-
వేసవి తాపంలోనూ.. విధి నిర్వహణ
మిర్యాలగూడ టౌన్ : లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్న ఆర్టీసీ సిబ్బంది వేసవి తాపంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బస్సుల్లోనే ఉంటున్న డ్రైవర్లు, కండక్టర్లు ఎండ వేడిమికి తల్లడిల్లుతున్నారు. ఆర్టీసీ డిపోల్లో తాగునీరు, మధ్యాహ్నం వేళ మజ్జిగ అందజేస్తుండడంతో కాస్తా ఉపశమనం పొందుతున్నారు. సిబ్బంది పడుతున్న ఇబ్బందులను గుర్తించిన సంస్థ సెలవులు పెట్టకుండా డ్యూటీ చేసే కండక్టర్లు, డ్రైవర్లకు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రూ.వెయ్యి చొప్పున ప్రోత్సాహకం అందిస్తోంది. పొద్దంతా బస్సుల్లోనే.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే ఎండలు మండుతున్నాయి. ఈ నెలలో 45 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ఇంటి నుంచి బయటికి వచ్చేందుకే ప్రజలు జంకుతున్న ఈ పరిస్థితిల్లో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు పొద్దస్తమానం బస్సుల్లో తిరుగుతూ ఎండకు అల్లాడుతున్నారు. ప్రధానంగా డ్రైవర్లు ఇంజన్ వేడి.. ఎండ మంటతో తల్లడిల్లుతున్నారు. కండక్టర్లు కూడా ప్రయాణికులకు టికెట్లు జారీ చేస్తూ ఉక్కపోత, వేడి గాలితో ఇబ్బంది పడుతున్నారు. సిబ్బంది పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ఆర్టీసీ సంస్థ అన్ని డిపోల్లో మధ్యాహ్నం 12గంటల నుంచి ఒంటి గంట వరకు మజ్జిగ పంపిణీ చేస్తుంది. మరోవైపు సిబ్బంది కూడా టోపీలు, రుమాలు ధరిస్తూ ఎండనుంచి కాస్త ఉపశమయం పొందుతున్నారు.ఫ ఎండ వేడిమికి అల్లాడుతున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఫ మధ్యాహ్నం వేళ మజ్జిగ అందజేస్తున్న సంస్థ ఫ రక్షణ చర్యలు తీసుకుంటున్న సిబ్బంది -
మజ్జిగతో కొంత ఉపశమనం
మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఎండ విపరీతంగా ఉండటంతో చెమట వస్తోంది. గ్లోకోజ్ లెవల్ పడిపోకుండా శీతల పానియాలు, నీరు ఎక్కువగా తాగుతున్నా. డిపోల్లో మధ్యాహ్నం మజ్జిగ ఇవ్వడంతో కొంత ఉపశమనం పొందుతున్నాం. – జీఆర్కె రెడ్డి, డ్రైవర్, మిర్యాలగూడ వడగాడ్పుతో ఇబ్బందులు బస్సుల్లో టికెట్లు కోట్టే సమయంలో ఎండ తీవ్రత, మనుషుల నుంచి వచ్చే వేడితో పాటు వడగాడ్పుతో ఇబ్బంది పడుతున్నాం. చెవుల్లోకి వేడి గాలి పోకుండా టవల్ను రక్షణ కవచంగా చుట్టుకుంటున్నాం. వడదెబ్బ తగలకుండా ఉండేలా జాగ్రత్తలను తీసుకుంటున్నాం. – సత్యనారాయణ, కండక్టర్, మిర్యాలగూడ -
ఉద్యోగి ఆరోగ్యమే.. సంస్థకు మహాభాగ్యం
మిర్యాలగూడ టౌన్ : ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల ఆరోగ్యమే.. సంస్థకు మహాభాగ్యమని నల్లగొండ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ శ్రీదేవి అన్నారు. బుధవారం మిర్యాలగూడ ఆర్టీసీ డిపోలో సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ‘గ్రాండ్ హెల్త్ చాలెంజ్’ కార్యక్రమంలో భాగంగా రెండవ విడత వైద్య పరీక్షల శిబిరాన్ని ఆమె సందర్శించారు. ఉద్యోగుల ఆరోగ్య పరిిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు ఉంటే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఆర్టీసీ సంస్థ ద్వారా వైద్యుల ద్వారా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. సిబ్బంది ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు అన్ని డిపోల్లో మజ్జిగ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆమె వెంట డిప్యూటీ ఆర్ఎంలు మాధవి, శివశంకర్, డిపో మేనేజర్ బొల్లెద్దు పాల్, సీఐ భారతీబాయి, ఎంఎఫ్ పుప్పాల యాదగిరి తదితరులు ఉన్నారు. ఫ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ శ్రీదేవి -
ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం
మిర్యాలగూడ : దేశంలో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. బుధవారం మిర్యాలగూడలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని మరిచి మత విధ్వేషాలు సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు. మోదీని ఓడిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ఇండియా కూటమి అభ్యర్థి రఘువీర్రెడ్డి గెలుపును కాంక్షిస్తూ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేపట్టాలన్నారు. ఈనెల 11న అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించే బైక్ ర్యాలీలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, రాగిరెడ్డి మంగారెడ్డి, గాదె పద్మ, వినోద్నాయక్, తిరుపతి రామ్మూర్తి, వరలక్ష్మి, పరుశురాములు, ఎండీ.అంజాద్, శశిధర్రెడ్డి, గోవర్ధని, రొండి శ్రీనివాస్, సత్యనారాయణరావు, సైదులు తదితరులు ఉన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి -
నేడు భువనగిరికి అమిత్షా
సాక్షి, యాదాద్రి : కేంద్ర హోం మంత్రి అమిత్షా గురువారం భువనగిరికి రానున్నారు. బీజేపీ ఎంపీ భ్యర్థి బూర నర్సయ్యగౌడ్కు మద్దతుగా రాయగిరిలో ఉదయం నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. బహిరంగ సభకు 50 వేల మందిని సమీకరించేందుకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి జనాన్ని తరలించనున్నారు. ఆహుతుల కోసం భారీ వేదిక ఏర్పాటు చేస్తున్నారు. జనం కూర్చోవడానికి జర్మన్ టెంట్లు వేస్తున్నారు. ఎండతీవ్రత దృష్ట్యా సభకు వచ్చేవారి కోసం మంచినీళ్లతో పాటు మజ్జిగ ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాకను పురస్కరించుకొని పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. -
బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిన భారత్
హుజూర్నగర్ (చింతలపాలెం): ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందని బీజేపీ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి అన్నారు. బీజేపీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తరఫున బుధవారం చింతలపాలెంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. నల్లగొండ లోక్సభ నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే సైదిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. దేశంలో ఎన్నో కోట్ల మందికి సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కిందని అన్నారు. ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ.. అవినీతి రహిత భారతదేశ నిర్మాణం బీజేపీ గెలుపుతోనే సాధ్యమన్నారు. మూడోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దొంగ హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, కాంగ్రెస్ పార్టీకి దిశానిర్ధేశం చేసే నాయకత్వం లేదని ఎద్దేవా చేశారు. దేశంలో బీజేపీ గెలుపొందే 400 సీట్లలో నల్లగొండ లోక్సభ నియోజకవర్గం ఒకటని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి, నాయకులు చల్లా శ్రీలత, వీరబాబు, పి. విజయ్, అంబళ్ల నరేష్, లింగరాజు, ఎం. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫ బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి -
దేశంలోనే అత్యధిక మెజార్టీ ఇవ్వాలి
పెద్దవూర: ఇన్నేళ్లు తనను ఆదరించినట్లుగానే తన కుమారుడు కుందూరు రఘువీర్రెడ్డిని ఆశీర్వదించి దేశంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చి ఢిల్లీకి పంపాలని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. బుధవారం రాత్రి పెద్దవూర మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. గత శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను ఎలా మట్టికరిపించారో అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లోనూ ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి మాట్లాడుతూ.. పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీని కచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు జానారెడ్డి కుటుంబం గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే 5 గ్యారంటీలను రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని, త్వరలోనే ఆరో గ్యారంటీని కూడా అమలు చేస్తామని అన్నారు. హస్తం గుర్తుపై ఓటు వేసి తనను ఎంపీగా గెలిపించాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు వారిని గజమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్నాయక్, మాజీ ఎంపీపీ రమావత్ శంకర్నాయక్, టి. చంద్రశేఖర్రెడ్డి, పబ్బు యాదగిరి, రవీందర్రెడ్డి, వినయ్రెడ్డి, చామల సువర్ణ, రామాంజిరెడ్డి, వెంకన్న, సీపీఎం నాయకుడు కూన్రెడ్డి నాగిరెడ్డి, ముత్యాల్రెడ్డి, సతీష్, కిలారి మురళీ తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి జానారెడ్డి -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
సూర్యాపేట: మండలంలోని బాలెంల గ్రామంలో బుధవారం విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందింది. వివరాలు.. బాలెంల గ్రామానికి చెందిన శివరాత్రి అంజమ్మ(45) ఇంట్లో దండెంపై బట్టలు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందింది. ఆమెకు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త యాదగిరి పదేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. చింతపల్లిలో మరొకరు..చింతపల్లి : విద్యుదాఘాతంతో ఓ కార్మికుడు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన చింతపల్లి మండలంలోని కుర్మేడు ఎక్స్రోడ్డు వద్ద బుధవారం జరిగింది. వివరాలు.. కుర్మేడు ఎక్స్రోడ్డు వద్ద ఉన్న ఓ హోటల్లో ఏపీలోని ఒంగోలుకు చెందిన ఆరుగురు కార్మికులు విద్యుత్ బోర్డును బిగిస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గోడ కూలి వ్యక్తి దుర్మరణం తిరుమలగిరి (తుంగతుర్తి) : గోడ కూలి వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. తిరుమలగిరి పట్టణానికి చెందిన పాలబిందెల సత్తయ్య(45) తానీమేసీ్త్రగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం సత్తయ్య ఓ ఇంటికి గోడ కడుతుండగా.. సాయంత్రం భారీ వర్షం, ఈదురుగాలులు వీచినప్పుడు గోడ కూలి అతడిపై పడటంతో తీవ్రగాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారులు ఉన్నారు. అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య గుర్రంపోడు : అప్పుల బాధతో పురుగుల మందు తాగి యువ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గుర్రంపోడు మండలం నడికూడ గ్రామంలో బుధవారం జరిగింది. ఎస్ఐ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. నడికూడ గ్రామానికి చెందిన మారేపల్లి శంకర్(33) తనకు ఉన్న రెండెకరాల భూమితో పాటు మరో పదెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఏడాది వర్షాలు లేక సరైన పంట దిగుబడి రాలేదు. దీంతో అప్పులు తీర్చే మార్గం కనిపించక మనస్తాపంతో ఈనెల 4న గ్రామశివారులోని తాటిచెరువు వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అటుగా వెళ్లిన గ్రామస్తులు శంకర్ను గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే వారు నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. శంకర్ భార్య మారేపల్లి అశ్విని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పట్టభద్రుల స్థానానికి 19మంది నామినేషన్లు దాఖలు
నల్లగొండ: ఖమ్మం–వరంగల్–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం 19మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరంతా నల్లగొండ కలెక్టరేట్లో రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్ దాసరి హరిచందననుకు నామినేషన్ల పత్రాలు అందజేశారు. నేటితో ఆఖరు.. ఈనెల 3వ తేదీ నుంచి కొనసాగుతున్న నామి నేషన్ల స్వీకరణ ప్రక్రియ గురవారంతో ముగియనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఇప్పటి వరకు మొత్తం 67మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. ఫ నామినేషన్ల స్వీకరణకు నేడు ఆఖరు తేదీ -
