్నా, చివరికి అది గోడ అయినా, దానిని తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నించిన ప్రతి సందర్భంలోనో టీడీపీ వారు అడ్డుకోవడం, వెంటనే స్టేలు తీసుకు రావడం చేశారు. చిత్రంగా గౌరవ హైకోర్టు వారు కూడా కారణం తెలియదు కాని, అలాంటి అక్రమ కట్టడాల కూల్చివేతకు ఎక్కువ సందర్భాలలో స్టే ఇచ్చారన్న అభిప్రాయం ఉంది. కృష్ణా కరకట్టపై ఉన్న భవనాలకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా, కొందరు హైకోర్టు నుంచి స్టే పొందగలిగారు. చివరికి టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నీటిపారుదల శాఖ స్థలంలో అక్రమంగా నిర్మించిన ప్రహరిగోడను కూల్చినా టీడీపీ మీడియా, టీడీపీ నేతలు రచ్చ,రచ్చ చేశారు. న్యాయ స్థానం నుంచి కూడా వారికి కొంత సానుకూలమైన ఆదేశాలు వచ్చాయి. విశాఖలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమించి గోడ కట్టిన గీతం యూనివర్శిటీలో ఆ గోడను తొలగించినప్పుడు కూడా ఇదే తంతు. కాని ఇప్పుడు సుప్రీంకోర్టు వారు నోయిడాలో ఏకంగా వందల కోట్ల రూపాయల విలువైన భారీ భవనాలను కూల్చివేయించారు. ఈ కూల్చివేతకు సుమారు ఇరవై కోట్ల వ్యయం అయిందని వార్తలు వచ్చాయి. ఈ భవనాలను నిర్మించిన బిల్డర్లు తమకు 500 కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. అంత ఖరీదైన భవనాల నిర్మాణానికి సహకరించిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియదు. కాని కొందరు మాత్రం ఇలా కూల్చడం కన్నా, ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తే బాగుండేదన్న వాదనను తీసుకు వస్తున్నారు. సుప్రీంకోర్టే ఆ పని చేస్తే, ఇక ప్రభుత్వాలు దానిని మరింతగా దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ప్రతివాదన చేసేవారు అంటున్నారు. కూల్చివేత ఘట్టం పూర్తి అయ్యాక, ఈ వాద, ప్రతివాదాలకు పెద్దగా విలువ ఉండదు. మరికొన్ని ఘట్టాలు కూడా గుర్తు చేసుకోవాలి. ఉత్తరప్రదేశ్లో అఘాయిత్యాలకు పాల్పడిన రౌడీషీటర్ల ఇళ్లను, మతకలహాలకు కారకులైనవారి ఇళ్లను అవి అక్రమమైనవి అయితే బుల్ డోజర్లు తీసుకు వెళ్లి కూల్చివేశారు. దానిని సుప్రీంకోర్టు కూడా నిలువరించలేదు. దాంతో యూపీ ప్రభుత్వానికి బుల్ డోజర్ ప్రభుత్వం అన్న పేరు కూడా కొంతమంది పెట్టారు. తెలంగాణలోని హైదరాబాద్లో వరదనీరు, డ్రైనేజీ వ్యవస్థ పారే నాలాల మీద ఇళ్లు కడితే వాటిని ఎందుకు కూల్చలేదని న్యాయస్థానం ఒక సందర్భంలో ప్రశ్నించింది. దాంతో అక్కడ ఉంటున్నవారికి ప్రత్యామ్నాయం చూపుతూ ఆ ఇళ్లను పలు చోట్ల కూల్చివేశారు. బాచుపల్లి అనే చోట అనుమతులు లేకుండా నిర్మించిన 200 పైగా విల్లాలను కూడా అధికారులు కూల్చివేశారు. అయినా ఇక్కడ ఎవరూ దానిని విధ్వంసంగా అభివర్ణించలేదు. ఏపీలో మాత్రం ప్రతిపక్ష టీడీపీ,దానికి వంతపాడే ఈనాడు, తదితర మీడియా మాత్రం ఆ తరహా ప్రచారం చేశాయి. నొయిడా ఘటన తర్వాత కూడా ప్రజా వేదికను తీసివేసిన విషయాన్ని విధ్వంసంగానే ప్రచారం చేస్తారా? ఏపీకి సపరేట్ రాజ్యాంగం ఉందని వారు భావిస్తారా?. కృష్ణానది అనుకుని ఉన్న విలాసవంత భవనాల ద్వారా కాలుష్యం నదిలో కలుస్తోందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. అయినా ఏపీ వరకు మినహాయింపు ఇవ్వాలని వీరు అభిలషిస్తారా? ఈ మొత్తం ప్రకియలో టీడీపీ, అనుబంధ మీడియా ఆత్మరక్షణలో పడినట్లయింది. సుప్రీం కోర్టు చేసింది విధ్వంసమా?లేక నిబంధనలు పాటించడమా అన్నదానిపై వీరు నోరు విప్పలేని పరిస్థితి. అయితే కొన్నాళ్లకు అంతా మర్చిపోయారని అనుకున్న తదుపరి యథా ప్రకారం టీడీపీ కాని, వారి మీడియా కాని విధ్వంసపు రాతలు రాయకుండా ఉంటాయని భావించలేం. ఎందుకంటే టీడీపీ ఓడిపోతే రామోజీరావు తదితర మీడియా సంస్థల యజమానులు తామే ఓడిపోయామని ఫీల్ అవుతున్నారు. ఎలాగైనా చంద్రబాబును గద్దె ఎక్కించడం ద్వారా తమ ఆధిపత్యాన్ని కొనసాగించవచ్చన్నది వారి ఆలోచన. ఇందు కోసం వారు పడరాని పాట్లు పడుతున్నారు. అయినా జగన్ వీటన్నిటిని సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు. అంతిమంగా ప్రజావేదిక కూల్చివేత విషయంలో జగన్దే కరెక్టు అని సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయాల ద్వారా తేలిందని అనుకోవచ్చు. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
అద్దాలతో మెరిసిపోతున్న ట్విన్ టవర్స్.. నెటిజన్ల విమర్శల ట్విస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: అద్దాలతో మెరిసిపోతున్న ట్విన్ టవర్స్ను చూశారు కదా! వీటిని మన రైల్వే మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాల్లో ఆదివారం పోస్ట్ చేసింది. పునరుద్ధరణ తరువాత న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ (ఎన్డీఎల్ఎస్) ఇలా ఉండబోతోందని పేర్కొంది. ఆధునికంగా కనబడుతున్నా.. ఆ టవర్స్పై నెటిజన్స్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. 40 అంతస్తుల జంట భవనాల్లో మల్టీ లెవల్ పార్కింగ్, పికప్, డ్రాప్ జోన్స్, 91 బస్బేలు, 1,500 ఈసీఎస్ పార్కింగ్లు ఉంటాయని, షాపులు, ఆఫీసులు, ఓ పెద్ద హోటల్ నిర్వహణకు సరిపడా స్థలముంటుందని రైల్వే శాఖ పేర్కొంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోస్ను 5వేల మంది రీట్వీట్ చేశారు. ► ఓ రైల్వే స్టేషన్కు అంత సంక్లిష్టమైన డిజైన్ అవసరమా? ► నిర్మాణానికి ఎక్కువ టైమ్ తీసుకోవడమే కాదు.. ఆ అద్దాల నుంచి వచ్చే ఉష్ణోగ్రత వేసవిలో ఢిల్లీ టెంపరేచర్ను మరింత పెంచుతుంది. ► డిజైన్ బాగానే ఉంది కానీ.. చూడ్డానికి 2025 ప్లాన్లా ఉంది. దానికోసం భూసేకరణ ఎలా చేస్తారు? బయట ఉన్న పహడ్గంజ్ నివాసితులను ఏం చేస్తారు? ► హైప్డ్ డిజైన్తో అనవసరమైన ఖర్చు. సింపుల్గా ఎఫెక్టివ్గా కట్టలేమా? ఆధునికత పేరుతో ధరలు పెంచుతారు. ఆ భారం ప్రయాణికులపైనే పడుతుంది. ► మన నిర్మాణాలు మన సంస్కృతిని ప్రతిబింబించాలి. ఇది ఎక్కడినుంచో కాపీ కొట్టినట్టు ఉంది. అంటూ విమర్శల వర్షం కురిపించారు. చదవండి: ఆగ్రా రైల్వేస్టేషన్లో టాయ్లెట్ చార్జీ రూ.112 -
నోయిడా ట్విన్ టవర్స్లో అత్యాధునిక సిస్మోగ్రాఫ్, బ్లాక్ బాక్సులు
నోయిడా: వంద మీటర్ల ఎత్తయిన జంట సౌధాలను నేలమట్టం చేసే సందర్భాన్ని పరిశోధకులు తమ అధ్యయనం కోసం వినియోగించుకున్నారు. భవిష్యత్ పరిశోధనకు కావాల్సిన సమాచారాన్ని రాబట్టేందుకు ఈ బహుళ అంతస్తుల భవంతులను ఎంచుకున్నారు. వాటర్ఫాల్ ఇంప్లోజన్ విధానంలో నోయిడా సెక్టార్93ఏలోని జంట భవనాలను ఆదివారం నేలమట్టంచేయడం తెల్సిందే. పేలుడుపదార్ధాల ధాటికి భవనం నేలను తాకే క్రమం, శిథిలాలు సమీప ప్రాంతాలపై చూపే ప్రభావం, తదితర సమగ్ర సమాచారం సేకరించారు. డ్రోన్లు, థర్మల్ ఇమేజ్ కెమెరాలతో సంఘటనను అన్ని వైపుల నుంచీ షూట్చేశారు. చదవండి: (నోయిడా ట్విన్ టవర్స్: తిరిగి వస్తున్న జనం, సెల్ఫీలతో సందడి) పేలుడు ప్రభావాన్ని అంచనావేసేందుకు 20 అత్యాధునిక సిస్మోగ్రాఫ్లు, 10 బ్లాక్ బాక్స్లను ఆ భవనాల్లోనే బిగించామని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీబీఆర్ఐ) శాస్త్రవేత్త దేబీ ప్రసన్న చెప్పారు. పేలుడు ధాటికి భూమి కంపనాలను గణించేందుకు సిస్మోగ్రాఫ్లను వాడారు. జెట్ డెమోలీషన్స్ అండ్ ఎడిఫీస్ ఇంజనీరింగ్ సంస్థ ఈ భవనాలకు పేలుడుపదార్థాలు అమర్చి పేల్చేసింది. బ్లాక్ బాక్స్ బ్లాక్బాక్స్ను ప్రత్యేకమైన పదార్థంతో.. ప్రతికూల వాతావరణంలో కూడా దృఢంగా ఉండేలా డిజైన్ చేస్తారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, నీటిలో మునిగినా ఎలాంటి డేటా ధ్వంసం కాకుండా ఉండేలా అన్ని జాగ్రత్త చర్యలతో దీన్ని తయారు చేస్తారు. చదవండి: (నోయిడా జంట టవర్ల కూల్చివేత: వంచితుల వ్యథ తీరేదెప్పుడు!) -
నోయిడా జంట టవర్ల కూల్చివేత: వంచితుల వ్యథ తీరేదెప్పుడు!
-ఎస్.రాజమహేంద్రారెడ్డి రెండు ఆకాశ హర్మ్యాలు.. ఒకటి 32 అంతస్తులు, మరొకటి 29 అంతస్తులు. 12 సెకండ్లలో నేలమట్టమయ్యాయి. నోయిడా జంట టవర్ల నిర్మాణానికి అయిన ఖర్చు రూ.70 కోట్లు. కూల్చడానికి అయిన ఖర్చు రూ.20 కోట్లు. వెరసి అక్షరాలా మొత్తం రూ.90 కోట్లు 12 సెకండ్లలో మట్టిలో కలిసిపోయాయి. అక్రమ కట్టడం కుప్పకూలింది. అక్రమార్కులకు ఇదో పెద్ద హెచ్చరిక అని అనుకోవడం వరకు బాగానే ఉంది కానీ, ఈ అక్రమ కట్టడం ఆకాశం ఎత్తు లేచే వరకు సాయం చేసిన అధికారులను ఏం చేశారు? వాళ్లనెలాగూ కూల్చలేం. కనీసం వాళ్ల ఉద్యోగాలనైనా కూల్చారా? కోర్టులు ఈ విషయంలో చొరవ తీసుకున్నట్టు లేదు. ప్రభుత్వాలు నోరు మెదపకుండా చోద్యం చూస్తున్నాయి. టవర్లు కోర్టు ఆదేశానుసారం కూలిపోయాయి. శిథిలాలు పోగయ్యాయి. ఎంత ఇంకో మూడు నెలల్లో శిథిలాలను తొలగిస్తాం అని నోయిడా మున్సిపల్ అధికారులు మాటిచ్చేశారు. తాము ఖర్చు పెట్టిన రూ.20 కోట్లలో(కూల్చడానికి) టవర్ల నిర్మాణానికి వాడిన స్టీల్ను అమ్ముకుంటే రూ.15 కోట్లయినా వస్తాయని వారి అంచనా. మరి ఈ జంట టవర్లలో ఫ్లాట్లు కొన్నవారు ఎటుపోవాలి? వారు అప్పో సప్పో చేసి ఫ్లాట్లు కొనుక్కొని ఉంటారు. ఇంకా నెలసరి వాయిదాలు(ఈఎంఐలు) చెల్లిస్తూనే ఉంటారు. వీరి గోస ఎప్పుడు తీరేనూ? ఢిల్లీలో సొంతింటి కల నెరవేర్చుకోలేక శివార్లలో ఉన్న నోయిడాలో కాస్త తక్కువ ధరకు ఈ కోరిక తీర్చుకొని ఉంటారు. ఈ రెండు టవర్లను(అపెక్స్, సెయాన్) నిర్మించిన సూపర్టెక్ కంపెనీ ఫ్లాట్ల కొనుగోలుదారుల నుంచి దాదాపు రూ.180 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడీ డబ్బంతా నిరాశ్రయులైన ఫ్లాట్ యజమానులకు తిరిగి చెల్లించాలి. సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బోపన్న, జస్టిస్ పార్దీవాలాల ధర్మాసనం ఈ నెల 26న ఈ విషయంలో ఆదేశాలు జారీ చేస్తూ ‘కొనుగోలుదారులందరికీ వారు చెల్లించిన డబ్బు మొత్తం 12% వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి’’ అని సూపర్టెక్ సంస్థకు స్పష్టం చేసింది. ముందస్తు చర్యగా సూపర్టెక్ రూ.1 కోటి మొత్తాన్ని కోర్టు రిజిస్ట్రీలో సెప్టెంబర్ 30లోగా జమ చేయాల్సి ఉంటుంది. మొత్తం బకాయిలు అందేది ఎప్పుడో? కోర్టు నియమించిన అమికస్ క్యూరీ గౌరవ్ అగర్వాల్ అక్టోబర్ మొదటివారంలో సూపర్టెక్ సంస్థ ప్రతినిధులతో సమావేశమై కొనుగోలుదారులకు రావాల్సిన బకాయిలను లెక్కతేల్చి సమర్పిస్తారని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. సూపర్టెక్ కంపెనీ నెలవారీ ఆదాయం రూ.20 కోట్లని, అందులో రూ.15 కోట్లను ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి కేటాయించాల్సి ఉంటుందని అమికస్ క్యూరీ వివరించారు. మిగతా రూ.5 కోట్ల సొమ్మును ఫ్లాట్ల కొనుగోలుదారులకు బకాయిలు చెల్లించేందుకు వినియోగిస్తామన్నారు. 59 మంది కొనుగోలుదారులకు చెల్లించాల్సి ఉందని మిగతా వాళ్లలో చాలామందికి డబ్బు తిరిగి చెల్లించడం గానీ, వేరే టవర్లలో ఫ్లాట్ కేటాయించడం గానీ జరిగిందని సూపర్టెక్ యజమాన్యం వెల్లడించింది. కొనుగోలుదార్లలో చాలామందికి ఎంతోకొంత ఇంకా రావాల్సి ఉందని తెలిసింది. టవర్లయితే 12 సెకండ్లలో నేటమట్టమయ్యాయి. కానీ, చివరి కొనుగోలుదారుడికి బకాయిలు అందేసరికి ఎన్ని రోజులు పడుతుందో వేచి చూడాల్సిందే! సుప్రీంకోర్టు ఆదేశం కాబట్టి కొనుగోలుదారులందరికీ వారి కష్టార్జితం వడ్డీతో సహా అందుతుందనే ఆశిద్దాం. వడ్డీ కడుతూనే ఉన్నాం.. సెయాన్లో ఫ్లాట్ కొనేందుకు 2011లో రూ.26 లక్షలు అప్పు తీసుకున్నాం. అన్ని అనుమతులు వచ్చాక నిర్మాణం చేపట్టారని నమ్మాం. అందుకే అప్పు తెచ్చి మరీ కొన్నాం. అక్రమ నిర్మాణమని కోర్టులు తేల్చడంతో గుండెలో రాయి పడ్డట్టు అయ్యింది. ఈ ఒత్తిడి తట్టుకోలేక మా నాన్నగారు అనారోగ్యం పాలయ్యారు. తెచ్చిన అప్పునకు ఇప్పటికీ వడ్డీ కడుతూనే ఉన్నాం. పెట్టిన డబ్బంతా మా చేతికి వస్తేగానీ కుటుంబం కుదుటపడదు. – కె.వర్మ (ఉద్యోగి) కనువిప్పు కావాలి 2009లో రూ.50 లక్షలు అప్పు తెచ్చి అపెక్స్ టవర్లో ఫ్లాట్ బుక్ చేశా. కోరుకున్న చోట ఇల్లు కొంటున్నామన్న సంతోషం కోర్టు ఆదేశంతో నీరుగారిపోయింది. అక్రమ కట్టడమని తేల్చడానికి అన్ని రోజులు ఎందుకు పట్టిందో అర్థం కాలేదు. అనుమతులన్నీ ఉన్నాయని నిర్మాణ సంస్థ బుకాయించడం కూడా జీర్ణం కాలేదు. విధిలేక ఈ ఫ్లాట్కు బదులుగా సూపర్టెక్ సంస్థ ఇవ్వజూపిన వేరే ఫ్లాట్తో సరిపెట్టుకోవాల్చి వచ్చింది. కూల్చివేతతో వివాదం ముగిసినప్పటికీ డబ్బు చెల్లించాక మాకు ఇష్టమైన ఫ్లాట్ను పొందలేకపోయామన్న బాధ మిగిలే ఉంది. అక్రమ నిర్మాణాలకు తెగబడే బిల్డర్లకు, వారితో లాలూచీ పడి కళ్లు మూసుకొని అన్ని అనుమతులు మంజూరు చేసే అధికారులకు ఈ సంఘటన కనువిప్పు కావాలి. – గుప్తా (వ్యాపారి) ఆరంభం నుంచి నేలమట్టం దాకా.. ► 2004: నోయిడా ‘సెక్టార్ 93ఎ’లో గృహ సముదాయం కోసం సూపర్టెక్ సంస్థకు స్థలం కేటాయింపు (ఎమెరాల్డ్ కోర్టు హౌజింగ్ సొసైటీలో) ► 2005: ఎమెరాల్డ్ కోర్టు హౌజింగ్ సొసైటీ భవన నిర్మాణ ప్లాన్కు నోయిడా అథారిటీ అనుమతి మంజూరు. 10 అంతస్తుల చొప్పున 14 రెసిడెన్షియల్ టవర్ల నిర్మాణానికి అనుమతి ► 2006: మరింత స్థలం కావాలన్న సూపర్టెక్ సంస్థ వినతికి నోయిడా అథారిటీ అంగీకారం. తొలుత అనుమతి ఇచ్చిన భవన నిర్మాణ ప్లాన్కు సవరణలు. 14 టవర్లకు బదులుగా మరో టవర్ నిర్మాణానికి ఓకే. దీంతో మొత్తం 15 టవర్లకు అనుమతి ఇచ్చింది. ► 2009: నిర్మాణ సంస్థ మరోసారి ప్లాన్ను మార్చి మరో రెండు టవర్ల(అపెక్స్, సెయాన్)ను అదనంగా చేర్చింది. అయితే, ఈ రెండు టవర్లలో 24 అంతస్తులు ఉండేటట్టుగా ప్లాన్ మార్చడంతోపాటు వెంటనే నిర్మాణం కూడా చేపట్టింది. దీనికి స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ► 2012: నిర్మాణ సంస్థ మరోసారి తన ప్లాన్ను సవరించి అపెక్స్, సెయాన్ టవర్లను 40 అంతస్తులకు పెంచింది. నిర్మాణ పనులను వేగవంతం చేసింది. ► 2012 డిసెంబర్: ఎమెరాల్డ్ కోర్టు సొసైటీలోని కొందరు ఈ విషయాన్ని అలహాబాద్ హైకోర్టుకు విన్నవిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ► 2014: జంట టవర్లను కూల్చివేయాల్సిందిగా అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణ సంస్థతో కుమ్మక్కయ్యారని నోయిడా అథారిటీని తప్పుపట్టింది. దాంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. ► 2014 మే: అనుమతులన్నీ ఉన్నాయంటూ సూపర్టెక్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ► 2021 ఆగస్టు 31: దాదాపు ఏడేళ్ల వాదోపవాదాల తర్వాత జంట టవర్లను కూల్చివేయాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. మూడు నెలల్లోగా పని పూర్తికావాలని ఆదేశించింది. ► 2022 ఫిబ్రవరి: మే 22న కూల్చివేస్తామని నోయిడా అథారిటీ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ► 2022 మే 17: కూల్చివేత కాల పరిమితిని సుప్రీంకోర్టు ఆగస్టు 28కి పొడిగించింది. ► 2022 ఆగస్టు 28: జంట టవర్లు నేలమట్టం. సూపర్టెక్ సంస్థ నిర్మించిన 15 టవర్ల ఎమెరాల్డ్ కోర్టు హౌజింగ్ కాంప్లెక్స్లో మొత్తం 650 ఫ్లాట్లు ఉన్నాయి. నేలమట్టమైన అపెక్స్, సెయాన్ టవర్లు ఇప్పటికీ నిలిచి ఉంటే మరో 915 ఫ్లాట్లు, 21 దుకాణాలు అదనంగా ఉండేవి. రూ. 31.5 లక్షలు రావాలి ‘‘నేను 2010లో సెయాన్లో రూ.42 లక్షలు పెట్టుబడి పెట్టాను. ఈ కట్టడం అక్రమమని కోర్టు తీర్పు ఇచ్చినప్పుడే మా కుటుంబం యావత్తూ కుంగిపోయాం. బిల్డర్స్తోపాటు నోయిడా అథారిటీ కూడా దీనికి బాధ్యత వహించాలి. అక్రమమని తెలిసి కూడా అనుమతులు ఎలా మంజూరు చేశారో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇదో పెద్ద అవినీతి సౌధం. 12 శాతం వడ్డీతో కలిపి నాకు రూ.80 లక్షలు బకాయిపడ్డారు. ఇందులో భాగంగా వేరేచోట ఇంకో ఫ్లాట్ ఇచ్చారు. అదిపోనూ ఇంకా రూ.31.5 లక్షలు రావాల్సి ఉంది’’ – పునీత్ (వ్యాపారి) -
నోయిడా ట్విన్ టవర్స్: తిరిగి వస్తున్న జనం, సెల్ఫీలతో సందడి
నోయిడా: ఉత్కంఠ రేపిన సూపర్టెక్ జంట టవర్ల కూల్చివేత ఆదివారం మధ్యాహ్నం విజయవంతంగా ముగిసిన విషయం తెలిసిందే. పేలుళ్ల కారణంగా టవర్ల పరిసరాల్లోని రహదారులు, భవనాలు, చెట్లపై పేరుకుపోయిన దుమ్ముధూళి తొలగింపు సాయంత్రం నుంచే మొదలైంది. అక్కడికి అత్యంత సమీపంలో ఉన్న ఎమెరాల్డ్ కోర్ట్, ఏటీఎస్ విలేజ్ సొసైటీల నుంచి ఖాళీ చేయించిన కుటుంబాల్లో సగానికి పైగా తిరిగి తమ నివాసాలకు చేరుకున్నాయి. అధికారులు వారికి విద్యుత్, నీరు, వంటగ్యాస్ సరఫరాలను పునరుద్ధరించారు. తమ నివాసాలు సురక్షితంగా ఉన్నందుకు వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, భారీ పేలుళ్లతో ఎమెరాల్డ్ కోర్ట్, ఏటీఎస్ విలేజ్ లోపల వెలుపల, ఇతర నివాస ప్రాంతాలు, రహదారులు, పరిసరాల్లోని చెట్లపై దుమ్ముధూళి దట్టంగా పేరుకుపోయింది. దీనిని తొలగించేందుకు ఆదివారం సాయంత్రం నుంచే పెద్ద సంఖ్యలో పనివారిని రంగంలోకి దించారు. 500 మంది సిబ్బందితోపాటు, 100 నీటి ట్యాంకర్లు, 22 యాంటీ స్మోగ్ గన్స్లో ఊడ్చటం, తుడవటం వంటి పనులను చేపట్టినట్లు నోయిడా అథారిటీ సీఈఓ రీతూ మహేశ్వరి తెలిపారు. టవర్ల కూల్చివేతతో ఏర్పడిన 80 వేల టన్నుల శిథిలాలను తొలగించేందుకు 3 నెలలు పడుతుందని ఎడిఫైస్ ఇంజినీరింగ్ సంస్థ తెలిపింది. దీనిని వృథాగా పడేయకుండా రీసైకిల్ చేసి, తిరిగి వినియోగిస్తామని పేర్కొంది. సెల్ఫీలతో జనం సందడి టవర్లు కూలిన తర్వాత సోమవారం కూడా జనం అక్కడికి వచ్చి ఆసక్తిగా తిలకిస్తున్నారు. పెద్ద ఎత్తున గుట్టలుగా పేరుకుపోయిన శిథిలాలకు సమీపంలో సెల్పీలు, వీడియోలు తీసుకుంటున్నారు. కాగా, నిబంధనలకు విరుద్ధంగా నివాస సముదాయాలను నిర్మించిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అధికార బీజేపీని ప్రశ్నించారు. బీజేపీ పెద్ద అబద్ధాల కోరు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. -
