vemulavada
-
వేములవాడలో బీజేపీ, వీహెచ్పీ ఆధ్వర్యంలో ధర్నా
-
పింక్ చొక్కాలు కాజేసిన భూములను పేదలకు పంచుతాం: మంత్రి పొంగులేటి
సాక్షి,కరీంనగర్జిల్లా: ధరణి చట్టంతో పేదల భూములను పింక్ చొక్కాల వారు కాజేశారని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. బుధవారం(నవంబర్ 20)వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా విజయోత్సవ సభలో పొంగులేటి పాల్గొని మాట్లాడారు.‘నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేశాం.రాబోయే నాలుగు ఏళ్ళలో 20 లక్షల ఇళ్ళు నిర్మించి ఇస్తాం.ఇందిరమ్మ ఇళ్ళు నిరంతర ప్రక్రియ..ప్రతి పేదవాడికి పక్కా ఇళ్ళు ఉండాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.దేశానికే రోల్ మోడల్గా తెలంగాణ రెవెన్యూ చట్టం 2024 రాబోతోంది.ధరణి చట్టంతో పేదల భూములను పింక్ చొక్కాల వారు కాజేశారు.ఆ భూములను ప్రజా ప్రభుత్వం తీసుకుని పేదలకు పంచి పెడుతాం’అని పొంగులేటి తెలిపారు. -
Shivaratri: వేములవాడలో శివరాత్రి శోభ (ఫొటోలు)
-
'ఈ లొల్లి మనకొద్దు బిడ్డో..' జర ఆలోచించు!
సాక్షి, రాజన్న సిరిసిల్ల/వేములవాడ: 'అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గర పడుతోంది. గ్రామాల్లో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల నాయకులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. రెండు వేర్వేరు పార్టీల నాయకులు ఎదురుపడితే దాదాపు గొడవకు దిగే పరిస్థితులు ఉంటున్నాయి. పల్లెల్లో వీటన్నింటిని గమనిస్తున్న ఓ తల్లి తన ఆవేదనను కొడుకుతో ఇలా పంచుకుంటుంది.' తల్లి : ఏరా బిడ్డ పొద్దున్నే తయారయ్యావు ఎక్కడికి పోతున్నావు? కొడుకు : ఇంకెక్కడికి అమ్మా ఎన్నికల ప్రచారానికి. ఈసారి అన్న గెలవాలి. తల్లి : మనకెందుకు రాజకీయాలు బిడ్డా. కష్టం చేస్తే కానీ ఇల్లు గడువదు. కొడుకు : అన్న గెలిస్తే మన కష్టాలన్నీ తీరుతాయమ్మా. తల్లి : చేండ్ల పత్తికి నీళ్లు పెట్టాలని, కల్లంలో వడ్లు ఉన్నాయని.. అయ్యా రోజు లొల్లి పెడుతుండ్రా. కొడుకు : పని ఎప్పుడూ ఉండేదేనే అవ్వ. ఓట్లు ఐదోళ్లకోసారి వస్తాయి. మనను నమ్ముకున్నోళ్ల కోసం మనం పనిచేయకపోతే అన్న ఎట్లా గెలుస్తాడే. తల్లి : యాబై ఏళ్లుగా చూస్తున్నాం. మన బతుకుల కన్న వారి బాగోగులే చూసుకుంటున్నారు. నీకు ఇంట్లో చెల్లె ఉంది. బాగా చదివించి పెళ్లి చేయాలే. ఒక్కగానొక్క కొడుకువి. నీకేమైన అయితే మా బతుకులు ఏమి కావాలి బిడ్డా. కొడుకు : ఏ.. ఎందుకు భయపడుతావు అవ్వా. తల్లి : బాగా ఆలోచించు కొడుకా.. మనవి చిన్న బతుకులు. ఆవేశంలో పోయి గొడవల్లో తలదూర్చితే మనకే నష్టం. నీవు గొడవలు పెట్టుకునేది కూడా ఎవరితోనే కాదు మన ఊరోళ్లతోనే. వారం రోజుల్లో ఎన్నికలు అయిపోతాయి. ఆ తర్వాత మనం చచ్చే వరకు ఊళ్లోనే ఉండాలే బిడ్డా..! మనకు ఏమైనా అవసరం ఉన్న ఈల్లే ముందుండాలే కదరా.. ఈ లొల్లి మనకెందుకు బిడ్డా. కొడుకు : అమ్మా.. నువ్వు చేప్పేది నిజమే. నేను ఎందుకు గొడవకు పోతానే. ఊళ్లో ఎవరూ కనిసించిన అత్తా.. మామ.. బాబాయ్.. పిన్ని.. అన్న.. అని పలకరిస్తా. వాళ్లతో నాకెందుకు గొడవ. తల్లి : నువ్వు చిన్నపిల్లగాడివి బిడ్డా. ఎవరు మంచోళ్లో.. ఎవరు చెడ్డోళ్లో.. గుర్తించి ఓట్లేద్దాం. డబ్బుకు, మద్యానికి లొంగకు, ఒక్కరోజు బిర్యానీ పెడితే ఐదేళ్లు కడుపు నిండదు. ఐదేళ్లపాటు మనకు కష్టాలు రాకుండా చూసుకుంటూ, మన కష్టసుఖాల్లో పాలుపంచుకునే నాయకున్ని గెలిపించుకుందాం బిడ్డా. కొడుకు : అలాగే అమ్మా.. ఈ గొడవలు నాకొద్దు. మంచి చేసే వారికే ఓటేస్తాను. ఏ పార్టీ నాకొద్దు. ఇవ్వాల్లి నుంచి ఏ పార్టీ వాళ్లతోని తిరుగను. చేండ్లకు పోతున్న. నువ్వు చెప్పిట్లే మంచి నాయకునికే ఓటేద్దాం. ఇవి చదవండి: అన్నీ పార్టీలకు ప్రధాన అస్త్రం ఇదే.. -
వేములవాడ బీజేపీ అభ్యర్థిగా చెన్నమనేని వికాస్ రావు
-
వేములవాడ బీజేపీ అభ్యర్థిగా చెన్నమనేని వికాస్ రావు
-
గెలిపిస్తేనే వస్తా.. లేకుంటే మళ్లీ ఇక్కడికి రాను: కేటీఆర్
సాక్షి, వేములవాడ: ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తేనే మళ్లీ వేములవాడ వస్తానని, లేదంటే ఇక్కడికి రానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని చెప్పారు. సోమవారం వేములవాడలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీనరసింహారావు తరపున కేటీఆర్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘కేసీఆర్ ఎంత ఉంటడు గింతంత ఉంటడు, ఆయనను కొట్టడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. సింహం సింగిల్గానే వస్తుంది. పందులే గుంపులుగా వస్తాయి. గిట్ల అన్నందుకు కేసు పెడితే బోయినపల్లి వినోద్ కుమార్పై పెట్టండి. ఇప్పుడు జరుగుతున్న పోరాటం వ్యక్తుల మధ్య కాదు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే. కర్ణాటక డిప్యూ టీ సీఎం డీకే శివకుమార్ మన నెత్తిన పాలుపోసి పోయిండు. అక్కడ 5 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పినందుకు ఇక్కడి కాంగ్రెస్సోళ్లు అతన్ని మళ్లీ ప్రచారానికి పిలవట్లేదు. రాహుల్ గాంధీ ఛాలెంజ్ను స్వీకరిస్తున్నా. అవును ఈ ఎన్నికలు ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమే. డిసెంబర్3న చూద్దాం ఎవరు గెలుస్తరో. ఢిల్లీ, గుజరాత్ నుంచి వచ్చిన వాళ్లతో ఏమీ కాదు. తెలంగాణ భవిష్యత్ ఇక్కడి గల్లీలోనే డిసైడ్ కావాలె. కేసీఆర్ అంటే తెలంగాణ భరోసా. సెంటిమెంట్లకు ఆయింట్ మెంట్లకు లొంగవద్దు. రేవంత్ రెడ్డి గతంలో సోనియా గాంధీని బలిదేవత అన్నాడు’ అని కేటీఆర్ గుర్తు చేశారు. -
వేములవాడలో బీజీపీ నేతల మధ్య టికెట్ ఫైట్
సిరిసిల్ల జిల్లా: తెలంగాణాలో అతి త్వరలో ఎన్నికలు జరిగే అవకాశమున్న నేపథ్యంలో అన్ని పార్టీలు గేరు మార్చి స్పీడును పెంచేశాయి. ఇదిలా ఉండగా వేములవాడలో బీజేపీ టికెట్ కోసం ఇద్దరు అభ్యర్థుల మధ్య టికెట్ కోసం కోల్డ్ వార్ జరుగుతోంది. మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ వికాస్ మధ్య టికెట్ వార్ తారాస్థాయికి చేరుకుంది. వివాదాస్పద పోస్టర్లు.. ఇప్పటికే బీజేపీ కార్యాలయంలో టికెట్య్ కోసం దరఖాస్తు చేసుకున్న తుల ఉమ వేములవాడలో పాగా వేసే క్రమంలో 'సాలు దొర - సెలవు దొర' అంటూ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వేములవాడ అభివృద్ధికి తనతో కలిసి రావాలని పోస్టర్స్ ద్వారా అభ్యర్ధించారు. బీజేపీ ఆశావహ అభ్యర్థిగా టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తున్న తుల ఉమ ప్రచార కార్యక్రమానికి పోస్టర్లతో శ్రీకారం చుట్టారు. సాలు దొర - సెలవు దొర పోస్టర్ల పేరిట తుల ఉమ ఓవైపు కేసీఆర్ పాలనను లక్ష్యం చేసుకుని మరోవైపు వేములవాడలో చెన్నమనేని వంశీయుల పాలనపైన కూడా విమర్శనాస్త్రాలను సంధించారు. దీంతో వేములవాడలో బీజేపీ రెండు గ్రూపులుగా చీలిపోయినట్లయింది. ఇద్దరిలో ఎవరికి టికెట్ కేటాయించాలో అర్ధంకాక బీజేపీ అధిష్టానం తలపట్టుకుంటోంది. టికెట్ వార్.. వేములవాడలో బీజేపీ టికెట్ బీసీలకే కేటాయిస్తారని ఆ ప్రకారం చూస్తే తమకే టికెట్ దక్కుతుందని తుల ఉమ ధీమాగా ఉన్నారు. ఇప్పటికే అక్కడ ఎర్రం మహేష్ తోపాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ కూడా టికెట్ ఆశిస్తున్నారు. తాజాగా చెన్నమనేని వికాస్ ఎంట్రీతో వేములవాడ బీజేపీలో రసాభాస మొదలైంది. ఇది కూడా చదవండి: విద్యార్థినుల మృతితో రెండు గ్రామాల్లో విషాదం -
TS Election 2023: ‘ఆది’ నుంచి అదే పోరు!
రాజన్న: వేములవాడ ఎమ్మెల్యే రమేశ్బాబును ‘ఆది’ నుంచి పౌరసత్వం సమస్య వెంటాడుతూనే ఉంది. కోర్టుల్లో పోరాడుతూనే 2009 నుంచి ఇప్పటి వరకు నాలుగుసార్లు వేములవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్లు కేటాయించే అంశంపై పార్టీ అధినేత, సీఎం కేసీఆరసైతం మొట్టమొదటగా రమేశ్బాబు పౌరసత్వం అంశాన్ని మాట్లాడుతూ టికెట్టు ఇవ్వలేకపోతున్నామని తెలిపారు. పౌరసత్వం కేసు కోర్టులో ఉన్నందునే వేములవాడలో అభ్యర్థిని మార్చాల్సి వస్తోందని ప్రకటించారు. బీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్న చల్మెడ లక్ష్మీనరసింహారావు నియోజకవర్గంలో చురుకుగా పర్యటిస్తుండగా.. రమేశ్బాబు అనుచరులు మాత్రం ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నారు. వేములవాడ ఎమ్మెల్యే రమేశ్బాబు పౌరసత్వాన్ని సవాల్ చేస్తూ రాజకీయ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ 2009 జూన్లో కేంద్ర హోంశాఖలో ఫిర్యాదు చేశారు. ఏడాది కాలంపాటు దేశంలో లేడని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన కేంద్ర హోంశాఖ అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్పీని విచారణకు ఆదేశించింది. రమేశ్బాబు 96 రోజులు మాత్రమే భారతదేశంలో ఉన్నట్లు నివేదికను సమర్పించారు. 2010 ఉపఎన్నికల తర్వాత రమేశ్బాబు ఎన్నికను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆది శ్రీనివాస్ ఆశ్రయించారు. దీంతో 2013 ఆగస్టు 14న రమేశ్బాబు పౌరసత్వం రద్దు చేయడమే కాకుండా ఓటర్ జాబితాలో పేరు తొలగించాలని తీర్పినిచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్చేస్తూ రమేశ్బాబు 2013లో సుప్రీంకోర్టుకు అప్పీల్కు వెళ్లగా.. కోర్టు స్టే ఇచ్చింది. రమేశ్బాబుకు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని ఆది శ్రీనివాస్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ వాదనలు కొనసాగుతున్న క్రమంలో ఈ అంశాన్ని కేంద్ర హోంశాఖ తేల్చాలని రమేశ్బాబు తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దీంతో ఈ అంశం కేంద్ర హోంశాఖకు వెళ్లింది. రమేశ్బాబు విజ్ఞప్తితో కేంద్రహోంశాఖ త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేసింది. త్రీమెన్ కమిటీ సైతం రమేశ్బాబు మోసపూరితంగా పౌరసత్వం పొందారని తేల్చి చెబుతూ.. ఆగస్టు 31, 2017న పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ అంశాన్ని రివ్యూ చేయాలని మరోసారి కేంద్రహోంశాఖకు రమేశ్బాబు విజ్ఞప్తి చేయగా.. జర్మనీ పౌరసత్వం ఉందంటూ డిసెంబర్ 17, 2017న భారతదేశ పౌరసత్వం రద్దు చేసింది. దీనిపై రమేశ్బాబు జనవరి 5, 2018న హైకోర్టును ఆశ్రయించగా.. స్టే లభించింది. స్టేను ఎత్తివేయాలని కోరుతూ ఆది శ్రీనివాస్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈక్రమంలో హైకోర్టు జూలై 10, 2019న రమేశ్బాబు పౌరసత్వాన్ని కేంద్రహోంశాఖ మూడు నెలల్లో తేల్చాలని ఆదేశించింది. కేంద్రహోంశాఖ రమేశ్బాబు పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి కేసు కొనసాగుతోంది. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరో రెండు, మూడు నెలల్లో తీర్పు వస్తుందన్న అంచనాతో బీఆర్ఎస్ పార్టీ అధినేత టికెట్ చల్మెడ లక్ష్మీనరసింహారావుకు కేటాయించినట్లు ప్రకటించారు. నాలుగుసార్లు గెలుపు.. రమేశ్బాబు 2009 ఎన్నికల్లో టీడీపీ టికెట్పై వేములవాడ ఎమ్మెల్యేగా గెలిచారు. 2010 ఉపఎన్నికల సందర్బంగా టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరి ఆపార్టీ టికెట్పై గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ టికెట్పై గెలిచారు. భావోద్వేగ ప్రకటన.. టిక్కెట్టు రాలేదని తెలిసిన తర్వాత ఎమ్మెల్యే రమేశ్బాబు భావోద్వేగ ప్రకటన చేశారు. ‘సవాళ్లు వచ్చినప్పుడే ధీటుగా నిలబడాలి. ఎన్నికల కోసం అభ్యర్ధులు వెనువెంటనే పుట్టరు. ప్రజాసేవ ద్వారా ఈ అర్హతలు సంపాదించుకోవాలి. పౌరసత్వంపై అక్టోబర్లో మనకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ సమస్య తీరితే మనకు ఆటంకాలు ఉండవు. ఉత్తమంగా పనిచేశానన్న సీఎం గారి వ్యాఖ్యలే మన దశాబ్దకాలం నిస్వార్థ ప్రజాసేవకు నిదర్శనం.’ అంటూ భావోద్వేగంతో కూడిన పోస్టు చేశారు. -
వేములవాడలో భక్తుల రద్దీ
-
వేములవాడలో శివరాత్రి ఏర్పాట్లలో ప్రభుత్వం విఫలం: బండి సంజయ్
-
వేములవాడ: సాంఘిక డిగ్రీ కాలేజీ ఘటనపై కలెక్టర్ ఆగ్రహం
-
ప్రజా గోస బీజేపీ భరోసా.. ప్రజల మద్దతు కోరుతూ మిస్డ్కాల్ ఉద్యమం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఆధ్వర్యంలో ‘ప్రజా గోస బీజేపీ భరోసా’ పేరిట నిర్వహిస్తున్న బైక్ ర్యాలీని గురువారం సిద్దిపేటలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభిస్తారు. అనంతరం వేములవాడలో నిర్వహించే బైక్ర్యాలీ లోనూ సంజయ్ పాల్గొంటారు. తొలివిడతలో రాష్ట్రంలోని 6 ఎంపీ స్థానాల్లోని, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ర్యాలీలను సమాంతరంగా మొదలుపెడతారు. ఈ ర్యాలీలకు తాండూరులో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, సిద్దిపేటలో పార్టీ మధ్యప్రదేశ్ ఇంచార్జి మురళీధర్రావు, జుక్కల్లో జాతీయ కార్యవర్గ సభ్యుడు డా.వివేక్ వెంకటస్వామి, బోధన్లో బీజేఎల్పీ నేత టి.రాజాసింగ్, నర్సంపేటలో పార్టీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్రావు, వేములవాడలో మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ నేతృత్వం వహిస్తారని పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, బైక్ ర్యాలీ ఇంచార్జి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి బుధవారం మీడియాకు వెల్లడించారు. టీఆర్ఎస్ సర్కార్ అప్రజాస్వామిక, నియంత, కుటుంబపాలనపై బీజేపీ చేస్తున్న పోరాటానికి ప్రజా మద్దతు కోరుతూ 6359199199 మొబైల్ నంబర్ ఏర్పాటు చేశామన్నారు. బీజేపీకి మద్దతు ఇవ్వాలనుకున్న వారు ఈ నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరారు. ఫసల్ బీమా, డబుల్ బెడ్రూమ్లు, నిరుద్యోగం, ఇతర అంశాలపై ఇబ్బందులను తెలుసుకుని ప్రజలకు భరోసా కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. త్వరలో మరో 7 నియోజకవర్గాల్లో... త్వరలోనే మరో 7 నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు ప్రారంభమవుతాయని ప్రేమేందర్రెడ్డి చెప్పారు. దేవరకద్రలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, ఆదిలాబాద్లో ఎంపీ ధర్మపురి అర్వింద్, వైరాలో ఎంపీ సోయం బాపూరావు, మేడ్చల్లో జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్రెడ్డి, దేవరకొండలో జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్రావు, ఇబ్రహీంపట్నంలో కొండా విశ్వేశ్వర్రెడ్డి, కల్వకుర్తిలో బాబూమోహన్ పాల్గొనను న్నారు. ‘100 టీఎంసీలు ఎత్తిపోయనోడివి లక్ష కోట్లకు పైగా డబ్బులు పెట్టి కాళేశ్వరం ఎందుకు కట్టినట్టు? వరద లతో 1,200 టీఎంసీలు వృథాగా సముద్రంలో కలిశాయి’ అని ఆయన సీఎం కేసీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. -
ఊరు మునిగింది.. ఉపాధి పోయింది!