ఎట్టకేలకు వడ్డె ఎల్లయ్య మృతదేహం లభ్యం
సూర్యాపేట, జగ్గయ్యపేట: గత నెల 19న కిడ్నాప్కు గురైన సూర్యాపేట జిల్లా సైనికపురి కాలనీకి చెందిన వడ్డె ఎల్లయ్య (58) మృతదేహాన్ని ఎట్టకేలకు బుధవారం జగ్గయ్యపేట మండలంలోని బండిపాలెం గ్రామ అటవీ ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. వివరాల ప్రకారం.. జగ్గయ్యపేటలో ఎల్లయ్యను గత నెల 19న కిడ్నాప్ చేశారంటూ అతడి సోదరుడు సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక సీఐ జానకిరామ్ ఆధ్వర్యంలో పట్టణ ఎస్ఐలు సూర్యభగవాన్, పద్మారావు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా అదే ప్రాంతానికి చెందిన తాడోజు శ్రీకాంత్రాజు(చారి) కొందరి సహాయంతో జగ్గయ్యపేటలో భార్యభర్తల గొడవ ఉందని ఎల్లయ్యను తీసుకువచ్చి ఓ ఇంట్లో హత్య చేసి మృతదేహాన్ని కనిపించకుండా చేసినట్లు ఈనెల 2న శ్రీకాంతరాజు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. దీంతో అతడిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించారు. అటవీ ప్రాంతంలో మృతదేహం లభ్యం.. ఎల్లయ్య మృతదేహం ఆచూకీ లేకపోవడంతోశ్రీకాంతరాజుకు సహకరించిన వారిని కొన్ని రోజులుగా పోలీసులు విచారిస్తుండడంతో బుధవారం వివరాలను వెల్లడించారు. జగ్గయ్యపేట మండలంలోని బండిపాలెం గ్రామ అటవీ ప్రాంతంలో కాల్చిపూడ్చి పెట్టినట్లు చెప్పడంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వెలికితీశారు. అయితే మృతదేహాన్ని పెట్రోల్ పోసి సగం కాల్చి పూడ్చి పెట్టడంతో పాటు 20రోజులు గడుస్తుండటంలో గుర్తుపట్టలేని విధంగా మారింది. అతడి ఒంటి మీద ఉన్న వస్తువులు ఆధారంగా భార్య యాదమ్మ తన భర్తగా గుర్తించింది. దీంతో పోలీసులు మృతదేహాన్ని జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి తహసీల్దార్ శేషగిరి సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సుఫారి ఇచ్చే నాతండ్రిని హత్య చేశారు.. సుఫారీ ఇచ్చే నాతండ్రిని హత్య చేశారని మృతుడి కుమార్తె అమల విలేకరుల ఎదుట బోరున విలపించింది. తన తండ్రిని రాజకీయంగా ఎదుర్కోలేక తాడోజు శ్రీకాంతరాజు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య, బొడ్డు కిరణ్, చింతలపాటి మధు, ఒంటెద్దు నిర్మల, వాణిశ్రీ హత్య చేయించారని పేర్కొంది. మాచిరెడ్డిపల్లిలో భారీ బందోబస్తునాగారం: వడ్డె ఎల్లయ్య హత్య ఘటనలో ప్రధాన నిందితుడైన తాడోజు శ్రీకాంత్రాజు స్వగ్రామం నాగారం మండలం మాచిరెడ్డిపల్లిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బుధవారం భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నాగారం సర్కిల్ సీఐ రఘువీర్ రెడ్డి తెలిపారు. ఫ జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామశివారులో సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఫ తహసీల్దార్, కుటుంబ సభ్యుల సమక్షంలో పోస్టుమార్టం -
పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్రెడ్డి
హన్మకొండ: నల్లగొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్రెడ్డిని అధిష్టానం బుధవారం ప్రకటించింది. వరంగల్లో బీఎస్సీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఫిలాసఫీ, మరఠ్వాడ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ పూర్తి చేసిన ప్రేమేందర్రెడ్డి విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఏబీవీపీలో పలు పదవులు నిర్వహించారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. పూర్వ వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా, తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 12 ఏళ్లుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ ప్రేమేందర్రెడ్డి కీలక పాత్ర పోషించారు. రెండోసారి ఎమ్మెల్సీ బరిలో.. 