కుప్పకూలిన అక్రమం
సుదీర్ఘ న్యాయపోరాటం ఫలించింది. భవనాల ఎత్తులోనే కాదు.. భయం, బాధ్యత లేని అవి నీతిలోనూ దేశంలోకెల్లా అతి ఎల్తైన జంట ఆకాశహర్మ్యాలు ఎట్టకేలకు కూల్చివేతకు గురయ్యాయి. ఢిల్లీ శివారులో యూపీ పరిధిలోకి వచ్చే నోయిడాలో 100 అడుగుల ఎత్తు వివాదాస్పద జంట భవంతులను సుప్రీమ్ కోర్ట్ ఆదేశాల మేరకు అధికారులు ఆదివారం కూల్చివేసిన ఘటన అనేక విధాల చరిత్రాత్మకం. ఇంతటి భారీ స్థాయి కూల్చివేత జరగడం దేశంలో ఇదే తొలిసారి. ‘వాటర్ ఇంప్లోజన్’ పద్ధతిలో 12 సెకన్లలో చాకచక్యంగా ఆకాశహర్మ్యాల కూల్చివేత పూర్తి చేయడం, చుట్టు పక్కలి ఆవాసాలకు నష్టం వాటిల్లకుండా అతి పెద్ద ప్రక్రియను విజయవంతం చేయడం విశేషం. వివిధ రాష్ట్రాల్లో విచ్చలవిడిగా సాగుతున్న నిర్మాణ నిబంధనల అతిక్రమణ నుంచి ఇప్పటికైనా పాల కులు నిద్ర నటించడం మానాల్సిన అవసరం దాకా అనేక అంశాల్ని ఈ కూల్చివేత తెరపైకి తెచ్చింది. ప్రభుత్వ నిబంధనల యథేచ్ఛ ఉల్లంఘనకు నోయిడా సూపర్టెక్ ట్విన్ టవర్స్ అతి పెద్ద ఉదాహరణ. భవన నిర్మాణ సంస్థ సూపర్టెక్ డెవలపర్స్తో చేతులు కలిపి నోయిడా అధికార యంత్రాంగం సాగించిన అవినీతికి కళ్ళెదుటి సాక్ష్యం. ఈ జంట ఆకాశహర్మ్యాలలో అనుమతించిన వాటికి మించి కట్టిన అంతస్థులు ఎక్కువ. ఒక్కముక్కలో వీటి ఎత్తు ఢిల్లీలోని చరిత్రాత్మక కుతుబ్ మినార్ను మించిపోయింది. పైపెచ్చు ఈ బహుళ అంతస్థుల భవంతులు రెంటికీ మధ్య అంతరం కేవలం 9 మీటర్లే. ఫలితంగా, అనేక నివాసాలకు తగినంత గాలి, వెలుతురు రాని పరిస్థితి. భవన నిర్మాతలపై ఆ ప్రాంగణంలోని నివాసుల సంక్షేమ సంఘం 2012లోనే అలహాబాద్ హైకోర్ట్కు వెళ్ళింది. అవినీతి, అక్రమాలను గుర్తించిన కోర్ట్ 2014లోనే టవర్స్ను కూల్చివేయాల్సిందిగా ఆదేశించింది. సుప్రీమ్ కోర్ట్ సైతం దాన్ని సమర్థిస్తూ, బయ్యర్ల సొమ్మును వడ్డీతో సహా వెనక్కి ఇచ్చేయమంటూ గత ఏడాదే ఆదేశించింది. ఆ కూల్చివేత భారీ పరిమాణం రీత్యా ఇప్పటికి జరిగింది. భవన నిర్మాణ నిబంధనల్ని ఉల్లంఘించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్నిచోట్లా విచ్చలవిడిగా సాగుతున్న ఆందోళనకర పరిణామం. నోయిడా ట్విన్ టవర్స్ అందుకు చిరు ఉదాహరణ మాత్రమే. ప్రభుత్వ నిబంధనలు ఏవైనప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూ, ఇష్టారాజ్యంగా బహుళ అంతస్థుల భవనాలు, బడాబాబుల విల్లాలు, భారీ అపార్ట్మెంట్లు కట్టడం ఇప్పుడు రివాజైంది. స్థానిక అధికార యంత్రాంగం చేతులు తడిపి, నోరు విప్పకుండా సాగుతున్న ఈ ధంధా ఆ పైన ప్రభుత్వాలు తరచూ ప్రకటించే భవనాల క్రమబద్ధీకరణ ప్రక్రియలో రాజముద్ర వేయించేసుకుంటోంది. తప్పులు చేయడమే కాక, వేలెత్తి చూపినవారిని నిందిస్తూ, రకరకాలుగా సమర్థించుకొనే ప్రయత్నాలకూ మన దగ్గర కొదవ లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని, నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానదీ గర్భంలో కట్టిన ఇంట్లో మాజీ సీఎం చంద్రబాబు కథ ఆంధ్రప్రదేశ్లో కొన్నాళ్ళ క్రితం చూశాం. అక్రమ కట్టడాల్ని కూల్చివేయడానికి సమకట్టిన ప్రభుత్వంపై అన్యాయం, అధర్మం, దుర్మార్గం అంటూ దుమ్మెత్తిపోయడం గమనించాం. చేసిన తప్పును కప్పిపుచ్చుకొంటూ, కక్షసాధింపు ముద్ర వేయాలనుకోవడం అవివేకం. అలాంటి వారందరికీ తాజా నోయిడా ఉదంతం ఒక చెంపపెట్టు. దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే – ఈ ట్విన్ టవర్స్ వ్యవహారంలో ఇప్పటి దాకా ప్రభుత్వ అధికారులు, అగ్నిప్రమాద నివారక విభాగం వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం! మన దేశంలోని రాజకీయ, పాలనా యంత్రాంగాల్లోని అవినీతిని ఇది బట్టబయలు చేస్తోంది. ఇప్పటికీ అనేక నగరాల్లో సరైన అనుమతులు లేకుండా సాగుతున్న నిర్మాణాలు సగానికి పైనే ఉంటాయని ఓ అంచనా. నిర్మాణాలపై సరైన నిఘా కానీ, నియంత్రణ కానీ, నిర్ణయాత్మకమైన చర్యలు కానీ లేకపోవడం ఇలాంటి అక్రమార్కులు బరి తెగించడానికి కారణమవుతోంది. ఈ ఉల్లంఘనల్లో భవన నిర్మాతలతో పాటు పాలకుల తప్పు కూడా కొంత లేకపోలేదు. కారణాలు ఏమైనా, స్థానిక ప్రభుత్వాలు తరచూ భవనాల క్రమబద్ధీకరణ పథకాన్ని (బీఆర్ఎస్) ప్రకటిస్తూ, జరిమానా విధింపుతో నిర్మాణాల్లోని తప్పుల్ని ఒప్పుల్ని చేస్తున్నాయి. బీఆర్ఎస్ను సర్కారీ ఆదాయ అవసరాలను తీర్చే కల్పవృక్షం, కామధేనువుగా చూస్తున్నాయి. భవన నిర్మాతలు సైతం తర్వాత డబ్బు కట్టి, రాజముద్ర వేయించుకోవచ్చనే ధీమాతో ఆది నుంచే అన్ని రూల్సునూ అడ్డంగా అతిక్రమిస్తూ, నిర్మాణాలు సాగిస్తున్నారు. ఆ పద్ధతి మార్చుకొని, తాజా ఘటనతో భవన నిర్మాణ రంగంలో కొరవడ్డ నమ్మకాన్ని పునరుద్ధరించాలి. పారదర్శకంగా, నియమాలు పాటించాలి. పాలకులు సైతం బీఆర్ఎస్ మంత్రజపం మానుకోవాలి. దోషులని తేలిన అధికారులు, భవన నిర్మాతలపై కఠిన చర్యలు చేపట్టాలి. ట్విన్ టవర్స్ నిర్మించిన సంస్థ మిగిలిన వారికి డబ్బులు వెనక్కి ఇవ్వడమో, ప్రత్యామ్నాయ ఫ్లాట్లు అందించడమో చేసినా, ఇప్పటికీ మరో 59 మంది బయ్యర్లకు న్యాయం జరగలేదు. ఈ అవినీతి హర్మ్యాలపై పరస్పర నిందారోపణలు చేసుకుంటున్న బీజేపీ, ఎస్పీలు ఆ పని మాని, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి. అన్నిచోట్లా బయ్యర్లు ట్విన్ టవర్స్ ప్రాంగణవాసుల లాగా సుదీర్ఘ పోరాటం చేయలేరు గనక నిర్మాణం కన్నా ముందే ప్రభుత్వాలే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. ఉల్లంఘనల్ని ససేమిరా అనుమతించబోమనే సంకే తాలివ్వాలి. అందుకు తాజా కూల్చివేత తొలి అడుగు కావాలి. అవసరమైతే ఇలాంటి కూల్చివేతలు మరిన్ని జరగాలి. అప్పుడే అందరిలో చైతన్యం పెరుగుతుంది. అవకతవకలకు అడ్డుకట్ట పడుతుంది. -
ట్విన్ టవర్ల కూల్చివేత, ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్
సాక్షి, ముంబై: పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈరోజు నోయిడా జంట టవర్ల కూల్చివేత వీడియోను షేర్ చేశారు. అయితే ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? ఇక్కడే ఆయన ప్రత్యేకత ఉంది. అహాన్ని జయించకపోతే... అది జీవితాన్ని ఎంతగా నాశనం చేస్తుందో తెలిపే అద్భుత సందేశంతో టవర్ల కూల్చివేత వీడియోను షేర్ చేశారు. కుతుబ్మినార్ కంటే ఎత్తైన నోయిడాలోని సూపర్టెక్ ట్విన్ టవర్లు కూల్చివేతను జీవిత సత్యంతో అన్వయించారు. నోయిడా టవర్ల కూల్చివేతను మండే మోటివేషన్కు ఎందుకు ఉపయోగిస్తున్నాను అంటే, మనలోని ఈగో కొండలా పేరుకుపోతే ఎంత ప్రమాదమో ఈ ఘటన తనకు గుర్తు చేసిందన్నారు. కొండంత ఎత్తుకు చేరిపోయిన అహాన్ని అంతం చేయడానికి పేలుడు పదార్థాల అవససరం పడుతుందంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి మహీంద్ర ఆలోచింపజేసే పోస్ట్తో ఏకీభవిస్తున్న ట్విటర్ యూజర్లు ఆయనను ప్రశంసించారు. మండే మోటివేషన్ ట్వీట్పై తమదైన శైలిలో కమెంట్ చేస్తున్నారు. తప్పు జరిగిందని అంగీకరించడానికి అహం అడ్డు వస్తుంది. వాస్తవానికి ఏ సమస్యకైనా తొలి పరిష్కారం అహాన్ని జయించడం. అలాకాకుండా ఈగో తిష్టవేసుకుని కూచుందో ఇహ..దాన్ని కూల్చేందుకు విస్ఫోటనం తప్పదు అని మరొక యూజర్ కమెంట్ చేశారు. Why am I using the demolition of the Noida towers for #MondayMotivation ? Because it reminds me of the dangers of letting our egos get too tall. Sometimes we need explosives to demolish the excess ego. pic.twitter.com/qSMl2qSera — anand mahindra (@anandmahindra) August 29, 2022 -
ట్విన్ టవర్ల కూల్చివేత.. ఫ్లాట్లో నిద్రపోయిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
లక్నో: నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ట్విన్ టవర్స్ను ఆదివారం అధికారులు కూల్చేసిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం 2.30 నిమిషాలకు వాటర్ పాల్ టెక్నిక్ను ఉపయోగించి.. బటన్ నొక్కి జంట భవనాలను నేలమట్టం చేశారు. కేవలం 9 సెకన్లలోనే ట్విన్ టవర్స్ కుప్పకూలాయి. ఈ టవర్స్ను కూల్చేందుకు 3,700 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించారు. ట్విన్ టవర్స్ వద్ద నో ఫ్లైయింగ్ జోన్ అమలు చేయడంతో పాటు చుట్టుపక్కల 500 మీటర్ల వరకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. అయితే కూల్చివేత ప్రక్రియకు ముందుగానే పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ట్విన్ టవర్స్ చుట్టుపక్కల ఉన్న స్థానికులను ముందుగానే తాత్కాలికంగా ఖాళీ చేయించారు. ఇ అయితే సమీపంలో షెల్టర్ కల్పించిన వారు మాత్రం ఆదివారం ఉదయం వరకు తమ ఫ్లాట్లలోనే ఉన్నారు. ఉదయం ఏడు గంటలకు వారు అక్కడి నుంచి షెల్టర్ కేంద్రాలకు వెళ్లారు. చదవండి: Noida Twin Towers Demolition: వ్యర్థాల తొలగింపుకు ఎన్ని రోజులు పడుతుందో తెలుసా! కానీ ఓ వ్యక్తి మాత్రం ఇంట్లో అలాగే పడుకుండిపోయాడు. ట్విన్ టవర్స్కు సమీపంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లోని టాప్ ఫ్లోర్లో గాఢంగా నిద్రిస్తూ ఉండిపోయాడు. ఖాళీ చేయాల్సిన నిర్ణీత సమయానికి అతడు మేల్కోలేదు. జంట టవర్ల కూల్చివేత ముందు చివరిసారి అన్నిచోట్ల తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఒక టవర్లోని పై అంతస్తు ఫ్లాట్లో నిద్రపోతున్న ఆ వ్యక్తిని సెక్యూరిటీ గార్డు గుర్తించాడు.వెంటనే టాస్క్ఫోర్స్ సిబ్బందికి సమాచారం అందించాడు. దీంతో అతడ్ని నిద్ర లేపి అక్కడి నుంచి షెల్టర్కు పంపారు.కాగా కూల్చివేత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సకాలంలో ఆ వ్యక్తిని గుర్తించినట్లు టాస్క్ఫోర్స్ సభ్యుడు తెలిపారు. చదవండి: నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత.. ఇప్పుడు కస్టమర్ల పరిస్థితి ఏంటి? -
ట్విన్ టవర్స్ కూల్చివేతకు ప్రధాన కారణాలు ఇవే..
-
వారి అవినీతికి ‘ట్విన్ టవర్స్’ సజీవ సాక్ష్యం: డిప్యూటీ సీఎం
లక్నో: ఉత్తర్ప్రదేశ్లోని నోయిడాలో సూపర్టెక్ సంస్థ అక్రమంగా నిర్మించిన జంట భవనాలు క్షణాల వ్యవధిలోనే నేలమట్టమయ్యాయి. అనధికారికంగా, అక్రమంగా గ్రీన్జోన్లో నిర్మించిన అత్యంత ఎత్తైన టవర్స్ను కూల్చేయాల్సిందేనంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు నోయిడా అథారిటీ అధికారులు కూల్చేశారు. ఈ క్రమంలో విపక్షాలపై విమర్శలు గుప్పించింది ఉత్తర్ప్రదేశ్ అధికార బీజేపీ. అలాంటి అక్రమ కట్టడాలతో రాజకీయ నాయకులు, బిల్డర్స్, అధికారుల మధ్య అనుబంధం ఎలా ఉంటుందో తెలుస్తుందని విమర్శించింది. భవిష్యత్తులో రాష్ట్రంలోని అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. నోయిడా ట్విన్ టవర్స్ నిర్మాణానికి 2004లో అనుమతులు లభించాయి. దీంతో అప్పటి సమాజ్వాదీ పార్టీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య. ‘సమాజ్ వాదీ పార్టీ అవినీతి, అరాచకాలకు నోయిడా ట్విట్ టవర్స్ సజీవ సాక్ష్యం. నేడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో ఎస్పీ అవినీతి భవనం కూలిపోతుంది. ఇదే న్యాయం, ఇదే సుపరిపాలన.’ అని ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు డిప్యూటీ సీఎం. नोएडा का सुपरटेक ट्विन टॉवर श्री अखिलेश यादव और सपा के शासनकाल के भ्रष्टाचार और अराजकता की नीति का जीवंत प्रमाण है। आज मुख्यमंत्री श्री योगी आदित्यनाथ जी के नेतृत्व में भाजपा की सरकार में सपा के भ्रष्टाचार की इमारत ढहेगी। यह है न्याय, यही सुशासन।#TwinTowers — Keshav Prasad Maurya (@kpmaurya1) August 28, 2022 డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఆరోపణలను తిప్పికొట్టింది సమాజ్ వాదీ పార్టీ. ‘ఈ అవినీత కట్టడం నిర్మించటానికి బీజేపీ సైతం కారణం. బీజేపీకి సూపర్టెక్ భారీగా నిధులు ముట్టజెప్పింది. కాషాయ పార్టీకి చెందిన ఆఫీసులో కూర్చుని ఓ బ్రోకర్ అందుకు బ్రోకరేజ్ అందుకున్నాడు.’ అని ఆరోపించింది. ఇదీ చదవండి: Noida Twin Towers: పేకమేడల్లా కుప్పకూలిన నోయిడా ట్విన్ టవర్స్ .. 9 సెకన్లలోనే.. -
నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత.. ఇప్పుడు కస్టమర్ల పరిస్థితి ఏంటి?
నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు జరిగిన నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేతపై ఉత్కంఠకు తెరపడింది. ముంబైకి చెందిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చివేసింది. ఈ కూల్చివేతపై.. ట్విన్ టవర్స్ నిర్మాణ సంస్థ సూపర్ టెక్ స్పందించింది. నోయిడా డెవలప్మెంట్ అధికారులు ఆమోదించిన బిల్డింగ్ ప్లాన్ ప్రకారమే కూల్చేసిన జంట భవనాల్ని నిర్మించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. నిర్మాణంలో ఎలాంటి ఫిరాయింపులు జరగలేదని సూపర్ టెక్ అధినేత ఆర్కే అరోరా స్పష్టం చేశారు. టవర్స్ కూల్చివేయడంపై ఇప్పటికే సూపర్ టెక్ నుంచి ఇళ్ల కొనుగోళ్ల కోసం అడ్వాన్స్లు చెల్లించిన కస్టమర్ల ఆందోళనపై స్పందించారు. కంగారు పడొద్దు. "మేం 70వేల కంటే ఎక్కువ యూనిట్లను కొనుగోలు దారులకు డెలివరీ చేశాం. మిగిలిన వారికి షెడ్యూల్ టైమ్ ప్రకారం డెలివరీ అందించేందుకు కట్టుబడి ఉన్నాం. సుప్రీం కోర్ట్ ఉత్తర్వుతో ట్విన్ టవర్స్ను కూల్చేస్తున్నామని, ఆ ప్రభావం మా సంస్థ నుంచి కొనసాగుతున్న ఇతర ప్రాజెక్ట్లపై ప్రభావం చూపదని ఆర్కే అరోరా అన్నారు. సుప్రీం తీర్పు మాకు శిరోధార్యం "నోయిడాలోని ట్విన్ టవర్స్ 'అపెక్స్', 'సెయానే'లు సెక్టార్ 93ఏ ఎమరాల్డ్ కోర్ట్ ప్రాజెక్ట్లో భాగంగా ఉన్నాయి. నోయిడా అథారిటీ కేటాయించిన భూమిలో నిర్మించబడింది. 2009లో రెండు టవర్లతో సహా ప్రాజెక్ట్ యొక్క నిర్మాణ ప్రణాళికలను నోయిడా అథారిటీ ఆమోదించింది. నాటి రాష్ట్ర ప్రభుత్వ బిల్డింగ్ బై చట్టాలకు అనుగుణంగా నిర్మించాం." అని ఆర్కే అరోరా పేర్కొన్నారు. "అయితే, మేం నిర్మించిన జంట భవనాల వల్ల సాంకేతిక కారణాల్ని ఎత్తి చూపిస్తూ రెండు టవర్లను కూల్చివేయాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల్ని గౌరవిస్తా. తీర్పు అమలుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. చదవండి👉 ట్విన్ టవర్స్ కూల్చివేతలో మీకు తెలియని ఆసక్తికర విషయాలు! -
కుప్పకూలిన నోయిడా ట్విన్ టవర్స్ (ఫొటోలు)
-
నేలమట్టమైన నోయిడా ట్విన్ టవర్స్
-
నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత.. వ్యర్థాల తరలింపుకు ఎన్ని రోజులు పడుతుందో తెలుసా!
లక్నో: నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేతపై దేశమంతా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. నోయిడాలో ట్విన్ టవర్స్ కూల్చివేత ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యింది. ముంబైకి చెందిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చివేసింది. వాటర్ పాల్ టెక్నిక్ను ఉపయోగించి..100 మీటర్ల దూరం నుంచి అధికారులు బటన్ను నొక్కడం ద్వారా టవర్లు నేలమట్టమయ్యాయి. 9 సెకన్లలోనే రెండు భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. భవనాలు కూలడంతో దాదాపు 40 మీటర్లమేర దట్టమైన పొగ కమ్ముకుంది. చదవండి: పేకమేడల్లా కుప్పకూలిన నోయిడా ట్విన్ టవర్స్ .. 9 సెకన్లలోపే.. అయితే ట్విన్ టవర్స్ కూల్చివేత తర్వాత నిర్మాణ వ్యర్థాల తొలగింపునకు 3 నెలల సమయం పట్టనుందని అధికారులు వెల్లడించారు. 55,000 నుంచి 80 వేల టన్నుల శిథిలాలను తరలించనున్నారు. ఈ టవర్స్ను కూల్చేందుకు 3,700 కిలోల పేలుడు పదార్థాలను అమర్చారు. ఇక ఈ రెండు భవనాల్లో ఒకటి 103 మీటర్ల ఎత్తు, మరొకటి 97 మీటర్ల ఎత్తు ఉన్నాయి. చదవండి: మీకు తెలియని ఆసక్తికర విషయాలు : ట్విన్ టవర్స్ కూలడానికి ఆ నలుగురే కారణం! కూల్చివేతల్లో ఒక్కో చదరపు అడుగుకు రూ. 267 ఖర్చు అవుతుండగా... 7.5 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలు కూల్చివేతకు రూ. 20కోట్లు ఖర్చు అవుతోంది. రూ. 70 కోట్లతో నిర్మించిన ఈ భవనాల ప్రస్తుత విలువ అక్షరాల 1, 200 కోట్లు. #WATCH | Noida, UP: Rubble of demolished #SupertechTwinTowers laid bare along with a cloud of dust in the vicinity after the demolition pic.twitter.com/0jxd4VVh0l — ANI (@ANI) August 28, 2022 ట్విన్ టవర్స్ వద్ద నో ఫ్లైయింగ్ జోన్ అమలు చేయడంతో పాటు చుట్టుపక్కల 500 మీటర్ల వరకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. అలాగే కూల్చివేసిన తర్వాత దుమ్ము, కాలుష్య స్థాయిలను పర్యవేక్షించడానికి ప్రత్యేక డస్ట్ మిషన్ను ఏర్పాటు చేశారు. బిల్డింగ్ కూలిన కొద్ది నిమిషాల్లోనే గాలిలో దుమ్ము, దూళిని క్లియర్ చేయనున్నారు. #WATCH | 'Controlled implosion' turns Noida's #SupertechTwinTowers to dust pic.twitter.com/zDksI6lfIF — ANI (@ANI) August 28, 2022 దాదాపు 500 మంది పోలీసులు, ట్రాఫిక్ సిబ్బందిని మోహరించారు. ట్విన్ టవర్స్ చుట్టుపక్కల ఉన్న స్థానికులను తాత్కాలికంగా ఖాళీ చేయించారు. అంతేగాక నోయిడాలోని ఓ స్వచ్ఛంద సంస్థ రంగంలోకి దిగి ఇప్పటివరకు పరిసరాల్లోని 35 వీధి కుక్కలనుపట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. -
పేకమేడల్లా కుప్పకూలిన నోయిడా ట్విన్ టవర్స్ .. 9 సెకన్లలోనే..