ఈ చిత్రంలో ఆటోలో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న మహిళలు వేములవాడ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన వారు. రుద్రవరం మధ్యమానేరు నిర్వాసిత గ్రామం. ఈ ఊరిలో ఉపాధిహామీ పనులు చూపకపోవడంతో వీరంత ఇతర గ్రామాలకు పనులకు వెళ్తున్నారు. మగవాళ్లయితే సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో అడ్డకూలీలుగా మారారు. ఉన్న ఊరిలోనే ఉపాధిహామీ పని చూపెట్టాలని నిర్వాసితులు వేడుకుంటున్నారు. సాక్షి,వేములవాడఅర్బన్: మధ్యమానేరు ప్రాజెక్టులో ముంపునకు గురైన గ్రామస్తులకు ఉపాధిహామీ పని కరువైంది. గతంలో వంద రోజుల పనులు పూర్తి చేసిన వారు సైతం మధ్యమానేరు నిర్వాసిత గ్రామాలలో ఉన్నారు. అయితే వారంతా ఇప్పుడు ఇతర గ్రామాల్లో పనుల కోసం ఆటోలలో వెళ్తున్నారు. మగవారైతే సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో అడ్డాకూలీలుగా మారిపోయారు. మరికొందరు వాచ్మెన్స్, సెక్యూరిటీగార్డులుగా పనులు చూసుకుంటున్నారు. పని కరువైన నిర్వాసిత కాలనీలు మిడ్మానేరు ముంపునకు గురైన సంకెపల్లి, ఆరెపల్లి, రుద్రవరం, అనుపురం, కొడుముంజ, శాభాష్పల్లి, చింతాల్ఠాణా, చీర్లవంచ, గుర్రవానిపల్లి ఆర్అండ్ఆర్ కాలనీలుగా ఏర్పాటు చేశారు. ఆయా కాలనీవాసులకు ఉపాధిహామీ పనులు పెట్టడం లేదు. ఒకప్పుడు ఐదు, ఆరు ఎకరాలలో పంటలు పండిస్తూ ధర్జాగా బతికిన వీరంతా ఇప్పుడు కుటుంబ పోషణకు ఇతర గ్రామాలకు కూలీలుగా పనులకు వెళ్తున్నారు. పని కల్పించాలని వేడుకోలు ►మిడ్మానేరు ముంపు గ్రామాల్లోని ఉపాధిహా మీ కూలీలకు జిల్లా అధికారులు స్పందించి పనులు చూపెట్టాలని కోరుతున్నారు. ►బ్యాక్ వాటర్ పక్కన చెరువులు, కుంటలు ఏర్పాటు చేస్తే పని దొరుకుతుందని వారు పేర్కొంటున్నారు. ►జిల్లా అధికారులు స్పందించాలని నిర్వాసిత గ్రామాల్లోని ఉపాధిహామీ జాబ్కార్డులు ఉన్న వారు కోరుతున్నారు. గతంలో పనిచేసినం మేము పాత గ్రామం ఉన్నప్పుడు రోజు ఉపాధి హామీ పనికి పోయినం. పునరావాస కాలనీకి వచ్చినప్పటి నుంచి ఉపాధిహామీ పనులు లేవు. ప్రభుత్వం మాకు ఉపాధి కల్పించాలి. – అంగూరి స్వప్న, రుద్రవరం పని చూపెట్టాలి పునరావాస కాలనీకి వచ్చినప్పటి నుంచి పనులు లేక కుటుంబపోషణ ఇబ్బందిగా మారింది. ఉపాధిహామీ పనులు లేవు, కూలి పని లేక ఇంటి వద్దనే ఉంటున్నాం. అధికారులు స్పందించి పని చూపెట్టాలి. – పాముల కనకవ్వ, రుద్రవరం పనులకు వస్తలేరు పునరావాసకాలనీల్లోని కూలీలు ఉపాధిహామీ పనులకు ఇతర గ్రామాలకు రమ్మంటే వస్తలేరు. మారుపాక, చంద్రగిరి గ్రామాలకు ఉపాధి పనులకు తీసుకెళ్తామంటే వస్తలేరు. ఇప్పటికైనా వాళ్లు వస్తే ఉపాధిహామీ పనులు కల్పిస్తాం. – నరేశ్ ఆనంద్, ఎంపీడీవో, వేములవాడ చదవండి: Hyderabad: యువతిపై ప్రేమ.. అప్పటికే పెళ్లి నిశ్చయమైందని తెలిసి.. -
గత జ్ఞాపకాలతో బరువెక్కుతున్న గుండెలు
బోయినపల్లి (చొప్పదండి): కూలిన గోడలు.. శిథిల రోడ్లు.. మోడువారిన చెట్లు.. పాడుబడిన గుడిని చూసి వారి గుండెలు బరువెక్కుతున్నాయి. తాము పుట్టి, పెరిగిన గ్రామాలు జ్ఞాపకాలుగా మిగలడాన్ని చూసి కళ్లు చెమర్చుతున్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మధ్యమానేరులో ముంపునకు గురైన గ్రామాలు ఇప్పుడు తేలడంతో వాటిని చూసిన నిర్వాసితులు ఉద్వేగానికి గురవుతున్నారు. ‘ఇది మా ఇల్లు.. ఇది మా బడి.. అరే అదిగదిగో అంజన్న గుడి’అంటూ పాత జ్ఞాపకాలను జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. మొండి గోడలు, మోడువారిన చెట్లను చూసి చలించిపోతున్నారు. ఈ దృశ్యాలు మధ్యమానేరు ప్రాజెక్టులో ముంపు నకు గురైన గ్రామాల్లో కనిపిస్తున్నాయి. మిడ్మానేరులో నీటిమట్టం తగ్గడంతో మునిగిన గ్రామాలు తేలాయి. వాటిని చూసేందుకు నిర్వాసితులు నిత్యం వెళ్లి వస్తున్నారు. రోజంతా అక్కడే గడిపి బరువెక్కిన హృదయాలతో తిరిగి వస్తున్నారు. 2019లో మునిగిన గ్రామాలు రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడలో 27.55 టీఎంసీల సామర్థ్యంతో మిడ్మానేరు ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్టుతో బోయినపల్లి, వేములవాడ, తంగళ్లపల్లి మండలాలకు చెందిన 11 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రాజెక్టులో 2018 నుంచి నీరు చేరడంతో ముంపు గ్రామాల ప్రజలు పునరావాస కాలనీలకు తరలిపోయారు. 2019లో 25 టీఎంసీల నీరు చేరడంతో బ్యాక్వాటర్లో ముంపు గ్రామాలు మొత్తం మునిగిపోయాయి. రెండేళ్లుగా ప్రాజెక్టులో నీరు నిండుగా ఉండటంతో ఆ గ్రామాల ఆనవాళ్లు కూడా కనిపించలేదు. నెల రోజులుగా 8 టీఎంసీల నీరు మాత్రమే ఉండటంతో ముంపునకు గురైన ఇళ్ల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పది కి.మీ. తగ్గిన బ్యాక్వాటర్ మిడ్మానేరు ప్రాజెక్టులో 26 టీఎంసీల నీరు చేరితే తంగళ్లపల్లి బ్రిడ్జి, సిరిసిల్ల బతుకమ్మ ఘాట్, సాయినగర్ వరకు 18 కి.మీ. మేర బ్యాక్వాటర్ చేరుతుంది. ఇటీవల ప్రాజెక్టు నుంచి మల్లన్నసాగర్, ఎల్ఎండీలకు నీరు విడుదల చేయడంతో ఇప్పుడు 8.33 టీఎంసీల జలాలున్నాయి. దీంతో బ్యాక్వాటర్ పది కిలోమీటర్లలోపే ఉంది. మిడ్మానేరు ప్రాజెక్టు స్వరూపం నీటి సామర్థ్యం 27.55 టీఎంసీలు ప్రస్తుత నిల్వ 8.33 టీఎంసీలు బ్యాక్ వాటర్ 18 కి.మీ. ప్రస్తుత బ్యాక్వాటర్ 10 కి.మీ. ముంపు గ్రామాలు 11 ప్రాజెక్టులో సేకరించిన భూమి 20వేల ఎకరాలు ముంపునకు గురైన ఇళ్లు సుమారు 8,500 నిర్వాసిత కుటుంబాలు 11,731 గుండెలు బరువెక్కుతున్నాయి ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గ డంతో నీలోజిపల్లి పాత గ్రామం ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పుట్టి పెరిగిన ఊరును చూసేందుకు వెళ్తే పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. కూలిన గోడలు.. దర్వాజలు కనిపించడంతో గుండెలు బరువెక్కుతున్నాయి. – సింగిరెడ్డి బాలమల్లు, నీలోజిపల్లి, బోయినపల్లి తెలియని అనుభూతి ముంపులో మునిగిన ఊరు మళ్లీ కనిపిస్తుందంటే చూసేందుకు వెళ్తున్నారు. మళ్లీ ఆ ఆనవాళ్లు కనిపిస్తాయో.. లేదోనని చాలామంది పాత ఊళ్లు చూసేందుకు వెళ్తున్నారు. పాత గ్రామాలను చూస్తే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. అదోరకమైన సంతోషం.. బాధ రెండూ కలుగుతున్నాయి. – ఆడెపు రాజు, వరదవెల్లి, బోయినపల్లి తేలిన గ్రామాలివీ వేములవాడ మండలం అనుపురం, కొడుముంజ, శాభాష్పల్లి, రుద్రవరం, బోయినపల్లి మండలం, కొదురుపాక, నీలోజిపల్లి, వరదవెల్లి -
వేములవాడలో వైభవంగా శివరాత్రి ఉత్సవాలు
-
‘తాళిబొట్టు’ ఘటనపై విచారణ
ద్రంగి (వేములవాడ): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి తహసీల్దార్ కార్యాలయ గు మ్మానికి ఓ మహిళ తాళిబొట్టు వేలాడదీసిన ఘటనను కలెక్టర్ కృష్ణభాస్కర్ సీరియస్గా తీసుకున్నారు. విచారణ చేపట్టి, నివేదిక ఇవ్వాలని ఆర్డీవో శ్రీనివాస్ను ఆదేశించారు. దీంతో ఆర్డీవో గురువారం రుద్రంగి మండ లం మానాల గ్రామంలోని వివాదాస్పద స్థలాన్ని పరిశీలించారు. ఇరువర్గాలు, గ్రామ పెద్దల నుంచి వివరాలు సేకరించారు. పట్టా పాసుపుస్తకాలు, పలు పత్రాలను పరిశీలించారు. తహసీల్దార్ శ్రావణ్కుమార్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ, పట్టా మార్పిడికి రుద్రంగి రెవెన్యూ సిబ్బందికి సంబంధం లేదని చెప్పారు. మానాల గ్రామం పాతకమ్మర్పెల్లి మండలం నిజామాబాద్ జిల్లాలో ఉన్న సమయంలోనే 2011–12లో సర్వేనంబర్ 130/14లోని రెండెకరాల వ్యవసాయ భూమి పొలాస రాజలింగం పేరు నుంచి పొలాస రాజం పేరిట పట్టా మార్పు జరిగిందని తెలిపారు. తర్వాత రాజం కోడలు పొలాస జల పట్టా చేసుకుందని చెప్పారు. పొలాస జల ఒక్కరే పట్టా చేసుకోవడంతో సమస్య తలెత్తిందని, పొలాసమంగకు రెండెకరాలలో రావాల్సిన వాటా కుటుంబ సమస్య కాబట్టి గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడుకోవాలని సూచించినట్లు తెలిపారు. తన తాళిబొట్టు తీసుకుని అయినా భూమిపట్టా మార్చాలంటూ తహసీల్దార్ కార్యాలయం గుమ్మానికి మంగ తాళిబొట్టు వేలాడదీసిన విషయం విదితమే. -
బామ్మకు బజారే దిక్కయింది..
వేములవాడ : రక్తం సంబంధం కుదరదు పొమ్మంటే.. ఆ వృద్ధురాలికి బజారు దిక్కయింది. మానవత్వంలేని మనవరాలి పనితో శతాధిక వయసులో రోడ్డుపైనే గడిపేస్తోంది. వివరాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ పట్టణానికి చెందిన వెంకట స్వామికి నలుగురు కూతుళ్లు. ఇందులో ఇద్దరు కూతుర్లు చనిపోయారు. పెద్ద కూతురికి తానే స్వయంగా ఇల్లు నిర్మించి ఇచ్చాడు. తన తల్లి (బామ్మ) చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే తాను కిరాయికి ఉంటున్న ఇంటివారు వెళ్లి పొమ్మన్నారు. దీంతో గత్యంతరం లేక వెంకటస్వామి తన తల్లిని తీసుకొని తన కూతురు సునీత ఇంటికి చేరాడు. అయితే, మనవరాలు శతాధిక వృద్ధురాలిని ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో వెంకటస్వామి కూతురి ఇంటి ముందు టెంట్ వేసుకుని బజార్లోనే తల్లిని పడుకోబెట్టి అక్కడే కూర్చుండిపోయాడు. మాతృ దినోత్సవం రోజున బామ్మకు జరిగిన ఇబ్బందిపై కాలనీవాసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
చెన్నమనేని పౌరసత్వంపై హైకోర్టు విచారణ
సాక్షి, హైదరాబాద్ : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై తెలంగాణ హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. రమేష్ కుమార్ పౌరసత్వం చెల్లదంటూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని పిటిషనర్ ఆది శ్రీనివాస్ కోర్టును కోరారు. మరోవైపు మరోవైపు కేంద్ర హోంశాఖ పౌరసత్వం రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని చెన్నమనేని రమేష్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం జూన్ 16న మరోసారి పూర్తి వాదనలు వింటామని తెలుపుతూ.. తదుపరి విచారణను జూన్ 16 కు వాయిదా వేసింది. లాక్డౌన్ కారణంగా ఈ పిటిషన్పై విచారణను హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టింది. కాగా వేములవాడ శాసన సభ్యుడైన చెన్నమనేని రమేష్కు జర్మని దేశంలో పౌరసత్వం ఉందంటూ ఆయన సమీప అభ్యర్థి ఆది శ్రీనివాస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. -
ఓడించాడని చంపేశారు!