2004లో శాయంపేట నియోజకవర్గం నుంచి, 2009లో పరకాల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. 2021లో జరిగిన నల్లగొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేశారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి విజయం సాధించగా.. జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికై న అనంతరం పల్లా రాజేశ్వర్రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ ఉప ఎన్నికలో గుజ్జుల ప్రేమేందర్రెడ్డి మరోసారి బరిలోకి దిగుతున్నారు. గురువారం ఆయన నల్లగొండలో నామినేషన్ వేయనున్నారు. బీజేపీ నుంచి పూర్వ వరంగల్ జిల్లా నుంచి పీఆర్టీయూ మాజీ అధ్యక్షుడు, బీజేపీ రిటైర్డ్ ఎంప్లాయీస్ సెల్ రాష్ట్ర కోకన్వీనర్ పులి సరోత్తంరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, అధికార ప్రతినిధి ప్రకాశ్రెడ్డి టికెట్ ఆశించగా.. పార్టీ అధిష్టానం చివరికి గుజ్జుల ప్రేమేందర్రెడ్డికి అవకాశం కల్పించింది. ఫ నేడు నామినేషన్ వేయనున్న ‘గుజ్జుల’ -
రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి
పెన్పహాడ్: రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని కేవీకే మృత్తిక శాస్త్రవేత్త ఎ.కిరణ్ తెలిపారు. బుధవారం మండల పరిధిలోని లింగాల గ్రామంలో భూసార పరీక్షకు మట్టి నమూనా సేకరించే విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒక్కసారి ప్రతి రైతు తమ భూమి మట్టి నమూనాను సేకరించి భూసార పరీక్ష చేయించుకొని దానికి అనుగుణంగా ఎరువులు వాడాలని సూచించారు. ఎండాకాలం తొలకరి వర్షాలకు లోతైన వేసవి దుక్కులు చేసుకొని పశువుల ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు వేసుకుంటే భూసారం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో కేవీకే సిబ్బంది బచ్చు వెంకటేశ్వర్లు, రైతులు జి.సుధాకర్రెడ్డి, ఆర్.కృష్ణయ్య, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
ఫ నల్లగొండ ఎస్పీ చందనా దీప్తి నల్లగొండ క్రైం: లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడుతుండడంతో జిల్లా పోలీసు యంత్రాంగం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి పెట్టినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ చందనా దీప్తి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే పాత నేరస్తులను కట్టడి చేసేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 693మంది పాత నేరస్తులు, రౌడీ షీటర్స్ని బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. వారి కదలికలపై నిఘా ఉంచామన్నారు. ఎవరైనా బైండోవర్ ఉల్లంఘించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి
భువనగిరి రూరల్: వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన భువనగిరి మండలంలోని బస్వాపురం గ్రామంలో ఐకేపీ సెంటర్ వద్ద అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండు నెలలుగా ధాన్యం కొనుగోలు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. ఫ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ -
ఫెసిలిటేషన్ కేంద్రాలు మరో రెండ్రోజులు పొడిగింపు
ఫ సూర్యాపేట కలెక్టర్ ఎస్. వెంకటరావు భానుపురి (సూర్యాపేట): ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకునేలా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాలను మరో రెండు రోజులు పొడిగించినట్లు సూర్యాపేట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకటరావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొదట 8వ తేదీ వరకు ఉండగా.. 10వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులు, సిబ్బంది, పోలీసులు ఫెసిలిటేషన్ కేంద్రాలకు వెళ్లి పోస్టల్ బ్యాలెట్ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. -