లక్నో: ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో సూపర్టెక్ సంస్థ అక్రమంగా నిర్మించిన జంట భవనాలు నేలమట్టమయ్యాయి. ముంబైకి చెందిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చివేసింది. ఒక్క బటన్ నొక్కడంతో 100 మీటర్లకు పైగా పొడవైన ఆ భవనాలు కేవలం 9 సెకండ్లలోనే పేకమేడల్లా కుప్పకూలాయి.. ఈ టవర్స్ను కూల్చేందుకు 3,700 కిలోల పేలుడు పదార్థాలను అమర్చారు. ఈ కూల్చివేత నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులు ముందుగానే స్థానికులను తాత్కాలికంగా ఖాళీ చేయించారు. పేలుడు పదార్థాల ద్వారా ‘‘కంట్రోల్డ్ ఇంప్లోజన్ ’’ (వాటర్ఫాల్ ఇంప్లోజిన్) విధానంతో కొన్ని సెకండ్లలో కూల్చేశారు. ఈ బిల్డింగ్ కట్టడానికి రూ.70 కోట్లు ఖర్చైతే.. కూల్చడానికి రూ.20 కోట్లు ఖర్చు అవుతుంది. నిర్మాణాల కూల్చివేత సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగక్కుండా అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. దాదాపు 500 మంది పోలీసులు, ట్రాఫిక్ సిబ్బందిని మోహరించారు. అదే విధంగా ఆ దారిలో వచ్చే వాహనాలను మళ్లించారు. #WATCH | 3,700kgs of explosives bring down Noida Supertech twin towers after years long legal battle over violation of construction laws pic.twitter.com/pPNKB7WVD4 — ANI (@ANI) August 28, 2022 -
మీకు తెలియని ఆసక్తికర విషయాలు: ట్విన్ టవర్స్ కూలడానికి ఆ నలుగురే కారణం!
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో సూపర్టెక్ సంస్థ అక్రమంగా నిర్మించిన జంట భవనాల కూల్చివేశారు. ముంబైకి చెందిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చి వేసింది. ఈ కూల్చివేత నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులు స్థానికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ సందర్భంగా ట్విన్ టవర్స్ కూల్చి వేతపై ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ►సుప్రీం కోర్ట్ ఆదేశాలతో ఆగస్ట్ 8 నుంచి సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, నోయిడా అధికారులు ఆధ్వర్యంలో ముంబైకి చెందిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థతో కూల్చివేత పనుల్ని ప్రారంభించారు. ►జంట భవనాల కూల్చి వేత పనుల్ని పూర్తి చేసినట్లు నోయిడా పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ తెలిపారు. భవనాల్ని నేల మట్టం చేసేందుకు సహాయక చర్యల కోసం 560మంది పోలీసులు, 100 రిజర్వ్ పోర్స్ సిబ్బంది, 4 క్విక్ రెస్పాన్స్ టీంలు రంగంలోకి దిగినట్లు చెప్పారు. ►ట్విన్ టవర్స్ను సెకన్ల వ్యవధిలో నేల మట్టం చేసేందుకు జంట భవనాల్లో 3,700 కేజీలకు పైగా పేలుడు పదార్థాల్ని నింపారు. ఇందుకోసం పిల్లర్స్కు సుమారు 7వేల రంద్రాలు చేశారు. వాటర్ ఫాల్ టెక్నిక్తో ఒక్క బటన్ నొక్కగానే సెకన్ల వ్యవధిలో కూల్చేందుకు 20వేల సర్క్యూట్ను సిద్ధం చేశారు. ►ప్రాజెక్ట్ ఇంజినీర్ల వివరాల ప్రకారం.. సూపర్టెక్ భవనాల్ని కూల్చే సమయం 9 సెకన్లు పడుతుంది. కూలిన వెంటనే సరిహద్దు ప్రాంతాల్లో 12 నిమిషాల పాటు దట్టమైన శిధిలా పొగ కమ్ముకుంటుంది. కూల్చివేతతో 55,000 నుంచి 80 వేల టన్నులు శిథిలాలు సేకరించే అవకాశం ఉండగా.. వాటిని తరలించేందుకు 3నెలల సమయం పట్టనుంది. ► కూలే సమయంలో కొన్ని సెకన్ల పాటు 30 మీటర్ల రేడియస్ వరకు కంపించనుంది. పేలుడు 30 మీటర్ల అధికారుల ప్రకారం, ఈ ప్రకంపనల పరిమాణం సెకనుకు దాదాపు 30మిల్లీ మీటర్లు ఉండవచ్చు. రిక్టర్ స్కేలుపై 0.4 తీవ్రతతో వచ్చిన భూకంపం ఎలా కంపిస్తుందో.. కూల్చి వేత సమయంలో నోయిడా టవర్స్ కంపిస్తాయి. ఇక 6 వరకు భూకంపాలను తట్టుకునేలా నిర్మించబడిందని అధికారులు తెలిపారు. ► ట్విన్ టవర్స్ చుట్టు పక్కల సుమారు 7వేల కుటుంబాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. తిరిగి వాళ్లు సాయంత్రం 5.30గంటలకు రావొచ్చని అన్నారు. కూల్చి వేతతో ఎలాంటి నష్టం జరగకుండా ఉండేలా స్థానిక నివాసాల్లో గ్యాస్, పవర్ సప్లయ్ నిలిపివేశారు. సాయంత్రం 4 గంటలకు కరెంట్, గ్యాస్ సదుపాయం అందుబాటులోకి రానుంది. ► సెక్టాకర్ 93ఏలో ట్విన్ టవర్స్ను నిర్మించిన ప్రాంతం చుట్టూ 450 మీటర్ల వరకు వాహనాల రాకపోకల్ని నిలిపివేయనున్నారు. బ్లాస్ట్ అనంతరం అంటే మధ్యాహ్నం 2.15 నుంచి 2.45గంటల వరకు వాహనాల రాకపో కలు ఆగిపోనున్నాయి. ► ట్విన్ టవర్స్ పక్కనే 8 మీటర్ల దూరంలో, మరికొన్ని 12 మీటర్ల దూరంలో భవనాలున్నాయి. దుమ్ము వ్యాప్తిని తగ్గించడానికి టవర్స్ను ప్రత్యేక వస్త్రంతో కప్పారు. ఈ ప్రాంతాన్ని ఒక నాటికల్ మైలు మేర నో ఫ్లై జోన్గా ప్రకటించారు. ► రూ. 100 కోట్ల బీమా పాలసీ కింద కూల్చివేత ప్రక్రియ జరుగుతుంది . ఈ బీమా ట్విన్ టవర్స్ పక్కనే ఉన్న భవనాలకు ప్రమాదం జరిగితే..నష్ట పరిహారంగా చెల్లించనున్నారు. ప్రీమియం, ఇతర ఖర్చులను సూపర్టెక్ భరించాలి. కూల్చివేత ప్రాజెక్ట్కు రూ. 20 కోట్ల కంటే ఎక్కువ ఖర్చవుతుంది. కూల్చివేతతో టవర్స్ నిర్మాణం కోసం ఉపయోగించిన ఉత్త ఇనుము వల్లే సుమారు రూ.50కోట్లకు పైగా నష్టం. ► ముంబైకి చెందిన ఎడిఫైస్ ఇంజినీరింగ్ అనే సంస్థ తొమ్మిదేళ్ల న్యాయపోరాటం తర్వాత రెండు టవర్లను కూల్చివేసే బాధ్యతను అప్పగించింది. ఎమరాల్డ్ కోర్ట్ సొసైటీ ప్రాంగణంలో నిబంధనలకు విరుద్ధంగా టవర్లను నిర్మించారని సుప్రీంకోర్టు గుర్తించిన తర్వాత వాటిని కూల్చేందుకు సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నోయిడా అధికారులతో కలిసి పని చేసింది. ►ఒక్కో టవర్లో 40 అంతస్తులు నిర్మించాలని బిల్డర్ ప్లాన్ చేశారు. కోర్టు ఆదేశాల కారణంగా కొన్ని అంతస్తులు నిర్మించలేకపోయినా, పేలుడుకు ముందు కొన్ని మాన్యువల్గా విరిగిపోయాయి. టవర్లలో ఒకటైన అపెక్స్లో 32 అంతస్తులను కలిగి ఉంది. సెయానేలో 97ప్లాట్లు ఉన్నాయి. మరొకటి 29. అపెక్స్ 103 మీటర్ల పొడవు ఉండగా, సెయానే 97 వద్ద ఉంది. ప్లాన్ ప్రకారం 900+ ఫ్లాట్లు ఉన్నాయి, వీటిలో మూడింట రెండు వంతులు బుక్ చేయబడ్డాయి. మరికొన్నింటిని అమ్మేశారు. నిర్మాణంలో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి వడ్డీతో సహా వాపసు ఇవ్వాలని డెవలపర్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ►9 ఏళ్ల పాటు సాగిన న్యాయ పోరాటం తర్వాత జంట టవర్లను కూల్చివేస్తున్నారు. సవరించిన బిల్డింగ్ ప్లాన్లో భాగంగా ఈ టవర్లు నిర్మాణానికి ఆమోదం లభించింది. ఆ ఆమోదంపై సూపర్టెక్ ఎమరాల్డ్ కోర్ట్ సొసైటీకి చెందిన నలుగురు స్థానికులు యూఎస్బీ తోతియా(80), ఎస్కే శర్మ(74), రవి బజాజ్ (65), ఎంకే జైన్ (59) నివాసితులు 2012లో కోర్టును ఆశ్రయించారు. మొదట్లో ఉద్యానవనం ఉన్న స్థలంలో టవర్లను నిర్మించినట్లు వారు తెలిపారు. అనుమతుల్లో అక్రమాలు వెలుగులోకి రావడంతో కొందరు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 2014లో అలహాబాద్ హైకోర్టు కూల్చివేతకు ఆదేశించగా..ఆ తర్వాత కేసు సుప్రీంకోర్టుకు వెళ్లింది. గత ఆగస్టులో, కోర్టు టవర్లను కూల్చివేసేందుకు మూడు నెలల సమయం ఇచ్చింది, కానీ సాంకేతిక సమస్యల కారణంగా అది ఒక సంవత్సరం పట్టింది. చదవండి👉 ఇదెక్కడి గొడవరా నాయనా.. పగోడికి కూడా రావొద్దు ఈ కష్టాలు -
నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేతకు సర్వం సిద్ధం
-
టిక్ టిక్ టిక్.. నోయిడా జంట భవనాల కూల్చివేత
నోయిడా: ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో సూపర్టెక్ సంస్థ అక్రమంగా నిర్మించిన జంట భవనాల కూల్చివేతకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజల్లో దడ మొదలైంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ జంట భవనాలను ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకి కూల్చివేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక్క బటన్ నొక్కడంతో 100 మీటర్లకు పైగా పొడవైన ఆ భవనాలు కేవలం 10 సెకండ్లలోపే పేకమేడల్లా నేలమట్టం కానున్నాయి. భవనాల కూల్చివేతను చేపట్టిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ సీఈఓ ఉత్కర్ మెహతా శనివారం పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూల్చివేతపై ఎలాంటి భయాలు వద్దని తాము చేపట్టిన ప్రక్రియ 150 శాతం సురక్షితమైనదని హామీ ఇచ్చారు. వాటర్ఫాల్ ఇంప్లోజన్ టెక్నిక్ ఈ తరహా భవనాలు కూల్చివేయడానికి మూడు మార్గాలున్నాయి. డైమండ్ కటర్, రోబోటిక్ టెక్నిక్, పేలుడు పదార్థాలు.. ఇలా మూడు రకాలుగా భవనాల్ని కూల్చేయవచ్చు. అయితే కూల్చడానికయ్యే ఖర్చు, సమయం, భద్రత అంశాలను దృష్టిలో ఉంచుకొని పేలుడు పదార్థాల ద్వారా ‘‘కంట్రోల్డ్ ఇంప్లోజన్ ’’ (వాటర్ఫాల్ ఇంప్లోజిన్) విధానంతో కొన్ని సెకండ్లలో కూల్చేయనున్నారు. ఈ టెక్నిక్ను 1773లో ఐర్లాండ్లోని వాటర్ఫోర్డ్లో హోలీ ట్రినిటీ కేథడ్రాల్ భవనం కూల్చివేతకు తొలిసారిగా ఉపయోగించారు. 2020లో కేరళలోని కొచికి సమీపంలో మారాడు పట్టణంలో కోస్తా తీర ప్రాంత నిబంధనలను అతిక్రమించి నిర్మించిన నాలుగు లగ్జరీ అపార్ట్మెంట్లను కూడా పేలుడు పదార్థాలను వినియోగించి కూల్చివేశారు. వంతెనలు, సొరంగాలు, భవనాలు, ఇతర నిర్మాణాలను కూల్చివేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఈ విధానమే అత్యంత భద్రమైనదని తేలింది. వాయు కాలుష్యంతో అనారోగ్య సమస్యలు జంట భవనాల కూల్చివేత సమయంలో తమ ఇళ్లకి ఏం జరుగుతుందోనని, దుమ్ము ధూళి కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయేమోనని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనాల కూల్చివేత సమయంలో వచ్చే ధూళి కొన్ని వారాల పాటు గాల్లోనే ఉండడం వల్ల శ్వాసకోశ ఇబ్బందులు రావచ్చునని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దేశంలో అత్యంత కాలుష్య నగరాల్లో నోయిడా ముందు వరసలోనే ఉంది. ఇప్పుడు వాయుకాలుష్యం మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ఆ భవనాల పక్కనే ఉన్న ఎమరాల్డ్ కోర్టు, ఏటీఎస్ విలేజ్లో ఉంటున్న 5 వేల మందికిపైగా ఆదివారం ఉదయం ఇళ్లు ఖాళీ చేసి వెళ్లనున్నారు. ‘‘మేము చాలా ప్రమాదంలో ఉన్నాం. భవనాల కూల్చివేత సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా మా ఇళ్లు ఏమయిపోతాయోనన్న భయాన్ని మాటల్లో చెప్పలేను’’ అని సీనియర్ రెసిడెంట్ ఆర్కె రస్తోగి ఆందోళన వ్యక్తం చేశారు. ఏటీఎస్ విలేజ్లో నివాసం ఉండే మౌసమి భవనాల కూల్చివేసిన తర్వాత ఏర్పడే దుమ్ము, ధూళికి ఎలాంటి శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయోనని ఆందోళన వ్యక్తం చేశారు. నోయిడా జంట భవనాల నిర్మాణం : 2012 రెండు జంట భవనాలు : అపెక్స్ (32 అంతస్తులు), సియాన్ (29 అంతస్తులు) భవనాలకు చేసిన రంధ్రాలు : 9,600 నింపిన పేలుడు పదార్థాలు : 3,700 కేజీలకు పైగా టవర్స్ నిర్మాణ వ్యయం : రూ.70 కోట్లు కూల్చివేతకు ఖర్చు : రూ.20 కోట్లు శిథిలాలు : 55,000 నుంచి 80 వేల టన్నులు శిథిలాల తరలింపునకు పట్టే సమయం: 3 నెలలు -
ట్విన్ టవర్స్ కూల్చివేతకు అంత ఖర్చా?.. ఎంత నష్టమంటే..
ఏళ్ల తరబడి ఆలోచన.. ఇంజనీర్ల ప్లాన్లు.. వందల నుంచి వేల మంది కూలీల కష్టం. దాదాపు మూడేళ్లపాటు శ్రమించి నిర్మించిన బిల్డింగులు. అలాంటి ఆకాశ హర్మ్యాలను కేవలం.. తొమ్మిదంటే తొమ్మిదే సెకండ్లలో నేలమట్టం నేల మట్టం చేయబోతున్నారు. అయితే తమకిది సింపుల్ వ్యవహారం అంటున్నారు సూపర్టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేత కోసం బటన్ నొక్కనున్న చేతన్ దత్తా. ఆగస్టు 28, నొయిడా(New Okhla Industrial Development Authority) 93A సెక్టార్లోని జంట టవర్లు పేకమేడల్లా కూలిపోనున్నాయి. సూపర్టెక్ ట్విన్ టవర్లను కూల్చివేయడానికి బటన్ను నొక్కడం.. ఒక సాధారణ ప్రక్రియ అని అంటున్నారు బ్లాస్టింగ్ వ్యవహారాలను చూసుకునే చేతన్ దత్తా . ► ఇది చాలా తేలికైన వ్యవహారం. డైనమో నుంచి విద్యుత్ను పుట్టిస్తాం. ఆ తర్వాత బటన్ను ప్రెస్ చేస్తాం. ఇది 9 సెకన్లలో అన్ని షాక్ ట్యూబ్లలోని డిటోనేటర్లను మండిస్తుంది. మేం 50-70 మీటర్ల దూరంలో ఉంటాం. కానీ, మాకేం ప్రమాదం ఉండదు. కూల్చివేత సజావుగా సాగాలని మేం అనుకుంటున్నాం. బ్లాస్టింగ్ ఏరియా మొత్తం నాలుగు లేయర్ల ఇనుప జాలీలతో కవర్ అయ్యి ఉంటుంది. అలాగే రెండు లేయర్ల బ్లాంకెట్లను కప్పుతున్నాం. కాబట్టి, శిథిలాలు ఏవీ కూడా వాటిని దాటి బయటకు రాలేవు. కాకపోతే దుమ్ము మాత్రం రావొచ్చు అని చేతన్ దత్తా వెల్లడించారు. ► కేవలం తొమ్మిది సెకన్లలోనే ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కానుంది. పేలుడు ధాటి, కూల్చివేత ప్రభావాల నేపథ్యంలో వైబ్రేషన్ను తగ్గించేందుకు కుషన్లను ఏర్పాటు చేశారు. ► చుట్టుపక్కల ఎమెరాల్డ్ కోర్టు, ఏటీఎస్ విలేజ్ సొసైటీలు ఉన్నాయి. సుమారు ఐదు వేల మంది జీవిస్తున్నారు అక్కడ. అందుకే.. ఉదయం నుంచే వాళ్లను ఖాళీ చేయించి, తిరిగి పేలుడు అయ్యాక సాయంత్రం పూట వాళ్లను సేఫ్టీ క్లియరెన్స్ అనంతరం ఇళ్లలోకి అనుమతిస్తారు. ► మాస్క్లు, ఐ గ్లాస్లు ధరించాలని ఇప్పటికే సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు వీలుగా.. ఆంబులెన్స్లు, ఫైర్ ఇంజన్లు సిద్ధంగా ఉంచారు. అలాగే ఫ్లెక్స్ ఆస్పత్రిలో 50 బెడ్లను సిద్ధంగా ఉంచారు. ట్రాఫిక్ మళ్లింపు సైతం ఉండనుంది. ► కూల్చివేతకు హర్యానా నుంచి తెప్పించిన 3,500 కేజీల పేలుడు పదార్థాలను వాడుతున్నారు. రెండు భవనాల్లో ఏకంగా 9,600 రంధ్రాలు చేసి వాటిని నింపుతారు. ► కూల్చివేత తర్వాత 32 అంతస్థులు, 29 అంతస్థుల బిల్డింగులు.. 35వేల క్యూబిక్ మీటర్ల శిథిలాలను మిగల్చొచ్చనే అంచనాలో ఉన్నారు. 55 వేల టన్నుల శిథిలాలను ఎత్తి పారబోయడానికి కనీసం మూడు నెలలైనా పట్టొచ్చు. ఆగస్టు 21నే ఈ కూల్చి వేత జరగాల్సి ఉన్నప్పటికీ.. నొయిడా అథారిటీ విజ్ఞప్తి మేరకు మరో వారం ముందుకు జరిగింది. ► సుప్రీం కోర్టు ఆదేశాల అనుసారం.. సూపర్టెక్ సంస్థ ఈ కూల్చివేత ఖర్చులను భరించనుంది. అలాగే.. నొయిడా అథారిటీ, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఈ కూల్చివేతను పర్యవేక్షించనున్నాయి. ► ఆగస్టు 28న గనుక ఏ పరిస్థితులతో అయినా కూల్చివేతను వాయిదా వేయాల్సి వస్తే.. వారం రోజుల్లో ఎప్పుడైనా కూల్చివేసేందుకు ప్రయత్నాలు చేయొచ్చని సుప్రీం కోర్టు సూచించింది. కానీ, ఆ గడువును మాత్రం దాటొద్దని హెచ్చరించింది. ► నొయిడాలో అక్రమంగా నిర్మించిన 100 మీటర్ల ఎత్తైన జంట భవనాలు చూస్తుండగానే కుప్పకూలనున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో వాటిని కూల్చడానికి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ► ఆదివారం (ఆగస్టు 28) కూల్చివేయబోతున్న నోయిడా సూపర్టెక్ ట్విన్ టవర్ల(అపెక్స్, సెయానే టవర్లు) నిర్మాణ వ్యయం చదరపు అడుగులకు (చదరపు అడుగు) రూ. 933 వెచ్చించి మొత్తం 7.5 లక్షల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణం కలిగి ఉంది. ఈ లెక్క అప్పటి అంచనా ప్రకారం మొత్తం రూ.70 కోట్లు. అయితే, ► దాని కూల్చివేత కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, దీనికి చాలా పేలుడు పదార్థాలు, మానవశక్తి మరియు పరికరాలు అవసరం. ► సూపర్టెక్ ఎమరాల్డ్ కోర్ట్ ప్రాజెక్ట్లో ఒక 3BHK అపార్ట్మెంట్ ధర దాదాపు రూ. 1.13 కోట్లు. ఈ రెండు భవనాల్లో దాదాపు 915 ఫ్లాట్లు ఉన్నాయని, వాటి ద్వారా కంపెనీకి దాదాపు రూ.1,200 కోట్ల ఆదాయం వచ్చేది. ► మొత్తం 915 ఫ్లాట్లలో దాదాపు 633 ఫ్లాట్లు బుక్ చేయబడ్డాయి మరియు కంపెనీ గృహ కొనుగోలుదారుల నుండి దాదాపు 180 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పుడు, సూపర్టెక్ని 12 శాతం వడ్డీతో గృహ కొనుగోలుదారులకు తిరిగి చెల్లించాలని కోరింది. ► ఇది కాకుండా.. పేలుడు సమయంలో చుట్టుపక్కల ఏమైనా డ్యామేజ్లు జరిగితే!. ఇందుకోసం బిల్డింగ్ కూల్చివేత బాధ్యతలను తీసుకున్న ఎడిఫైస్ ఇంజినీరింగ్ కంపెనీ రూ.100 కోట్ల ఇన్సూరెన్స్కు వెళ్లింది. ► కూల్చివేతకు అయ్యే మొత్తం కాస్ట్.. అక్షరాల రూ.20 కోట్ల రూపాయలు. ఇందులో సూపర్టెక్ కంపెనీ ఐదు కోట్ల రూపాయలు మాత్రం ఇవ్వనుంది. మిగతా పదిహేను కోట్ల రూపాయలు.. శిథిలాలు అమ్మకం(అందులో నాలుగు వేల టన్నుల స్టీల్ కూడా ఉంటుంది) ద్వారా సేకరించనుంది. ► నొయిడాలో ఎమరాల్డ్ కోర్టు సమీపంలోని సెక్టార్ 93ఏలో ఎపెక్స్, సియాన్ ట్విన్ టవర్స్ ఉన్నాయి. ఎపెక్స్ ఎత్తు 102 మీటర్లు. దీన్ని 32 అంతస్తులతో నిర్మించారు. 95 మీటర్ల ఎత్తున్న సియాన్లో 29 అంతస్తులున్నాయి. ఈ జంట భవనాల్లో 915 ఫ్లాట్లు, 21 వాణిజ్య సముదాయాలు, రెండు బేస్మెంట్లున్నాయి. 2009లో సూపర్టెక్ లిమిటెడ్ కంపెనీ దీని నిర్మించింది. ► పూర్తవడానికి మూడేళ్లు పట్టింది. అయితే పలు నిబంధనల్ని కంపెనీ గాలికొదిలేసింది. ► నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్బీసీ) ప్రకారం గృహ నివాస భవనాల మధ్య కనీసం 16 మీటర్ల దూరముండాలి. కానీ ఎపెక్స్కు, పక్కనే ఉన్న ఎమరాల్డ్ కోర్టులోని టవర్కు మధ్య 9 మీటర్ల దూరం కూడా ఉంచలేదు. ఆ దూరం ఉండి ఉంటే.. ఇప్పుడు ఇంత భారీ విధ్వంసానికి తెర లేచేదే కాదు. ► నిబంధనల ఉల్లంఘనపై.. ఎమరాల్డ్ కోర్టు నివాసులు 2012లోనే కోర్టుకెక్కారు. వీటి నిర్మాణం అక్రమమేనని తేలుస్తూ అలహాబాద్ హైకోర్టు 2014లో తీర్పునిచ్చింది. నాలుగు నెలల్లోగా రెండు భవనాలను కూల్చివేసి, అపార్ట్మెంట్ కొనుగోలుదారులకు డబ్బు వాపసు చేయాలంటూ అలహాబాద్ హైకోర్టు ఏప్రిల్ 11, 2014 నాటి తీర్పును వ్యతిరేకిస్తూ.. గృహ కొనుగోలుదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ.. ► దేశ అత్యున్నత న్యాయస్థానంలోనూ ఎదురు దెబ్బ తగిలింది. జంట భవనాల్ని కూల్చేయాల్సిందేనని కోర్టు 2021 ఆగస్టు 31న తీర్పునిచ్చింది. అందుకు 2022 ఆగష్టు నెలను తుది గడువు ప్రకటించింది. ► ఇది నోయిడా అథారిటీ మరియు సూపర్టెక్ల మధ్య "అనుకూలమైన సంక్లిష్టత" ఫలితమేనని సుప్రీం కోర్టు పేర్కొంది. ► కుతుబ్ మినార్ కంటే ఎత్తైన ఈ జంట భవనాల కూల్చివేతను.. దేశంలోనే ఇప్పటిదాకా ఎత్తైన భవనాల కూల్చివేతగా చెప్తున్నారు. అందుకే ఈ కూల్చివేత ఒక చారిత్రక ఘట్టంగా దేశ చరిత్రలో నిలిచిపోనుంది. -
నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేతకు ఏర్పాట్లు పూర్తి
-
Noida twin towers: కట్టేందుకు మూడేళ్లు... కూల్చేందుకు...తొమ్మిదే సెకన్లు