వేములవాడ: రాజకీయ కక్షలకు ఓ రౌడీ షీటర్ బలయ్యాడు. పట్టపగలు అందరూ చూస్తుండగానే వెంటాడి నడిరోడ్డుపై కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన సిరిసిల్ల జిల్లా వేములవాడలో బుధవారం చోటుచేసుకుంది. గత మున్సిపల్ ఎన్నికల్లో తమను ఓడించాడని కక్ష పెంచుకున్న ప్రత్యర్థులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో వేములవాడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సీఐ సీహెచ్ శ్రీధర్ కథనం ప్రకారం.. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పట్టణానికి చెందిన ముద్రకోల వెంకటేశ్ కౌన్సిలర్గా పోటీ చేసి ఓడిపోయాడు. స్థానికంగా వాటర్ ప్లాంటులో డ్రైవర్గా పని చేస్తున్న శివ తనకు మద్దతు ఇవ్వకుండా ప్రత్యర్థి గెలుపునకు సహకరించాడని వెంకటేశ్ కక్ష పెంచుకున్నాడు. తన ఓటమికి కారణమైన అతడిని ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించాడు. కక్షతో రగిలిపోతున్న వెంకటేశ్.. అదను చూసి దెబ్బ కొట్టాలని పథకం రచించాడు. ఈ నేపథ్యంలో ఉదయం బైక్పై వెళ్తున్న శివను తన సన్నిహితుడు శ్రీనివాస్తో కలసి వెంటాడారు. నడిరోడ్డుపై అటకాయించి కత్తులతో పొడిచి హత్య చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న శివను చూసిన స్థానికులు.. పోలీసులకు, 108కు సమాచారం అందించారు. వారు శివను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుంచి కరీంనగర్కు తరలించారు. పరిస్థితి విషమించడంతో శివ చికిత్స పొందుతూ చనిపోయాడు. కాగా శివపై మూడేళ్ల క్రితం రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు సీఐ తెలిపారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ చంద్రకాంత్ పరిశీలించారు. మృతుడి భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితులు ముద్రకోల వెంకటేశ్, శ్రీనివాస్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. కేసు దర్యాప్తులో ఉంది. -
కొత్తగా రెండు రెవెన్యూ డివిజన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మెదక్ జిల్లా జోగిపేట, సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడను నూతన రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేసేందుకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటితో రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 74కు చేరింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా జిల్లాలు, డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఆ తర్వాత కూడా స్థానికులు, ప్రజాప్రతినిధుల నుంచి వచి్చన అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకొని మరిన్ని డివిజన్లు, మండలాలకు లైన్క్లియర్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్తగా చౌట్కూరు మండలం ప్రతిపాదిత జోగిపేట రెవెన్యూ డివిజన్లో నాలుగు మండలాలను ప్రభుత్వం చేర్చింది. ప్రస్తుతం సంగారెడ్డి డివిజన్లో కొనసాగుతున్న అందోల్, పుల్కల్, వట్పల్లి మండలాలతోపాటు కొత్తగా చౌట్కూరు మండలాన్ని ఏర్పాటు చేసింది. పుల్కల్ మండలం నుంచి కొన్ని గ్రామాలను తొలగించి చౌట్కూరు మండలంలో కలిపింది. దీంతో రాష్ట్రంలో మండలాల సంఖ్య 586కు చేరింది. వేములవాడ డివిజన్ ఇలా.. ప్రస్తుతం సిరిసిల్ల రెవెన్యూ డివిజన్లో ఉన్న 6 మండలాలతో వేములవాడ డివిజన్ ఏర్పాటు చేశారు. ఇందులో వేములవాడ, వేములవాడ (గ్రామీణ), చందూర్తి, బోయినపల్లి, కోనరావుపేట, రుద్రండి మండలాలున్నాయి. ఇదిలావుండగా డివిజన్లు, మండలం ఏర్పాటుపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు, అభ్యంతరాలను స్వీకరించేందుకు 30 రోజుల గడువు ఇస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జారీ చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఏసీబీకి చిక్కిన వీటీడీఏ సీపీవో
వేములవాడ/సుల్తాన్బజార్: వేములవాడ ఆలయ అభివృద్ధి అథారిటీ (వీటీడీఏ) చీఫ్ ప్లానింగ్ అధికారి లక్ష్మణ్గౌడ్ సోమవారం ఏసీబీకి చిక్కారు. లే అవుట్ అనుమతి కోసం రూ.6.50 లక్షలు లంచం తీసుకుంటుండగా ఆయన్ను పట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్న జవ్వాజి సంపత్, వినికంటి సందీప్లు త్రిశూల్ డెవలపర్స్ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇటీవల వేములవాడ రుద్రవరంలో కొనుగోలు చేసిన ఓ స్థలం లే అవుట్ కోసం వీటీడీఏ చీఫ్ ప్లానింగ్ అధికారి లక్ష్మణ్గౌడ్కు దరఖాస్తు చేసుకున్నారు. వారి నుంచి రూ.8 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు రూ.6.50 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. అనంతరం సంపత్, సందీప్లు కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ వీరభద్ర, ఇన్స్పెక్టర్ సంజీవ్లను ఆశ్రయించారు. వారు ఇచ్చిన సూచనల మేరకు ఫోన్ ద్వారా లక్ష్మణ్గౌడ్తో మాట్లాడి డబ్బులు సిద్ధం చేశామని, ఎక్కడ ఇవ్వాలని అడగగా.. హైదరాబాద్ కోఠి గుజరాతిగల్లీలోని తన నివాసం వద్దకు రావాలని సూచించారు. వారు వచ్చాక తన కుమారుడు రోహిత్ను పంపిస్తున్నానని, అతనికి నగదు ఇవ్వాలని లక్ష్మణ్గౌడ్ చెప్పాడు. నగదును తీసుకుని బ్యాగ్లో పెట్టుకున్న రోహిత్ను అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లక్ష్మణ్గౌడ్ నుంచి వాగ్మూలం తీసుకుని అతనితో పాటు కుమారుడు రోహిత్ను అదుపులోకి తీసుకున్నారు. -
పోలింగ్పై పోలీసుల నిఘా
సాక్షి, వేములవాడ: పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్ 11న జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించి ప్రతీ ఓటరు తన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వేములవాడ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, ప్రతీ గ్రామంలో ఓటర్లంతా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టారు. జిల్లా పోలీసు అధికారుల సూచనల మేరకు వేములవాడ డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక బృందాలు గ్రామగ్రామాన కవాతులు నిర్వహిస్తూ పోలీసులు ప్రజల రక్షణ కోసం ఉన్నారన్న సంకేతాలు అందజేస్తున్నారు. ఎవరి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా పోలీసులు ప్రజలకు రక్షణగా ఉంటారన్న భరోసాను ఇస్తున్నారు. ప్రత్యేక పోలీసుల బలగాలతో కవాతులు నిర్వహించి ప్రజలకు మరింత ధైర్యాన్ని ఇస్తున్నారని స్థానికంగా చర్చించుకుంటున్నారు. ప్రత్యేక బలగాల రాక పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వేములవాడ ప్రాంతానికి ప్రత్యేక బలగాలు వచ్చేశాయి. వీరితో నిత్యం కూడళ్ల వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోడ్ అమల్లో ఉండటంతో అందుకు అనుగుణంగా విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి వేళల్లోనూ తనిఖీలు నిర్వహిస్తూ పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. వాహనాల తనిఖీలు, బస్సులు తనిఖీలు, ముల్లెమూటల తనిఖీలు, నగదు తరలింపు అంశాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఇటీవల వేములవాడ శివారులో రూ.4 లక్షలు తరలిస్తున్న ఓ వ్యక్తిని సోదా చేసి పట్టుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా డబ్బులు తరలించవద్దన్న ఎన్నికల సంఘం నిబంధనలను ఇక్కడి పోలీసులు పాటిస్తున్నారు. చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు మరింత ముమ్మరం చేస్తున్నారు. మద్యం పట్టివేత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నేరచరిత గల వ్యక్తులను పట్టుకుని తహసీల్దారు ముందు బైండోవర్ చేయడంతోపాటు ఎలాంటి చర్యలకు దిగినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన మ ద్యాన్ని పట్టుకుని సీజ్ చేస్తున్నారు. ఎన్నికల నియమావళికి లోబడి డబ్బుల తరలింపు అంశాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న డబ్బులను సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేస్తున్నారు. 103 మందిని బైండోవర్ చేశారు. 58 లీటర్ల మద్యం పట్టుకున్నారు. 96 పోలింగ్ స్టేషన్లలో 70 నార్మల్ పోలింగ్ స్టేషన్లు, 26 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా గుర్తించారు. 141 లొకేషన్లలో 255 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. ఇందుకు రెండు ఫ్లయింగ్ స్క్వాడ్, 1 స్టాటిస్టిక్స్ అసెస్మెంట్ టీం గస్తీ తిరుగుతున్నారు. -
జిల్లాలో సగం కన్నా ఎక్కువ యూతే..
సాక్షి, సిరిసిల్ల: జిల్లా నిండా యువోత్సాహం కనిపిస్తోంది. మొత్తం ఓటర్లలో 51.54 శాతం 39 ఏళ్లలోపు వయసు వారే ఉన్నారు. రాష్ట్రఎన్నికల సంఘం ప్రకటించిన తుది ఓటరు జాబితాను పరిశీలిస్తే.. పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉండగా.. జిల్లా జనాభాలో 73.20 శాతం ఓటర్లుగా నమోదైనట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల నాటి వివరాలను పరిశీలిస్తే.. పార్లమెంట్ ఎన్నికల నాటికి చాలామార్పులు చోటు చేసుకున్నాయి. కొత్తగా 27,896 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ‘యువ’ ఓటర్లే అధికం జిల్లా ఓటర్ల సంఖ్య 4,33,902 కాగా ఇందులో 18 – 39 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఓటర్ల సంఖ్య 2,23,638 ఉంది. అంటే జిల్లా ఓటర్లలో 51.54 శాతంగా నమోదైంది. సగానికి కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉండడం విశేషం. ఎన్నికల సంఘం ఇటీవల కల్పించిన ఓటర్ల నమోదులో కొత్తగా 27,896 నమోదు ఓటర్లుగా తమ పేర్తు చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా ఆన్లైన్, ఆఫ్లైన్లో ఫాం–6 ద్వారా అనేకమంది కొత్త ఓటర్లు నమోదు చేసుకోవడం విశేషం. మహిళా ఓటర్లు అధికం జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో పురుషుల ఓటర్ల సంఖ్య 2,11,324 కాగా.. మహిళలు ఓటర్లు 2,22,572 మంది ఉన్నారు. పురుషుల కంటే 1,1248 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో గెలుపోటముల్లో మహిళల పాత్ర కీలకంగా మారనుంది. మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా ఉండటానికి గల్ఫ్ వలసలు కారణాలుగా భావిస్తున్నారు. జిల్లా ఓటర్ల వివరాలు నియోజకవర్గాల వారీగా.. నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం సిరిసిల్ల 1,11,926 1,15,994 3 2,27,923 వేములవాడ 99,398 1,06,578 3 2,05,979 -
అభిషేక్కు అభినందనలు!
సాక్షి, హైదరాబాద్: ధాన్యాన్ని బస్తాల్లో నింపేందుకు తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి చలించి 9వ తరగతి విద్యార్థి చేసిన ఓ అద్భుత ఆవిష్కరణ జాతీయ స్థాయి బహుమతి సాధించింది. సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హనుమాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న అభిషేక్ ఈ ఆవిష్కరణ చేశాడు. అభిషేక్ తయారు చేసిన యంత్రానికి రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ సైన్స్ ఫెయిర్లో ప్రథమ బహుమతి వచ్చింది. జాతీయ స్థాయిలో మూడో బహుమతి సాధించింది. అభిషేక్ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించారు. సోమవారం అభిషేక్ తన ఉపాధ్యాయులతో పాటు కేటీఆర్ను కలిశారు. చిన్న వయసులో ధాన్యం ఎత్తే యంత్రాన్ని తయారు చేయాలన్న ఆకాంక్ష ఎలా మొదలైందని కేటీఆర్ ఆ బాలుడిని అడిగి తెలుసుకున్నారు. తనది వ్యవసాయ కుటుంబమని తల్లిదండ్రులు ధాన్యాన్ని ఎత్తేందుకు మరో నలుగురితో కలసి పడుతున్న కష్టం తనకు ఈ పరికరాన్ని తయారు చేసేందుకు స్ఫూర్తి కలిగించిందని అభిషేక్ తెలిపాడు. జాతీయ స్థాయిలో బహుమతి అందుకున్నందుకు అభిషేక్ను కేటీఆర్ అభినందించారు. భవిష్యత్తులో ఏమవుతావని కేటీఆర్ అడగగా.. ఐఏఎస్ కావాలన్న ఆకాంక్ష తనకుందని అభిషేక్ చెప్పాడు. ఇందుకు అవసరమైన అన్ని రకాల సహాయం అందిస్తానని కేటీఆర్ భరోసా ఇచ్చారు. అభిషేక్ తన యంత్రానికి పేటెంట్ పొందేందుకు, భవిష్యత్తులో మరిన్ని అవిష్కరణలు చేసేందుకు, తన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర స్టేట్ ఇన్నోవేషన్ సెల్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని కేటీఆర్ తెలిపారు. తన తరఫున ప్రోత్సాహకంగా రూ.1.16 లక్షల చెక్కును అభిషేక్కు అందించారు. -
‘రాజన్న’ నేలపై రాజెవ్వరు?