పోలీసు పహారాలో ముగిసిన అంత్యక్రియలు
సూర్యాపేట : ఎల్లయ్య మృతదేహాన్ని జగ్గయ్యపేట నుంచి అంబులెన్స్లో సూర్యాపేట మండలంలోని ఆయన స్వగ్రామం యర్కారానికి బుధవారం తీసుకోచ్చారు. ఎల్లయ్య అంత్యక్రియలు పోలీసు పహారాలో రాత్రి ముగిశాయి. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ రవి, సీఐ సురేందర్రెడ్డి, రాజశేఖర్, బాలునాయక్తో పాటుగా మరో నలుగురు సీఐలు, పది మంది ఎస్ఐలతో భారీ బందోబస్తు చేపట్టారు. ఎల్లయ్య మృతదేహానికి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ శాఖ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు కొప్పుల వేణారెడ్డి ఆయన నివాసానికి వెళ్లి మృతదేహాంపై పూలమాల వేసి నివాళులార్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
రైతులు భూసార పరీక్ష చేయించుకోవాలి
పెన్పహాడ్ : ప్రతి రైతు తప్పనిసరిగా భూసార పరీక్ష చేయించుకోవాలని కేవీకే మృత్తిక శాస్త్రవేత్త ఎ.కిరణ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని నూర్జహాన్పేట గ్రామంలో భూసార పరీక్షలో భాగంగా మట్టి నమూనా సేకరించే విధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి రైతు తమ నేల భూసారాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా ఎరువులు వాడాలని, తద్వారా ఎరువుల వాడకంలో అనవసర ఖర్చులు తగ్గించి భూసారాన్ని కాపాడుకుంటూ అధిక, సుస్థిర దిగుబడులు పొందవచ్చని, భూసార పరీక్షలు చేయడంతో పోషకాల పరిమాణం కాకుండా భూమిలోని చౌడు, సున్నం శాతాన్ని గుర్తింవచ్చన్నారు. రైతులు తమ పొలంలోని మట్టిని సేకరించి కేవీకే గడ్డిపల్లికి పంపిస్తే భూసార పరీక్ష చేసి భూ ఆరోగ్య పత్రాలు అందజేస్తామన్నారు. మట్టి నమూనాలు సేకరించే విధానానికి 7893989055కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో కేవీకే సిబ్బంది బచ్చు వెంకటేశ్వర్లు, రైతులు జనుపుల శ్రీను, ధరావత్ మస్తాన్, బాణోతు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, బాణోతు విజ్జ తదితరులు పాల్గొన్నారు. -
ఖర్చుల వివరాలు ప్రతిరోజు సమర్పించాలి
నకిరేకల్: అభ్యర్థుల ప్రచారాలకు సంబంధించిన ఖర్చుల వివరాలను ప్రతిరోజు ఏఆర్ఓ కార్యాలయంలో సమర్పించాలని భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకుడు సయాన్ దెబ్బర్మ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన నకిరేకల్లోని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి(ఏఆర్ఓ) కార్యాలయాన్ని సందర్శించి ఆయా మండలాల ఎక్స్పెండీచర్ టీంలతో సమావేశమయ్యారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఏఆర్ఓ టి. పూర్ణచంద్ర, తహసీల్దార్ జమీరుద్దీన్, డీఎస్పీ సైదా తదితరులు పాల్గొన్నారు. రెండో విడత ఖర్చుల తనిఖీ..నల్లగొండ: కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో మంగళవారం నల్లగొండ లోక్సభ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకుడు కళ్యాణ్ కుమార్ దాస్ ఎంపీ అభ్యర్థుల రెండో విడత ఖర్చుల తనిఖీ నిర్వహించారు. మొత్తం 22 మంది అభ్యర్థులకు గాను 19మంది అభ్యర్థులు హాజరై వారికి సంబంధించిన ఖర్చుల రిజిస్టర్లు, రికార్డులను, రిపోర్టులను ఆయనకు సమర్పించారు. అభ్యర్థుల ఖర్చులకు సంబంధించి రిపోర్టులతో పాటు ఏబీసీ ఫార్మాట్లను పరిశీలించి షాడో రిజిస్టర్తో పోల్చి చూశారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యయ పరిశీలకుడు కె. సురేష్, ఎన్నికల ఎక్స్పెండిచర్ నోడల్ అధికారి కిరణ్కుమార్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఉద్యోగులపై ప్రత్యేక నిఘా