మూడేళ్ల పాటు నిర్మించిన ఆకాశ హర్మ్యాలవి. తొమ్మిదంటే తొమ్మిదే సెకండ్లలో నేలమట్టం కానున్నాయి. నోయిడాలో అక్రమంగా నిర్మించిన 100 మీటర్ల ఎత్తైన జంట భవనాలు చూస్తుండగానే కుప్పకూలనున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో వాటిని కూల్చడానికి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతకూ ఈ ట్విన్ టవర్స్ను ఎలా కూలుస్తారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఆగస్టు 28. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో అక్రమంగా నిర్మించిన సూపర్టెక్ జంట భవనాలను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధికారులు నేలమట్టం చేయనున్నారు. 40 అంతస్తులున్న ఈ భవనాలను ఆగస్టు 21నే కూల్చేయాల్సి ఉన్నా భద్రతా ఏర్పాట్లకు అధికారులు గడువు కోరడంతో 28కి వాయిదా పడింది. ఏం జరిగింది? నోయిడాలో ఎమరాల్డ్ కోర్టు సమీపంలోని సెక్టార్ 93ఏలో ఎపెక్స్, సియాన్ ట్విన్ టవర్స్ ఉన్నాయి. ఎపెక్స్ ఎత్తు 102 మీటర్లు. దీన్ని 32 అంతస్తులతో నిర్మించారు. 95 మీటర్ల ఎత్తున్న సియాన్లో 29 అంతస్తులున్నాయి. ఈ జంట భవనాల్లో 915 ఫ్లాట్లు, 21 వాణిజ్య సముదాయాలు, రెండు బేస్మెంట్లున్నాయి. 2009లో సూపర్టెక్ లిమిటెడ్ కంపెనీ దీని నిర్మించింది. పూర్తవడానికి మూడేళ్లు పట్టింది. అయితే పలు నిబంధనల్ని కంపెనీ గాలికొదిలేసింది. నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్బీసీ) ప్రకారం గృహ నివాస భవనాల మధ్య కనీసం 16 మీటర్ల దూరముండాలి. కానీ ఎపెక్స్కు, పక్కనే ఉన్న ఎమరాల్డ్ కోర్టులోని టవర్కు మధ్య 9 మీటర్ల దూరం కూడా ఉంచలేదు. దాంతో ఎమరాల్డ్ కోర్టు నివాసులు 2012లోనే కోర్టుకెక్కారు. వీటి నిర్మాణం అక్రమమేనని తేలుస్తూ అలహాబాద్ హైకోర్టు 2014లో తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టులోనూ కంపెనీకి ఎదురు దెబ్బ తగిలింది. జంట భవనాల్ని కూల్చేయాల్సిందేనని కోర్టు 2021 ఆగస్టు 31న తీర్పునిచ్చింది. అందుకు ఈ నెలలో తుది గడువు ప్రకటించింది. భద్రతా ఏర్పాట్లు ఇలా ? ► ఇంత ఎత్తైన భవనాల కూల్చివేత వల్ల పరిసర ప్రాంతాలకు, ఇతర నివాసాలకు నష్టం లేకుండా చూడటం సవాలుగా మారింది. ఇందుకోసం ఎన్నో జాగ్రత్తలు చేపట్టారు. ► ట్విన్ టవర్స్ సమీపంలోనిఎమరాల్డ్ కోర్టు, ఏటీఎస్ విలేజ్ సొసైటీస్లో నివసిస్తున్న 5 వేల మందిని ఆగస్టు 28న ఖాళీ చేయిస్తున్నారు. ఉదయం 7.30కి ఇళ్లు వీడి, సాయంత్రం ఎడిఫస్ కంపెనీ చెప్పాకే తిరిగి రావాలి. ► వారికి చెందిన 1200 వాహనాలను కూడా తరలిస్తున్నారు. ► టవర్స్ సమీపంలోని నోయిడా–గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్వేపై వాహనాల రాకపోకల్ని మధ్యాహ్నం 2.15 నుంచి 2.45వరకు నిలిపివేస్తారు. ► జంట భవనాలున్న ప్రాంతంలోకి ఆగస్టు 28 రోజంతా ప్రజలు, వాహనాలు, జంతువులు ఎవరినీ రానివ్వరు. ► చుట్టుపక్కల భవనాల్లోకి ధూళి, సిమెంట్ ముక్కలు పోకుండా మూడంచెల భద్రతా ఏర్పాటు చేశారు. ► పేల్చివేతతో చుట్టుపక్కల భవనాలకు నష్టం జరగకుండా జంట భవనాల చుట్టూ కందకం తవ్వారు. అదనపు భద్రత కోసం మధ్యలో అతి పెద్ద కంటైనర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ► చుట్టుపక్కల భవనాల కోసం ముందు జాగ్రత్త చర్యగా ఎడిఫస్ కంపెనీ రూ.100 కోట్ల బీమా కవరేజీ తీసుకుంది! ► అగ్నిమాపక శకటాలు, అంబులెన్స్లు సిద్ధంగా ఉంచుతున్నారు. ఇలా కూలుస్తారు... ► కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆగస్టు 28 మధ్యాహ్నం 2.30కు కంట్రోల్డ్ ఇంప్లోజన్ టెక్నిక్ సాయంతో కూల్చివేత జరుగుతుంది. ► రెండు భవనాలూ తొమ్మిది సెకండ్లలో పేక మేడలా నేలకొరుగుతాయి. దీన్ని ఎడిఫిస్ ఇంజనీరింగ్ సంస్థ పర్యవేక్షిస్తోంది. ► 46 మంది ఇంజనీర్లు రోజుకు 12 గంటలు నిర్విరామంగా పని చేస్తున్నారు. 300కు పైగా సీసీటీవీ కెమెరాలతో పనులను పర్యవేక్షిస్తున్నారు. ► కూల్చివేతకు 3,500 కేజీల పేలుడు పదార్థాలను వాడుతున్నారు. రెండు భవనాల్లో ఏకంగా 9,600 రంధ్రాలు చేసి వాటిని నింపుతారు. ► సియాన్ టవర్లో పేలుడు పదార్థాలు నింపడం పూర్తయింది. ఎపెక్స్నూ పూర్తి కావచ్చింది. ► హర్యానాలోని పల్వాల్లో పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పెసో) నుంచి పేలుడు పదార్థాలు తెప్పిస్తున్నారు. ► కూల్చివేత కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి బ్రిటన్ నుంచి నిపుణుల్ని రప్పిస్తున్నారు. ► కూల్చివేతతో 25 వేల క్యూబిక్ మీటర్ల శిథిలాలు మిగులుతాయని అంచనా. వీటి తొలగింపుకే కనీసం మూణ్నెల్లు పడుతుంది. వీటి డంపింగ్కు సూపర్టెక్ కంపెనీ 5 హెక్టార్లు కేటాయించింది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తెలంగాణకే తలమానికం! ట్విన్ టవర్స్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సిటీ పోలీసు కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్కు పేరు ఖరారైంది. ట్విన్ టవర్స్గా పిలుస్తున్న దీన్ని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేడెట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీఎస్ఐసీసీసీ)గా నామకరణం చేశారు. ఆగస్టు 4న సీఎం కేసీఆర్ దీన్ని ప్రారంభించనున్నారు. వాస్తవానికిది నాలుగు టవర్స్తో కూడిన సముదాయం. టీఎస్ఐసీసీసీ ప్రారంభోత్సవ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్న నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఉన్నతాధికారులకు కొన్ని కీలక బాధ్యతలు అప్పగించారు. 2015 నవంబర్లో దీని నిర్మాణం ప్రారంభమైంది. గురువారం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, డీజీపీ మహేందర్రెడ్డి, నగర కొత్వాల్ సీవీ ఆనంద్ తదితరులు ‘టీఎస్ఐసీసీసీ’ని సందర్శించి పనులపై సమీక్షించారు. 83.4 మీటర్లకు పరిమితం బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఏడెకరాల్లో ఈ జంట భవనాలను 135 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని తొలుత భావించారు. అప్పుడున్న నిబంధనల ప్రకారం బంజారాహిల్స్లో 15 మీటర్లకు మించిన ఎత్తులో నిర్మాణాలు జరపకూడదు. ఈ ఆంక్షలను సడలిస్తూ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ భవనానికి పురపాలక శాఖ అనుమతి ఇచ్చింది. మరోపక్క ఇంత ఎత్తైన భవనాలు నిర్మించాలంటే దానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో 83.4 మీటర్ల ఎత్తుతో నిర్మించుకోవడానికి సివిల్ ఏవియేషన్ శాఖ అనుమతించింది. ఈ మేరకు పోలీసు విభాగం 20 అంతస్తులతో 83.4 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ‘టీఎస్ఐసీసీసీ’లో స్వరూప, స్వభావాలివీ.. నగర పోలీసు కమిషనరేట్ ఆగస్టు ఆఖరు కల్లా టీఎస్ఐసీసీసీలోకి తరలనుంది. 18వ అంతస్తులో కొత్వాల్ కార్యాలయం ఉంటుంది. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్, ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ తదితరాలు సైతం అక్కడికే వెళ్తాయి. నాలుగు బ్లాకుల్లో (ఏ, బీ, సీ, డీ) 5.5 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు. బ్లాక్–ఏలో 20 అంతస్తులు (16216 చదరపు మీటర్లు విస్తీర్ణం), బ్లాక్–బీలో 18 అంతస్తులు (12320 చదరపు మీటర్లు విస్తీర్ణం), బ్లాక్–సీలో జీ+2 ఫ్లోర్లు (7920 చదరపు మీటర్లు విస్తీర్ణం), బ్లాక్–డీలో జీ+1 ఫ్లోర్ (2230 చదరపు మీటర్లు విస్తీర్ణం). పూర్తిస్థాయిలో డబుల్ ఇన్సులేటెడ్ గ్లాస్తో నిర్మించే ఈ టవర్స్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్యానెల్స్ అదనపు ఆకర్షణ. భవనంపై హెలిప్యాడ్, 17వ అంతస్తులో పబ్లిక్ అబ్జర్వేషన్ డెస్క్, పోలీసు మ్యూజియం ఉంటాయి. 900 మంది కూర్చునే సామర్థ్యంతో ఆడిటోరియం, 740 వాహనాలకు పార్కింగ్ వసతి ఉంది. (చదవండి: పేపర్ లీక్ వ్యవహారం.. ఐదుగురు అధికారుల సస్పెన్షన్) -
ట్విన్ టవర్ల కూల్చివేతకు రంగం సిద్ధం: భారీ తరలింపులు, హై టెన్షన్!
న్యూఢిల్లీ:నోయిడా వివాదాస్పద, అక్రమ జంట టవర్ల కూల్చివేతకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 21 న నోయిడాలోని సెక్టార్ 93Aలో సూపర్టెక్ జంట టవర్లు అపెక్స్ (32 ఫోర్లు), సెయానే (31 ఫోర్ల)కూల్చివేతకు రంగం సిద్దమైంది. టన్నుల కొద్దీ పేలుడు పదార్థాలతో దాదాపు 100 మీటర్ల ఎత్తైన ఈ టవర్లను ఎడిఫైస్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో నేలమట్టం చేయనున్నారు. ఎంపిక చేసిన నిపుణుల సమక్షంలో ఆగస్ట్ 2 నుండి ఆగస్టు 20 వరకు ఈ జంట టవర్లను పేలుడు పదార్థాలతో నింపుతారు. అనంతరం ఆగస్టు 21 మధ్యాహ్నం 2.30 గంటలకు క్షణాల్లో వీటిని పూర్తిగా కూల్చివేయ నున్నారు. నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు జరిగాయని గత ఆగస్టులో సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన అనంతరం ఈ పరిణామం జరగనుంది. అలాగే సుప్రీం ఆదేశాల మేరకు గృహాలను కొనుగోలు చేసి మోసపోయిన వారికి సంబంధిత నగదును వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడి ఫ్లాట్లలో నివసిస్తున్న వారిని తరలించేందుకు అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. నోయిడాలో సూపర్టెక్ అక్రమ జంట టవర్లలో 1,396 ఫ్లాట్లలో నివసిస్తున్న దాదాపు 5 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు. దీంతో చుట్టుపక్కల నివసిస్తున్నవారిలో ఆందోళన నెలకొంది. అంతకుముంద జూలై 27నాటి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్, పోలీస్ ఆర్డబ్ల్యుఎలతో నోయిడా అథారిటీ, పోలీసులు, ఇతర అధికారుల సమావేశంలో తరలింపు ప్రణాళిక, భద్రతా వివరాలను చర్చించారు. ఈ మేరకు ఆగస్టు 14న కూల్చివేతకు సంబంధించిన పూర్తిస్థాయి డ్రెస్ రిహార్సల్ నిర్వహించనున్నట్లు నోయిడా అధికారులు తెలిపారు. ఈ ప్రాంగణంలో రెడ్ జోన్గా ప్రకటించారు. అంతేకాదు నో-ఫ్లై జోన్గా ప్రకటించాలని కేంద్రం అనుమతి కోరనున్నారు. నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్వేపై వాహనాల రాకపోకలు నిలిపి వేస్తామన్నారు. దశలవారీగా ఎక్స్ప్లోజివ్స్ ద్వారా వీటిని కూల్చివేయనున్నారు. ఈ పేలుడుకు మూడు గంటల ముందు, రెండు గంటల తర్వాత ఐదు గంటల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని నోయిడా అథారిటీ సీనియర్ అధికారి తెలిపారు. దీంతో ట్విన్ టవర్లకు ఆనుకుని ఉన్న ఎమరాల్డ్ కోర్ట్ ఏటీఎస్ విలేజ్ సొసైటీ నివాసితులపై కూడా ఈ కూల్చివేత తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. -
తప్పు చేస్తే.. తప్పించుకోలేరు! సూపర్టెక్కి దెబ్బ మీద దెబ్బ
ఎవరు చూస్తారులే... ఏం జరుగుతుందిలే.. ప్రాబ్లెమ్ వస్తే మ్యానేజ్ చేద్దాం అనుకుంటే అన్ని సార్లు కుదరదు. తప్పు బయట పడితే దాని తాలుకు ఫలితాలు ఎలా ఉంటాయో రియల్ ఎస్టేట్ కంపెనీ సూపర్టెక్కి తెలిసి వస్తున్నాయి. అతి విశ్వాసంతో సూపర్టెక్ వేసిన రాంగ్స్టెప్స్ ఇప్పుడా కంపెనీ పుట్టి మునిగిపోవడానికి బాటలు వేస్తున్నాయ్.. నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఉన్న ఉన్న నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా సూపర్టెక్ అనే రియల్టీ సంస్థ 40 అంతస్థులతో జంట భవనాలు నిర్మించింది. ఈ అక్రమ నిర్మాణాలు వ్యతిరేకిస్తూ స్థానికులు కోర్టును ఆశ్రయించారు. అలహాబాద్ హై కోర్టు మీదుగా సుప్రీం కోర్టు వరకు మూడేళ్లకు పైగా ఈ కేసు నడిచింది. అప్పటికే నోయిడా అధికారులను ‘మేనేజ్’ చేస్తూ వచ్చిన సూపర్టెక్ సంస్థ న్యాయస్థానాలను లైట్ తీసుకుంది. కోర్టులో విచారణ జరుగుతున్నా నిర్మాణం చేసుకుంటూ పోయింది. 39వ ఫ్లోర్ నిర్మాణంలో ఉండగా కోర్టు తీర్పు వెలువడింది. కూల్చేయండి నిబంధనలు ఉల్లంఘించి కట్టిన 40 అంతస్తుల జంట భవనాలు కూల్చేయాలని కోర్టు కరాఖండీగా తేల్చి చెప్పింది. ఈ భవంతిలో ఇళ్లు కొనుగోలు చేసిన వారికి వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. భవనం కూల్చివేత ఖర్చులు కూడా సూపర్టెక్ సంస్థనే భరించాలని తీర్పు వెలువరించింది. గుణపాఠం నిర్మాణం పూర్తి చేసుకున్న భవనం కూల్చివేస్తే ఎంతో వర్క్ఫోర్స్, నిర్మాణ సామగ్రి వృధా అవుతుందని కనీసం భవనం స్వాధీనం చేసుకున్నా చాలంటూ మొరపెట్టుకుంది సూపర్టెక్. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు మళ్లీ జరగొద్దంటే గుణపాఠం కఠినంగా ఉండాలి కాబట్టి కూల్చివేత విషయంలో మరో మాటకు తావులేదంది సుప్రీం కోర్టు. 2022 మే 21లోగా కూల్చివేయాల్సిందే అంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం తన అభిప్రాయం స్పష్టం చేసింది. దివాలా కత్తి సుప్రీం కోర్టు తీర్పు సూపర్టెక్కి వ్యతిరేకంగా రావడంతో అప్పులిచ్చిన బ్యాంకులు సూపర్టెక్ కంపెనీ మెడ మీద కత్తి పెట్టి బాకీ తీర్చమన్నాయి. ఓ వైపు ఇళ్ల కోసం తీసుకున్న అడ్వాన్సులు, నగదుకు వడ్డీతో సహా తిరిగి వెనక్కి చెల్లించాల్సి వచ్చింది. ఇవి చాలవన్నట్టు భవంతి కూల్చివేత పనులకు సైతం నిధులు సమకూర్చాల్సి వచ్చింది. చివరకు ముంబైకి చెందిన సంస్థ కూల్చివేత పనులు దక్కించుకుంది. పేలుడు ప్రమాదం భవంతి ధృడంగా ఉండటంతో ఎక్కువ మొత్తంలో మందు గుండు అవసరం అంటూ కోర్టుకు విన్నవించుకుంది. మే 21లోగా భవంతిని కూల్చడం కష్టమంటూగడువు పొడిగించమని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 2022 ఆగస్టు 21న కూల్చివేతకు గడువు పెంచింది సుప్రీం. 40 అంతస్థుల భవనం కూల్చివేతకు పేలుడు పదార్థాలు ఎక్కువ మొత్తంలో వినియోగిస్తున్నారని తెలియడంతో స్థానికంగా నివసిస్తున్న అపార్ట్మెంట్ వాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తమ భవనాలకు నష్టం వాటిల్లితే బాధ్యత ఎవరిది అంటూ నోయిడా అధికారులకు మొరపెట్టుకున్నారు. మాసంగతేంటి? భవనం కూల్చివేతకు ఉపయోగిస్తున్న మందుగుండు సామగ్రి, దాని పేలుడు తీవ్రత అంచనా వేసేందుకు సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా మరోసారి సర్వే చేపడుతున్నారు. ఇవి చాలదన్నట్టు మరో సమస్య కూడా రెడీగా ఉంది. 40 అంతస్తుల భవనం పక్కనే ఉన్న ఇతర నిర్మాణాలకు కూడా సామర్థ్య పరీక్షలు నిర్వహించాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. పేలుడు వల్ల వీటికి ఏమైనా ప్రమాదం వాటిల్లితే బాధ్యత ఎవరు తీసుకుంటారు అంటూ ప్రశ్నిస్తున్నారు. వీరంతా కలిసి నోయిడా అధికారులకు ఆశ్రయించారు. తడిసిమోపెడు ట్విన్ టవర్స్ పేలుడు వల్ల తమ భవనాలకు ఏ నష్టం రాకుండా ముందస్తు రక్షణ ఏర్పాట్లు కూడా సూపర్ టెక్ చేపడుతుందని ఈ విషయంలో నోయిడా అధికారుల నుంచి హామీ లభించిందని అపార్ట్మెంట్ వాసులు అంటున్నారు. ఇదే గనుక నిజమైతే సూపర్టెక్కు ఖర్చు తడిసిమోపెడు అవుతుంది. ఇప్పటికీ దివాలా అంచున ఆ కంపెనీ నిలదొక్కుకునే సమయం ఇవ్వకుండా వేగంగా అక్కడి నుంచి కిందకు పడేసే అవకాశం ఉంది. అయితే ఈ అంశంపై తమకు ఇప్పటి వరకు ఎటువంటి ఆదేశాలు రాలేదని సూపర్టెక్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. అడకత్తెరలో.. మరోవైపు నోయిడా అధికారుల పరిస్థితి ఈ విషయంలో కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. కళ్లముందే నలభై అంతస్థుల భవనం నిర్మాణం జరుగుతుంటూ ఏం చేస్తున్నారంటూ న్యాయస్థానం సిబ్బందిని తీవ్రంగా మందలించింది. సుప్రీం ఆగ్రహంతో ఒకప్పుడు తప్పుడు పనులకు వత్తాసు పలికిన అధికారులు ఇప్పుడు వాటిని సరిదిద్దలేక నానాతంటాలు పడుతున్నారు. ఇటు సూపర్టెక్కు చెప్పలేక అటు ప్రజల ఆందోళనలకు పరిష్కారం చూపలేక బిక్కచచ్చిపోతున్నారు. చదవండి: ఇదెక్కడి గొడవరా నాయనా.. పగోడికి కూడా రావొద్దు ఈ కష్టాలు -
ఇదెక్కడి గొడవరా నాయనా.. పగోడికి కూడా రావొద్దు ఈ కష్టాలు
నోయిడా ట్విన్ టవర్ కేసు చిత్రవిచిత్ర మలుపులు తీసుకుంటోంది. అక్రమంగా నలభై అంతస్థుల భవనం నిర్మించారంటూ కోర్టుకు వెళ్లిన వాళ్లకు న్యాయం దక్కేట్టు కనిపిస్తున్నా అంతకు మించి ఎన్నో చిక్కులు ఎదురవుతున్నాయి. అసలెందుకు ఈ కేసు వేశాంరా బాబు అన్నట్టుగా మారింది వాళ్ల పరిస్థితి. నోయిడా అధికారుల నిర్లక్ష్యం, రియల్టర్ల అత్యాశ చివరికి అందరికీ కష్టాలను కొని తెచ్చింది. అక్రమ నిర్మాణం నోయిడాలో ఎమరాల్డ్ ఫేజ్లో అనేక అపార్ట్మెంట్లు ఉన్నాయి. అయితే ఇదే సముదాయంలో నిబంధనలు ఉల్లంఘిస్తూ సూపర్టెక్ అనే సంస్థ నలభై అంతస్థుల జంట భవనాల నిర్మాణం చేపట్టింది. దీన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు కోర్టులను ఆశ్రయించారు. చివరకు నాలుగైదేళ్ల తర్వాత భవన నిర్మాణం అక్రమం అంటూ సుప్రీం కోర్టు 2022 ఫిబ్రవరిలో తేల్చింది. అప్పటికే దాదాపు 39వ అంతస్థు వరకు నిర్మాణం పూర్తయ్యింది. సాగుతున్న కూల్చివేత కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ జంట భవనాలు కూల్చేయాల్సి 2022 మే 21న కూల్చేయాల్సి ఉంది. ఆ పనుల్లో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఎమారాల్డ్ ఫేజ్లోకి వెళ్లే నాలుగు దారుల్లో మూడు దారులు మూసి వేశారు. కేవలం ఒక్కటి మాత్రమే తెరిచి ఉంచారు. ముందుగా నిర్దేశించిన గడువు మే 21లోగా కూల్చివేత సాధ్యం కాదని తేలడంతో ఈ గడువును ఆగష్టు వరకు పొడిగించారు. కష్టాల్లో స్థానికులు దారులు మూసివేయడం వల్ల ఎమరాల్డ్ ఫేజ్లో ఉన్న నివాసాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు టెస్ట్ బ్లాస్టింగ్స్, ఇతర పనుల కారణంగా నిత్యం ట్విన్ టవర్స్ నుంచి దుమ్ము రేగుతూ అక్కడున్న వారికి చికాకులు తెచ్చి పెడుతున్నాయి. పైగా కూల్చివేత పనులు దక్కించుకున్న సంస్థ భారీ ఎత్తున పేలుడు పదార్థాలు వినియోగించాల్సి ఉంటుందని చెప్పడం మరింత సందేహాలను లేవనెత్తింది. ట్విన్ టవర్స్ పేల్చి వేత వల్ల తమ ఇళ్లకు ఏమైనా ఇబ్బందులు కలుగుతాయో ఏమో అనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మాగోడు వినండి ట్విన్ టవర్స్ కూల్చివేత వ్యవహారంలో తమ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలంటూ అక్కడి వారు నోయిడా అధికారులను కోరారు. దీంతో 2022 జూన్ 7న ట్విన్ టవర్స్ నిర్మించిన సూపర్టెక్ సంస్థ, కూల్చివేత పనులు చేపడుతున్న ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ, స్థానికులతో కలిసి నోయిడా అధికారులు సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక ఆందోళనలకు పరిగణలోకి తీసుకుని కూల్చివేత పనులు చేపట్టాలని ఇందులో కోరనున్నట్టు సమాచారం. మరి ఈ సమావేశం తర్వాత ఈ భవనాల కూల్చివేత అంశం మరే మలుపు తీసుకుంటుందో చూడాలి. చదవండి: ఇంకా పేలుడు పదార్థాలు కావాలి.. అప్పుడే ఆ పని చేయగలం! -
Twin Towers: ఇంకా పేలుడు పదార్థాలు కావాలి.. అప్పుడే ఆ పని చేయగలం!