వేములవాడ రాజన్న సన్నిధి.. పుణ్యక్షేత్రాల గడ్డ.. విప్లవ పోరాటాలకు అడ్డా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా. గోదావరి నీటితో సుస్థిర సాగు, బొగ్గు, గ్రానైట్ వనరులతో పారిశ్రామిక వృద్ధి, జీవన ఆ‘దార’మైన సంప్రదాయ వృత్తి చేనేత, బతుకుదెరువుకు గల్ఫ్ వలసలు, తాగునీటి తండ్లాట, సామాజిక, అభ్యుదయ ఉద్యమాల్లో ముందడుగు.. ఇలా భిన్న వైరుధ్యాల ఈ జిల్లా.. ఎన్నికల తీర్పులో ప్రతిసారీ ప్రత్యేకతను చాటుకుంటోంది. 2009, 2014 ఎన్నికల్లో అప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారు. ప్రభుత్వ నాలుగేళ్ల పనితీరుకు పరీక్షగా నిలుస్తోన్న ప్రస్తుత ఎన్నికల్లో ఈ జిల్లా తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో 12 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. జగిత్యాలలో కాంగ్రెస్ గెలిచింది. 2009లో అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పడిన మహాకూటమి తెలంగాణలో విఫలమైంది. ఇక్కడ మాత్రం పదిచోట్ల గెలిచింది. ఇప్పుడు వస్తున్న ‘కూటమి’పై ఓటరెలా స్పందిస్తాడనేది కీలకం కానుంది. నియోజకవర్గాల వారీగా ‘సాక్షి గ్రౌండ్ రిపోర్ట్’ ఇదీ.. కోరుట్ల: ఎవరెట్లా..? కోరుట్లలో గత ఎన్నికల నాటి ప్రత్యర్థులే మళ్లీ తలపడుతున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రా వు (టీఆర్ఎస్), జువ్వాడి నర్సింగరావు (కాంగ్రెస్) మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ ఉంది. విద్యాసాగర్రావు నాలు గోసారి టీఆర్ఎస్ నుంచి బరిలో దిగారు. గత ఎన్నికల్లో కాం గ్రెస్ అభ్యర్థిత్వం దక్కక.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి రెండో స్థానంలో నిలిచిన నర్సింగరావు ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. 2009 నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న విద్యాసాగర్రావుపై కొంత సహజ వ్యతిరేకత ఉంది. కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీలు ఉన్న ఈ సెగ్మెంట్లో పట్టణ ఓటర్ల సంఖ్య ఎక్కువ. కోరుట్లలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయకపోవడం, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మల్లాపూర్ చక్కర కర్మాగారంపై ముందడుగు లేకపోవడంపై అసంతృప్తి ఉంది. రెండో పంట నీటిని ఎన్నికల కారణంగా ఇతర ప్రాంతాలకు తరలించారని ఇక్కడి రైతులు అభిప్రాయపడుతున్నారు. - విద్యాసాగర్రావు అందుబాటులో ఉంటారని పేరు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఆయన భరోసాతో ఉన్నారు. ప్రచారంలో ముందున్నారు. - కాంగ్రెస్ అభ్యర్థిని ఆలస్యంగా ఖరారు చేయడంతో పూర్తిస్థాయిలో ప్రచారం మొదలుకాలేదు. జగిత్యాల.. ఎలాగైనా గెలవాల! టీఆర్ఎస్, కాంగ్రెస్ గెలుపు కోసం పోటాపోటీ వ్యూ హాలు పన్నుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత తాటి జీవన్రెడ్డి లక్ష్యంగా టీఆర్ఎస్ కీలక నేత కల్వకుంట్ల కవిత ఇక్కడ అంతా తానై వ్యవహరిస్తున్నారు. టి.జీవన్రెడ్డి (కాంగ్రెస్), ఎ.సంజయ్కుమార్ (టీఆర్ఎస్) వరుసగా రెండోసారి పోటీ పడుతున్నారు. జగిత్యాల నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ.. పొత్తులో భాగంగా జీవన్రెడ్డి గెలుపునకు పూర్తిస్థాయిలో పని చేస్తున్నారు. వీరిద్దరు కలయిక టీఆర్ఎస్కు సవాలుగా మారింది. కవిత మూడేళ్లుగా ఇక్కడ టీఆర్ఎస్ గెలుపునకుప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్కు అండగా నిలిచే ప్రధాన సామాజిక వర్గం ఓటర్లు ఆ పార్టీ అభ్యర్థి వైఖరిపై అసంతృప్తితో ఉన్నారు. వీరితో జీవన్రెడ్డికి ఏళ్లుగా సంబంధాలు ఉన్నాయి. - వైద్యుడైన సంజయ్కుమార్ (టీఆర్ఎస్)ప్రజల కోసం, పార్టీ కోసం సమయం కేటాయిస్తారనే అభిప్రాయం ఉంది. అయితే, పార్టీలోని ఇతర నేతలు, శ్రేణులతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని పేరు. - జీవన్రెడ్డి లక్ష్యంగానే టీఆర్ఎస్ అధిష్టానం అమలు చేస్తున్న ఎన్నికల వ్యూహం.. సాధారణ ఓటర్లలో జీవన్రెడ్డిపై సానుభూతికి కారణమవుతోంది. ధర్మపురి (ఎస్సీ): పాతకాపుల బరి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మపురి బరిలో ఉన్న కొప్పుల ఈశ్వర్ (టీఆర్ఎస్), అడ్లూరి లక్ష్మణ్కుమార్ (కాంగ్రెస్).. పాత ప్రత్యర్థులే. ఈశ్వర్ 2004 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. నాలుగేళ్లు అధికారంలో ఉండీ ఆశించిన అభివృద్ధి చేయలేదని ఓటర్లలో అసంతృప్తి ఉంది. రూ.100 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెప్పినా ఆచరణలో జరగలేదనే అభిప్రాయం ఉంది. డిగ్రీ కాలేజీ, బస్సు డిపో నిర్మాణ హామీలూ నెరవేరలేదు. ప్రత్యర్థులు పాతవారే కావడంతో అసాధారణ మార్పులు జరిగితే తప్ప ఫలితం సైతం అదేరకంగా ఉంటుంది. - విస్తృతమైన ప్రజాసంబంధాలు ఈశ్వర్కు కలిసొచ్చే అంశం. - నాలుగేళ్లగా కాంగ్రెస్ సంస్థాగతంగా బలహీనమైంది. వేములవాడ: ఎవరికి అండ పవిత్ర శైవ క్షేత్రం వేములవాడలో నాలుగోసారీ పాత ప్రత్యర్థులే పోటీ పడుతున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు (టీఆర్ఎస్), ఆది శ్రీనివాస్ (కాంగ్రెస్) మధ్యే ప్రధాన పోటీ.. బీజేపీ అభ్యర్థి ప్రతాప రామకృష్ణకు వచ్చే ఓట్లు ఫలితాలపై ప్రభావం చూపనున్నా యి. నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి పనులపై రమేశ్బాబు ప్రచారం చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు లేకుండా పనిచేశామని చెబుతున్నారు. ప్రత్యర్థి పాత వ్యక్తి కావడం రమేశ్కు అనుకూలాంశంగా కనిపిస్తోంది. రమేశ్ గెలిచినా అందుబాటులో ఉండరనే శ్రీనివాస్ ప్రచారాన్ని ఓటర్లు గత ఎన్నికల్లో పట్టించుకోలేదు. రమేశ్బాబు పౌరసత్వంపై ఆది శ్రీనివాస్ న్యాయపోరాటం కొనసాగుతోంది. వీరిద్దరు 2009 నుంచీ ఇక్కడ పోటీపడుతున్నారు. గత ఎన్నికల్లో శ్రీనివాస్ బీజేపీ తరపున పోటీ చేశారు. ఈసారి కాంగ్రెస్ టికెట్పై బరిలో ఉన్నారు. కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడిన కీలక నేత ఏనుగు మనోహర్రెడ్డి తన వర్గంతో టీఆర్ఎస్లో చేరారు. దీంతో టీఆర్ఎస్కు అదనపు బలం చేకూరినట్టయ్యింది. ఆది శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ ఆలస్యంగా ఖరారు చేయడంతో ప్రచార వ్యూహం ఆలస్యమైంది. నాలుగోసారి పోటీ చేస్తుండడంలో ఓటర్లలో ఉండే సానుభూతి కలిసి వస్తుందని ఆది శ్రీనివాస్ భావిస్తున్నారు. - నియోజకవర్గ కేంద్రం వేములవాడలో వ్యాపార వర్గం మొగ్గు ఎటుంటే వారిదే విజయం.. అంచనాకందని మంథని గత ఎన్నికల ప్రత్యర్థులే మళ్లీ తలపడుతున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ (టీఆర్ఎస్), మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు (కాంగ్రెస్) మధ్య హోరాహోరీ నడుస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్న ప్రాంతం కావడంతో ఆ పార్టీకి ఇక్కడ గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. సామూహిక వివాహాలు, సేవా కార్యక్రమాలు, నిత్యం ప్రజలకు సన్నిహితంగా ఉండడం మధుకు కలిసొచ్చే అంశం. మారుమూల అటవీ గ్రామాలకు రవాణా సౌకర్యాల కల్పనతో కూడా ఆయన కొంత అభిమానాన్ని సంపాదించారు. గత ఎన్నికల తర్వాత శ్రీధర్బాబు అందుబాటులో లేరనే అసంతృప్తి కాంగ్రెస్ శ్రేణులలో ఉంది. దీంతో మండల, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు టీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్పై ఈ ప్రభావం పడుతోంది. ఆ పార్టీ ఆలస్యంగా ప్రచార వ్యూహం మొదలుపెట్టింది. టీఆర్ఎస్లోని అసంతృప్త నేతలను కాంగ్రెస్లో చేర్చుకునే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. కాంగ్రెస్ పూర్తి స్థాయి ప్రచారం మొదలుపెడితే ఓటర్ల మొగ్గు స్పష్టంగా కనిపించే పరిస్థితి ఉంది. - ఇప్పటికైతే ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థి మధు ముందున్నారు. - మంత్రిగా తాను చేసిన అభివృద్ధి, టీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని పోల్చుతూ శ్రీధర్బాబు ప్రచారం సాగిస్తున్నారు. సిరిసిల్ల.. మెజారిటీపైనే దృష్టి టీఆర్ఎస్ ముఖ్యనేత, మంత్రి కె.తారకరామారావు నాలుగోసారి ఇక్కడ పోటీ చేస్తున్నారు. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న కేటీఆర్తో మాజీ ప్రత్యర్థి కె.కె.మహేందర్రెడ్డి (కాంగ్రెస్) పోటీ పడుతున్నారు. నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి కేటీఆర్కు ఎన్నికల్లో అనుకూలంగా కానుంది. సాగునీటి వనరుల అభివృద్ధి, గ్రామాల్లోనూ మౌలిక సదుపాయాల కల్పన, చేనేత కార్మికుల సంక్షేమ కార్యక్రమాలతో కేటీఆర్కు ఆదరణ పెరిగింది. చేనేతల సంక్షేమ కోసం చేపట్టిన పథకాలతో ఎక్కువ సంఖ్యలో ఉండే ఈ వర్గీయులలో కేటీఆర్పై సానుకూలత ఉంది. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ ప్రత్యర్థి పార్టీల ముఖ్యనేతలు, శ్రేణులు టీఆర్ఎస్లోనే ఉన్నారు. కేటీఆర్తోనే సిరిసిల్లకు గుర్తింపు వచ్చిందనే అభిప్రాయం ఉంది. అత్యధిక పోలింగ్ నమోదయ్యేలా టీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేక ప్రచార ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి. - కేటీఆర్ గెలుపు విషయంలో సందేహాలు లేకపోవడంతో గతంలో కంటే భారీ మెజారిటీ పెంపు లక్ష్యంగా ఇక్కడి టీఆర్ఎస్ ప్రచారం సాగుతోంది. హుస్నాబాద్:సందడి లేదు.. కరువు ప్రాంతమైన హుస్నాబాద్ స్థానాన్ని సర్దుబాటులో ప్రజాకూటమి సీపీఐకి కేటాయించిం ది. తాజా మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్కుమార్ (టీఆర్ఎస్), చాడా వెంకట్రెడ్డి (సీపీఐ), చాడ శ్రీనివాస్రెడ్డి (బీజేపీ) పోటీ పడుతున్నారు. తాగునీటి సరఫరా, జిల్లాలు, మండలాల పునర్విభజనపై గ్రామాల ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి బరిలో లేకపోవడంతో టీఆర్ఎస్కు నష్టం జరిగే పరిస్థితి కనిపించట్లేదు. ఏడాదిన్నర క్రితం ఇక్కడ నిర్వహించిన బహిరంగసభలో ఏఐసీసీ ఇంచార్జీ దిగ్విజయ్సింగ్ సమక్షంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించారు. అనంతరం ప్రవీణ్రెడ్డి 136 గ్రామాల్లో ప్రచారం చేశారు. తాజా మాజీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉండడంతో కాంగ్రెస్ గెలుపు ఖాయమని అనుకున్న ఆ పార్టీ శ్రేణులు.. ఇప్పుడు కూటమి పేరుతో సర్దుబాటు నిర్ణయంతో ప్రచారానికి దూరంగా ఉన్నారు. దీంతో ఇక్కడ ఎన్నికల సందడి కనిపించడం లేదు. ఇది టీఆర్ఎస్కు ఊరట కలిగించే పరిణామం. హుజూరా‘బాద్షా’ ఎవరో! టీఆర్ఎస్ కీలక నేత, మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్లో నాలుగోసారి పోటీ చేస్తున్నారు. ఆయనతో పాడి కౌశిక్రెడ్డి (కాంగ్రెస్) పోటీ పడుతున్నారు. మంత్రిగా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కువ మందితో వ్యక్తిగత పరిచయాలు ఈటల రాజేందర్కు అనుకూలాంశాలు. నీటి వనరుల అభివృద్ధి, ఖరీఫ్ పంటకు పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు అనుకూలతను పెంచుతోంది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీకి గట్టి పట్టున్న హుజూరాబాద్లో ఇప్పుడూ అదే పరిస్థితి ఉంది. రాజేందర్ కీలకమంత్రిగా ఉన్నా.. హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాలను అభివృద్ధి చేయలేదని కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం చేస్తున్నారు. - అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడంతో ఎన్నికల వ్యూహంలో కాంగ్రెస్ కొంత వెనుకబడింది. పెద్దపల్లి: పార్టీల్లో లొల్లి తాజా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి (టీఆర్ఎస్), చింతకుంట విజయరమణరావు (కాంగ్రెస్) నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన విజయరమణరావు ఈసారి కాంగ్రెస్ నుంచి బరిలో దిగారు. నాలుగేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని మనోహర్రెడ్డి ధీమా. నాలుగేళ్లలో చెప్పుకోదగిన స్థాయిలో ఏమీ జరగలేదని, ఇదే తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ అభ్యర్థి భావన.. జిల్లా కేంద్రమైన పెద్దపల్లి గ్రామపంచాయతీ మాదిరిగానే ఉందని, టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని విమర్శిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా.. ప్రజలతో వ్యవహరించే వ్యక్తిగత శైలి టీఆర్ఎస్ అభ్యర్థికి ఇబ్బందిగా మారనుందనే అభిప్రాయం ఉంది. గ్రామస్థాయిలోని నేతలు గుర్తింపు సమస్యతో పూర్తిస్థాయిలో పని చేయడంలేదు. మొత్తంగా అభ్యర్థి పరంగా కాంగ్రెస్, పార్టీ పరంగా టీఆర్ఎస్ ఇక్కడ ముందంజలో ఉన్నాయి. - ప్రధాన సామాజికవర్గం ఓట్లపై టీఆర్ఎస్ ధీమా ∙వ్యక్తిగత సంబంధాలు విజయరమణరావు బలం. కరీంనగర్: మూడు ముక్కలాట కరీంనగర్లో గంగుల కమలాకర్ (టీఆర్ఎస్), పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్), బండి సంజయ్కుమార్ (బీజేపీ) మధ్య ప్రధాన పోటీ ఉంది. కరీంనగర్లో ఎవరూ రెండోసారి ఎమ్మెల్యేగా గెలవరనే సంప్రదాయాన్ని బద్ధలుకొడుతూ గంగుల కమలాకర్ ఇక్కడ వరుసగా రెండుసార్లు గెలుపొందారు. కరీంనగర్ నగరంలోనే అధిక ఓట్లు ఉన్నాయి. కరీంనగర్ గ్రామీణ ప్రాంతంలో టీఆర్ఎస్ ద్వితీయశ్రేణి నేతలపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. అభివృద్ధి పనులలో అవినీతి జరిగిందనే నినాదంతో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన ఈయన ఇప్పుడు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభా కర్ 2009లో కరీంనగర్ ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో ఓడిపోయారు. గంగుల కమలాకర్, పొన్నం ప్రభాకర్ వ్యక్తిగతంగా సన్నిహితులు. గత రెండు ఎన్నికల్లోనూ ఒకరు ఎంపీగా, మరొకరు ఎమ్మెల్యేగా పోటీచేస్తూ పరస్పరం సహకరించుకున్నారనే ప్రచారం ఉంది. గతంలోని సాన్నిహిత్యం ఇప్పుడు ఎవరో ఒకరికి ఇబ్బందికరంగా మారే పరిస్థితి.. కరీంనగర్ అసెంబ్లీ స్థానంపై మొదటి నుంచి వెలమ వర్గం ప్రభావం ఎక్కువ. ఆ వర్గం అభ్యర్థి లేకుండా ఎన్నికలు జరుగుతుండడం ఇదే మొదటిసారి. ఈ వర్గం ఇప్పుడు టీఆర్ఎస్కు అనుకూలంగా ఉంది. - కమలాకర్కు గత ఎన్నికల్లో త్రిముఖ పోటీ కలిసొచ్చింది. ఇప్పుడూ అదే పరిస్థితి కనిపిస్తోంది. - తెలంగాణ కోసం లోక్సభలో తాను నాడు చేసిన పోరాటం, బీసీ నినాదం కలిసి వస్తుందని కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ భావిస్తున్నారు. మానకొండూరు (ఎస్సీ): గెలుపు తకరారు గత రెండు ఎన్నికల్లో ఓటర్లు ఒకసారి కాంగ్రెస్ను, మరోసారి టీఆర్ఎస్ను గెలిపించారు. ఈసారీ ఆ సెంటిమెంట్ కొనసాగుతుందా అనేది ఆసక్తికరం. తాజా మాజీ ఎమ్మెల్యే ఏర్పుల బాలకిషన్ (టీఆర్ఎస్), మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ (కాంగ్రెస్) మధ్య ప్రధాన పోటీ ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బాలకిషన్ ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గంలో చెప్పుకోదగిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ అభ్యర్థి మోహన్ ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి పోటీచేసిన కవ్వం పల్లి సత్యనారాయణ.. ఇప్పుడు మోహన్ గెలుపునకు పనిచేస్తున్నారు. - ప్రజలకు అందుబాటులో ఉండరనేది టీఆర్ఎస్కు ప్రతికూలం - 2009 నుంచి 2014 వరకు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి పరిస్థితిని, గత నాలుగేళ్లను పోల్చి చూసుకోవాలని మోహన్ అంటున్నారు. రామగుండం: ‘కార్మిక’ గండం కార్మిక క్షేత్రం రామగుండంలో ఎన్నికలు రసవత్తరంగా ఉన్నాయి. 2009 నుంచి ఇక్కడ ఒకేరకంగా ఎన్నికలు జరుగుతున్నాయి. సోమారపు సత్యనారాయణ (టీఆర్ఎస్), కోరుకంటి చందర్ (ఏఐఎఫ్ బీ), మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ (కాంగ్రెస్), బల్మూరి వనిత(బీజేపీ) పోటీ పడుతున్నారు. 2009లో టీఆర్ఎస్ నుంచి పోటీచేసిన కోరుకంటి చందర్.. 2014లో, ఇప్పుడు టీఆర్ఎస్ రెబెల్గా ఏఐఎఫ్బీ నుంచి బరిలో ఉన్నారు. గత ఎన్నికల తరహాలోనే సోమారపు –కోరుకంటి మధ్య ప్రధాన పోటీ ఉంది. సత్యనారాయణ వైఖరితో సొంత పార్టీ నేతలు చందర్కు మద్దతు తెలుపుతున్నారు. రామగుండం ఎన్నికలపై సింగరేణి కార్మికుల ప్రభావం ఎక్కువ. రాష్ట్ర స్థాయి టీఆర్ఎస్ ముఖ్యనేతలు వచ్చినప్పుడు మినహాయిస్తే కార్మిక సంఘాల నేతలు సత్యనారాయణ కోసం ప్రచారం చేయడంలేదు. వారసత్వ నియామకాల విషయంలో నిబంధనలు పెట్టడంపై అసంతృప్తి ఉంది. కార్మికుల నివాసాలకు ఏసీ, ఇతర సౌకర్యాల కల్పన వంటి హామీలు ఆచరణలోకి రాలేదని అసంతృప్తి నెలకొంది. - సత్యనారాయణపై సహజ వ్యతిరేకత ∙రెండుసార్లు ఓటమితో చందర్పై సానుభూతి.. చొప్పదండి (ఎస్సీ): పోటీ దండి మిశ్రమ ప్రాంతాలతో కూడిన చొప్పదండిలో సుంకె రవిశంకర్ (టీఆర్ఎస్), మేడిపల్లి సత్యం (కాంగ్రెస్), బొడిగె శోభ (బీజేపీ) పోటీపడుతున్నారు. రవిశంకర్ ఒక్కరే నియోజకవర్గానికి చెందిన వారు. టీఆర్ఎస్ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడైన ఆయన కేసీఆర్ ప్రభుత్వ పథకాలతోనే ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన మేడిపల్లి సత్యంకు గ్రామగ్రామాన వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. టీఆర్ఎస్ పాలనలో చొప్పదండి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదనే ప్రచారంతో ఆయన ముందుకు సాగుతున్నారు. టీఆర్ఎస్ ఇక్కడ తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభకు టిక్కెట్ నిరాకరించింది. దీంతో ఆమె బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి బరిలో నిలిచారు. శోభకు వచ్చే ఓట్ల సంఖ్య పెరిగే కొద్ది టీఆర్ఎస్ అభ్యర్థికి ఇబ్బందికరమే.. - బొడిగె శోభ ఈ నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాలను శాసించే పరిస్థితిలో ఉన్నారని చెప్పవచ్చు. -
కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక
వేములవాడరూరల్ : రుద్రవరం గ్రామస్తులు ఆది శ్రీనివాస్ సమక్ష్యంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్న కట్ట శ్రీనివాస్ తన పదవికి, పార్టీకి రాజీనామ చేసి ఆది సమక్షంలో కాంగ్రెస్పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రుద్రవరం సర్పంచ్ పిల్లి రేణుక కనుకయ్యతో పాటు ఉప సర్పంచ్ స్వామి కలిసి గ్రామంలోని దాదాపు 50 మంది యువకులు ఆది శ్రీనివాస్కు మద్దతుగా నిలిచారు. అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామ చేసినట్లు ప్రకటించారు. -
కొడుకును కొడుతున్నారని ఆగిన తల్లిగుండె..
వేములవాడరూరల్: ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యా దు చేసుకున్నారు. ఈ విషయం ఓ యువకుడి తల్లికి తెలియడంతో తన కొడుకును కొడుతున్నారని ఆ తల్లి గుండె ఆగిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రూరల్ ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం వేములవాడ మండలంలోని చెక్కపల్లి గ్రామానికి చెందిన చేపూరి తిరుపతి, వెంకటేష్, కరుణాకర్ ఇంకొంతమంది, నూకలమర్రి గ్రామానికి చెందిన చెక్క రాహుల్, వనపర్తి నగేష్తో పాటు మరికొంత మంది ఆదివారం ఓ పెళ్లి భరాత్లోఘర్షణ పడ్డారు. ఈ విషయంపై ఒకరిపై ఒకరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు కూడా రాత్రి ఇచ్చుకున్నారు. నూకలమర్రి గ్రామానికి చెందిన చెక్క వెంకవ్వ(35)కు ‘మీ కొడుకు చెక్క రాహుల్ను కొడుతున్నారంటూ’ కొందరు ఫోన్ చేశారు. తన కొడుకును కొడుతున్నారా అంటూ ఫోన్లో మాట్లాడుతూనే ఆమె కుప్పకూలిపోయింది. వెంటనే వేములవాడ ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందినట్లు బంధువు తెలిపారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. దుబాయిలో మృతిరాలి భర్త.. వెంకవ్వ భర్త సత్యనారాయణ ఉపాధి నిమిత్తం గల్ఫ్లో ఉంటాడు. విషయం తెలుసుకుని స్వదేశానికి వస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. వెంకవ్వకు కూతురు, కొడుకు ఉన్నారు. -
పిట్స్ బాధతో యువకుడి ఆత్మహత్య
కోనరావుపేట(వేములవాడ) : కుటుంబ కలహాలు, అనారోగ్యంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన యాదరవేణి మల్లేశం(33) కొన్నిరోజులుగా కుటుంబ కలహాలతో ఇబ్బంది పడుతున్నాడు. రెండేళ్ల నుంచి పిట్స్తో బాధ పడుతున్నాడు. దీంతో మంగళవారం ఉదయం తన వ్యవసాయ క్షేత్రం వద్ద వేపచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడికి భార్య లావణ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి తండ్రి దేవయ్య ఫిర్యాదుతో ఎస్సై రమేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వేములవాడకు పోటెత్తిన భక్త జనం
-
శివరాత్రికి ముస్తాబవుతున్న వేములవాడ
-
వాహన పూజలో అపశృతి.. భక్తులపైకి దూసుకెళ్లిన వాహనం
సాక్షి, వేములవాడ: ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడలోని రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో వాహన పూజలో అపశృతి దొర్లింది. రాజన్న ఆలయం ముందు వాహన పూజ చేస్తుండగా నిలిపి ఉంచిన బొలెరో వాహనం ఒక్కసారిగా ముందుకు దూకి క్యూలైన్లోకి దూసుకెళ్లింది. దర్శనం కోసం వేచి ఉన్న ముగ్గురు భక్తులకు తీవ్రగాయాలయ్యాయి. మరో ద్విచక్ర వాహనం ధ్వంసమైంది. బాధితులను ఆసుపత్రికి తరలించారు. హైద్రాబాద్ మియాపూర్కు చెందిన లక్ష్మి, నరసింహస్వామి దంపతులు గాయపడగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరిని ఆలయ అధికారులు పరామర్శించారు. -
జీపు, బైక్ ఢీ: ఒకరు మృతి
సాక్షి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాజన్న గుడి చెరువు కట్ట కింది బస్టాండ్ సమీపంలో తుఫాన్ జీపు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిని లక్క సుజిత్ రెడ్డి(30)గా గుర్తించారు. వాసవి నగర్కు చెందిన ఇతని స్వగ్రామం పొత్కపల్లి కాగా వేములవాడలో డీసీఎం వ్యాన్ డ్రైవర్గా ఉపాధి పొందుతూ పదేళ్లుగా ఇక్కడే నివసిస్తున్నాడు. -
వేములవాడలో వ్యక్తి దారుణ హత్య
సాక్షి, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్నగుడి చెరువులో సోమవారం ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలానికి చెందిన బండి బాలయ్య(40) అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకోసి హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్ళి పరిశీలించారు. శవం భయంకరంగా ఉండటంతో సిరిసిల్ల మార్చూరీకి తరలించారు. -
పుణ్యక్షేత్రాల్లో పెరిగిన భక్తుల రద్దీ
యాదాద్రి/వేములవాడ: వరుస సెలవులు రావడంతో తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన యాదాద్రి, వేములవాడల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది. యాదాద్రిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటలపైగా సమయం పడుతున్నది. కొండపైన తగినంత పార్కింగ్ స్థలం లేకపోవడంతో భక్తుల వాహనాలను తులసి కాటేజ్ వద్ద నిలిపివేశారు. వేములవాడలో... వేములవాడ: రాజన్నసిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచి భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. దీంతో సర్వ దర్శనానికి 5 గంటల సమయం పడుతున్నది. భక్తుల రద్దీతో ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఆలయంలో శీఘ్ర దర్శనాన్ని అధికారులు అమలు చేశారు. -
ఫిన్లాండ్ వధువు..వేములవాడ వరుడు
వేములవాడ: ప్రేమకు హద్దులు ఉండవంటారు నిజమే వీరి ప్రేమకు దేశాలు హద్దు కాలేదు. ఫిన్లాండ్ ఎక్కడ..వేములవాడ ఎక్కడ..?అయినా ఈ జంట, సోమవారం ఉదయం కృష్ణప్రసాద్, జొహన్నా స్థానిక రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. పట్టణం యువకుడు, ఫిన్లాండ్కు చెందిన యువతి దంపతులయ్యారు. సీహెచ్ కృష్ణప్రసాద్ మూర్తి ఉన్నత చదువుల కోసం నాలుగేళ్ల క్రితం ఫిన్లాండ్ దేశానికి వెళ్లాడు. అతడు చదువుతున్న యూనివర్సిటీలోనే అక్కడి టామ్సెరె నగరానికి చెందిన సరినెన్ జొహన్నా చదువుకుంటోంది. వారిద్దరి మధ్య మొదలైన పరిచయం ప్రేమగా మారింది. రెండు కుటుంబాల వారు పెళ్లికి కూడా అంగీకరించడంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. -
14 నుంచి ‘రాజన్న’ బ్రహ్మోత్సవాలు
► 15న కల్యాణోత్సవం ► సన్నాహాలు చేస్తున్న అధికారులు వేములవాడ : వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వచ్చేనెల 14 నుంచి 18వరకు రాజన్న బ్రహ్మోత్సవాలు నిర్వహించేందకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. మహాశివరాత్రి ముగిసిన అనంతరం శివకల్యాణోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 15న పార్వతీ రాజరాజేశ్వర స్వామివార్ల కల్యాణోత్సవం, 16న సదస్యం, 17న సాయంత్రం ఉత్సవమూర్తుల రథోత్సవం, 18న అవబృత స్నానం, త్రిశూల యాత్ర, ఏకాదశవరణములతో బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయని అర్చకులు తెలిపారు. రాష్ట్రంలోని మిగతా శైవ క్షేత్రాలలో ‘కారణాగమము’ అనుసరించి మహాశివరాత్రి పర్వదినం రోజునే కల్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలు జరుపుకుంటారు. కానీ వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో ‘స్మార్థ వైదిక’ పద్ధతిని అనుసరించి మహాశివరాత్రి అనంతరం కామదహనం మరుసటి రోజున పార్వతీపరమేశ్వరుల వివాహం నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. ఇరుకైన ప్రదేశంతో ఇబ్బందులు రాజన్న భక్తులు, శివపార్వతులు కల్యాణోత్సవంలో పాల్గొని శివుడిని వివాహమాడటం ఆనవాయితీగా వస్తోంది. ఆలయంలోని అద్దాల మంటపంలో శివకల్యాణోత్సవం జరిపిస్తారు. లక్షలాదిగా తరలివచ్చే శివపార్వతులకు ఈ స్థలం ఏ మూలనా సరిపోవడం లేదు. ఇరుకైన ప్రదేశంలో కల్యాణోత్సవం నిర్వహించడం వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు ఇప్పటికే శివపార్వతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత రాజన్న గుడిలో జరిగే ఉత్సవాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న క్రమంలో ఈసారి కల్యాణోత్సవ వేదికను మార్పు చేస్తారా..? లేక అదే ప్రాంతంలో కొనసాగిస్తారా అన్న సందేహాలు ప్రారంభమయ్యాయి. -
ఏంచేశారని జనచైతన్య యాత్రలు?
ఇళ్లు, ఇళ్ల స్థలాలకోసం ఎమ్మెల్యే అనంతలక్షి్మని నిలదీసిన మహిళలు ∙చేసింది తక్కువ–చెప్పేది ఎక్కువ ∙వేములవాడవాసుల అసంతృప్తి వేములవాడ (కరప) : మండలంలోని వేములవాడలో ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి పార్టీనాయకులు, కార్యకర్తలతో కల్సి నిర్వహించిన జన చైతన్యయాత్రలో మహిళల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. గురువారం వేములవాడలో జరిగిన జన చైతన్యయాత్రలో గ్యాస్ కనెక్షన్లు, పెట్టుబడి నిధి చెక్కులు పంపిణీచేసున్నారని చెపితే మహిళాశక్తి సంఘ సభ్యులు తరలివచ్చారు. ఎమ్మెల్యే అనంతలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు బుంగా సింహాద్రి తదితరులు కాలనీవద్ద ఈ మేరకు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే అనంతలక్ష్మి దంపతులతో పాటు పలువురు నాయకులు ఊకదంపుడు ప్రసంగాలిచ్చారు. ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చాకా ఏం చేశారని చైతన్య యాత్రలు నిర్వహిసున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిపించినందుకు మీరుణం తీర్చుకునేందుకు ఏపనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పగా కొంతమంది మహిళలు ఏదో అడగడానికి ప్రయత్నించగా స్థానిక నాయకులు వారిని అడ్డుకున్నారు. పంపిణీకార్యక్రమం అయినతర్వాత మహిళలు ఎమ్మెల్యే చుట్టుముట్టి తమ సమస్యలను ఏకరువుపెట్టారు. రెండేళ్లుగా తిరుగుతున్నా హౌసింగ్లోన్ ఇవ్వలేదని, మరుగుదొడ్డి బిల్లులు ఇవ్వడంలేదని, ఇంటి స్థలం ఇవ్వలేదని అడుగుతుండగా స్థానికనాయకులు అక్కడనుంచి జారుకున్నారు. ఇప్పటికే కొంతమందికి ఇచ్చామని, రానున్నరోజుల్లో అర్హులందరికీ గృహరుణాలు ఇస్తామన్నారు. ఇవ్వడంజరుగుతుందని సద్దిచెప్పి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ప్రచురించిన కరపత్రంలో అవాస్తవాలు ఉన్నాయని వారు వివరిచారు. ఈ సందర్భంగా హైస్కూలులో మూడేళ్లుగా గదుల నిర్మాణం పూర్తికాక విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. కాపుకార్పొరేషన్ ద్వారా 14 మందికి ఇచ్చామన్న రుణాలు ఎవరికి ఇచ్చారో చెప్పాలన్నారు. ఈసారి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెపుతామని ప్రజలు తెలిపారు. -
రాజన్న ఆలయంలో బయోమెట్రిక్
వేములవాడ : రాజన్న ఆలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు బయోమెట్రిక్ విధానం అమల్లోకి వచ్చింది. గురువారం ఆలయ ఉద్యోగులు బయోమెట్రిక్ మిషన్ వద్ద హాజరు నమోదు చేసి విధులకు హాజరయ్యారు. రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆలయ అధికారులు ఉద్యోగుల వేలిముద్రలు సేకరించారు. ప్రధాన ఆలయంలో అర్చకులు, ఉద్యోగులకు విచారణ కార్యాలయం, ఎస్టాబ్లిష్మెంట్ కార్యాలయంలో మొత్తం మూడుచోట్ల బయోమెట్రిక్ మిషన్ ఏర్పాటు చేసినట్లు ఈవో దూస రాజేశ్వర్ తెలిపారు. ఇప్పటి వరకు విధులకు గైర్హాజరవుతూ నిర్లక్ష్యం వహించిన సిబ్బంది కొందరికి ఈ విధానం మింగుడుపడడం లేదు. -
రాజన్న సన్నిధిలో వరుణయాగం
7,8,9 తేదీల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు వేములవాడ : వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధిలో ఆగస్టు 7,8,9 తేదీల్లో రుష్యశృంగ వరుణయాగం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. శనివారం ఆలయ కార్యనిర్వహణాధికారి దూస రాజేశ్వర్ అర్చకులు, పూజల విభాగం సిబ్బందితో సమావేశం నిర్వహించి యాగం ఏర్పాట్లపై చర్చించారు. రుష్యశృంగ మహాముని విగ్రహ ప్రతిష్ట, వరుణజపం, స్వామివారికి సంతత ధారాభిషేకం, వరుణయాగహవనంతోపాటు అనుబంధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మూడు రోజులపాటు ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు ఈవో రాజేశ్వర్ తెలిపారు. భక్తులు రాజన్న దర్శనం, కోడె మొక్కులు, కల్యాణాలు, సత్యనారాయణ వ్రతాలు చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. గతంలో వరుణయాగం ధర్మగుండం పక్కన నిర్వహించేవారు. దీంతో భక్తులకు ఇబ్బంది కలుగుతున్నట్లు భావించి ఈసారి ఆలయం ముందు భాగంలో యాగశాల ఏర్పాటు చేస్తున్నారు. -
వేములవాడలో అతిపెద్ద బస్టాండ్
స్థలాన్ని పరిశీలించిన అధికారులు వేములవాడ : వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తుల కోసం గుడిచెరువు కట్టకింద 20 ఎకరాల్లో 40 ప్లాట్ఫాంలతో అతిపెద్ద బస్టాండ్ నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. స్థలాన్ని టూరిజం, వీటీడీఏ, స్థానిక అధికారులు ఆదివారం పరిశీలించారు. బస్టాండుతోపాటు డార్మెటరీహాల్, సమాచారకేంద్రాలు నిర్మించనున్నట్లు చెప్పారు. వీటీడీఏ ఎస్టేట్ ఆఫీసర్ రమేశ్ లొలేవార్, ఆర్కిటెక్ నాగరాజు, ముక్తీశ్వర్, ఆలయ డీఈ రఘునందన్, సైస్ డైరెక్టర్లు రామతీర్థపు రాజు, జడల శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు నామాల లక్ష్మీరాజం, పొలాస నరేందర్, పెంట బాబు, ఇప్పపూల విజయ్, పుల్కం రాజు, నిమ్మశెట్టి విజయ్, ముద్రకోల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
రాజన్నను దర్శించుకున్న చందులాల్
కరీంనగర్: వేములవాడ రాజ రాజేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర గిరిజనాభివృద్ధి, పర్యాటక శాఖ మంత్రి చందులాల్ శనివారం దర్శించుకున్నారు. సతీసమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక పూజ ఏర్పాట్లను చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. త్వరలోనే ఆలయాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చుదిద్దుతామని మంత్రి తెలిపారు. -
సిరిసిల్ల కేంద్రంగా రాజాద్రి జిల్లా
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 24 జిల్లాలను ఏర్పాటు చేయాలని తీవ్రంగా కసరత్తు చేస్తున్న తరుణంలో సిరిసిల్ల కేంద్రంగా వేములవాడ రాజన్న జిల్లా (రాజాద్రి) అనూహ్యంగా తెరపైకి వచ్చింది. కలెక్టర్ నీతూప్రసాద్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో జగిత్యాల జిల్లాలతోపాటు సిరిసిల్లను జిల్లా చేయాలని ప్రతిపాదించారు. సీఎం కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ సిరిసిల్లకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఆయన అభీష్టం మేరకే జిల్లా ఏర్పాటు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఈనెల 7,8 తేదీల్లో హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. సీసీఎల్ఏ ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ సిరిసిల్ల జిల్లా ఏర్పాటుపై చర్చించారు. ఆ తరువాత సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలోనూ సిరిసిల్ల జిల్లా ఏర్పాటుపై కసరత్తు చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో భద్రాచలం, యాదగిరిగుట్ట, వేములవాడ పుణ్యక్షేత్రాలు ప్రధాన ఆలయాలుగా ఉన్నాయి. వీటిలో భద్రాద్రి, యాదాద్రి పేరిట కొత్త జిల్లాలు అవతరించబోతున్నందున వేములవాడ రాజన్న పేరుతో సిరిసిల్ల-వేములవాడ నియోజకవర్గాలను కలుపుతూ కొత్తగా రాజాద్రి జిల్లా ఏర్పాటుచేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని సీఎం ఈ సమావేశంలో వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేసీఆర్ సూచనలతో జిల్లా యంత్రాంగం ఆగమేఘాల మీద సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు చకచకా పావులు కదుపుతోంది. -
వేములవాడ చేరుకున్న చిన్నజీయర్స్వామి
వేములవాడ అర్బన్: చిన్నజీయర్ స్వామి ఆదివారం కరీంనగర్ జిల్లా వేములవాడకు చేరుకున్నారు. రాజరాజేశ్వరస్వామి ఆలయ మాజీ చైర్మన్, బీజేపీ రాష్ట్ర నాయకుడు అది శ్రీనివాస్ ఇంట్లో జరగనున్న ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొంటారు. చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం వేములవాడలో శోభాయాత్ర జరగనుంది. సోమవారం ఉదయం గుడిచెరువుకట్ట వద్ద శ్రీరామ పాదుకా పట్టాభిషేకం నిర్వహించనున్నారు. -
గర్భవతినని నమ్మించేందుకే..!
వేములవాడ: గర్భంరాకున్నా.. ఉందని చెప్పుకుని.. దానిని నిజం చేసేందుకే కొడిమ్యాలకు చెందిన లావణ్య రాజన్న ఆలయం వద్ద నిద్రిస్తున్న బాలుడిని కిడ్నాప్ చేసిందని పోలీసులు గుర్తించారు. ఆమెను శుక్రవారం విలేకరుల ఎదుట అరెస్టు చూపారు. సంఘటన వివరాలను సీఐ శ్రీనివాస్ తన కార్యాలయంలో వెల్లడించారు. హుజూరాబాద్కు చెందిన లావణ్యకు 2000 సంవత్సరంలో వివాహమైంది. మూడేళ్ల అనంతరం రోడ్డు ప్రమాదంలో భర్త చనిపోయాడు. దీంతో అమ్మమ్మగారి ఊరైన కొడిమ్యాలకు వచ్చిపోయేది. ఈక్రమంలో సందిరెడ్డి రవీందర్రెడ్డి అనే వీడియోగ్రాఫర్తో పరిచయం ఏర్పడింది. అనంతరం వీరిద్దరు ప్రేమవివాహం చేసుకున్నారు. వారికో పాప పుట్టింది. దీంతో ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. అత్త, ఆడపడుచులు సూటిపోటీ మాటలు పడలేక.. తనకు ఎలాగైనా కొడుకు కావాలని ప్లాన్ వేసుకుంది. ఇటీవల ఆమె గర్భందాల్చినా.. అబార్షన్ అయ్యింది. ఈ విషయాన్ని దాచిపెట్టి తన గర్భవతినని అందరికీ చెప్పుకుంది. మే ఎనిమిదిన తన డెలీవరి అని, పుట్టింటికి వెళ్తున్నానని గత నెల 4న బయల్దేరింది. గర్భం లేకపోవడం.. సమయం దగ్గరపడుతుండడంతో బాలుడి కోసం వెదకడం ప్రారంభించింది. గతనెల 29న వేములవాడ చేరుకుని రాజన్న ఆలయ ఆవరణలో వెదికినా.. బాలురు కనిపించకపోవడంతో వెనుదిరిగింది. తిరిగి ఈనెల 3న మళ్లీ రాజన్న గుడికి చేరుకుంది. అప్పటికే నల్లగొండ జిల్లా నుంచి వచ్చిన కొమ్ము కల్పన ఒడిలో ఉన్న నాలుగు నెలల చిన్నారిని గమనించింది. అర్ధరాత్రి మూడు గంటల సమయంలో కల్పన తల్లి ధర్మగుండం వైపు వెళ్లాక బాలుడితో పరారయ్యింది. అక్కడ్నుంచి ఓ ఆటోలు కరీంనగర్ చేరుకుంది. కరీంనగర్లో తనకు నార్మల్ డెలవరీ అయ్యిందంటూ కుటుంబసభ్యులందరికీ ఫోన్ ద్వారా సమాచారం అందించింది. అందరూ కలిసి కొడిమ్యాలకు చేరుకున్నారు. అందరితో కలిసి సంబరాలు జరుపుకుంది. అయితే బాలుడు కనిపించడం లేదంటూ కల్పన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్పెషల్ టీం రంగంలోకి దిగింది. సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా లావణ్యను గుర్తించి నేరుగా కొడిమ్యాల చేరుకుని బాలుడిని తీసుకొచ్చి కల్పనకు అప్పగించామని సీఐ వివరించారు. రాజన్న దర్శనం కోసం వచ్చే భక్తులు తమ వస్తువులు, పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని, 100 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. -
వేములవాడ రాజన్న దశ మారేనా?
వేములవాడ అర్బన్ : పేదల దేవుడు, రాష్ట్రంలోనే అతిపెద్ద ఆలయం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి ఎమ్మెల్యే రమేశ్ చెన్నమనేని రూ.145 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టేలా ప్రతిపాదనలు తయూరు చేశారు. వీటిని ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయానికి అందజేసినట్లు తెలిసింది. ఇతర ఆలయూలకు రూ.కోట్లు వెచ్చిస్తున్న సీఎం కేసీఆర్.. ఎములాడ రాజన్నను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపణలు వస్తున్నారుు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని రాజన్న భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ అధికారులతో కసరత్తు చేయించారు. పలు అభివృద్ధి పనులపై నివేదిక రూపొందించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే సీఎం కేసీఆర్ వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించే అవకాశాలున్నట్లు టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే జర్మనీ పర్యటన ముగిశాక సీఎం పర్యటన తేదీ ఖరారవుతుందని అంటున్నారు. కేసీఆర్పైనే ఆశలు.. ముఖ్యమంత్రి కేసీఆర్ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.200 కోట్లు వెచ్చిస్తామని, రాజన్న భక్తుల సమస్యలు పరిష్కరిస్తామని, దేవస్థానాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పర్చుతామని 2012 వేములవాడ పర్యటనలో కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, తొలి ప్రభుత్వం టీఆర్ఎస్ కావడం, సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టడంతో రాజన్న ఆలయ అభివృద్ధికి చర్యలు తాసుకుంటారని పట్టణవాసులతో పాటు రాజన్న భక్తుల ఆశించారు. తొలుత యాదగిరిగుట్టపై దృష్టి సారించిన సీఎం.. అక్కడి ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు ప్రకటించడమే కాకుండా ప్రతీ బడ్జెట్లో రూ.వందకోట్లు కేటాయిస్తున్నట్లు ప్రక టించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు రాజన్నకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాల మధ్య రూ.145 కోట్ల వ్యయంతో దేవస్థానం అభివృద్ధికి ఎమ్మెల్యే నివేదిక రూపొందించి ముఖ్యమంత్రి కార్యాలయంలో సమర్పించారు. దీంతో పనుల్లో కదలిక ప్రారంభమైనట్లు భక్తులు భావిస్తున్నారు. అరుుతే, వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు సీఎం కేసీఆర్ హాజరైతే స్పష్టత వస్తుందని వారు ఆశిస్తున్నారు. -
రాజన్నకు కల్యాణశోభ
వేములవాడ అర్బన్ : శ్రీరాజరాజేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యూరుు. ఉదయం 8.15కు ఈవో దూస రాజేశ్వర్, ఏఈవోలు గౌరినాథ్, ఉమారాణి ఉత్సవాలను ప్రారంభించారు. అర్చకులకు దేవస్థానం పక్షాన వర్ని- దీక్షా వస్త్రాలు అందించారు. శివభగత్పుణ్యాహవచనము, పంచగవ్య మిశ్రణ ము, దీక్షాధారణము, రుత్విక్ వరణము, మంటప ప్రతిష్ఠ, నవగ్రహ ప్రతిష్ఠ, గౌరీ షోడశ మాతృకా ప్రతిష్ఠ, అంకురార్పణము, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము తదితర కార్యక్రమాలు నిర్వహిం చారు. స్థానాచార్యులు గోపన్నగారి శంకరయ్యశర్మ సారథ్యంలో అర్చక బృందం కల్యాణ మండపంలో భేరీ పూజ, దేవతాహ్వానము పూజలు చేపట్టారు. నేడు ఆదిదేవుల కల్యాణం రాజన్న ఆలయంలో ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే శివకల్యాణోత్సవం ఆది వారం జరగనుంది. ఉదయం 10.20కు అభిజిత్ లగ్న ముహూర్తమున పార్వతీరాజరాజేశ్వర స్వామి వారల కల్యాణం ఘనంగా నిర్వహిం చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యూరుు. సాయంత్రం 4 గంటలకు శివపురాణ ప్రవచనము, 5 గంటలకు ప్రధాన హోమము సప్తపది, లాజాహోమము, ఔపాసనము, బలిహరణము అనంతరం రాత్రి 8 గంటల కు పెద్ద సేవపై ఉత్సవమూర్తుల ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. శివకల్యాణోత్సవాన్ని తిలకించేందుకు ఇప్పటికే 50 వేలకు పైగా భక్తులు చేరుకున్నారు. నగరపంచాయతీ పక్షాన పట్టువస్త్రాలు రాజన్న పెళ్లికి స్థానిక నగరపంచాయతీ పక్షాన పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు చైర్పర్సన్ నామాల ఉమ-లక్ష్మీరాజం, వైస్చైర్మన్ ప్రతాప రామకృష్ణ, కమిషనర్ శ్రీహరి తెలిపారు. ఉదయం 9 గంటలకు కార్యాలయం నుంచి ఊరేగింపుగా రాజన్న ఆలయానికి చేరుకుని స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తామన్నారు. రాజన్న సేవలో ఉన్నత విద్యామండలి చైర్మన్ వేములవాడ అర్బన్ : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి పీఆర్వో విభాగం సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్న పాపిరెడ్డి కుటుంబసభ్యులు రాజన్నకు కోడె మొక్కు చెల్లించుకున్నారు. ఈవో దూస రాజేశ్వర్, ఏఈవో గౌరినాథ్, పీఆర్వో తిరుపతిరావు, ఏపీఆర్వో చంద్రశేఖర్, అర్చకులు పాల్గొన్నారు. -
వరంగల్ టు నాంపల్లి
వేములవాడ అర్బన్ :వరంగల్ జిల్లా నుంచి వేములవాడ ప్రాంతానికి గంజాయి సరఫరా అవుతున్నట్లు తమ విచారణలో తేలిందని ఎక్సై జ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ విజయ్ తెలి పారు. స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో బుధవా రం ఆయన విలేకరులతో మాట్లాడారు. జాతర సందర్భంగా ఎక్సైజ్శాఖ పక్షం రోజుల ముందునుంచే దాడులు నిర్వహించిందని, 50 వేల లీట ర్ల బెల్లం పానకం, పదివేల లీటర్ల గుడుంబా ధ్వంసం చేశామని పేర్కొన్నారు. 20 వాహనాలు సీజ్ చేశామని చెప్పారు. బుధవారం నిర్వహించిన దాడుల్లో రూ.10 వేల విలువైన మద్యం బాటిళ్లు పట్టుకున్నట్లు స్పష్టం చేశారు. గుడుంబా తయారు చేస్తున్న గ్రామాలను గుర్తించామని, దీన్ని అరికట్టేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మంగళవారం రాత్రి నాంపల్లిలో జరిపిన దాడుల్లో పదిన్నర కిలోల గంజాయి పట్టుకున్నామని, విచారణలో వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం ద్వారకారావుపేట నుంచి బస్సులో వేములవాడకు తరలించినట్లు తేలిందని స్పష్టం చేశారు. నాంపల్లిలోని ఓ ఇంట్లో సంప్లో గంజాయి దాచిపెట్టారని తమ దాడుల్లో బయటపడిందని వెల్లడించారు. గుడుంబా, గంజాయి విక్రయించేవారి సమాచారం తమకు 9440902702 నంబర్లో సమాచారం అందించాలని కోరారు. సమావేశంలో టాస్క్ఫోర్స్ సీఐ చంద్రశేఖర్, వేములవాడ ఎస్హెచ్వో లక్ష్మణ్, ఎస్సైలు కిషన్, అశోక్, సమ్మయ్య, నరేశ్, రవీందర్రెడ్డి, రాములు, రాజన్న, సత్యనారాయణలు పాల్గొన్నారు. -
‘రాజన్న’ మూడోకన్ను
వేములవాడ అర్బన్ : పేదల దేవుడిగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు. సోమ, శనివారాల్లో భక్తుల సంఖ్య ఒక్కోసారి లక్షల్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో దేవస్థానానికి పటిష్ట భద్రత కల్పించే దిశలో అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆలయ పరిసరాల్లో మంగళవారం 55 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు పనులు చేపట్టారు. వరల్డ్ సోర్స్ అసోసియేషన్ అనే ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే ఆలయ లోపలిభాగంలో 16 సీసీ కెమెరాలు పనిచేస్తుండగా... మరింత భద్రత కోసం ఆలయం వెలుపల ప్రధాన ప్రదేశాలను ఎంపిక చేసుకుని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. రెప్పవాల్చినా దొరికిపోయేలా వీటిని నెలకొల్పారు. గుడి ప్రధాన ఆహ్వాన ద్వారం, దానిముందే ఉన్న పోలీస్ కంట్రోల్ గదిపై, విచారణ కార్యాలయం, బద్దిపోచమ్మ ఆలయ సెంటర్, భీమేశ్వరాలయ సెంటర్, పార్వతీపురం, పార్కింగ్ స్థలం, రాజేశ్వరపురం, అంబేద్కర్చౌరస్తా, గుడి పడమర దిశలోని మహాద్వారం తదితర ప్రధాన ద్వారాల వద్ద మొత్తం 55 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ ఆలయంలోని ఎస్పీఎఫ్, స్థానిక పోలీస్స్టేషన్లలో ఉంటే కంట్రోల్ రూమ్లకు అనుసంధానం చేయనున్నారు. గుర్తించడం సులువు హుండీ సొమ్ముకు కన్నం వేసిన ఘటనలు సీసీ కెమెరాల ద్వారా గతంలో బయటపడిన ఉదంతాలున్నాయి. ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడన్నట్లుగా ఏకంగా స్వామి వారి ముందున్న హుండీలను చాకచక్యంగా తొలగించి అందులోని డబ్బులు కాజేశారు. ఇలా రాజన్న ప్రధాన ఆలయంలో ఎస్పీఎఫ్ సిబ్బంది, నాంపల్లి నర్సింహాస్వామి ఆలయంలో హోంగార్డులు దోచుకున్నారు. భక్తులు హుండీల్లో వేసిన కట్నాలూ, కానుకలతో నిండుగా కనిపిస్తున్న వైనాన్ని చూసిన వీరు హుండీలను తస్కరించేశారు. ఇవన్నీ సీసీ కెమెరాల్లో రికార్డవడంతో నిందితులను గుర్తించడం సులువైంది. ఈ నేపథ్యంలో భద్రత రీత్యా సీసీ కెమెరాల ఏర్పాటు మరింత అనివార్యమైంది. ఇప్పటికే స్మార్ట్ పోలీస్ వ్యవస్థలో భాగంగా వేములవాడ పట్టణంలో నిఘా నిమిత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా ఇప్పుడు ఆలయ పరిసరాల్లోనూ భద్రత పెంచారు. ఆన్లైన్ లింకింగ్ నాంపల్లి నర్సింహాస్వామి దేవస్థానం, రాజన్న ఆలయం, అనుబంధ దేవాలయాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల దృశ్యాలను అధికారులు చూసుకునేందుకు వీలుగా ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే నాంపల్లి నర్సింహా స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆన్లైన్కు అనుసంధానం చేశారు. దీంతో సంబంధితశాఖ అధికారులు ఎప్పుడుపడితే అప్పుడే సీసీ కెమెరా దృశ్యాలను చూసుకునే వీలున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇదే విధంగా రాజన్న ఆలయం, అనుబంధ దేవాలయాలను సైతం ఆన్లైన్లోకి లింకప్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. భక్తుల రక్షణకు, ఆలయ భద్రతకు నిఘా పెంచడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది
తాడ్వాయి/దోమకొండ, న్యూస్లైన్: అప్పటి వరకూ ఆనందంతో గ డిపిన ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. దేవుడిని దర్శిం చుకుని, మొక్కులు సమర్పించుకుని, ఎంతో ఉత్సాహంతో ఇంటికి తిరుగు పయనమైన వారిని రోడ్డు ప్రమాదం కకావికలం చేసింది. నవ్వుల స్థానంలో రోదనలు మిన్నంటాయి. కరీంనగర్ జిల్లా వేములవాడలో రాజన్నను దర్శించుకుని తిరిగి వస్తున్న జిల్లావాసులు నలుగురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం రెండు కుటుంబాలలో తీరని విషాదాన్ని మిగిల్చింది. తాడ్వాయి మండలం నందివాడకు చెందిన కమ్మరి రజిత (28), ఆమె కుమారుడు రాకేష్ (10), కూతురు అశ్విని ఈనెల 18న దోమకొండలో ఉండే తమ అమ్మమ్మ కంది సుగుణ (60) ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి బంధువులతో కలిసి సోమవారం ఆ టోలో వేములవాడకు వెళ్లి, రాజన్నను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నా రు. మంగళవారం ఉదయం దోమకొం డకు బయల్దేరారు. గంభీరావుపేట మండలం గజసింగవరం వద్ద వీరి ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. సుగుణ, ఆటోడ్రైవర్ స్నేహితుడు అబ్రబోయిన ప్రవీణ్ (18) అక్కడికక్కడే మరణించారు. రజిత, రాకేష్ సిరి సిల్ల ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణిం చారు. సుగుణ కూతురు విజయ, రజి త కూతురు అశ్విని, ఆటో డ్రైవర్ రాజుతీవ్రంగా గాయపడ్డారు. ఒకేసారి నలుగురు మరణించడంతో నందివాడ, దోమకొండలలో విషాదం నెలకొంది. బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. దేవుడిని చూసి వస్తూ దేవుడి దగ్గరికే వెళ్లిపోయారని గ్రామస్తులు కంటతడి పెట్టారు. మృతుల ఇళ్ల వద్దకు చేరుకుని విచారం వ్యక్తం చేశారు. స్నేహితుడి కోసం వెళ్లి ప్రవీణ్ డ్రైవర్ రాజు గౌడ్కు మిత్రుడు. తనతో రావాలని రాజు కోరడంతో ప్రవీణ్ ఆటోలో వెళ్లాడని తెలిసింది. ప్రమాదంలో ప్రవీణ్ మృతి చెందడంతో అతడి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాలను సిరి సిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించినట్లు బంధువులు తెలిపారు. -
లోగుట్టు రాజన్నకెరుక!