ఫ పార్టీలు, అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం చేస్తే ఉద్యోగం ఊస్టే ఫ వారి సోషల్ మీడియా అకౌంట్లపై కూడా ఎలక్షన్ కమిషన్ డేగ కన్ను భువనగిరి టౌన్: ఎన్నికల నియమావళి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు సభలు, సమావేశాల్లో పాల్గొనరాదు. ఏదో ఒక పార్టీ కోసం పనిచేయడం లేదా ప్రచారం చేయకూడదు. ఆయా పార్టీలు, నేతలకు వ్యతిరేకంగా మాట్లాడరాదు. పోలింగ్ సమయంలో ఓటర్లను ప్రభావితం చేసినా వారి ఉద్యోగానికే ఎసరొచ్చే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచే ప్రభుత్వ ఉద్యోగులపై ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కూడా ఈసీ నిఘా పెట్టింది. తమకు నచ్చిన నాయకులకు మద్దతుగా తమ వాట్సాప్, ఫేస్బుక్, ట్విటర్ అకౌంట్స్లో అప్ లోడ్ చేసినా, షేర్ చేసినా వారిపై వేటు తప్పదు. ఉద్యోగులు ప్రచారంలో పాల్గొన్నట్లు ఎవరైనా ఫొటోలు, వీడియో ఆధారాలతో ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తే వారిని ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం ఉంది. -
12 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపించొచ్చు
నల్లగొండ: ఓటరు గుర్తింపు కార్డు లేనివారు లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు గాను ఎన్నికల సంఘం అనుమతించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి పోలింగ్ బూత్లో చూపించొచ్చని నల్లగొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆధార్ కార్డు, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డు, ఫొటో ఉన్న బ్యాంక్, పోస్టాఫీస్ పాస్బుక్లు, కేంద్ర కార్మిక శాఖ ద్వారా జారీ చేయబడిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డు, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఎన్పీఆర్ కింద జారీచేసిన స్మార్ట్ కార్డు, ఇండియన్ పాస్పోర్ట్, ఫొటో కలిగిన పెన్షన్ డాక్యుమెంట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ సంస్థలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు వారి ఉద్యోగులకు జారీచేసిన ఫొటో గుర్తింపు కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీచేసిన అధికారిక గుర్తింపు కార్డు, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ దివ్యాంగ కార్డులలో ఏదో ఒకదానిని గుర్తింపుకార్డులుగా చూపవచ్చని తెలిపారు.ఫ నల్లగొండ జిల్లా కలెక్టర్ హరిచందన -
ఎకై ్సజ్ అధికారుల దాడులు
హుజూర్నగర్ : నియోజకవర్గంలో ఎకై ్సజ్ అధికారులు మంగళవారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సారా విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి 3ద్విచక్ర వాహనాలు, 21లీటర్ల సారా, 50 కిలోల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ సీఐ నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మటంపల్లి మండలంలోని కొత్తదొనబండ తండాకు చెందిన బానోత్ బాలు తన ద్విచక్రవాహనంపై 8లీటర్ల సారా తరలిస్తుండగా తనిఖీలు నిర్వహించిన పట్టుకుని సారాతో పాటు వాహనాన్ని స్వాదీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. అదే విధంగా మేళ్లచెరువు మండలం వెల్లటూరు కాలనీకి చెందిన దాసు నరసమ్మ టీవీఎస్ వాహనంపై 8లీటర్ల సారా తరలిస్తుండగా సారాతో పాటు వాహనం స్వాదీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు, అదే మండలం సాధుతండాకు చెందిన ధరావత్ లింగ, ధరావత్ రంగమ్మ మోటార్ సైకిల్పై 5లీటర్ల సారా, 50కేజీల బెల్లం తరలిస్తుండగా స్వాదీనం చేసుకుని ఇరువురిని అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. అంతే కాకుండా వివిధ మండలాల్లో పలు కేసుల్లో ఉన్న 22మందిని ఆయా మండలాల తహసీల్దార్ల వద్ద బైండ్ ఓవర్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్ ఎస్ఐలు జగన్మోహన్రెడ్డి, దివ్య, వెన్నెల, గోవర్ధన్, సిబ్బంది పేర్కొన్నారు. ఫ 21 లీటర్ల నాటుసారా, 50కిలోల బెల్లం స్వాధీనం -
ఫ తండ్రీకొడుకులు చెమటోడుస్తున్నారు..!