దేశ వ్యాప్తంగా రియల్టీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నోయిడా ట్విన్టవర్స్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. పరిస్థితుల ప్రభావమో లేక ఉద్దేశ పూర్వకంగానో కాదంటే తెర వెనుక ఏదైనా శక్తులు నడిపిస్తున్నాయో తెలియదు కానీ సుప్రీం కోర్టు ఉత్తర్వులు సైతం ఈ కేసులో సకాలంలో అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. నిబంధనలు తుంగలో తొక్కి నలభై అంతస్థుల భవనాలు నిర్మించారని, వీటిని కూల్చివేయాలంటూ సుప్రీం కోర్టు నోయిడా ట్విన్ టవర్స్ కేసులో తీర్పు ఇచ్చింది. అంతేకాదు ఇక్కడ అపార్ట్మెంట్ల కోసం డబ్బులు కట్టిన వారికి వడ్డీతో సహా తిరిగి చెల్లించాలంటూ నిర్మాణ సంస్థ సూపర్టెక్ను ఆదేశించింది. కోర్టు తీర్పు ప్రకారం 2022 మే 22న జంట భవనాలు కూల్చేయాల్సి ఉంది. మాట మార్చారు ఈ పనులను ముంబైకి చెందిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ అండ్ జెట్ డెమోలిషన్ సంస్థలు దక్కించుకున్నాయి. కోర్టు తీర్పును అనుసరించి ట్విన్ టవర్స్ కూల్చివేత కోసం 2022 ఏప్రిల్ 10న టెస్ట్ బ్లాస్ట్ నిర్వహించాయి. ఇక అక్రమ భవంతుల కూల్చివేత ఒక్కటే మిగిలిందనే తరుణంలో మరింత సమయం కావాలని కూల్చివేత పనులు దక్కించుకున్న ఎడిఫైస్ సంస్థ కోరుతోంది. ఇంకా కావాలి మొదటగా పది అంతస్థుల్లో పేల్చివేత చేయాలని నిర్ణంయిచామని కానీ ఇప్పుడు బేస్మెంట్తో సహా కూల్చివేయక తప్పదని ఎడిఫైస్ సంస్థ అంటోంది. దీని కోసం పేలుడు పదర్థాలు ఎక్కువగా సమకూర్చుకోవాల్సి ఉంటుందని చెబుతోంది. మారిన ప్రణాళిక వల్ల అవసరమైన పేలుడు పదార్థాలు మొత్తం 2.4 టన్నుల నుంచి 3,3 టన్నులకు పెరిగిందని పేర్కొంది. అంతేకాకుండా కాలమ్స్కి జియో టెక్స్టైల్స్ క్లాత్ అమర్చబోతున్నట్టు చెప్పింది. ఆగష్టు 28న ఓకే ప్లాన్లో మార్పులు చోటు చేసుకున్నందున ముందుగా నిర్ధేశించినట్టుగా మే 22న కూల్చివేత చేయడం సాధ్యం కాదని, కాబట్టి గడువును 2022 ఆగష్టు 28 వరకు పొడిగించాలని ఎడిఫైస సంస్థ నోయిడా అథారిటీకి లేఖ రాసింది. ఈ కొత్త ప్రతిపాదనలపై నోయిడా అధికారులు గుర్రుగా ఉన్నారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మే 22న కూల్చివేత పనులు చేపట్టకపోవడం ఒప్పంద ఉల్లంఘన కింద పరిగణిస్తామంటూ హెచ్చరించారు. ఏం జరగబోతుంది సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి మే 22న కూల్చివేత చేపట్టడం మా వల్ల కాదంటోంది ఎక్స్పోజివ్ సంస్థ. ఇప్పటికే జంట భవనాల కేసులో అనేక తప్పిదాలకు నోయిడా అధికారులు పాల్పడినట్టు సుప్రీం గుర్తించింది. తాజాగా కూల్చివేత గడువును కూడా అమలు చేయకపోవడం నోయిడా అధికారులకు లేనిపోని తలనొప్పులు తెచ్చి పెట్టింది. ప్రస్తుతం ఈ అంశంపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగాలంటే మరోసారి న్యాయస్థానం జోక్యం తప్పేట్టుగా లేదు. చదవండి: 40 అంతస్థుల ట్విన్ టవర్స్ కూల్చివేతలో మరో ట్విస్ట్! -
40 అంతస్థుల ట్విన్ టవర్స్ కూల్చివేత.. చివర్లో ఊహించని ట్విస్ట్!
నిబంధనలు అతిక్రమించి ఢిల్లీలోని నోయిడాలో నిర్మించిన ట్విన్ టవర్స్ కూల్చివేతలో చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ట్విస్ట్ కారణంగా సుప్రీం కోర్టు ఆదేశాలు అమలు చేయలని పరిస్థితి ఎదురయ్యింది. దీంతో తప్పు మాది కాదంటే మాది కాదంటూ ఒకరి తర్వాత ఒకరు తెర మీద నుంచి తప్పుకుంటున్నారు. తాజా మలుపులపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి! నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని నోయిడా సెక్టార్ 93లో సూపర్ టెక్ అనే రియాల్టీ సంస్థ నిబంధనలు తుంగలో తొక్కి 40 అంతస్థుల జంట భవనాలు నిర్మించింది. దీనిపై అలహాబాద్ కోర్టు మీదుగా సుప్రీం కోర్టు వరకు వివాదం నడిచింది. చివరకు నిర్మాణ సంస్థదే తప్పుగా తేల్చిన కోర్టు 2022 మే 22న రెండు జంట భవనాలు కూల్చివేయాలని ఆదేశించింది. అదే విధంగా నోయిడా అధికారులకు తలంటింది. టెస్ట్ బ్లాస్ట్ ట్విన్ టవర్స్ కూల్చివేత పనులను ఎడిఫైస్ ఇంజనీరింగ్ అండ్ డిమాలిషన్ సంస్థ చేజిక్కుంచుకుంది. ఆ తర్వాత భవనాల కూల్చివేత పనులు పరిశీలించేందుకు టెస్ట్ బ్లాస్ట్ని 2022 ఏప్రిల్ మొదటి వారంలో నిర్వహించింది. ఇక మే 22న జంట భవనాలను నాలుగు వేల కేజీల మందుగుండు సామగ్రితో పేల్చివేయడమే తరువాయి అనే సమయంలో ఎడిఫైస్ సంస్థ షాక్ ఇచ్చింది. ప్లేట్ ఫిరాయించిన ఎడిఫైస్ నోయిడాలోని ట్విన్ టవర్లను కూల్చి వేసేందుకు తమకు కేటాయించిన సమయం సరిపోదంటూ కొత్త రాగం అందుకుంది. సుప్రీం కోర్టు నిర్దేశించిన గడువులోగా (2022 మే 22)న భవనం కూల్చివేయలేమని, తమకు మరో రెండుమూడు నెలల సమయం కావాలంటూ చెబుతోంది. చుట్టు పక్కల ఉండే వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా భవనాలను కూల్చివేయాలంటే తాము మరింత సాంకేతిక సామర్థ్యం సమకూర్చుకోవాలంటూ తెలపింది. ఎడిఫైస్ సంస్థ ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించడంతో నోయిడా అధికారుల నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టయ్యింది. మాకు సంబంధం లేదు ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా 40 అంతస్థుల భవనం కడుతుంటూ చూస్తూ ఊరుకున్నారంటూ సుప్రీం కోర్టు నోయిడా అధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో జాప్యం జరిగితే ఎటువంటి పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందోనని కిందామీదా అవుతున్నారు. భవనం కూల్చివేతతో తమకు సంబంధం లేదని.. అదంతా బిల్డరే చూసుకోవాలని చెబుతున్నారు. తాము కేవలం కూల్చివేత పనులను పర్యవేక్షిస్తామంటూ చెబుతున్నారు. కుట్ర ఆరోపణలు ట్విన్ టవర్స్ కూల్చివేత విషయంలో కావాలనే జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. బిల్డర్ల ప్రయోజనాలు కాపాడేందుకు కొత్త అంశాలను తెర మీదకు తెస్తున్నారంటున్నా ట్విన్ టవర్ సమీప ప్రజలు. రెండు నెలలుగా సాంకేతిక అంశాలపై నోరు విప్పకుండా ఈ రోజు అదనపు సమయం కావాలని అడగటం కుట్రలో భాగమని ఆరోపిస్తున్నారు ఈ కేసులో ప్రతివాదులు. దీంతో ఈ కేసులో సుప్రీం కోర్టు తదుపరి చర్యలు ఎలా ఉండవచ్చనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చదవండి: 40 అంతస్థుల జంట భవనాలు కూల్చేస్తారా లేక జైళ్లో పెట్టమంటారా ? -
టెస్ట్ బ్లాస్ట్ సక్సెస్.. 40 అంతస్థుల బిల్డింగ్ కూల్చివేతకు అంతా రెడీ
దేశవ్యాప్తంగా రియల్టీ రంగాన్ని కుదిపేస్తోన్న నోయిడా ట్విన్ టవర్ కేసులో టెస్ట్ బ్లాస్టింగ్ను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. 2022 ఏప్రిల్ 10న మధ్యాహ్నం 2:15 గంటల నుంచి 2:45 గంటల నడుమ ఈ బ్లాస్ట్ను నిర్వహించారు. ఈ జంట భవనాలకు సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్, 14వ అంతస్థుల్లో ఐదు కేజీల పేలుడు పదార్థాలతో టెస్ట్ బ్లాస్ట్ చేపట్టారు. సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూ్ట్ (సీబీఆర్ఐ) రూర్కీ నుంచి వచ్చిన నిపుణులు బ్లాస్టింగ్ పనులను పర్యవేక్షించారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులను అనుసరించి 2022 మే 22న ఈ జంట భవనాలను కూల్చివేయబోతున్నారు. టెస్ట్ బ్లాస్ట్ అనంతరం ఈ రెండు భవనానలు కూల్చి వేసేందుకు 3,000ల నుంచి 4,000 కేజీల పేలుడు పదార్థాలు అవసరం అవుతాయని అంచనా. దాదాపు 9 సెకన్లలో ఈ భవంతి నేలమట్టం అవుతుందని పేలుడు పనులు దక్కించుకున్న ఎడిఫైస్ ఇంజనీరింగ్ అండ్ జెట్ డిమాలిషన్ సంస్థ తెలిపింది. నోయిడా సెక్టార్ 93ఏలో నిబంధనలు ఉల్లంఘిస్తూ సూపర్టెక రియాల్టీ సంస్థ ఎమరాల్డ్ పేరుతో 40 అంతస్థుల జంట భవనాల నిర్మాణ పనులు చేపట్టింది. దీనిపై అలహాబాద్ హైకోర్టుతో పాటు సుప్రీం కోర్టులో కూడా అనేక విడతలుగా విచారణ జరిగింది. చివరకు జంట భవనాలను కూల్చివేయాల్సిందే అంటూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. Low intensity blast (mock drill) sound heard at Supertech Twin Tower in Noida. The building has to be demolised on 22nd May. Blast Test was done to see as to how many kgs of explosives to be used on actual day. #SuperTech #twintower #demolition #Noida #Blast pic.twitter.com/Zevad7ja98 — Gurmeet Singh, IIS (@Gurmeet_Singh33) April 10, 2022 చదవండి: నోయిడా ట్విన్ టవర్ల కూల్చివేత.. ‘రేరా’ ఎక్కడ విఫలమవుతోంది? -
40 అంతస్థుల భవనం కూల్చివేత.. ఇళ్లలో నుంచి బయటకు రావొద్దు..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నోయిడా జంట భవనాల కేసులో మరో కీలక ఘట్టం చోటు చేసుకోబోతుంది. సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి నిబంధనలకు విరుద్ధంగా కట్టిన సూపర్టెక్ ఎమరాల్డ్ భవనాలు కూల్చేయబోతున్నారు. అందులో భాగంగా టెస్ట్ బ్లాస్ట్కి తేదీ, సమయం నిర్ణయించారు. 2022 ఏప్రిల్ 10న మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3:00 గంటల వరకు టెస్ట్బ్లాస్ట్ చేయాలని నిర్ణయించారు. దీంతో జంట భవనాలకు సమీపంలో నివసిస్తున్న ప్రజలకు నోయిడా అధికారులు.ముందుస్తు జాగ్రత్తలు సూచించారు. ఆదివారం మధ్యాహ్నం 2:15 గంటల నుంచి 2:45 గంటల వరకు సమీమ ప్రాంత ప్రజలు ఇళ్లలోనే ఉండాలని తెలిపారు. వీలయితే కిటీకీలు, తలుపులు మూసుకోవాలని సూచించారు. బాల్కనీల్లో, బిల్డింగ్ల పైకి ఎక్కి బ్లాస్టింగ్ చూడటం, వీడియోలు తీయడం వంటి పనులు చేయొద్దని తెలిపారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీ పరిధిలోని నోయిడా సెక్టార్ 93ఏలో రియల్టీ సంస్థ సూపర్ టెక్ ఎమరాల్డ్ పేరుతో 40 అంతస్థుల జంట భవనాల నిర్మాణ పనులు ప్రారంభించింది. అయితే 32వ అంతస్థు వరకు నిర్మాణ పనులు జరిగాక నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ కోర్టులో కేసు నమోదు అయ్యింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు జంట భవనాలు కూల్చేయాలని తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు మేరకు నోయిడా పాలనాధికారులు ఎడిఫైస్ ఇంజనీరింగ్ అంట్ జెట్ డిమాలిషన్స్ అనే సంస్థకు కూల్చివేత పనులు అప్పగించారు. 2022 మే 22న కూల్చేయబోతున్నారు. అంతకంటే ముందు పేలుడు ప్రభావాన్ని అంచనా వేసేందుకు టెస్ట్ బ్లాస్ట్ జరుపుతున్నారు. చదవండి: 40 అంతస్తులు..4 టన్నుల మందు గుండు..9 సెకన్లలో ట్విన్ టవర్స్ మాయం..! -
40 అంతస్తులు..4 టన్నుల మందు గుండు..9 సెకన్లలో ట్విన్ టవర్స్ మాయం..!
Supertech Twin Towers Demolition: నిబంధనలకు విరుద్ధంగా భవనాల నిర్మాణం చేపట్టిన సూపర్టెక్ లిమిటెడ్కి చెందిన ఎమరాల్డ్ కోర్ట్ ప్రాజెక్టు 40 అంతస్తుల ట్విన్ టవర్స్ భవనాలను మే 22 నాటికి కూల్చివేస్తామని నోయిడా అథారిటీ సుప్రీంకోర్టుకు తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ కూల్చివేత పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు అధికారులు కోర్టుకు తెలిపారు. కాగా తాజాగా కూల్చివేత పనులకు సంబంధించిన వివరాలను నోయిడా అధికారులు వెల్లడించారు. 9 సెకన్లలో మాయం..! సుమారు 4 టన్నుల మందు గుండు సహాయంతో కేవలం 9 సెకన్లలో ట్విన్ టవర్స్ను నేలమట్టం చేస్తామని అధికారులు పేర్కొన్నారు. కోర్టులో పేర్కొన్న విధంగా కూల్చివేత పనులు జరుగుతాయని తెలిపారు. మే 22న మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో ట్విన్ టవర్స్ను కూల్చివేస్తామని వెల్లడించారు. కాగా కూల్చివేత సమయంలో టవర్స్కు సమీపంలోని సెక్టార్-93Aలో నివసిస్తున్న సుమారు 1,500 కుటుంబాలను ఐదు గంటల పాటు వారి ఇళ్ల నుంచి తరలించనున్నట్లు అధికారులు తెలిపారు . అంతేకాకుండా సైట్కు దగ్గరగా ఉన్న నోయిడా ఎక్స్ప్రెస్వేను కూడా ఒక గంట పాటు మూపివేయబడుతుందని పేర్కొన్నారు. ఎడిఫైస్ నేతృత్వంలో..! ట్విన్ టవర్స్ అపెక్స్, సెయాన్ భవనాలను ఎడిఫైస్ ఇంజినీరింగ్ సంస్థ కూల్చివేయనుంది. కూల్చివేత పనులకు సంబంధించిన వివరాలను సంస్థ ప్రతినిధులు తెలిపారు.ఈ కంపెనీ 2019లో దక్షిణాఫ్రికా జోహన్నెస్బర్గ్లో 108 మీటర్ల పొడవైన బ్యాంక్ ఆఫ్ లిస్బన్ను కూల్చివేసింది. కాగా కూల్చివేతకు అయ్యే ఖర్చులను పూర్తిగా మొత్తం బిల్డర్ భరించాలని కోర్టు ఆదేశించింది. కుమ్మక్కు..! ట్విన్ టవర్స్ నిర్మాణంలో అధికారులు కూడా కుమ్మకునట్లు తెలుస్తోంది. బిల్డర్తో కుమ్మక్కయిన నోయిడా అధికారులను ప్రాసిక్యూట్ చేయాలని కోర్టు ఆదేశించింది. బిల్డర్లు, నోయిడా అధికారుల కుమ్మక్కయిన విధానం ఈ కేసు రికార్డు చూస్తే అర్థం అవుతోందని, ప్రణాళికా విభాగం అధికారుల ఉల్లంఘన స్పష్టమవుతోందని పేర్కొంది. ఇక రెండు టవర్ల (టి–16, టి–17) ఫ్లాట్ యజమానులకు మొత్తం సొమ్ము 12 శాతం వడ్డీతోసహా తిరిగి చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చదవండి: ట్విన్ టవర్స్ కూల్చోద్దు.. ఒక్కసారి మా మాట వినండి -
40 అంతస్థుల ట్విన్ టవర్స్.. రెండు వారాల్లో కూల్చేయాల్సిందే?
దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన నోయిండా జంట భవనాల కేసులో నిర్మాణ కంపెనీకి సుప్రీంలో మరోసారి చుక్కెదురైంది. రెండు వారాల్లో 40 అంతస్థుల జంట భవనాల కూల్చివేత పనులు ప్రారంభించాలంటూ నోయిడా అథారిటీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా కోర్టును తప్పుదారి పట్టించినందుకు నిర్మాణ కంపెనీ డైరెక్టర్లను జైలుకి పంపించాల్సి ఉంటుందంటూ హెచ్చరించింది. ఇదీ వివాదం దేశ రాజధాని ప్రాంతం పరిధిలోకి వచ్చే నోయిడాలో గ్రీన్ జోన్ పరిధిలో నిబంధనలు అతిక్రమించి సూపర్ టెక్ అనే సంస్థ 40 అంతస్థులతో రెండు జంట భవనాలు నిర్మించింది. ఇందులో మొత్తం 915 అపార్ట్మెంట్లు, 21 షాపులు ఉన్నాయి. ఇందులో 633 అపార్ట్మెంట్లు ఇప్పటికే బుక్ అయ్యాక అలహాబాద్ హైకోర్టులో కేసు నమోదు అయ్యింది. గ్రీన్ జోన్ పరిధిలో నిర్మించినందుకు ఈ రెండు భవనాలు కూల్చేయాలంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. తప్పు తప్పే అలహాబాద్ కోర్టు తీర్పు సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది నిర్మాణ కంపెనీ. కేసు వివరాలు పరిశీలించిన సుప్రీం కోర్టు 2021 ఆగస్టులో అలహాబాద్ కోర్టు తీర్పును సమర్థిస్తూ మూడు నెలల్లోగా జంట భవనాలు కూల్యేయాల్సిందే అని తీర్పు ఇచ్చింది. దీంతో నిర్మాణ కంపెనీ తప్పు జరిగిందని ఒప్పుకుంటూ ఎంతో ఖర్చు చేసినందున కేవలం ఒక్క భవనం కూల్చేసి.. మరో భవనం ఉంచేయాలంటూ కోర్టుకి విన్నవించింది. గడువు పూర్తైనా జంట భవనాల కూల్చివేతకు సంబంధించిన కోర్టు విధించిన మూడు నెలల గడువు పూర్తైన ఎటువంటి కదలిక లేకపోవడంతో 2022 జనవరి 12న మరోసారి సుప్రీం ఈ కేసుపై దృష్టి సారించింది. పలుమార్లు ఈ కేసులో వాదనలు విన్న ధర్మాసనం 2022 ఫిబ్రవరి 7 మరోసారి ఆదేశాలు జారీ చేసింది. రెండు వారాల్లో జంట భవనాల కూల్చివేతకు సంబంధించి మూడు రోజుల్లోగా సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి తగు కార్యాచరణ ప్రారంభించాలని నోయిడా సీఈవోకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కేవలం రెండు వారాల్లోగా కూల్చివేత పనులు మొదలు కావాలంటూ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇప్పటికైనా కోర్టు తీర్పు అమలుకు సహకరించాలని లేదంటే వడ్డీతో సహా ఇక ఈ భవనంలో అపార్ట్మెంట్లు బుక్ చేసుకున్న 633 మందికి 12 శాతం వడ్డీతో సొమ్ము వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా ఈ భవన నిర్మాణం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న కాలనీ వాసులకు రూ. 2 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలంటూ తీర్పు వెలువరించింది సర్వోన్నత న్యాయస్థానం. చదవండి: Noida Twin Towers Case : ఒక్క టవరే కూల్చండి.. ప్లీజ్ -
జంట టవర్లను కూల్చివేయాల్సిందే
న్యూఢిల్లీ: నోయిడాలో 40 అంతస్తుల జంట టవర్ల కూల్చివేతపై గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో సవరణలకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు సూపర్టెక్ లిమిటెడ్ సంస్థ వేసిన పిటిషన్ను కొట్టివేసింది. భవన నిర్మాణ నిబంధనలకు అనుగుణంగా లేని ఒక టవర్లోని 224 ఫ్లాట్లతోపాటు గ్రౌండ్ ఫ్లోర్లోని కమ్యూనిటీ ఏరియాను పాక్షికంగా మాత్రమే నేలమట్టం చేసేందుకు వీలు కల్పించాలన్న వినతిని తోసిపుచ్చింది. ఇలాంటి వెలుసుబాట్లు కల్పిస్తే ఆగస్ట్ 31వ తేదీ నాటి తమ తీర్పును తిరిగి పూర్తి స్థాయిలో సమీక్షించుకున్నట్లవుతుందని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీవీ నాగరత్నల ధర్మాసనం తెలిపింది. రెండు టవర్లను పూర్తిగా కూల్చివేయాల్సిందేనని స్పష్టం చేసింది. చదవండి: ఆ ఒక్క కారణంతో కోవిడ్ పరిహారాన్ని ఆపొద్దు -
Noida Twin Towers Case : ఒక్క టవరే కూల్చండి.. ప్లీజ్
నిబంధనలు ఉల్లంఘించి 40 అంతస్థుల జంట భవనాల నిర్మాణం కేసులో బిల్డర్ వెనక్కి తగ్గాడు. ఇంతకాలం నిబంధనల ప్రకారమే నిర్మాణం చేపట్టామంటూ చెబుతూ వచ్చినవారు తప్పును ఒప్పుకున్నారు. భారీ శిక్ష నుంచి మినహాయించాలంటూ అత్యున్నత న్యాయస్థానాన్ని వేడుకున్నారు. అలహాబాద్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా 40 అంతస్థుల ట్విన్ టవర్స్ని సూపర్ టెక్ అనే సంస్థ నిర్మించింది. దీనిపై అలహాబాద్ హైకోర్టులో పిటీషన్ దాఖలు కాగా.. విచారించిన కోర్టు జంట భవనాలను కొట్టి వేయాలంటూ తీర్పు ఇచ్చింది. సుప్రీం ఫైర్ అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సూపర్ టెక్ సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కేసు వివరాలను పూర్తిగా విచారించిన సుప్రీం కోర్టు అలహాబాద్ హై కోర్టు తీర్పునే సమర్థిస్తూ జంట భవనాలను రెండు నెలల్లోగా నేలమట్టం చేయాలంటూ తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టు తీర్పుపై సూపర్ టెక్ సంస్థ రివ్యూ పిటీషన్ వేసింది. మన్నించండి దేశ సర్వోన్నత న్యాయస్థానంలో తీర్పు వ్యతిరేకంగా రావడంతో సూపర్టెక్ సంస్థ దారికొచ్చింది. ట్విన్ టవర్స్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఒక్క భవనాన్ని కూల్చివేసేలా తీర్పును మార్చాలంటూ వేడుకుంది. ఈ అవకాశం ఇస్తే మిగిలిన ఒక్క భవనాన్ని పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేస్తామంటూ బతిమాలింది. భవన నిర్మాణానికి కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయని, ఎంతో సిమెంటు, స్టీలు వినియోగించామని అదంతా వృథా అవుతుందని పేర్కొంది. రెండు భవనాలను కూల్చేస్తే శిథిలాలతో ఆ ప్రాంతం నిండిపోతుందని పేర్కొంది. మొత్తంగా చేసిన తప్పును ఒప్పుకుని శిక్షలో మినహాయింపు ఇవ్వాలని వేడుకుంది. 915 అపార్ట్మెంట్లు నోయిడా ప్రాంతంలో సూపర్ టెక్ సంస్థ నిర్మించిన జంట భవనాల్లో మొత్తం 915 అపార్ట్మెంట్లు, 21 షాపులు ఉన్నాయి. ఇందులో 633 అపార్ట్మెంట్లు ఇప్పటికే బుక్ అయ్యాయి. అయితే గ్రీన్ జోన్ పరిధిలో ఈ భవన నిర్మాణం చేపట్టడంతో వివాదం రాజుకుంది కళ్లు మూసుకున్నారా ? గ్రీన్ జోన్లో 40 అంతస్థులతో జంట భవనాలు నిర్మిస్తుంటే కళ్లు మూసుకున్నారా అంటూ నోయిడా అధికారులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు అపార్ట్మెంట్ బుక్ చేసుకున్న వారికి రెండు నెలల్లోగా వడ్డీతో సహా డబ్బులు వాపస్ ఇవ్వాలంటూ బిల్డర్కు కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. చదవండి : నోయిడా ట్విన్ టవర్ల కూల్చివేత.. ‘రేరా’ ఎక్కడ విఫలమవుతోంది? -
ప్రపంచాన్ని చీకట్లో ముంచెత్తిన రోజు ఇది
-
అమరులకు ఘనంగా నివాళులు అర్పించిన బైడెన్
-
ప్రపంచాన్ని చీకట్లో ముంచెత్తిన రోజు ఇది
20 Years For 9/11 Attacks: 9/11 ఉగ్రదాడులు. సెప్టెంబర్ 11, 2001.. ఈరోజు అమెరికా చరిత్రలోనే కాదు యావత్ ప్రపంచాన్ని కొద్దిగంటలు చీకట్లోకి నెట్టేసిన రోజు. ట్విన్ టవర్స్, పెంటగాన్లపై వైమానిక దాడుల తర్వాత.. కరెంట్, ఇంటర్నెట్, శాటిలైట్, రేడియో ఫ్రీక్వెన్సీ కట్టింగ్లతో ఏం జరుగుతుందో అర్థంకాక ప్రపంచం మొత్తం భయాందోళలకు లోనైంది. ఇంతకీ దాడి టైంలో అప్పటి అధ్యక్షుడు బుష్ ఎక్కడున్నాడు? ఇప్పటి అధ్యక్షుడు బైడెన్ గురించి లాడెన్ ఆనాడు ఏం చెప్పాడు? 9/11 దాడులకు ఇరవై ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రత్యేక కథనం.. సెప్టెంబర్ 11 ఉగ్రదాడులు.. చరిత్రలోనే ఇప్పటిదాకా రికార్డు అయిన అతిపెద్ద ఉగ్రమారణహోమం. 11 ఎకరాల విస్తీర్ణంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాల్లోకి హైజాక్ విమానాల ద్వారా ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. ప్రత్యక్షంగా సుమారు నాలుగు వేల మంది ప్రాణాల్ని బలిగొన్నారు. ఈ దాడి తర్వాత రకరకాల గాయాలతో, జబ్బులతో చనిపోయిన వాళ్ల సంఖ్య చాలా చాలా ఎక్కువ. నష్టపరిహారం కోసం ఇప్పటిదాకా 67,000 దరఖాస్తులు వచ్చాయి. వీసీఎఫ్(విక్టిమ్ కాంపంజేషన్ ఫండ్) ద్వారా 40 వేలమందికి పైగా.. దాదాపు 9 బిలియన్ల డాలర్ల నష్టపరిహారాన్ని అందజేసినట్లు నిర్వాహకురాలు రూపా భట్టాచార్య చెప్తున్నారు. ఈ లెక్కన బాధితుల సంఖ్య ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. కారణాలు.. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద మారణహోమానికి అల్ఖైదా ఉగ్రవాద సంస్థ కారణమని చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో ఇజ్రాయెల్తో అమెరికా స్నేహహస్తం, సోమాలియా, మోరో అంతర్థ్యుద్దం(ఫిలిఫ్ఫైన్స్), రష్యా, లెబనాన్, కశ్మీర్(భారత్)లలో హింసాత్మక ఘటనలు, ముస్లింల అణచివేత, ఇస్లాం వ్యతిరేక కుట్రలకు అమెరికా వెన్నుదన్నుగా నిలిచిందన్నది అల్ఖైదా ప్రధాన ఆరోపణ. అంతేకాదు సౌదీ అరేబియా గడ్డపై యూఎస్ భద్రతా దళాల మోహరింపు, ఇరాక్కు వ్యతిరేకంగా ఆంక్షల విధింపు.. తదితర కారణాలు అమెరికాపై ఉగ్రవాద దాడులకు అల్ఖైదాను ఉసిగొల్పాయనేది వాదన. నాలుగోది ఫ్లాప్.. పక్కా ప్రణాళిక.. విమానం నడపడంలో శిక్షణ పొందిన 19 మంది ఉగ్రవాదులు. ఐదుగురు మూడు గ్రూపులుగా, నలుగురు ఒక గ్రూప్గా విడిపోయారు. సెప్టెంబర్ 11, 2001 ఉదయం మొత్తం నాలుగు విమానాల్ని హైజాక్ చేశారు. మొదటి ఫ్లైట్ అమెరికన్ ఎయిర్లైన్స్11ను.. ఉదయం 8గం.46ని.కు మాన్హట్టన్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ టవర్ను ఢీకొట్టారు. పదిహేడు నిమిషాల తర్వాత రెండో విమానం(యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 175) వరల్డ్ ట్రేడ్ సెంటర్ సౌత్ టవర్ను ఢీకొట్టింది. కేవలం గంటా నలభై రెండు నిమిషాల్లో 110 అంతస్తుల ట్విన్ టవర్స్ చూస్తుండగానే కుప్పకూలిపోయాయి. మంటలు.. దట్టమైన పొగ, ఆర్తనాదాలు, రక్షించమని కేకలు, ప్రాణభీతితో ఆకాశ హార్మ్యాల నుంచి కిందకి దూకేసిన భయానక దృశ్యాలు ఆన్కెమెరా రికార్డు అయ్యాయి. ఆ దాడులతో రెండు కిలోమీటర్ల మేర భవనాలు సైతం నాశనం అయ్యాయి. దట్టంగా దుమ్ము అలుముకుని మొత్తం ఆ ప్రాంతాన్ని పొద్దుపొద్దున్నే చీకట్లోకి నెట్టేశాయి ఉగ్రదాడులు. 9/11.. పెంటగాన్ దాడి దృశ్యం ఇక మూడో దాడి.. డల్లాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన విమానాన్ని ఓహియో వద్ద హైజాక్ చేశారు. వర్జీనియా అర్లింగ్టన్ కౌంటీలోని పెంటగాన్ పడమర భాగాన్ని ఉదయం 9గం.37ని. నిమిషాలకు ఢీకొట్టారు. నాలుగో విమానం.. ఉ.10.03ని. సమయంలో పెన్సిల్వేనియా షాంక్స్విల్లే దగ్గర మైదానాల్లో క్రాష్ ల్యాండ్ అయ్యింది. బహుశా ఇది వైట్ హౌజ్ లేదంటే యూఎస్ పార్లమెంట్ భవనం లక్క్ష్యంగా దూసుకొచ్చి ఉంటుందని భావిస్తున్నారు. మొత్తానికి భద్రతా దళాలు, రక్షణ దళాలు అప్రమత్తం అయ్యేలోపే ఊహించని ఘోరం జరిగిపోయింది. బుష్ చెవిలో ఊదింది ఆయనే సెప్టెంబర్ 11, 2001.. మంగళవారం ఉదయం. ఆనాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్.. ఉదయాన్నే చాలా నీరసంగా ఉన్నారు. అయినప్పటికీ కరోలీ బూకర్ ఎలిమెంటరీ స్కూల్లో ఓ ఈవెంట్కు హాజరయ్యారు. పిల్లలతో ఇంటెరాక్ట్ అయిన టైంలో బుష్ చెవిలో ఏదో గొణిగాడు ఆండ్రూ కార్డ్. ఈయన వైట్హౌజ్లో చీఫ్ స్టాఫ్గా పని చేశాడు అప్పుడు. అయితే వాళ్లకు దాడి గురించి ప్రాథమిక సమాచారం తప్పుగా అందింది. ఓ చిన్న విమానం.. అదీ పైలెట్కు గుండెపోటు వల్ల జరిగిందన్న సమాచారంతో పొరబడి ఆ దుర్ఘటనలపై విచారం వ్యక్తం చేశారు వాళ్లు. కాసేపటికే అదొక కమర్షియల్ జెట్లైనర్ విమానమని, భారీ ఉగ్రదాడి అనే క్లారిటీ వచ్చింది. సెకండ్ గ్రేడ్ క్లాస్ రూంలో వైట్ హౌజ్ స్టాఫ్, యూఎస్ నేవీ కెప్టెన్ అంతా అధ్యక్షుడు బుష్తో భేటీ అయ్యారు. ఆటైంలోనే యూబీఎల్ అనే పేరును ప్రెసిడెంట్ బుష్ వద్ద ప్రస్తావించాడు కార్డ్. యూబీఎల్.. అంటే వుసామా బిన్ లాడెన్. ఈ దాడులకు సరిగ్గా నెల రోజుల క్రితం అమెరికాపై దాడులకు పాల్పడతామని లాడెన్ బెదిరించినట్లు సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీ వైట్ హౌజ్కు నివేదిక సమర్పించిన విషయాన్ని కార్డ్ గుర్తు చేశాడు. కాసేపటికే పెంటగాన్ దాడి వార్త అందాక బుష్ను వైట్హౌజ్కు కాకుండా.. రహస్య ప్రాంతానికి తరలించి తర్వాతి ప్రణాళిక మీద చర్చలు జరిపారు. అఫ్గన్ ద్వారా వేట సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో చాలా మార్పులొచ్చాయి. ఆసియన్ దేశాల విషయంలో పాశ్చాత్య దేశాల ధోరణి పూర్తిగా మారిపోయింది. ట్రావెల్ బ్యాన్-ఆంక్షలు, మతవిద్వేష దాడులు పేట్రేగిపోయాయి. ఇక అల్ఖైదా మీద ప్రతీకారంతో అప్గన్ ఆక్రమణ చేపట్టిన అమెరికా సైన్యం.. ఒసామా బిన్లాడెన్ కోసం వేట మొదలుపెట్టింది. అయితే తొలుత ట్విన్ టవర్స్ దాడులతో తనకేం సంబంధం లేదని ప్రకటించుకున్న లాడెన్.. ఆ తర్వాత మూలకారకుడు తానే అని ఒప్పుకున్నట్లు వీడియో ఆధారాలు వెలుగు చూశాయి. దాడి జరిగిన పదేళ్ల తర్వాత 2011, మే 1న అబ్బోట్టాబాద్ (పాక్) దగ్గర అమెరికా సైన్యం నిర్వహించిన ‘ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్’లో లాడెన్ హతం అయినట్లు అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. బైడెన్ గురించి లాడెన్ లేఖ! తాజా అఫ్గన్ పరిణామాలు దాదాపు అందరికీ తెలిసినవే. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకోగా.. తిరిగి తాలిబన్లు ఆక్రమణకు పాల్పడ్డారు. ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే తాలిబన్లు బిన్ లాడెన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 9/11 దాడుల్లో లాడెన్ ప్రమేయం లేదని, లాడెన్కు వ్యతిరేకంగా అమెరికా దొంగ సాక్క్క్ష్యాలు సృష్టించిందని, ఆధిపత్య ధోరణితో అఫ్గన్లో అమెరికా సైన్యం మోహరించిందంటూ వరుస ప్రకటనలు విడుదల చేశారు. ఇక అల్ఖైదా నేత బిన్ లాడెన్.. 2010లో రాసిన ఓ లేఖ తాలిబన్ పరిణామాల తర్వాత తెర మీదకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడి పోటీలో జో బైడెన్ పేరు తెర మీదకు రావడాన్ని ఒసాబా బిన్ లాడెన్ స్వాగతించాడని 48 పేజీల లేఖ ఒకటి విడుదల అయ్యింది. ‘బైడెన్ అధ్యక్ష పదవికి ముందస్తుగా సిద్ధంగా లేడు. అతను గనుక అధ్యక్షుడు అయితే.. అమెరికా దానంతట అదే సంక్షోభంలోకి కూరుకుపోతుంది. బైడెన్ అసమర్థన పాలన అమెరికాను నాశనం చేస్తుంద’ని ఆ లేఖలో లాడెన్ పేరిట రాసి ఉంది. అమెరికా 9/11 ఉగ్రదాడులకు 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. - సాక్షి, వెబ్డెస్క్ -
నోయిడా ట్విన్ టవర్ల కూల్చివేత.. ‘రేరా’ ఎక్కడ విఫలమవుతోంది?
నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని 40 అంతస్తుల ట్విన్ టవర్లను కూల్చేయాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రియాల్టీ రంగానికి పెనుషాక్లా తగిలింది. రేరా చట్టం (రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ యాక్ట్ -2016) అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇంత తీవ్ర స్థాయిలో కోర్టు తీర్పు వెలువడానికి కారణం ఏంటీ. ఇంత భారీ స్థాయిలో తప్పులు చోటు చేసుకుంటుంటే దాన్ని అరికట్టడంలో రేరా ఎక్కడ విఫలమైంది అనేది ఇప్పుడు రియాల్టీ రంగంలో చర్చకు దారి తీసింది. రేరా సరిపోదా ? దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇతర కోర్టులకు కూడా మార్గదర్శనం కానుంది. ఈ తరహా తీర్పులు మరిన్ని వెలువడితే రియల్టీ రంగంలో ఉన్న వారికి సైతం ఇబ్బంది. రియాల్టీలో ఉన్న ప్రధాన లోపాలు ఏంటీ వీటిని పరిష్కరించాలంటే రేరా లాంటి చట్టాలే సరిపోతాయా? ఈ వ్యాపారంలో ఉన్న వారు, కొనుగోలుదారులు, ఇతర ప్రభుత్వ విభాగాల బాధ్యత ఏంటీ అనే తెర మీదకు వస్తోంది. - రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎవరు ప్రవేశించాలి. అందుకు అర్హతలు ఏముండాలి అనే విషయంలో ఎటువంటి నిబంధనలు లేవు. దీంతో ఈ రంగంపై అనుభవం లేకపోయినా తమ బ్లాక్మనీని వైట్ చేసుకునేందుకు రియాల్టీ రంగంలోకి వస్తున్న వారి సంఖ్య ఎక్కువైపోతుంది. వీరికి ప్రాజెక్టును పూర్తి చేయడం మీద కన్న తమ లాభం, ఇతరత్రా వ్యవహరాలపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. ఫలితంగా ఇలాంటి వారి వెంచర్లను నమ్మినవారు మధ్యలో మునిగిపోతున్నారు. రేరా చట్టంతో ఈ సమస్య సమసిపోతుందనుకున్నారు. అయితే వాస్తవంలో అలా జరగడం లేదు - బిల్డర్కి కొనుగోలుదారుడికి మధ్య సమస్య తలెత్తిన సందర్భంలో వాటిని పరిష్కరించడంలో రేరాది ప్రేక్షక పాత్రే అవుతుంది. రేరా చట్టంలో ఉన్న నిబంధనలు లీగల్ ఫైట్ టైమ్ని మరింతగా పెంచుతున్నాయి. ఫలితంగా ఆర్థికంగా బలంగా ఉండే బిల్డర్లతో కొనుగోలుదారులు లీగల్గా ఎక్కువ కాలం పోటీ పడలేని పరిస్థితి నెలకొంది. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఫాస్ట్ట్రాక్ కోర్టులు అవసరమనే అభిప్రాయం వినిపిస్తోంది. - సబ్బు బిళ్ల మొదలు బట్టల వరకు ఏదైనా వస్తువును కొనేప్పుడు దాన్ని పరిశీలించి.. బాగుందని నమ్మితేనే కొంటాం. కానీ రియల్ ఎస్టేట్, ఇళ్ల కొనుగోలు విషయంలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. కనీసం నిర్మాణం మొదలుకాకముందే బిల్డర్లు అమ్మకాలు మొదలుపెడతారు. వారి ఏజెంట్లు ఆహా ఓహో అని చెబుతారు. ఆలస్యం చేస్తే రేటు పెరుగుతుందని తొందరపెడతారు. మరోవైపు బ్యాంకర్లు, ఇతర ఫైనాన్షియల్ సంస్థలు సైతం లోన్లు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో డబ్బులు చెల్లించినా సకాలంలో ఇళ్లు చేతికి అందక చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేల రూపాయల సొమ్మును ఈఎంఐ, వడ్డీలుగా అదనంగా చెల్లిస్తున్నారు. ఈ విషయంలో కనీసం ప్రభుత్వ విభాగాలు సైతం చేష్టలుడిగి చూస్తుండి పోతున్నారు. ఇచ్చిన గడువులోగా ఇంటి నిర్మాణం పూర్తి చేయని బిల్డర్కి ఎటువంటి జవాబుదారితనం లేకపోయినా వచ్చిన నష్టమేమీ లేకుండా పోయింది. చదవండి : 40- Storey Noida Towers: కుమ్మక్కయ్యారు.. కూల్చేయండి -
చివరికి మిగిలిందిదీ!
20 ఏళ్ల పాటు సాగిన ఒక యుద్ధానికి ప్రపంచ పెద్దన్న ముగింపు పలికింది. 2001, సెప్టెంబర్ 11 న్యూయార్క్లోని ట్విన్ టవర్స్ను విమానాలతో ఢీకొట్టి కూల్చేసి అల్కాయిదా విలయం సృష్టించింది. దాడుల్ని సహించలేని అగ్రరాజ్యం ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేస్తానని ప్రతిజ్ఞ చేసింది. అందుకోసం అఫ్గానిస్తాన్లో 20 ఏళ్ల పాటు యుద్ధం నడిపించింది. నలుగురు అధ్యక్షులు మారారు. వేలాది సైన్యం బలయ్యారు. కోట్లాది డాలర్లు ఖర్చయ్యాయి. చివరికి ఏం జరిగింది. తడిసి మోపెడయ్యే ఖర్చుని తట్టుకోలేక తాలిబన్లకే తలొగ్గి వెనక్కి వెళ్లిపోయింది. అసలు ఈ 20 ఏళ్లలో జరిగిందేంటి ? అమెరికాపై 2001 సెప్టెంబర్ 11న జరిగిన దాడులతో ఆ దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఉగ్రవాద పంజా దెబ్బ తొలిసారి చూసిన అగ్రరాజ్యం తోకతొక్కిన తాచులా బుసలు కొట్టింది. దాడులు జరిగిన నెల రోజులు కూడా తిరిగిందో లేదో అప్పటి అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ అఫ్గానిస్తాన్ను అక్టోబర్ 7, 2001న ఆక్రమించారు. దాడులకి కారకుడైన అల్కాయిదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ను వెంటాడి వేటాడి హతమార్చడానికి ఆ దేశానికి పదేళ్లు సమయం పట్టింది. ఆ తర్వాత మరో పదేళ్లు 50 దేశాల బలగాలు దశలవారీగా సహకరించడంతో 20 ఏళ్ల పాటు అఫ్గాన్లో తాలిబన్లను ఎదుర్కొంటూ తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని నడిపించింది. 2011లో బరాక్ ఒబామా హయాంలో అత్యధికంగా లక్షా 40 వేల మంది సంకీర్ణ బలగాలు అఫ్గాన్లో ఉన్నాయి. అలుపెరుగని యుద్ధం చేసిన అమెరికా దానికయ్యే వ్యయాన్ని భరించలేక వెనుదిరిగింది. ప్రాణ నష్టం అఫ్గానిస్తాన్ని అమెరికా ఆక్రమించిన తర్వాత నేరుగా ప్రత్యక్ష యుద్ధంలో గత 20 ఏళ్ల కాలంలో 2,41,000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక పరోక్ష ప్రభావంతో అంటే యుద్ధం కారణంగా ఏర్పడిన కరువు, ఆకలి, వ్యాధులు, గాయాలు వంటి కారణాలతో వేలాది మంది మరణించారు. అఫ్గానిస్తాన్కు 2,670 కి.మీ. మేరకు కొండల సరిహద్దుని పాకిస్తాన్ పంచుకోవడంతో అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో ఇరు దేశాలకు ప్రాణనష్టం జరిగింది. ఖర్చు తడిసిమోపెడు అఫ్గాన్తో యుద్ధం, పునర్ని ర్మాణం పేరిట అమెరికాకు ఖర్చు తడిసిమోపెడైంది. ఈ 20 ఏళ్ల కాలంలో అగ్రరాజ్యం దాదాపుగా 2.26 లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసిందని బ్రౌన్ యూనివర్సిటీ కాస్ట్స్ ఆఫ్ వార్ ప్రాజెక్టు అంచనా వేసింది. అమెరికా రక్షణ బడ్జెట్ నుంచి 93,300 కోట్ల డాలర్లు కేటాయిస్తే, అదనంగా మరో 44,300 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. ఈ యుద్ధం కోసం విపరీతంగా అప్పులు చేసిన అమెరికా వడ్డీలే వందల కోట్ల డాలర్లలో కడుతోంది. అమెరికాలో ఎన్నో తరాలపై ఈ యుద్ధానికి సంబంధించిన ఆర్థిక భారం పడనుంది. అఫ్గాన్ ఎలా ఉందంటే.. అఫ్గానిస్తాన్లో 2001లో తాలిబన్ అరాచక పాలనకు తెరపడిన తర్వాత పరిస్థితుల్లో ఎంతో కొంత మార్పు వచ్చినప్పటికీ చాలా అంశాల్లో మిగతా దేశాలతో పోల్చి చూస్తే వెనుకబడే ఉంది. విద్య, ఆరోగ్యం, మహిళా హక్కులు మెరుగుపడ్డాయి. ప్రజల సగటు ఆయుఃప్రమాణం 56 ఏళ్ల నుంచి 64 ఏళ్లకు పెరిగింది. ప్రసవ సమయంలో మహిళల మరణాలు బాగా తగ్గాయి. పార్లమెంటు దిగువ సభలో 27 శాతం సీట్లు మహిళలకి రిజర్వ్ చేశారు. అయినప్పటికీ మహిళల అభ్యున్నతిలో ప్రపంచ దేశాల్లో దిగువ స్థానంలోనే ఉంది. 2019 యునిసెఫ్ లెక్కల ప్రకారం 37 లక్షల మంది పిల్లలు బడి ముఖం చూడకపోతే వారిలో 60 శాతం మంది ఆడపిల్లలే ఉన్నారు. విద్యనభ్యసిస్తున్న టీనేజ్ అమ్మాయిలు 37 శాతం మంది మాత్రమే ఉన్నారు. 2005లో 22% మంది ప్రజలకే విద్యుత్ సౌకర్యం ఉంటే, 2019 నాటికి 98% జనాభాకి విద్యుత్ వెలుగులు ప్రసరించాయి. 2016 సంవత్సరం నాటికి 54.5% మంది నిరుపేదలు కాగా, నిరుద్యోగం రేటు 8.84%గా ఉంది. ఈ 20 ఏళ్ల కాలంలో 27 లక్షల మంది అఫ్గాన్ పౌరులు పొరుగున ఉన్న పాకిస్తాన్, ఇరాన్లలో తలదాచుకున్నారు. మరో 40 లక్షల మంది ఆ దేశంలోనే చెట్టుకొకరు పుట్టకొకరుగా చెదిరిపోయారు. అఫ్గానిస్తాన్ ఇప్పటికీ పిల్లలకి నరకప్రాయంగా ఉంది. 2010–20 మధ్యలో జరిగిన దాడుల్లో 3,219 మంది మహిళలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక అదే సమయంలో 7,792 మంది పసిపిల్లలు మృతి చెందారు. అమెరికా వైమానిక దళం అంచనాల ప్రకారం 2013–2019 మధ్య అఫ్గాన్పై అమెరికా వేల సార్లు వైమానిక దాడులు జరిపింది. 27 వేల బాంబుల్ని జారవిడిచింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
టెకీ డాక్టర్
న్యూయార్క్లోని ‘ట్విన్ టవర్స్’ పై ఉగ్రవాదుల దాడి జరిగిన సమయంలో డాక్టర్ సుంబుల్ దేశాయ్ లాస్ ఏంజెలిస్లోని డిస్నీ ల్యాండ్ ఆఫీస్లో ఉన్నారు. అప్పటికి ఆమె డాక్టర్ కాదు. అందులోని ఒక డిజిటల్ మీడియా విభాగానికి చిన్నపాటి క్రియేటివ్ హెడ్. పాతికేళ్ల అమ్మాయి. డిస్నీలోకి రావడానికి ముందు, డిస్నీ వాళ్లదే ఏబీసీ టీవీలో నైట్ డ్యూటీ చేస్తుండేది. డే డ్యూటీ ఐబీఎంలో. దాడి జరిగిన రోజు రాత్రి, దేశాయ్ డ్యూటీలో ఉండగా న్యూయార్క్లోని ఆసుపత్రి నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. ‘మీ మదర్ని ఐసీయు నుంచి వేరొక వార్డుకు తరలిస్తున్నాం. ఐసీయులోని బెడ్స్ అన్నీ క్లియర్ చేస్తున్నాం’ అని చెప్పారు. క్లియర్ చేస్తున్నది జంట సౌధాలపై జరిగిన దాడిలో గాయపడిన వారి కోసం. అప్పటికి రెండు వారాలుగా దేశాయ్ తల్లి ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓ అర్ధరాత్రి ఆమెకు స్ట్రోక్ వస్తే అక్కడ చేర్చారు. ఆఫీస్ నుంచి వెంటనే ఆసుపత్రికి బయల్దేరింది దేశాయ్. తర్వాత ఆమె ఏడాది పాటు ఆఫీస్కే వెళ్లలేదు. డిస్నీకి సెలవు పెట్టింది. తల్లి ఆరోగ్యం పూర్తిగా మెరుగయ్యే వరకు ఆమె పక్కనే ఉండి ట్రీట్మెంట్, మెడిసిన్, ఇతర ఆరోగ్య సేవల్ని ఒక పూర్తి స్థాయి ‘కేర్ గివర్’గా అందించింది దేశాయ్. ఆ సమయంలో ఆమెకు వైద్యులు పరిచయం అయ్యారు. వైద్యరంగంపై ఆసక్తి కలిగింది. డాక్టర్ అవాలనుకుంది! అయితే ఆమె చదివింది కంప్యూటర్ సైన్స్. మెడిసిన్కి కంప్యూటర్సేమీ అడ్డురావని సెలవు పూర్తయ్యాక డిస్నీలో రీ–జాయిన్ అయినప్పుడు అక్కడి వాళ్లు నవ్వుతూ అనడం దేశాయ్కి ఉత్సాహం ఇచ్చింది. డ్యూటీ చేస్తూనే సాయంకాలపు ‘పోస్ట్ బాక్యులోరియట్’ కోర్సులో చేరింది. డిగ్రీ అర్హతతో ఏ సబ్జెక్టులోనైనా అవగాహన కలిగించే కోర్సు అది. క్రమంగా దేశాయ్కి ఆ క్లాసుల మీద ఆసక్తి పెరిగింది. డీస్నీ మీద అనాసక్తి ఏర్పడింది. కోర్సు పూర్తవుతుండగా ఉద్యోగం మానేసి వర్జీనియా మెడికల్ కాలేజ్కి అప్లయ్ చేసింది. సీటు వస్తుందనుకోలేదు. వచ్చింది! 2004 నాటి సంగతి అది. అప్పటికి ఆమె పెళ్లి కూడా అయింది. భర్తకు స్టాన్ఫోర్డ్లోని బిజినెస్ స్కూల్లో ఉద్యోగం. ఏబీసీ టీవీలో ఉండగా పరిచయం అయిన వ్యక్తే. మెడికల్ కోర్సులో ఉన్న ఆ నాలుగేళ్లూ భర్తకు దూరంగా ఉంది. ఆయనే వచ్చి చూసి వెళ్లేవాడు. లేదంటే ఎప్పుడైనా ఈమె వెళ్లేది. కోర్సు పూర్తయ్యాక ‘స్టాన్ఫోర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్’లో చేరింది. మూడేళ్ల క్రితం.. ఆపిల్ ‘హెల్త్’ కు వైస్ ప్రెసిడెంట్గా వచ్చే ముందు వరకు డాక్టర్ దేశాయ్ స్టాన్ఫోర్డ్ సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్లో సీనియర్ పొజిషన్లో ఉన్నారు. అందులోని డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ విభాగానికి ‘స్ట్రాటజీ అండ్ ఇన్నొవేషన్’ వైస్ చైర్మన్గా రిలీవ్ అయ్యారు. స్టాన్ఫోర్డ్లో మొత్తం తొమ్మిదేళ్ల అనుభవం. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఆపిల్ హెల్త్ వాచ్ సిక్స్త్ జనరేషన్ (సీరీస్ 6) రూపకర్త డాక్టర్ దేశాయే. అందులోని సరికొత్త హెల్త్ ఫీచర్స్.. ఈసీజీ చెక్, రక్తంలో ఆక్సిజన్ మెజర్మెంట్ ఆమె ఆలోచనే. ఆ ఆలోచనలకు డిజిటల్ సపోర్ట్, సాఫ్ట్వేర్ కూడా ఆమెదే. సాఫ్ట్వేర్ ఇంజినీరుగా కెరీర్ ఆరంభంలో ఆమె ‘ఐ లవ్ టెక్నాలజీ’ అంటుండేవారు. ఏబీసీ టీవీలో పని చేసినా.. లైవ్ ఇంటర్వూ్యలు బాగుండేవట కానీ తక్కిన ప్రోగ్రామ్ వర్క్ బోర్ కొట్టేదట. ఏమైనా ఈరోజు ఆమె ఇంత పెద్ద పొజిషన్లో ఉండటానికి కారణం తల్లి, ఆ తల్లి వైద్యులు. వాళ్లు మాత్రమే కాదు.. ఏబీసీ టీవీ ‘వరల్డ్ న్యూస్ టునైట్’ హోస్ట్ పీటర్ జెన్నింగ్స్, వాల్డ్ డిస్నీ సీఈవో మైఖేల్ ఐస్న్ర్, స్టాన్ఫోర్డ్లో ‘డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్’ ఛైర్మన్ బాబ్ హారింగ్టన్ల భాగస్వామ్యం కూడా ఉంది డాక్టర్ దేశాయ్ ఉన్నతిలో. ఆ విషయాన్ని ఆమె తరచు చెబుతుంటారు. -
12 సెకన్లలో 462 అడుగుల టవర్స్ నేలమట్టం!
-
‘ట్విన్ టవర్స్’ నిధులు అదుర్స్
సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం నగర పోలీసు విభాగానికి పెద్దపీట వేసింది. హోంశాఖకు మొత్తం రూ.1389.66 కోట్లు కేటాయించగా... ఇందులో రూ.574.2 కోట్లు (41.3 శాతం) నగర పోలీసు విభాగానికి దక్కాయి. ‘ట్విన్ టవర్స్’గా పిలిచే బంజారాహిల్స్ ప్రాంతంలో నిర్మించనున్న అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు (ఐసీసీసీ) మూడో విడతగా రూ.280.8 కోట్లు కేటాయించడం గమనార్హం. ‘పది లక్షల కళ్ల’ లక్ష్యంతో ముందుకు వెళ్తున్న సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాజెక్టుకు రూ.140 కోట్లు కేటాయించింది. 2017–18లో రూ.509 కోట్లు కేటాయించగా... ఈసారి కేటాయింపులు రూ.63 కోట్లు పెరిగాయి. పోలీసు అధికారులు ప్రతిపాదనలకు అనుగుణంగానే కేటాయింపులు ఉండటం విశేషం. సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లకు రూ.42.97 కోట్ల చొప్పున కేటాయింపులు జరిగాయి. దాదాపు రెండేళ్ల క్రితం ఏర్పడిన రాచకొండకు పోలీసు కమిషనరేట్ నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయించింది. ఐసీసీసీ ఏర్పాటుకు కీలక అడుగు.. బంజారాహిల్స్లోని ఏడెకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న సిటీ పోలీసు కమిషనరేట్ హెడ్–క్వార్టర్స్ అండ్ ఇంటిగ్రేడెట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (హెచ్సీపీసీహెచ్క్యూ అండ్ ఐసీసీసీ) దేశంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి దీనిని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. 2015 నవంబర్ 22న ముఖ్యమంత్రి ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నగర ప్రజల భద్రతే ప్రామాణికంగా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా అందుబాటులోకి రానున్న ఈ పోలీస్ ‘ట్విన్ గ్లాస్ టవర్స్’ నిర్మాణానికి మొత్తం రూ.1002 కోట్లు నిర్మాణ వ్యయమవుతుందని అంచనా వేశారు. 2015లోనే రూ.302 కోట్లు మంజూరు చేయగా... 2016–17 బడ్జెట్లో మరో రూ.140 కోట్లు కేటాయించారు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.145 కోట్లు కేటాయించింది. తాజాగా రూ.280.8 కోట్లు కేటాయించారు. నిర్మించతలపెట్టిన దాని కంటే ఎత్తు తగ్గడం, తదితర కారణాల నేపథ్యంలో ఈ మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. మౌలిక వసతులకు రూ.10కోట్లు.. సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కాన్సెప్ట్లో భాగంగా పోలీసుస్టేషన్ల స్వరూప, స్వభావాలను పూర్తిగా మార్చేస్తున్నారు. ఆధునిక హంగులతో కూడిన ఠాణాల నిర్మాణం, ఉన్నవాటికి అదనపు సౌకర్యాల ఏర్పాటు, ప్రత్యేకంగా రిసెప్షన్ తదితరాల కోసం ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించింది. కొత్తగా పోలీసుక్వార్టర్స్ నిర్మాణం, అభివృద్ధి, అధికారుల కార్యాలయాలు, సిబ్బందికి బ్యారెక్స్, యంత్రసామాగ్రి కొనుగోలు కోసం రూ.40 కోట్లు కేటాయించారు. ‘ట్రాఫిక్ టెక్నాలజీ’కి రూ.10 కోట్లు.. నగర ట్రాఫిక్ విభాగం ప్రమాదాల నిరోధం, నాన్ కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్, విధి నిర్వహణలో పారదర్శకతలకు ప్రాధాన్యం ఇస్తూ వివిధ రకాలైన సాంకేతిక పరిజ్ఞానం, ఉపకరణాలను సమకూర్చుకుంటోంది. ఇందులో భాగంగా సిటిజెన్ సెంట్రిక్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ పథకం కింద ఈ బడ్జెట్లో ప్రభుత్వం ఈ ఏడాది రూ.10 కోట్లు ఇచ్చింది. ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం (ఐటీఎంఎస్) పేరుతో అత్యాధునిక వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రధాన కూడళ్లలో క్షేత్రస్థాయి సిబ్బంది ప్రమేయం లేకుండా ట్రాఫిక్ నిర్వహణ, ఉల్లంఘనుల గుర్తింపు, సేఫ్ అండ్ ఫాస్ట్ జర్నీ లక్ష్యాలుగా ఉన్న ఈ ప్రాజెక్టుకు తుది దశకు చేరింది. దీంతో పాటు జీపీఎస్ టెక్నాలజీతో పని చేసే డిజిటల్ కెమెరాలు, 3 జీ కనెక్టివిటీతో పని చేసే చెస్ట్ మౌంటెడ్ కెమెరాలు, ఇతర ఊపకరణాలకు నిధులు కేటాయించారు. ఈ కోణంలో సైబరాబాద్కు రూ.5 కోట్లు, రాచకొండకు రూ.కోటి కేటాయించింది. రూ.12 కోట్లతో వ్యవస్థీకృత నేరాలకు చెక్ సైబర్ నేరాలతో పాటు వ్యవస్థీకృతంగా రెచ్చిపోతున్న ముఠాల పైనా నగర పోలీసులు సాంకేతిక యుద్ధం చేయనున్నారు. దీనికి అవసరమైన సాఫ్ట్వేర్స్, ఇతర ఉపకరణాలు ఖరీదుతో పాటు క్రైమ్ డేటా విశ్లేషణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకుగాను సర్కారు రూ.12 కోట్లు కేటాయించింది. బ్యాక్ ఎండ్ టెక్నాలజీలో భాగంగా పోలీసు విభా గం అనేక ఎనలటిక్స్ను సమకూర్చుకుంటోంది. నేరగాళ్ల కదలికలపై నిఘా, అనుమానితుల గుర్తింపు తదితరాల కోసం వీటిని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే సైబర్, క్రైమ్ ల్యాబ్స్తో పాటు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్లో భారీ స్థాయిలో బ్యాక్ఎండ్ సేవలు చేసే సాఫ్ట్వేర్స్తో పాటు వీడియో ఎన్హ్యాన్స్మెంట్, రిట్రీవ్ సాఫ్ట్వేర్స్ సమీకరించుకున్నారు. ఈ బడ్జెట్తో అవసరమైన అదనపు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఉన్న వాటి అభివృద్ధికి వీటిని వెచ్చించనున్నారు. సైబరాబాద్లో ఈ పద్దు కింద రూ.5 కోట్లు, రాచకొండకు రూ.1.5 కోట్లు కేటాయించింది. రాచకొండ కమిషనరేట్కు నిధులు.. 2016లో ఆవిర్భవించిన రాచకొండ కమిషనరేట్కు ప్రత్యేకంగా కమిషనరేట్ భవనం లేకపోవడంతో ఇప్పటికీ గచ్చిబౌలిలో ఉన్న సైబరాబాద్ కమిషనరేట్లోనే కొనసాగుతోంది. సరూర్నగర్లోని వీఎం హోమ్ స్థలాన్ని కేటాయించినా... కోర్టు ఆదేశాలతో వెనక్కు తగ్గాల్సి వచ్చింది. దీం తో రంగారెడ్డి జిల్లాలో 56 ఎకరాలు కేటాయిస్తూ మంత్రి మండలి బుధవారం నిర్ణయం తీసుకు ంది. గురువారం నాటి బడ్జెట్లో కమిషనరేట్ నిర్మాణం కోసం రూ.5 కోట్లు కేటాయించారు. డేగ‘కళ్ల’ కోసం రూ.140కోట్లు.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో విస్తరించి ఉన్న నగరం మొత్తాన్ని సీసీ కెమెరా నిఘాలో ఉంచడానికి ప్రభుత్వం, పోలీసు విభాగం ముమ్మర కసరత్తు చేస్తోంది. మూడు కమిషనరేట్లలోనూ కలిపి పది లక్ష సీసీ కెమెరాల ఏర్పాటును లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందుకుగాను ప్రభుత్వం తొలి బడ్జెట్లోనే రూ.69 కోట్లు కేటాయించింది. 2017–18లో రూ.225 కోట్లు ఇచ్చింది. స్మార్ట్ అండ్ సేఫ్ సిటీ ప్రాజెక్టు కింద మూడు కమిషనరేట్లలో పబ్లిక్ ప్లేసుల్లో కెమెరాలు ఏర్పాటు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్తో వీటి కనెక్టివిటీ తదితర అవసరాల కోసం ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూ.140 కోట్లు కేటాయించింది. సైబరాబాద్కు రూ.6 కోట్లు, రాచకొండకు రూ.1.5 కోట్లు కేటాయించింది. ప్రతిపాదనల మేరకు కేటాయింపులు రాచకొండ పోలీసు కమిషనరేట్కు సంబంధించి ప్రతిపాదనల మేరకు కేటాయింపులు జరిగాయి. ప్రభుత్వం కేటాయించిన నిధులతో ప్రతి ఠాణాను మోడల్గా మార్చడానికి, ట్రాఫిక్ స్థితిగతులు మెరుగుపరచడానికి కృషి చేస్తాం. కమిషనరేట్ భవన నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయింపులు జరిగాయి. ఇది తొలి దఫా నిధులు మాత్రమే. భూమి స్వాధీనం, అభివృద్ధి పూర్తి చేసిన తర్వాత రెండో దఫాగా అవసరమైన మొత్తం ప్రతిపాదిస్తాం. – మహేష్ మురళీధర భగవత్, రాచకొండ పోలీసు కమిషనర్ -
అమెరికాను వదలని.. లాడెన్
న్యూయార్క్: బిన్ లాడెన్ చనిపోయిన తరువాత కూడా అమెరికాను భయపెడుతూనే ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు మరో రూపంలో. ఇంతకూ అసలు విషయంఏమిటంటే.. అప్పుడెప్పుడో 2001 న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ను రెండు విమానాలతో లాడెన్ కూల్చిన సంగతి అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ ఘటన జరిగి దాదాపు 16 ఏళ్లు అవుతున్నా.. దాని ప్రభావం అమెరికన్ల మీద ఇంకా ఉంది. ఈ ట్విన్టవర్స్ కూలిపోవడం వల్ల ఏర్పడ్డ దుమ్ము, ధూళి, ఇతర విషవాయులతో చిన్నారులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని తాజా వైద్య నివేదికలు ప్రకటించాయి. తాజాగా ఎన్వైయూ హెల్త్ రీసెర్చ్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ హెల్త్ రిజిస్ట్రీ వారు 308 మంది చిన్నారుల ఆరోగ్యంపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల్లో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. 123 మంది చిన్నారుల్లో బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అధిక స్థాయిలో ఉండడం, దుమ్ము, హనికర విషవాయులు రక్తంలో కలిసి ఉండడాన్ని గుర్తించారు. టవర్స్ కూలిపోయే సమయంలో దగ్గరున్న 50 వేల మందిలో గుండెజబ్బులు, క్యాన్సర్ కారకాలు ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు. -
విశాఖలో ట్విన్ టవర్స్!
సాక్షి, విశాఖపట్నం: న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ తరహాలోనే విశాఖలో ట్విన్ టవర్స్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ పేర్కొన్నారు. నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దేశంలోనే అత్యంత ఎత్తయిన టవర్స్ నిర్మించనున్నట్టు చెప్పారు. ఇప్పటికే వరల్డ్ ట్రేడ్ సెంటర్ సీఈవోతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోందన్నారు. ఇందులో ఓ ఫైవ్ స్టార్ హోటల్ను కూడా నిర్మించాలని నిర్ణయించామన్నారు. ఆర్థిక నగరాల ఏర్పాటు, ఐటీ రంగాభివృద్ధిపై మంగళవారం విశాఖలో రియల్ ఎస్టేట్ బిల్డర్స్, ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. -
అమర పోలీసుల సంస్మరణార్థం 10కె రన్
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమర పోలీసుల జ్ఞాపకార్థం అక్టోబర్ 16 నుంచి మూడు రోజుల పాటు 2కె, 5కె, 10కె రన్ పోటీలను నిర్వహించనున్నట్లు డీజీపీ అనురాగ్శర్మ తెలిపారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వామ్యం చేసి, పోలీసు సేవలపై అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. పోటీల్లో 5 వేల మంది పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఆయన సీనియర్ అధికారులతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో తొలిసారి అమర పోలీసుల సంస్మరణార్థం రన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. అమెరికాలో ట్విన్ టవర్స్ ఘటన తర్వాత న్యూయార్క్ పోలీసు డిపార్టుమెంట్ (ఎన్వైపీడీ) ఏటా రన్ నిర్వహిస్తోందని, అలానే రాష్ట్రంలోనూ పోటీలు ప్రారంభించనున్నామని, ఇక నుంచి ఏటా నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రజల సౌకర్యార్థం 2కె, 5కె, 10కె పోటీలు నిర్వహిస్తున్నామని, అందుకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఠీఠీఠీ.ఞౌజీఛ్ఛిటఠ.జీ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, అలానే హైదరాబాద్లోని మాదాపూర్, కూకట్పల్లి, సరూర్నగర్, కుషాయిగూడ, అబిడ్స్, బంజారాహిల్స్, చార్మినార్, పంజాగుట్ట, ఉస్మానియా యూనివర్శిటీ, అంబర్పేట, నారాయణగూడ పోలీస్స్టేషన్లలోనూ పేర్లు నమోదు చేయించుకోవచ్చని చెప్పారు. 2కె రన్లో పాల్గొనే వారు రూ.250, 5కె రన్కు రూ.300, 10కె రన్కు రూ.350 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. జర్నలిస్టులు ప్రవేశ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, గుర్తింపు కార్డు చూపిస్తే అనుమతిస్తారని చెప్పారు. రన్లో విజయం సాధించిన వారికి మెడల్స్ అందజేస్తామని, పోటీలో పాల్గొనే వారికి టీ-షర్ట్లు ఉచితంగా ఇస్తామని పేర్కొన్నారు. పోలీసు సేవలపై ‘ఎక్స్ పో’ పోలీసు సేవలపై అక్టోబర్ 15, 16 తేదీల్లో పీపుల్స్ ప్లాజాలో ‘‘ఎక్స్ పో’’ నిర్వహించనున్నట్లు డీజీపీ అనురాగ్శర్మ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర విభాగాల పోలీసు స్టాళ్లను ఏర్పాటు చేసి ప్రజలకు వివరిస్తామని చెప్పారు. సమావేశంలో శాంతిభద్రతల అదనపు డీజీ అంజనీకుమార్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్త్రివేది, సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్యా, రాచకొండ కమిషనర్ మహేశ్భగవత్, సీఐడీ చీఫ్ సౌమ్యామిశ్రా, సీనియర్ ఐపీఎస్ అధికారి రమేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దు
జంట టవర్లు నిర్మించ తలపెట్టిన స్థలంపై సుప్రీంకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో పోలీసుల కోసం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పేరుతో జంట టవర్లు నిర్మించ తలపెట్టిన స్థలంలో రెండు వారాల పాటు ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ స్థలంపై యాజమాన్య హక్కులు కోరుతూ క్రమబద్ధీకరణ కోసం ప్రైవేటు వ్యక్తులు పెట్టుకున్న దరఖాస్తుపై తగిన ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఆ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టబోమని ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలతో ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనాలను కాపాడినట్లవుతుందని కోర్టు పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ జగదీశ్సింగ్ ఖెహర్, జస్టిస్ సి.నాగప్పలతో కూడిన ధర్మాసనం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుల కోసం ప్రభుత్వం ఏ స్థలం అయితే జంట టవర్ల నిర్మించాలని తలపెట్టిందో ఆ స్థలం తమదని, ఈ స్థలం క్రమబద్ధీకరణకు తాము పెట్టుకున్న దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించిందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ హైదరాబాద్కు చెందిన మీర్ ఇక్బాల్ ఆలీ, మరో 16 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన సింగిల్ జడ్జి, జంట టవర్లు నిర్మిస్తున్న స్థలంపై పిటిషనర్లు యాజమాన్య హక్కులు కోరుతున్న నేపథ్యంలో, 4 వారాల పాటు ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల క్రమబద్ధీకరణ దరఖాస్తును తిరస్కరిస్తూ జారీ చేసిన మెమోలో తిరస్కరణకు కారణాలు చెప్పలేదని సింగిల్ జడ్జి తప్పుపట్టారని, కాబట్టి తాము ఆ మోమోను ఉపసంహరించుకుని మళ్లీ సరైన కారణాలతో మెమో జారీ చేస్తామని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు నివేదించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం 8 వారాల్లోపు పిటిషనర్ల క్రమబద్ధీకరణ దరఖాస్తుపై తగిన ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ మీర్ అలీ తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ ఖెహర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) వాదనలు వినిపిస్తూ హైకోర్టు ఆదేశాల మేరకు పిటిషనర్ల క్రమబద్ధీకరణ దరఖాస్తుపై నిర్ణయం వెలువరించేంత వరకు జంట టవర్లు నిర్మించ తలపెట్టిన స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టబోమని తెలిపారు. దరఖాస్తుపై నిర్ణయాన్ని పిటిషనర్లకు తెలియజేయాలంటూ మీర్ అలీ తదితరులు దాఖలు చేసిన ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ను పరిష్కరించింది. -
ట్విన్ టవర్స్కు లైన్ క్లియర్
హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో పోలీసుల కోసం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పేరుతో అంతర్జాతీయ స్థాయిలో చేపట్టదలచిన ట్విన్ టవర్స్(జంట టవర్ల) నిర్మాణంపై తెలంగాణ సర్కార్కు హైకోర్టులో ఊరట లభించింది. జంట టవర్ల నిర్మాణానికి హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్రావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జంట టవర్ల నిర్మాణ పనులు చేస్తున్న స్థలంపై ప్రైవేటు వ్యక్తులు యాజమాన్యపు హక్కులు కోరుతున్న నేపథ్యంలో ఆ స్థలంలో ఎటువంటి నిర్మాణ పనులు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులు అత్యంత దారుణమైనవని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆ ఉత్తర్వులు ఒక్క నిమిషం కూడా అమల్లో ఉండటానికి వీల్లేదని తేల్చి చెప్పింది. పిటిషనర్లు పెట్టుకున్న క్రమబద్దీకరణ దరఖాస్తును తిరస్కరించడానికి కారణాలు వివరిస్తూ మళ్లీ ఉత్తర్వులు జారీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి చెప్పడంతో, సింగిల్ జడ్జి ముందు తాము దాఖలు చేసిన రిట్ పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు పిటిషనర్లు అంగీకరించారు. ఈ నేపథ్యంలో క్రమబద్దీకరణ కోసం పిటిషనర్లు పెట్టుకున్న దరఖాస్తు విషయంలో 8 వారాల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఈ ఆదేశాలతో అటు సింగిల్ జడ్జి వద్ద ఉన్న పిటిషన్, ఇటు అప్పీల్ను పరిష్కరిస్తున్నట్లు ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. -
నిమ్స్ లో ట్విన్ టవర్లు
♦ విదేశీ రోగుల చికిత్సకు ప్రత్యేకం ♦ ప్రతిపాదనలు సిద్ధం చేసిన వైద్య ఆరోగ్య శాఖ సాక్షి, హైదరాబాద్: వైద్య సేవల రంగంలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ఒరవడికి శ్రీకా రం చుడుతోంది. హైదరాబాద్ కేంద్రంగా ‘మెడికల్ టూరిజం’కు విసృ్తత ప్రాచుర్యం కల్పిం చేందుకు మరో అడుగు ముందుకు వేసింది. ఇందులో భాగంగా విదేశాల నుంచి రోగులను ఆకర్షించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళికలు రూపొందించింది. ప్రత్యేకంగా వీరికి వైద్య చికిత్సలు అందించేందుకు నిమ్స్ ప్రాంగణంలో జంట టవర్లు నిర్మించే ప్రతిపాదనలు సిద్ధం చేసింది.హైదరాబాద్కు చెందిన కార్పొరేట్ ఆస్పత్రులు కొన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వైద్య చికిత్సలు అందిస్తున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో అంద రి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. అందుకే ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పాటు వివిధ దేశాల నుం చి వైద్యం కోసం హైదరాబాద్కు వచ్చే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య పర్యాటక గమ్యస్థానంగా మారుతోందని ఇటీవల సామాజిక ఆర్థిక సర్వేలోనూ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రస్తావించింది. దీంతో అందుబాటులో ఉన్న అవకాశాలను ఆదాయ మార్గంగా మలుచుకునేందుకు మెడికల్ టూరిజంపై దృష్టి సారిస్తోం ది. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే విదేశీ రోగులకు అత్యాధునిక వైద్యం అందించేలా ఆలోచిస్తోంది. దీంతో ఆదాయం తో పాటు టూరిజంలో కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేది సర్కారు ఆలోచన. గల్ఫ్ దేశాల్లో వైద్యం చాలా ఖరీదుతో కూడుకున్న అంశం. దుబాయ్, సౌదీ అరేబియా లాంటి దేశాలతో పోలిస్తే రాష్ట్రంలో వైద్య ఖర్చులు చాలా తక్కువ. విదేశాల నుంచి ఎక్కువగా ఆప్తాల్మజీ, నెఫ్రాలజీ, కార్డియాక్ సమస్యలతో పాటు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఎక్కువ మంది నగరానికి వస్తున్నారు. ఈ సమాచారం ఆధారంగా కార్పొరేట్ ఆస్పత్రులతో దీటైన వైద్యాన్ని తక్కువ ధరకే ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగానే నిమ్స్లో జంట టవర్లను నిర్మించే ప్రతిపాదనలు తయారు చేసింది. విదేశీ రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు వీలుగా వీటిని అత్యాధునికంగా నిర్మిస్తారు. అంతర్జాతీయ స్థాయి వసతులతో పాటు రోగుల వెంట వచ్చే సహాయకులకు ఇందులో అన్ని సదుపాయాలు కల్పించాలని భావిస్తోంది. ఎర్రమంజిల్లో ఇప్పటికే నిమ్స్కు కేటాయించిన స్థలాన్ని ‘ఇంటర్నేషనల్ టవర్స్’ నిర్మాణానికి వినియోగించనున్నారు. నిర్మాణాలకు సంబంధించి రెండు మూడు డిజైన్లను వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే తయారు చేయించింది. ఈ ప్రతిపాదనలను ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలనకు పంపించింది. వీటితో పాటు నిమ్స్లో ఈ-లైబ్రరీ, మినీ ఆడిటోరియం, స్టేడియం, డాక్టర్లు నివాసముండేందుకు క్వార్టర్లు నిర్మించాలని విడివిడిగా ప్రతిపాదనలను రూపొందించింది. -
ఇంతకీ ఆరోజు ఏం జరిగింది..?
2001, సెప్టెంబర్ 11... తెల్లవారుతోంది. సగం అమెరికా మాత్రం ఇంకా నిద్రలోనే ఉంది. దేశ చరిత్రలోనే పీడకలగా మిగిలిపోనున్న రోజు ఒకటి వస్తుందని ఊహించని అమెరికన్లు ఒళ్లు విరుచుకుంటూ అప్పుడే నిద్రలేచారు. లేచీ లేవడంతోనే రిమోట్ పట్టుకుని టీవీల ముందు కూర్చున్నారు. బయట ఏం జరుగుతోందో మరుక్షణమే వారికి తెలిసొచ్చింది. అంతే.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తాము విదేశీయుల ముందు గొప్పగా చెప్పుకొనే ‘జంట సౌధాలు’ ఇక లేవని, తమది అత్యంత పటిష్టమైన రక్షణ విభాగమేమీ కాదని వారికి నెమ్మదిగా అర్థమైంది. ఇంతకీ ఆరోజు ఏం జరిగింది..? ప్రపంచం మొత్తాన్ని నివ్వెరపోయేలా చేసిన ఘటన 9/11 ఉగ్రదాడి. అమెరికాలోని ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’కు చెందిన 110 అంతస్తుల జంట భవంతులను ఉగ్రవాదులు నేలమట్టం చేసి, వేలాది ప్రాణాలను బలిగొన్న కర్కశ చర్య అది. తమ దేశానికి ఖ్యాతి తెచ్చిన భవంతులను, తమ విమానాలతోనే కూల్చడాన్ని అమెరికన్లు నేటికీ జీర్ణించుకోలేరు. అధికారిక లెక్కల ప్రకారం 3 వేల మందిని ఈ పైశాచిక చర్య బలిగొంది. అందుకే దీన్ని ప్రపంచ చరిత్రలోనే అత్యంత భయంకర ఉగ్రదాడిగా అభివర్ణిస్తారు. ఆరోజు.. సెప్టెంబర్ 11.. తెల్లవారు జామున పంతొమ్మిది మంది హైజాకర్లు బోస్టన్, నెవార్క్, వాషింగ్టన్ డీసీ నుంచి శాన్ఫ్రాన్సిస్కో, లాస్ఏంజిలీస్కు వెళ్తున్న నాలుగు వాణిజ్య విమానాల్లోకి ప్రవేశించారు. వీరంతా అల్ఖైదాకు చెందినవారు. కరడుగట్టిన ఈ ఉగ్రవాదులు విమానాలను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. వీటిలో ఒక విమానాన్ని ఉదయం 8.46 గంటల ప్రాంతంలో ప్రపంచ వాణిజ్య సంస్థకు చెందిన ఉత్తర భవనంలోకి (టవర్-1) ఢీకొట్టించారు. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు, ధూళి రేణువులు ఆ ప్రాంతాన్ని కమ్మేయసాగాయి. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే మరోదాడి జరిగింది. ఈసారి టార్గెట్ దక్షిణ భవనం (టవర్-2). ఉదయం 9.03 గంటలకు ‘యునెటైడ్ ఎయిర్లైన్స్ ఫై్లట్ 175’ను దక్షిణ భవంతిలోకి దూసుకుపోనిచ్చారు. అంతే.. చూస్తుండగానే పెద్ద ఎత్తున పొగ, మంటలు చెలరేగి.. గంట వ్యవధిలోనే జంట భవనాలు రెండూ నేలమట్టమయ్యాయి. మరిన్ని దాడులు.. హైజాకర్ల బృంద నియంత్రణలోని మరోరెండు విమానాలు సైతం భారీ విధ్వంసాల దిశగా పరుగులు తీశాయి. 9.37 గంటలప్పుడు అమెరికాకు అత్యంత కీలకమైన యుద్ధ తంత్ర ప్రధాన కార్యాలయం ‘పెంటగాన్’ మీదికి ‘అమెరికన్ ఎయిర్లైన్స్ ఫై్లట్ 77’ దూసుకెళ్లింది. ఈ దాడిలో దాదాపు 125 మంది అధికారులు, సాధారణ పౌరులు మరణించారు. నాలుగో విమానమైన ‘యునెటైడ్ ఎయిర్లైన్స్ ఫై్లట్ 93’ అతి క్లిష్టమైన ఉగ్ర బాధ్యతను నెత్తికెత్తుకుంది. అమెరికా అధ్యక్ష భవనం ‘వైట్హౌస్’ లేదా ‘కేపిటల్’ (అమెరికా సంయుక్త రాష్ట్రాల కాంగ్రెస్ భవనం)లో ఒకదాన్ని పేల్చివేయడమే దీని అంతిమ లక్ష్యం. అయితే, ఈ విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది హైజాకర్లపై ఎదురుతిరగడంతో 10.03 గంటల ప్రాంతంలో షాంక్స్విల్లే, పెన్సిల్వేనియా సమీపంలో కుప్పకూలింది. దీంతో అమెరికా మనుగడకు అతిపెద్ద ముప్పు తప్పినట్టైంది. మరణాలు.. ఈ వరుస దాడుల్లో మొత్తం 2,996 మంది అక్కడికక్కడే మరణించారు. వీరిలో 2,977 మంది బాధితులు, 19 మంది హైజాకర్లు ఉన్నారు. నాలుగు విమానాల్లోని 246 మంది ప్రయాణికులూ మరణించారు. ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. ఈ దాడిలో ఒక్క అమెరికన్లే కాక, 90కి పైగా దేశాలు తమ తమ పౌరుల్ని కోల్పోయాయి. ఈ దాడుల్లో రేగిన దుమ్ముధూళిని పీల్చడం వల్ల ఎందరో అస్వస్థతకు గురయ్యారు. నష్టం.. ప్రపంచ వాణిజ్య సంస్థకు చెందిన జంట భవనాలతో పాటు ఇతర భవనాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాటిలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ 7,6,5,4 భవనాలతో పాటు మారియట్ ప్రపంచ వాణిజ్య సంస్థ-3 కూడా ఉంది. ఇక్కడి చాలా వరకూ భవనాలు విషవాయువుల కారణంగా నేటికీ నిరుపయోగంగానే ఉన్నాయి. వీటిని తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చే చర్యలు చేపడుతున్నారు. కారకులు.. దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే అమెరికా విచారణ సంస్థ ‘ఎఫ్బీఐ’ కుట్రదారుల పేర్లు వెల్లడించింది. ఈజిప్ట్కు చెందిన మహ్మద్ అట్టా 19 మంది హైజాకర్లు, ఒక పైలట్కు నాయకత్వం వహించాడు. ఈ దాడిలో అట్టా హతమయ్యారు. అయితే, అతని సామాను మాత్రం వేరే విమానంలో లభ్యమవడంతో కుట్ర బయటపడింది. 19 మంది హైజాకర్లు, వారి నేపథ్యాలు, లక్ష్యాలకు సంబంధించిన సమాచారం ఈ పత్రాల్లో ఉంది. వీరిలో 15 మంది సౌదీ అరేబియాకు చెందిన వారు కాగా, ఇద్దరు యూఏఈ, ఈజిప్టు, లెబనాన్ దేశాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. అల్ఖైదా.. ఉగ్రసంస్థ అల్ఖైదా ఈ దాడుల వెనక ప్రధాన పాత్ర పోషించింది. సెప్టెంబర్ 11 దాడుల ప్రధాన సూత్రధారి ఖలీద్ షేక్ మహ్మద్. ఈ వ్యూహాన్ని 1996లో అతడు అల్ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్కు వివరించాడు. అయితే, కొన్ని కారణాల రీత్యా 1999లో అతనికి లాడెన్ నుంచి అనుమతి లభించింది. అప్పటి నుంచి వరుస సమావేశాలు జరిగాయి. హైజాకర్లను ఏర్పాటు చేయడం, శిక్షణ లాంటి పనులను మహ్మద్ చూసుకున్నాడు. ఆశ్చర్యకర విషయమేంటంటే.. అమెరికా నిఘా విభాగం 1998 డిసెంబర్లోనే విమానాల దారి మళ్లింపు, అమెరికాపై దాడులు లక్ష్యంగా అల్ఖైదా పనిచేస్తున్నట్టు గుర్తించింది. ఇదే విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు బిల్ క్లింటన్కు కూడా వివరించడం కొసమెరుపు. -
అన్వేషణం: కొండ మీద విందు చేస్తారా?
స్వచ్ఛమైన గాలిని తృప్తిగా పీల్చుకోవాలని, పచ్చని చెట్ల నీడల్లో సేద దీరాలని, సెలయేటి అలల సవ్వడి వింటూ సరదాగా గడపాలని అందరికీ ఉంటుంది. అయితే ప్రకృతి ఒడిలో కూర్చుని పసందైన విందును ఆరగించాలన్న ఆలోచన ఎవరికైనా ఎప్పుడైనా వచ్చిందా? వచ్చినా కాంక్రీట్ జంగిల్స్లో నివసించే మనకు ఆ అవకాశం దొరికే చాన్స్ లేదు కదా! కానీ చైనా వెళ్తే ఆ కోరిక కచ్చితంగా తీరుతుంది. చైనాలోని హుబే ప్రావిన్స్లో ఇచాంగ్ అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతాన్ని ఆనుకుని జైలింగ్ గార్గ్ అనే పెద్ద లోయ ఉంది. పెద్ద పెద్ద చెట్లు, సెలయేళ్లు, రంగురంగుల పూలమొక్కలతో ఈ లోయ ప్రాకృతిక సౌందర్యానికి నిలయంలా ఉంటుంది. ఈ లోయ పక్కనే ఉన్న పెద్ద కొండ మీద ఉంది... ఫాంగ్వెంగ్ రెస్టారెంట్. ఇచాంగ్ శివార్లలో చాలా గుహలు ఉంటాయి. అక్కడ ట్రెక్కింగ్, బంగీ జంప్ లాంటివి చేయడానికి చాలామంది వస్తుంటారు. వారందరి కోసం నెలకొల్పిందే ఈ రెస్టారెంటు. కొండ చరియ మీద నిర్మించిన ఈ రెస్టారెంటులో అడుగు పెడుతుంటే కాళ్లు వణుకుతాయి. ఎందుకంటే... గాలిలో వేళ్లాడుతున్నట్టు ఉంటుంది మరి. అయితే కాస్త ధైర్యం చేసి వెళితే ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి దక్కుతుంది. రుచికరమైన సీఫుడ్ స్పెషల్స్ని ఆరగిస్తూ... చుట్టూ ఉన్న అందాలను పరికిస్తూ గడిపే కాలం... మీ జీవితంలోనే గొప్ప జ్ఞాపకమై మిగిలిపోతుంది! అరేబియా తీరంలో అద్భుత విలాసం! అత్యాధునిక సౌకర్యాలతో అత్యంత అందంగా తీర్చిదిద్డిన ఇంట్లో కూర్చొని... అరేబియా సముద్రపు అందాలను ప్రత్యక్ష్యంగా చూస్తూ ఉదయాలను, సాయంత్రాలను ఆస్వాదించాలంటే ముంబైలోని ఇంపీరియల్ టవర్స్లో నివసించాలి. ఈ మానవ నిర్మిత అద్భుతాల ఇంటీరియర్, ఎక్స్టీరియర్ డెకరేషన్ల గురించి పరిశీలించినా, ఇక్కడ నివసించే వారికి అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి గమనించినా అందులో నివసించే వారి పట్ల కాస్తాయినా అసూయపుడుతుంది. ముంబై మణిహారంలో మెరిసేటి జంట వజ్రాలు ఇంపీరియల్ టవర్స్. ముంబైలోని తార్దేవ్ ప్రాంతంలో ఒకప్పుడు స్లమ్ ఉండేది. అక్కడి ప్రజలకు ఉచితంగా మరోచోట స్థలం ఇచ్చి పంపించి, ఆ తర్వాత ఇక్కడ ఈ బిల్డింగ్లను నిర్మించారు. 254 మీటర్లు (833 అడుగులు) ఎత్తున్న ఈ టవర్స్లో 17 హైస్పీడ్ ఎలివేటర్లున్నాయి. విద్యుత్, సహజవనరులను సద్వినియోగం చేసుకొనేలా, పునర్వినియోగం చేసుకొనేలా దీని నిర్మాణం సాగింది. గ్రేవాటర్ సిస్టమ్ ద్వారా ఈ భవంతి పరిసరాల్లో కురిసిన వర్షపు నీటిని కూడా వినియోగించుకునే విధానాన్ని అమల్లో పెట్టారు. ఈ భవంతిలోకి ప్రవేశించే గాలి కూడా శుద్ధి చేసినదే! ఈ అద్భుత నిర్మాణ ఘనత హఫీజ్ కాంట్రాక్టర్ అనే ఆర్కిటెక్టుకు చెందుతుంది. ఇందులో 3, 4, 5 బెడ్రూమ్ డూప్లెక్స్ హౌస్లు కూడా ఉన్నాయి. భారత వాణిజ్య రాజధానిలో అత్యంత విలాసవంతమైన భవనాలుగా దేశంలోనే అతి పొడవైన భవనాలుగా గుర్తింపు పొందాయి ఈ ట్విన్ టవర్స్. ముంబైలోని మహా ధనవంతుల అడ్రస్ ఇది. అందుకే సెక్యూరిటీ, లివింగ్ స్టాండర్డ్స్ విషయంలో ఇంపీరియల్ టవర్స్కు ప్రత్యేక ప్రమాణాలున్నాయి. ఎవరైనా వాటికి లోబడి నడుచుకోవాల్సిందే. ఈ టవర్స్ రికార్డును చెరిపేసే విధంగా... ఈ ట్విన్ టవర్స్కు పక్కనే నిర్మిస్తున్న ఇంపీరియల్ టవర్-3 2017 నాటికి పూర్తవుతుంది. అప్పుడదే దేశంలోని అత్యంత ఎత్తయిన భవంతిగా నిలిచే అవకాశం ఉంది.