వేములవాడ రాజన్న ఆలయ తలనీలాల కాంట్రాక్టర్ ఆ పరమశివుడికే శఠగోపం పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆలయానికి బకాయిపడ్డ రూ.3.9 కోట్ల సొమ్మును చెల్లించేందుకు మొండికేస్తున్నాడు. ఇప్పటికే వాయిదా గడువు దాటిపోయినా స్పందించడం లేదు. మరో నెలరోజుల్లో ఒప్పంద గడువు సైతం ముగియనుంది. ఈలోగా కాట్రాక్టర్ నుంచి డబ్బు రాబట్టడం అధికారులకు సవాలుగా మారింది. వేములవాడ, న్యూస్లైన్: రాజన్నకు భక్తులు సమర్పించుకునే తలనీలాల వెంట్రుకలను సేకరించుకునేందు కు దేవాదాయశాఖ అనుమతితో ప్రతి సంవత్సరం అధికారులు టెండర్లు నిర్వహిస్తారు. 2012 ఫిబ్రవరిలో నిర్వహించిన టెండర్లలో 2012 నుంచి 2014 వరకు రెండేళ్ల పాటు తల నీలాలు సేకరించుకునేందుకు రూ.12.10 కోట్లకు వెంకటేశ్వర్రావు అనే వ్యక్తి కాంట్రాక్టు దక్కించుకున్నారు. తొలుత వాయిదాల ప్రకా రం నిర్ణయించిన మొత్తాన్ని చెల్లిస్తూ వచ్చారు. గత సంవత్సరం నుంచి వాయిదాలు తప్పించడంతో అధికారులు ఆయనపై ఒత్తిడి తెచ్చా రు. దీంతో కొంత గాడిలోపడ్డ కాంట్రాక్టర్ వా యిదాలు పొడగించమని కోరారు. అధికారు లు అనుమతి ఇచ్చినప్పటికీ ఆయన చెల్లింపు లు చేయలేకపోయారు. దీంతో పూచికత్తుకిం ద ఇచ్చిన చెక్కును ఆలయ అధికారులు బ్యాంకులో జమచేశారు. ఖాతాలో డబ్బులేకపోవడంతో చెక్కు బౌన్సయింది. మరింత ఒ త్తిడి చేసిన అధికారులు కోర్టు నోటీసులు పం పారు. ఓ మెట్టు దిగివచ్చిన కాంట్రాక్టర్ కొంత మొత్తాన్ని చెల్లించి మళ్లీ వాయిదా కోరాడు. అందుకు అధికారులు నిరాకరించారు. బ్లాక్ లిస్టులో పెట్టేందుకు సిఫార్సు కాంట్రాక్టర్ తీరుతో విసిగిపోయిన ఆలయ అధికారులు సదరు కాంట్రాక్టర్ను బ్లాక్లిస్టులో చేర్చాలని కోరుతూ దేవాదాయశాఖ కమిషనర్కు నివేదించారు. తనకున్న రాజకీయ పలుకుబడితో దేవాదాయ కమిషనర్ను కలిసిన కాంట్రాక్టర్ తనకు అనుకూలంగా అంతా చక్కబెట్టుకున్నారు. బ్లాక్లిస్టులో పెట్టేందుకు సిఫార్సు చేస్తూ నివేదించిన అధికారులకు దేవాదాయశాఖ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలు దిమ్మదిరిగేలా చేశాయి. కల్యాణకట్టలో ఉన్న నాయీబ్రాహ్మణులకు తోడుగా వందమంది నాయిబ్రాహ్మణులను అదనంగా నియమించాలని కమిషనర్ ఆదేశించారు. దీంతో చేసేదిలేక మళ్లీ కాంట్రాక్టర్పైనే ఒత్తిడి తెచ్చేందుకు అధికారులు సిద్ధపడ్డారు. తలనీలాలను భద్రపరిచే స్టోర్రూంను సీజ్చేశారు. బకాయి మొత్తం చెల్లించాకే అందులో ఉన్న వెంట్రుకలు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. దీంతో దిగివచ్చిన కాంట్రాక్టర్ ఇటీవలే రూ.16 లక్షలు చెల్లించారు. వెంట్రుకలు సొమ్ము రాలుస్తాయా? ఒకవేళ కాంట్రాక్టర్ డబ్బు చెల్లించకుంటే.. సీజ్ చేసిన స్టోర్రూంలోని వెంట్రుకలు రికవరీ కావల్సిన సొమ్ముతో సరితూగుతాయా.. లేదా అన్నది ప్రశ్న. ఆ వెంట్రుకలను ఆలయ అధికారులు వేలం వేద్దామన్నా వాటిని కొనేవారు ఇక్కడ అందుబాటులో లేరు. దీంతో వెంట్రుకలను వేలం వేసేవరకు వేచిచూసి బినామీ పేరిట ప్రస్తుత కాంట్రాక్టరే తక్కువ రేటుకు కొనుగోలు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయని స్థానిక నాయీబ్రాహ్మణులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. బకాయిలు కట్టకుండా దాటవేస్తున్న కాంట్రాక్టర్కు అనుకూలంగా కమిషనర్ వత్తాసు పలకడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ లోగుట్టు ఏమిటో.. రాజన్నకే తెలియాలి! -
మార్మోగిన శివనామస్మరణ
వేములవాడ, న్యూస్లైన్ : వేములవాడ శ్రీరాజేశ్వరస్వామి క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు గురువారం అంత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా తలనీలాలు సమర్పించిన భక్తులు ధర్మగుండంలో పుణ్యస్నానాలాచరించి మొక్కులు చెల్లించుకున్నారు. వేలాదిమంది శివదీక్షాపరులు శివనామస్మరణ చేస్తూ ఇరుముడులతో తరలివచ్చి దీక్షలు విరమించారు. రద్దీ అధికంగా ఉండడంతో నిత్య, నిశీ, ఆర్జిత పూజలను రద్దుచేసి లఘుదర్శనం కల్పించారు. సాయంత్రం 6.30 గంటలకు మహాలింగార్చన మొదలై రాత్రి 9గంటల వరకు కొనసాగింది. అనంతరం రాత్రి 11.30 గంటలకు లింగోద్భవ వేడుక కన్నులపండువగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక వేకువజాము వరకు కొనసాగింది. పట్టువస్త్రాల సమర్పణ మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలను ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్రావు సమర్పించారు. ఆలయ పాలకమండలి అథితిగృహంలో శాస్త్రోక్తంగా పట్టువస్త్రాలను శిరోధారణ చేసిన వీరు అశేషజనవాహిన మధ్యన లయానికి చేరుకుని స్వామివారికి సమర్పించారు. భక్తిప్రపత్తులతో మొక్కుల చెల్లింపు.. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లింపులు నిరంతరాయంగా సాగాయి. కోడెటికెట్ల కోసం భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. క్యూలైన్లలో స్పల్పంగా తోపులాట జరిగింది. పలువురు భక్తులు స్వామివారికి నిలువెత్తు బంగారం (బెల్లం) తూకం వేయించి ఆలయ ఆవరణలో పంచిపెట్టారు.తలనీలాల మొక్కులతో కల్యాణకట్ట కిక్కిరిసిపోయింది. ఇవి మినహా నిత్యపూజలన్నీ రద్దుచేయడంతో లఘుదర్శనం సాఫీగా సాగింది. దీక్షల విరమణ మండల, అర్ధమండల దీక్షలు స్వీకరించిన సుమారు ఐదువేల మంది శివస్వాములు ఓంకారనాదాలు చేస్తూ ఇరుముడులతో తరలివచ్చారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూలైన్లలో వెళ్లి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం భీమేశ్వరాలయానికి చేరుకుని దీక్షలు విరమించారు. రాజన్న సేవలో ప్రముఖులు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీరాజరాజేశ్వరస్వామి సేవలో పలువురు ప్రముఖులు తరించారు. బీజేపీ జాతీయ నాయకుడు బండారు దత్తాత్రేయ, ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఎమ్మెల్సీలు టి.సంతోష్కుమార్, వెంకట్రావు, కలెక్టర్ వీరబ్రహ్మయ్య దంపతులు, ఎస్పీ శివకుమార్, ఓఎస్డీ సుబ్బరాయుడు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. దత్తాత్రేయ స్వామివారికి కోడెమొక్కు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు. అంచనాలు తారుమారు.. మహా జాతరకు సుమారు నాలుగు లక్షల మంది తరలివస్తారని ఆలయ వర్గాలు వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. సుమారు రెండు లక్షల మంది మాత్రమే వచ్చినట్లు అంచనా. శుక్రవారం మరో లక్షమంది భక్తులు రావచ్చునని అధికారులు భావిస్తున్నారు. మొత్తమ్మీద మహాశివరాత్రికి మూడు లక్షలు మించి జనం రాకపోవచ్చునని స్పష్టమవుతోంది. భక్తుల ఏర్పాట్లను ఉత్సవాల ప్రత్యేకాధికారి, జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఆలయ చైర్మన్ బొమ్మ వెంకటేశ్వర్లు, ఈవో సిహెచ్వీ.కృష్ణాజీరావు, ధర్మకర్తలు, అరుణ్తేజాచారి, సగ్గు పద్మాదేవరాజ్, ఆకునూరి బాలరాజు, సింగిరెడ్డి స్వామిరెడ్డి, గుండా చంద్రమౌళి, కుమటాల శ్రీనివాస్, బండం మల్లారెడ్డి, విజయారాజంతోపాటు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగు మనోహర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి తదితరులు పర్యవేక్షించారు. సిరిసిల్ల డీఎస్పీ దామెర నర్సయ్య నేతృత్వంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
పొన్నం ప్రభాకర్ చూపు ఎటువైపు?
రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్ - ఢిల్లీలో మంచి హొదా - కాంగ్రెస్ అధిష్టానంతో సాన్నిహిత్యం - కేంద్ర మంత్రులతో పరిచయాలు - అధిష్టానం దృష్టిలో మంచి బాలుడుగా గుర్తింపు పొందారు కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్. 2014 ఎన్నికలలో పొన్నం చూపు ఢిల్లీ వైపా? హైదరాబాద్ వైపా? అంటే హైదరాబాద్ వైపే అంటున్నారు. ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దేశ రాజధానిలో కొనసాగుతున్న హవాను వదులుకొని ఆయన హైదరాబాద్ రావాలని ఎందుకు అనుకుంటున్నారు?. లోక్సభ నుంచి స్థాయి దిగి రాష్ట్ర శాసనసభకు రావాలన్న ఆలోచనలకు కారణాలు ఏమిటి? ఢిల్లీలో ఎంత గుర్తింపు ఉన్నప్పటికీ ఆయన హైదరబాద్పై మోజుపడుతున్నారు. దాంతో రాష్ట్రంలో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యేందుకు తన వ్యూహం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. మొట్టమొదటిసారిగా ఎంపీగా ఎన్నికైనా, చిన్న వయసైనప్పటికీ పొన్నం ప్రభాకర్కు మంచి హోదా లభించింది. రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్గా ఎంపికయ్యారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం పొన్నం నైజం. అధిష్టానం అడుగుజాడల్లో నడుచుకోవడం ఆయనకు అలవాటైపోయింది. మారిన రాజకీయ పరిస్థితుల్లో అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటూ మంచి మార్కులే కొట్టేశారు. అధిష్టానం కూడా ఆయనను నమ్మదగిన వ్యక్తిగా గుర్తించింది. అందుకే మరోసారి కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి బరిలోకి దింపుతామని భరోసా కూడా ఇచ్చింది. అయితే మళ్లీ లోక్సభకు పోటీ చేయడానికి పొన్నం సుముఖంగా ఉన్నట్లు లేరు. లోక్సభకు కాకుండా, శాసనసభకు పోటీ చేయడానికే పొన్నం ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అందు కోసం ముందుగానే ఆయన రెండు శాసనసభ నియోజకవర్గాలను కూడా ఎంపిక చేసుకున్నట్లు కరీంనగర్ జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఉన్నట్టుండి ఆయన ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఏమిటని అందరూ ఆశ్ఛర్యపోతున్నారు. అందుకు రెండు ప్రధాన కారణాలు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి అన్ని అవకాశాలు అనుకూలంగా ఉన్న క్రమంలో ప్రజలు ఆదరించే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై ఉన్న మోజుతో ప్రజలు ఎంపిగా ఓడిస్తారేమోనన్న భయం పొన్నంను వెంటాడుతున్నట్లు భావిస్తున్నారు. అందుకే ఉన్నంతలో శాసనసభ్యునిగా పోటీ చేయడం మంచిదన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తెలంగాణ ఏర్పడితే అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన గట్టి నమ్మకం. దాంతో తనకు మంత్రి పదవి దక్కకపోతుందా అన్న ఆలోచనలో పొన్నం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికలలో ఆయన వేములవాడ, కరీంనగర్ అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఆ ఆలోచనతోనే ఎంపీ నిధులను ఎక్కవగా ఈ రెండు నియోజకవర్గాల్లోనే ఖర్చు చేస్తున్నారు. అలాగే ఈ రెండు నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులతో తరచూ సమావేశమవుతున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. -
‘ఆరాధన’.. అరణ్యరోదన
వేములవాడ, న్యూస్లైన్: ఒకప్పుడు ఘంటసాల, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, జిక్కీ, జానకీ వంటి మహామహులు గానం చేసిన వేదిక అది.. నేడు పేరెన్నికగన్న ఒక్క కళాకారుడు లేని వైనం.. గాత్ర కచేరీలకు బదులు సినీ భక్తి గీతాలాపన చేసే దైన్యం.. ఇదీ ఏటా రాజన్న ఆలయంలో నిర్వహించే త్యాగరాజ ఆరాధనోత్సవాల ప్రహసనం. క్రమంగా వేడుకలు కళతప్పుతున్నాయి. అంతేకాకుండా ఆహ్వాన పత్రిక ముద్రణ విషయంలో నిర్లక్ష్యం. కార్యక్రమ తేదీలను తప్పుగా ముద్రించిన నిర్లిప్తత. ఆరు దశాబ్దాల క్రితం అంకురించిన ఈ ఉత్సవాలు కీర్తి ఏటా దిగజారుతుంది. ఆరు దశాబ్దాల చరిత్ర.. ఈ సంవత్సరం 61వ త్యాగరాజ ఆరాధనోత్సవాలను ని ర్వహించేందుకు రాజన్న ఆలయ అధికారులు రంగం సి ద్ధం చేశారు. ఈనెల 21 నుంచి 25 వరకు ఈ వేడుకలు నిర్వహించనున్నారు. మొదట బ్రాహ్మణుడైన చెవిటి సాంబమూర్తి ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఆయన తదనంతరం రాజన్న ఆలయం ఈ బాధ్యతను నిర్వర్తిస్తుంది. కాలక్రమేనా ఇక్కడికి వచ్చిన అధికారులు సైతం వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించారు. అంతే అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిం చారు. అయితే ఏటా బడ్జెట్ పెరుగుతున్న ఉత్సవాల కీర్తి తగ్గుతుంది. ఇక ఆహ్వానపత్రికలోని రెండో పేజీలో ఉత్సవాల తేదీలను సైతం తప్పుగా ముద్రించారు. ఒకప్పటి తో పోలిస్తే ఆదాయం పదింతలు పెరిగింది. అయినా ని ర్వహణ మాత్రం అంతంతే. ఉత్సవాల నిర్వహణ బాధ్యతలను ఓ జూనియర్ అసిస్టెంట్ కేడర్ అధికారి తీసుకున్నారు.అయితే అతను ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై ఉన్నతాధికారులు, పాలకవర్గం దృష్టి పెట్టకపోవడం శోచనీయం. అయినవారికీ, బంధుప్రీతికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రూ.4 లక్షలతో 45 కార్యక్రమాలు ఈ సంవత్సరం సుమారు రూ. 4 లక్షలకు పైగా బడ్జెట్ను కేటాయించారు. కార్యక్రమాల విషయానికొస్తే 5 రోజుల పాటు 45 కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆహ్వానపత్రిక సూచిస్తుంది, దురదృష్టమేమిటంటే ఈ ఐదు రోజుల్లో ఏనాడూ ఒక్క పేరెన్నికగన్న కళాకారుడి కార్యక్రమం లేకపోవడం. ఒకరిద్దరు కళాకారుల గాత్రకచేరీలు మినహా అంతా మమ అనిపించేలా తెలుస్తుంది. ఇక త్యాగరాజ కృతులు వినిపించాల్సిన వేదికపై సినీ భక్తిసంగీతం, హరికథ, బుర్రకథలకు ప్రాధాన్యతనిస్తున్న తీరు ఇందుకు నిదర్శనం. -
మహాశివరాత్రి పనులకు టెండ‘రింగ్’
వేములవాడ, న్యూస్లైన్ : వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి జాతర సందర్భంగా చేపట్టనున్న పనులకు టెండర్ ప్రక్రియ సోమవారం ముగిసింది. ఒకే పనిని రెండు మూడు పనులుగా విభజించి నిబంధనలను అతిక్రమించిన ఆలయ అధికారులు.. కాంట్రాక్టర్లకు టెండర్లు కట్టబెట్టడంలోనూ కనీస నియమాలు పాటించలేదు. ముందుగా అనుకున్నట్టే పలువురు కాంట్రాక్టర్లు రింగయి పనులను దక్కించుకున్నారు. మొత్తం 20 పనుల్లో.. నాంపెల్లి గుట్టపై ప్రధాన దేవాలయం చుట్టూ గాల్వాల్యూమ్ షెడ్డు నిర్మాణం, ధర్మగుండం వద్ద 5హెచ్పీ పంపులు, డీజిల్ ఇంజిన్ ఏర్పాటుకు టెండర్లు దాఖలు కాలేదు. మిగిలిన 18 పనుల్లో తొమ్మిది పనులకు రింగైన కాంట్రాక్టర్లు అధిక ధరలు కోట్ చేశారు. మిగతా తొమ్మిది పనుల్లో రెండింటికి అంచనాల ప్రకారం.. మరో ఏడింటికి లెస్కు కోట్ చేసి పనులను దక్కించుకున్నారు. కాంట్రాక్టర్లు రింగయ్యారన్న అనుమానం వచ్చిన ప్రతీసారి టెండర్లను రద్దుచేసి బహిరంగవేలం వేసే అధికారులు.. ఈసారి మాత్రం సీల్డు టెండర్లలో పేర్కొన్న విధంగానే పనులను అప్పగించేందుకు సిద్ధపడ్డారు. ఎక్సెస్, లెస్ ఇలా.. ఆలయ ఆవరణలో రెండు నెలలు తాత్కాలిక పందిళ్లు వేసే పనికి రూ.4.60 లక్షలు కాగా, 4శాతం ఎక్సెస్, పది రోజులకు రూ.4.80 లక్షల పనికి 8శాతం లెస్, ఏడు నెలలు 12 ఫీట్ల ఎత్తుతో పందిళ్ల ఏర్పాటుకు రూ.4.99 లక్షలు కాగా, 4.95శాతం ఎక్సెస్, 16 ఫీట్ల ఎత్తుతో పందిళ్ల ఏర్పాటుకు రూ.1.90 లక్షలకు, 4.95 ఎక్సెస్కు టెండర్లు దాఖలయ్యాయి. నాంపెల్లి గుట్టపై పందిళ్లు వేసే పనికి రూ.95 వేలు కాగా, యథాతథంగా, ప్రధానాలయానికి రంగులు వేసే పనికి రూ.2.75 లక్షలు, ధర్మగుండం, ఆర్సీసీ ఆర్చీగేట్లకు రంగులు వేసే పనులకు రూ.2.25 లక్షలు కాగా, ఈ రెండు పనులు 5శాతం లెస్కు కోట్ చేశారు. అనుబంధ దేవాలయానికి రంగులు వేసే పనికి రూ.4.60 లక్షలుగా నిర్దేశించగా, 10శాతం లెస్తో ఇద్దరు కాంట్రాక్టర్లు కోట్ చేశారు. దీంతో డ్రాతీసి ఈ పనులను అప్పగించేందుకు అధికారులు నిర్ణయించారు. నందీశ్వర కాంప్లెక్స్లోని బ్లాక్నంబర్-1, బ్లాక్ నంబర్-2 వసతిగదుల్లో ఎలక్ట్రిక్ కీట్యాగ్ స్విచ్సిస్టం ఏర్పాటుకు ఒక్కో బ్లాక్ రూ.లక్ష చొప్పున నిర్ణయించగా, 4.25 శాతం ఎక్సెస్కు, ప్రధాన ఆలయం ఆవరణలోని ఫ్లై-ఓవర్ బ్రిడ్జిల ప్లాట్ఫారాలకు అల్యూమినియం ప్లేట్లు బిగించేందుకు రూ 1.20 లక్షలు కాగా, 2శాతం ఎక్సెస్కు, నాంపెల్లి గ్రామ రహదారిపై కేదారేశ్వర పెట్రోల్ బంక్వద్ద రూ.4.70 లక్షలతో నిర్ధేశించిన ఐరన్ ఆర్చిగేట్ ఏర్పాటు పనులను అంచనాల ప్రకారం దక్కించుకున్నారు. అనుబంధ ఆలయాల ముందుభాగంలో గ్రానైట్ ఫ్లోరింగ్ పనులను రూ.4.70 లక్షలు నిర్ణయించగా, 4.99 శాతం ఎక్సెస్కు, బస్డిపో వద్ద ఆలయానికి చెందిన ఖాళీ స్థలం చుట్టూ రూ.145 లక్షలతో కంచె ఏర్పాటు పనికి 4.99 శాతం లెస్తో, బాలానగర్ వద్దనున్న ఆలయం ఖాళీస్థలం చుట్టూ రూ.3.40 లక్షలతో ఫెన్సింగ్ వేసే పనిని 6శాతం లెస్తో దక్కించుకున్నారు. మొదటి బైపాస్ శివారులోని ఖాళీ స్థలంచుట్టూ 1.75 లక్షలతో ఫెన్సింగ్ పనిని 4.99శాతం లెస్తో, జాతరగ్రౌండ్లోని గోశాల షెడ్డు ఎత్తును పెంచేందుకు రూ.1.20 లక్షల పనికి 2శాతం ఎక్సెస్తో, నగరేశ్వరస్వామివారి ఆలయానికి విమానగోపురం పునర్నిర్మాణానికి రూ.12 లక్షల పనిని 4.81శాతం ఎక్సెస్తో కాంట్రాక్టర్లకు అప్పగించారు. -
అలేఖ్య.. లవ్ చీటర్ !
వేములవాడ, న్యూస్లైన్ : వేములవాడకు చెందిన పూర్ణచందర్ ప్రేమ పేరుతో తనను వంచించాడని, న్యాయం చేయాలని అతడి ఇంటిముందు బైఠాయించి నానారభస చేసిన అలేఖ్యరెడ్డి అమాయకురాలేమీ కాదు.. ఆమె కూడా ఓ పెద్ద మోసగత్తె అనే విషయం ఆలస్యంగా తెలిసింది. బీటెక్ స్టూడెంట్నని, రెవెన్యూ ఇన్స్పెక్టర్నని రకరకాల హోదాలు చెప్పి యువకులతో పరిచయాలు పెంచుకోవడం.. కొద్దిరోజుల తర్వాత ప్రేమిస్తున్నానంటూ వలపుల వల వేయడం.. తర్వాత తనను మోసం చేశాడంటూ కేసులు పెట్టి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేయడం.. ఇదీ ఆమె అసలు నైజం! అలేఖ్య వలలో చిక్కుకుని ఆమె భర్తతోపాటు నలుగురు యువకులు కేసులపాలు కాగా.. పూర్ణచందర్ అయిదో వ్యక్తి. అతడు తనను మోసం చేశాడంటూ ఫొటోలు చూపించి స్థానికులను, పోలీసులను, మీడియాను సైతం తప్పుదారిపట్టించింది. పూర్ణచందర్ కూడా అలేఖ్య దారిలోనే వెళ్లి ఆమె వలలో చిక్కుకున్నాడు. పూర్ణచందర్-అలేఖ్య వ్యవహారంపై ‘ప్రేమాయకుడు’ శీర్షికతో ‘సాక్షి’లో వచ్చిన కథనం హైదరాబాద్ టాబ్లాయిడ్లోనూ ప్రచురితమైంది. ఈ కథనాన్ని చదివిన సరూర్నగర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ దివ్యారెడ్డి స్పందించి అలేఖ్య అసలు చరిత్రను బయటపెట్టారు. వలపుల వలలో చిక్కితే అంతే.. వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన అలేఖ్యరెడ్డి ఉరఫ్ బుజ్జీ ఉరఫ్ హేమ పసితనంలోనే తల్లి మరణించడంతో తండ్రి మరో వివాహం చేసుకున్నాడు. అలేఖ్య విద్యాభ్యాసం కోసం హైదరాబాద్ వెళ్లి ఉమెన్ ్స హాస్టల్లో ఉంటూ చదువుకుంది. ఈక్రమంలోనే రవీందర్ అనే వ్యక్తిని వివాహమాడింది. కొంతకాలానికి రవీందర్తోపాటు ఆయన కుటుంబసభ్యులపై సరూర్నగర్ మహిళా పోలీస్టేషన్లో వేధింపుల కేసుపెట్టింది. క్రైం నంబర్ 14/13 ప్రకారం 420, 498(ఎ) 3అండ్4/డీపీ యాక్ట్ కేసులు బాధితులపై నమోదయ్యాయి. * చైతన్యపురి పోలీస్స్టేషన్లో క్రైం నంబర్ 385/12 ప్రకారం.. జగ దీశ్వర్ అనేవ్యక్తిపై చీటింగ్, కిడ్నాప్ 324,509 కింద కేసులు పె ట్టింది. ఇక్కడా బాధితుడు బోరుమన్నాడు. * మరో వ్యక్తిపై క్రైం నంబర్ 62/13 ప్రకారం 342, 366, 307, 506, ఆర్/డబ్ల్యూ 34 సెక్షన్లతో కేసుపెట్టింది. తాజాగా హైదరాబాద్లో ఉంటున్న పూర్ణచందర్ ఆమె వలలో చిక్కాడు. ప్రేమపేరిట తనను వంచించాడని, కిడ్నాప్చేసి వేధించాడని పేర్కొంటూ చిక్కడపల్లి పోలీస్స్టేషన్లో క్రైం నంబర్ 421/13 ప్రకారం 420, 323, 506 కేసులు పెట్టింది. దీంతో పూర్ణచందర్తోపాటు అతడి తల్లిదండ్రులు రాధ, రాంచందర్ రిమాండ్ కాలాన్ని జైల్లో గడిపారు. ఇటీవలే విడుదలైన వీరు వేములవాడకు వచ్చారు. ఇది తెలుసుకున్న అలేఖ్యరెడ్డి శనివారం రాత్రి వేములవాడకు వచ్చి అతడి ఇంటిముందు బైఠాయించి కొ త్త డ్రామాకు తెరలేపింది.ఈమె రాకతో పరు వుపోతుందని భావించిన వీరు ఇంటికి తా ళంవేసి వెళ్లిపోయారు. దీంతో అలేఖ్య ఆరోపణలు నిజమేనని స్థానికులు నమ్మేశారు. ఆమె ఓ చీటర్ సరూర్నగర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ దివ్యారెడ్డి సోమవారం ‘న్యూస్లైన్’తో ఫోన్లో మాట్లాడారు. సరూర్నగర్ ఆర్ఐగా చెప్పుకున్న అలేఖ్యరెడ్డి పెద్ద మోసగత్తె అని ఆమె చెప్పారు. గతంలో ఉప్పల్ ఆర్ఐగా చెప్పుకొని స్థానికులకు ల్యాండ్ పోజిషన్ సర్టిఫికెట్లు ఇప్పించే పేరిట పెద్దమొత్తంలో వసూళ్లకు పాల్పడినట్లు తెలిపారు. జంటనగరాల్లో మహిళా ఆర్ఐలున్న రెవెన్యూ కార్యాలయాన్ని గుర్తించి.. అందుకనుగుణంగా తనపేరును మార్చుకుని ఆ ప్రాంతాల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గతంలో గుర్తించారని వెల్లడించారు. పూర్ణచందర్ సైతం.. వేములవాడకే చెందిన ఓ యువతిని పూర్ణచందర్ మూడేళ్ల క్రితం ప్రేమవివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో ఆమెను వదిలేశాడు. అనంతరం హైదరాబాద్ వెళ్లి ఓ ప్రైవేట్ ఆసుపత్రి మెడికల్ షాపులో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ యువతితో ప్రేమాయణం సాగించాడు. పెళ్లి చేసుకుందామనుకునే సమయంలో అనుకోకుండా అలేఖ్యరెడ్డితో పరిచయం ఏర్పడింది. తనను సరూర్నగర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పరిచయం చేసుకున్న అలేఖ్య... తన తల్లి తహశీల్దార్గా మరణించిందని, ఆమె స్థానంలో తనకు కారుణ్య నియామకాల్లో భాగంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం దక్కిందని చెప్పింది. తన జీతంతోపాటు తల్లి పింఛన్, ఇంటి కిరాయిలు కలిపి నెలకు రూ.లక్ష ఆదాయం ఉంటుందని పేర్కొంది. ఇవన్నీ నమ్మిన పూర్ణచందర్ ఆమెతో చనువు పెంచుకున్నాడు. ఇంకేముంది ఆమె పాచిక పారింది. మూడు నెలలు తిరక్కుండానే ఇలా అడ్డంగా బుక్కైపోయాడు.