నిడమనూరు మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఎండ వేడిమికి తట్టుకోలేక మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కూడా ప్రచార రథంపై చల్లటి నీరు తాగుతూ కనిపించారు. అదేవిధంగా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జయవీర్రెడ్డి తలపై నీటిని పోసుకుంటూ ఉపశమనం పొందగా.. నల్లగొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్రెడ్డి తలకు కండువా కట్టుకుని, మజ్జిగ ప్యాకెట్లు తాగుతూ వేడి నుంచి బయటపడే ప్రయత్నం చేశారు. – నిడమనూరు -
యువకుడి ఆత్మహత్య
కొండమల్లేపల్లి : ఉరివేసుకొని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రామ్మూర్తి తెలిపిన ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రంలోని బియావర్ జిల్లా పాట్వా గ్రామానికి చెందిన ప్రజాపతి సోహన్లాల్, కమ్లి దంపతుల 3వ కుమారుడు రాకేశ్(24) రెండు సంవత్సరాలుగా కొండమల్లేపల్లిలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రాకేష్ మూడు నెలల క్రితం హైదరాబాద్కు వెళ్లి ఈనెల 6న మండల కేంద్రానికి వచ్చాడు. తన పాత యజమాని అయిన సందే కిరణ్కు ఫోన్ చేసి మళ్లీ షాపులో పనిచేస్తానని ఇక్కడే ఉంటానని అడగడంతో తాను అందుబాటులో లేనని కిరణ్ తెలిపాడు. అయితే దుకాణం తాళాలు ఇవ్వాల్సిందిగా రాకేశ్ కోరగా కిరణ్ తన దుకాణం నుంచి తాళాలు తీసుకొమ్మని చెప్పాడు. మరుసటి రోజు తాళం తీయకపోవడంతో అనుమానం వచ్చిన కిరణ్ షాప్ తెరిచి చూడగా రాకేష్ ప్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు మృతుని బాబాయి ప్రకాష్చంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ రామ్మూర్తి తెలిపారు. ఫ మృతుడు రాజస్థాన్ రాష్ట్ర వాసి -
ఓటు వేయాలని ‘ఆహ్వానం’
ఫ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇన్విటేషన్ కార్డుభువనగిరిటౌన్: ఓటు హక్కు ఉన్న వారందరూ లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి రావాలంటూ రూపొందించిన ఆహ్వా న పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజాస్వామ్య పండుగ పేరిట రూపొందించబడిన ఈ ఆహ్వాన పత్రిక వాట్సాప్ గ్రూపుల్లో తిరుగుతోంది. ఓటర్లందరూ కుటుంబ సభ్యులతో కలిసి తప్పనిసరిగా ఓటు వేసేందుకు తరలిరావాలని అందులో పేర్కొన్నారు. పోలింగ్ తేదీ, వేళలను వేడుక సమయంగా, పోలింగ్ స్టేషన్ను వేదికగా, ఐదేళ్ల ప్రజాస్వామ్య ఫలాలను విందుగా అందులో సూచించారు. ప్రజల్లో చైతన్యం కలిగించేందుకే ఆహ్వాన పత్రిక రూపొందించినట్లు చివర్లో పేర్కొనడం విశేషం. -
10న నకిరేకల్లో కాంగ్రెస్ సభ
ఫ హాజరుకానున్న ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నకిరేకల్: కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి గెలుపు కోసం 10వ తేదీన నకిరేకల్ పట్టణంలోని మినీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సీఎం రేవంత్రెడ్డి హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం మినీ స్టేడియంలో సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే, స్థానిక నాయకులు పరిశీలించారు.
Pagination
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
రాయన్ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల
దుష్యంత్ చౌతాలాకు షాక్.. ఖట్టర్ను కలిసిన నలుగురు జేజేపీ ఎమ్మెల్యేలు
టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
ఫ్రాంక్ఫర్ట్లో ఉగాది వేడుకలు
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి
IPL 2024: కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న కేఎల్ రాహుల్..?
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా
పంజాబ్ కింగ్స్తో ఆర్సీబీ కీలక పోరు.. యువ ఆటగాడు అరంగేట్రం
సీఎం జగన్లో ఆ ధీమా ఎలా వచ్చిందంటే.?
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement