-
నూతన చట్టాలపై అవగాహన ఉండాలి
నల్లగొండ క్రైం : నూతన చట్టాలపైన అవగాహన పెంచుకోవాలని ఎస్పి చందనాదీప్తి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నూతన చట్టాల పైన అధికారులు, సిబ్బందికి నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణలో ఆమె మాట్లాడారు. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమలయ్యే నూతన చట్టాలపై కానిస్టేబుల్ నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు విడతలవారీగా శిక్షణ ఇస్తామన్నారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం చట్టాలు జూలై 1, 2024 నుంచి అమలులోకి రానున్నాయి అని ఎస్పీ వివరించారు. ప్రతి పోలీస్ అధికారి, సిబ్బందికి నూతన చట్టాలపై అవగాహన ఉంటే రానున్న రోజుల్లో బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎలా స్వీకరించాలి, ఏఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి అనే విషయాలు తెలుస్తాయన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములునాయక్, పోలీసు అధికారులు రమేష్, సైదా, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఈ నెల 30వరకు పోలీస్ యాక్ట్ శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని నేట నుంచి ఈ నెల 30వ తేదీ వరకు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందని ఎస్పీ చందనాదీప్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహిచొద్దని పేర్కొన్నారు.ఫ ఎస్పీ చందనా దీప్తి -
మత్స్య మాయాజాలం!
చెరువుల్లో నీళ్లు లేకున్నా చేపపిల్లలు పోసినట్టు బిల్లులునల్లగొండ టూటౌన్: చెరువుల్లో నీరులేకున్నా చేపపిల్లలు వదిలినట్టు కాంట్రాక్టర్లు మాయాజాలం ప్రదర్శించారు. మత్స్యశాఖ అధికారులు సైతం క్షేత్రస్థాయిలో జరిగిన అక్రమాలను తెలుసుకోకుండానే బిల్లుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇదంతా తెలిసిన కొందరు మత్స్యకార సహకార సంఘాల నాయకులు చేపపిల్లలను సగం కూడా పంపిణీ చేయలేదని రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దాంతోనే ఇప్పటివరకు కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయకుండా నిలుపుదల చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అధికారులు పంపిన ప్రతిపాదనల ప్రకారం ప్రభుత్వం నుంచి కాంట్రాక్టర్లకు దాదాపు రూ.6 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో చేపపిల్లలెలా పోశారో? మత్స్యకారుల ఉపాధి కోసం చెరువుల్లో చేపల పెంపకానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలు పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. జిల్లాలో నీటి రిజర్వాయర్లు, డిపార్ట్మెంట్ చెరువులు, జీపీ చెరువులు కలిపి సుమారు 1,100 వరకు ఉన్నాయి. గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆయకట్టు ప్రాంతంతో పాటు నాన్ ఆయకట్టు ప్రాంతంలో కూడా దాదాపు 80 శాతం చెరువుల్లో కనీసం 10 శాతం నీరు కూడా లేదు. అయినా ఆయా చెరువుల్లో పోసేందుకు మత్స్యకారులకు చేపపిల్లలు పంపిణీ చేసినట్లు బిల్లులు పెట్టారు. అయితే ఈ లెక్కలన్నీ కాకి లెక్కలేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారీ వర్షాలు కురిసిన సమయంలో కూడా ఉచిత చేపపిల్లల పంపిణీలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. డీసీఎంలో చేపపిల్లలను తీసుకెళ్లినట్లు బైక్ నంబర్లు సైతం వేసి ఉన్నతాధికారులను బురిడీ కొట్టించిన ఘటనలు గతంలో జిల్లాలో వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఫ క్షేత్రస్థాయిలో పరిశీలించని యంత్రాంగం ఫ రూ.6 కోట్లు చెల్లించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఫ మత్స్యకారుల ఫిర్యాదులతో నిలిచిన బిల్లుల మంజూరు ప్రక్రియజిల్లాకు ఐదు కోట్ల చేపపిల్లలు కేటాయింపు నాగార్జునసాగర్ ప్రాజెక్టుతో పాటు పలు రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో ఉచిత చేపపిల్లల కోసం గత ఏడాది 6కోట్లకు పైగా చేపపిల్లలు అవసరమవుతాయని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దాంతో ఐదు కోట్ల వరకు ఉచిత చేపపిల్లలు జిల్లాకు కేటాయించారు. కానీ తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువుల్లో నీరు లేకున్నా చేపపిల్లలను ఎలా పంపిణీ చేశారన్నది అంతు చిక్కడంలేదు. ఉచిత చేపల పంపిణీలో అక్రమాలు భారీగానే చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మత్స్యకార సంఘాల నాయకులు ఇక్కడి అధికారులకు కాకుండా.. హైదరాబాద్లోని కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా చేప పిల్లల పంపిణీలో జరిగిన అక్రమాలు, ఫిర్యాదులపై మత్స్యశాఖ జిల్లా అధికారి వెంకయ్యను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని చెప్పారు. -
ఆండాళ్ అమ్మవారికి ఊంజలి సేవోత్సవం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజలి సేవోత్సవాన్ని పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ఆండాళ్ అమ్మవారిని ఊరేగిస్తున్న సమయంలో మహిళా భక్తులు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోని అద్దాల మండపంలో ఆండాళ్ అమ్మవారిని అధిష్టింపజేసి ఊంజలి సేవోత్సవాన్ని చేపట్టారు. ఆండాళ్ అమ్మవారికి ఇష్టమైన నాదస్వరాన్ని వినిపించారు. అనంతరం హారతినిచ్చారు. ఆలయంలో నిత్య పూజలు యథావిధిగా కొనసాగాయి. -
రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
నల్లగొండ : రాష్ట్ర అవతరణ దినోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరిచందన శుక్రవారం ఒక ప్రకటనలో అధికారులను ఆదేశించారు. వేడుకలు నిర్వహించే పోలీస్ పరేడ్ మైదానంలో టెంట్లు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేయాలని ఆర్డీవోను ఆదేశించారు. మైదానాన్ని, అమరవీరుల స్థూపాలను శుభ్రం చేసి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. జూన్ 1 నుంచే క్లాక్టవర్ చౌరస్తా, కలెక్టరేట్ తదితర ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను, అతిథుల కోసం సీట్ల కేటాయింపు తదితర అంశాలను చూడాలని సీపీఓను ఆదేశించారు. జాతీయ జెండా ఆవిష్కరించనున్న కలెక్టర్ నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా జూన్ 2న ఉదయం 9 గంటలకు కలెక్టర్ దాసరి హరిచందన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఉదయం 8.45 గంటలకు అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించనున్నారు. ఇన్చార్జి డీఎంహెచ్ఓగా డాక్టర్ కళ్యాణ చక్రవర్తి నల్లగొండ టౌన్ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇన్చార్జి అధికారిగా జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి శుక్రవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డీఎంహెచ్ఓగా ఉన్న డాక్టర్ అనిమల్ల కొండల్రావు ఉద్యోగ విరమణ చేయడంతో కళ్యాణచక్రవర్తిని ఇన్చార్జి డీఎంహెచ్ఓగా నియమిస్తూ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ రవీందర్నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలల్లో పనుల పరిశీలన కనగల్ : మండలంలోని తేలకంటిగూడెం, తిమ్మజిగూడెం, తుర్కపల్లిలో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో జరుగుతున్న నిర్మాణ, మరమ్మతు పనులను శుక్రవారం డీఈఓ భిక్షపతి పరిశీలించారు. త్వరలోనే పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాడు. ఆయన వెంట ఏఈ కత్తుల జగన్, పెరిక అంజయ్య తదితరులున్నారు. లైంగిక వేధింపుల కేసుపై విచారణ సూర్యాపేట టౌన్: కాపుగల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, ఫుడ్సేఫ్టీ సర్వీససెస్ జిల్లా అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తిపై వచ్చిన లైంగిక వేధింపుల కేసులో విచారణ జరుపుతున్నట్టు సూర్యాపేట జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మానసిక వైద్య నిపుణుడిగా సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ స్రవంతిని డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నట్లు మే 20న ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. ఫిర్యాదును లైంగిక వేధింపుల చట్ట సమీక్ష కమిటీకి నివేదించానని తెలిపారు. ఈ విషయంపై డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తిని వివరణ కోరేందుకు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చిందని తెలిపారు. 28న డాక్టర్ స్రవంతి స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేసినట్లు పోలీసుల ద్వారా తెలిసిందని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై కలెక్టర్ ఆదేశానుసారం ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ లైంగిక వేధింపుల నివారణ చట్టం ద్వారా విచారణ జరుగుతుందని తెలిపారు. -
బహుజన రాజ్య స్థాపనకు పోరాడాలి
భానుపురి (సూర్యాపేట): మారోజు వీరన్న కలలుగన్న బహుజన రాజ్యం స్థాపనకు ప్రతిఒక్కరూ పోరాడాలని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మారోజు వీరన్న 25వ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. 1999 మే 16న అప్పటి సీమాంధ్ర పాలకుల చేతిలో బూటకపు ఎన్కౌంటర్కు గురైన మారోజు వీరన్న రూపొందించిన కులవర్గ పోరాట సిద్ధాంతం నేటికీ ప్రకంపనలు సృష్టిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చామకూరి నర్సయ్య, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆరుట్ల జనకిరామ్రెడ్డి ఉన్నారు. -
28న డాక్ అదాలత్
రామగిరి(నల్లగొండ) : రీజినల్ లెవెల్ డాక్ అదాలత్ను ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు నల్లగొండ డివిజన్ సూపరింటెండెంట్ కె.రఘునాథ స్వామి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ (గూగుల్ మీట్) ద్వారా నిర్వహించే ఈ కార్యక్రమానికి పోస్టల్ సర్వీసులపై ఏమైనా ఫిర్యాదులుంటే పోస్టల్ ద్వారా కవరుపై 46వ డాక్ అదాలత్ అని రాసి కె.శ్రీకాంత్ సహాయ నిర్దేశకులు, పోస్ట్ మాస్టర్ జనరల్, హైదరాబాద్ అడ్రస్కు జూన్ 14వ తేదీ లోగా పంపించాలని పేర్కొన్నారు. -
రైతులు ఆందోళన చెందవద్దు
నల్లగొండ : వానాకాలం సాగుకు సంబంధించి సరిపడా విత్తన నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ దాసరి హరిచందన పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ అధికారులతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండలాల్లో సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ఎటువంటి కొరతా లేదన్నారు. లైసెన్స్ ఉన్న డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని, ఒకవేళ లూజ్ విత్తనాలు అమ్ముతున్నట్లు రైతుల దృష్టికి వస్తే అధికారులకు తెలియజేయాలన్నారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు తెలిస్తే హెల్ప్లైన్ నంబర్ 7288800023 ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. నకిలీ విత్తనాలను అరికట్టడానికి క్షేత్రస్థాయిలో పోలీస్, వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారులతో కూడిన బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆథరైజ్డ్ డీలర్ల వద్ద కాకుండా బయట విత్తనాలు కొని రైతులు మోసపోవద్దని సూచించారు. మిర్యాలగూడ, శాలిగౌరారం మండలాల్లో నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి విత్తనాలను సీజ్ చేశామని తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో 941 అవుట్లెట్లు ఏర్పాటు చేశామని అవసరమైన రెతులు ఈ అవుట్లెట్ల ద్వారా మాత్రమే విత్తనాలు కొనాలని సూచించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో జీలుగ విత్తనాలను 30 కిలోలు రూ.1,116, పిల్లి పెసర 40 కిలోలు రూ.1084, పత్తి విత్తనాలు 475 గ్రాములు రూ.864 చొప్పున అమ్ముతున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూర్ణచంద్రరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఫ సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయి ఫ నకిలీ విత్తనాలు అమ్మితే ఫిర్యాదు చేయాలి ఫ కలెక్టర్ హరిచందన ఎరువుల దుకాణాల్లో కలెక్టర్ తనిఖీలు నల్లగొండ పట్టణంలో ఎరువుల దుకాణాల్లో కలెక్టర్ దాసరి హరిచందన ఆకస్మిక తనిఖీలు చేశారు. మిర్యాలగూడ రోడ్డులో ఉన్న ట్రేడర్స్, ఫర్టిలైజర్స్ దుకాణాలను అందుబాటులో ఉన్న విత్తనాలు, ఎరువుల నిల్వలు, రిజిస్టర్ల రికార్డులు పరిశీలించారు. విత్తనాల అమ్మకం విషయంలో ఎలాంటి పొరపాట్లు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు. -
కేతేపల్లిలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత
నల్లగొండ టౌన్ : ఎండ మండుతోంది. శుక్రవారం కేతేపల్లి మండల కేంద్రంలో రికార్డుస్థాయిలో 46.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వేడిమికి తాళలేక జనం తల్లడిల్లుతున్నారు. ఉదయం 9 గంటల తర్వాత ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకు జకుంతున్నారు. ఇళ్లలోనే ఏసీలు, కూలర్ల కింద సేదదీరుతున్నారు. దీంతో మధ్యాహ్నం వేళ వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎండతీవత్ర కారణంగా చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు.. కేతేపల్లి తర్వాత.. దామరచర్లలో 46.3 డిగ్రీ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, అత్యల్పంగా చింతపల్లి మండలం గొడకొండలో 40.1 డిగ్రీలు నమోదైంది. ఇక, నేరడుగొమ్ము, కామారెడ్డిగూడెం, నకిరేకల్, నాంపల్లి, నిడమనూరు, హాలియా, తడకమళ్ల, కట్టంగూర్లో 45 డిగ్రీలకుపైగా, పి.దోమలపల్లి, అయిటిపాముల, ముల్కచర్ల, మాటూరు, పజ్జూర్, నల్లగొండ కలెక్టరేట్, మామిడాల, యాచారం, తిమ్మాపూర్, మెడ్లవాయి, బుగ్గబాయిగూడెం, నార్కట్పల్లి, ఇబ్రహీంపేట, గూడపూర్, తెల్దేవర్పల్లి, మాడ్గులపల్లి, టీక్యాతండా 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా అన్నిమండలాల్లో 41 నుంచి 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత ఉంది. -
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
నల్లగొండ టౌన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విధిగా క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ బి.రవీంద్ర నాయక్ సూచించారు. శుక్రవారం ఆయన నల్లగొండలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఇన్చార్జి డీఎంహెచ్ఓ, ప్రోగ్రాం అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం సీజన్లో వచ్చే సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, వ్యాధులు వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. డెంగీ, మలేరియా వ్యాధులు రాకుండా దోమల వ్యాప్తిని అరికట్టాలన్నారు. అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఎంహెచ్ఓ కళ్యాణ చక్రవర్తి, డిప్యూటీ డీఎంహెచ్ఓలు వేణుగోపాల్రెడ్డి, కేశ రవి, పీఓ డీటీ గీతా, వాణి, డాక్టర్ అరుంధతి, డాక్టర్ పద్మ, జిల్లా మలేరియా అధికారి దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. మెరుగైన వైద్యం అందించాలి చిట్యాల : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రనాయక్ తెలిపారు. శుక్రవారం చిట్యాల పీహెచ్సీని ఆయన తనిఖీ చేశారు. ఉద్యోగుల హాజరు, రిజిస్టర్లను పరిశీలించారు. వార్డుల్లోని రోగులతో మాట్లాడి వైద్యసేవలను అందిస్తున్న తీరును ఆడిగి తెలుసుకున్నారు. ఆయనవెంట వైద్యాధికారి డాక్టర్ సయ్యద్ అజర్అహ్మద్, డాక్టర్ సత్యనరేష్ ఉన్నారు. ఫ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ బి.రవీంద్రనాయక్ -
ఉరివేసుకొని మహిళ బలవన్మరణం
గరిడేపల్లి : ఉరివేసుకొని ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మండల పరిధిలోని కుత్భుషాపురం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మహ్మద్ ఫర్జానా(26) తన భర్త మహ్మద్ బాబా కొంతకాలంగా మానసికంగా వేధిస్తుండడంతో అతడి వేధింపులు భరించలేక తన ఇంటిలో ఎవరు లేని సమయంలో చీరతో ఫ్యాన్కు ఉరివేసుకొని మృతి చెందింది. మృతురాలి తల్లి సయ్యద్ సైదాబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. దర్వేశిపురంలో ఓ మహిళకనగల్ : మండలం దర్వేశిపురం గ్రామానికి చెందిన కడమంచి ఈదమ్మ(68) గురువారం శ్మశానవాటికలో ఉన్న తన కొడుకు సమాధికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలిసిన స్థానికులు ఈదమ్మకు దహన సంస్కారాలు నిర్వహించారు. ఆమె మృతిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. నీటి సంపులో పడి వృద్ధురాలు మృతిమోత్కూరు : అనుమానాస్పద స్థితిలో ఓ వృద్ధురాలు నీటి సంపులో పడి మృతి చెందింది. ఈ సంఘటన మోత్కూరు పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో శుక్రవారం చోటు చేసుకుంది. మండల ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన కూరెళ్ల పాపమ్మ(62) అనే వృద్ధురాలు తన ఇంటి ఎదుట ఉన్న నీటి సంపులో (నల్లా గుంత) పడి మృతి చెందింది. కుమారుడు తన తల్లి కనిపించకపోవడంతో వెతకగా నీటి సంపులో పడి ఉండడాన్ని గమనించాడు. వెంటనే అందులోకి దిగి బయటకు తీయడంతో అప్పటికే మృతి చెందింది. కుమారుడు పరమేష్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా ఎస్ఐ కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. బంగారంతో టీ20 ప్రపంచ కప్ భువనగిరి : అమెరికాలోని న్యూయార్క్లో ఈనెల 2వతేదీ నుంచి జరుగనున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఓ స్వర్ణకారుడు బంగారంతో సూక్ష్మసైజులో టీ20 ప్రపంచ కప్ను తయారు చేసి అబ్బురపర్చాడు. పట్టణానికి చెందిన చోల్లేటి శ్రీనివాసచారి బంగారం, వెండితో సూక్ష్మసైజులో వివిధ రకాల వస్తువులు తయారు చేయడంలో ప్రావీణ్యుడు. ఇందులో భాగంగా గతంలో క్రికెట్ స్టేడియం, పార్లమెంట్ భవనం, పీసా టవర్, హరితహారం, ఐసీసీ కప్, బంగారు బతుకమ్మ, వరల్డ్ కప్లను తయారు చేశాడు. తాజగా అమెరికాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ను రూ.4వేలు ఖర్చు చేసి శుక్రవారం రోజు మొత్తం శ్రమించి 500 మిల్లీగ్రాముల బంగారంతో ఆఫ్ ఇంచ్ ఎత్తుతో తయారు చేశారు. -
No Headline
నల్లగొండ : తెలంగాణ పౌర స్పందన వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ‘ప్రభుత్వ బడులు నిలబడాలి.. చదువులో అంతరాలు పోవాలి’ అనే నినాదంతో ముద్రించిన కరపత్రాలను శుక్రవారం ఎన్జీ కళాశాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పౌర స్పందన వేదిక జిల్లా అధ్యక్షుడు పాల్వాయి అంజిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఒక గది, ఒక ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడు ఉండాలన్నారు. అంతరాలు లేని చదువు అందాలంటే ప్రభుత్వ పాఠశాలలను పెంచి అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో కె.రాఫెల్, కె.మదుసూదన్, ఎస్.వెంకట్రెడ్డి, ఎడ్ల సైదులు, పెరుమాళ్ల వెంకటేశం, శేఖర్రెడ్డి, నరసింహ పాల్గొన్నారు. -
‘వైటీపీఎస్’లో చోరీ కేసులో నిందితుల అరెస్టు
నల్లగొండ క్రైం : దామరచర్ల మండలంలోని వైటీపీఎస్ (యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్)లో జీఐ వైర్, అల్యామినియం షీట్ల దొంగతనం చేసిన 11మంది నిందితులను నల్లగొండ జిల్లా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.కోటి 49లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. 4జీఐ వైర్ బండిల్, 58లక్షల నగదు, బెలినో కారు, 2బైక్లు, ఓఆటోను రికవరీ చేశారు. అందుకు గల వివరాలను నల్లగొండ ఎస్పీ చందనా దీప్తి శుక్రవారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దామరచర్ల వైటీపీఎస్ ప్రాజెక్టులో భారీ నిర్మాణాలు జరుగుతున్నాయని అందుకు అవసరమైన పరికరాలను భారీ ఎత్తున ప్రాజెక్టు పరిధిలోని భూమిలో నిల్వ చేసారని, ఏడాదిన్నర కాలంగా 11మంది ముఠా సభ్యులు జీఐ వైర్ అల్యూమినియం షీట్లను డీసీఎం వాహనాల్లో చోరీ చేసి హైదరాబాద్లో అమ్మినట్లు తెలిపారు. వైటీపీఎస్ పనులు నిర్వహిస్తున్న బీహెచ్ఈఎల్, ఇతర నిర్మాణ సంస్థలకు చెందిన సెక్యూరిటీ సిబ్బంది, క్రేన్ డ్రైవర్ సాయంతో చోరీలకు పాల్పడ్డారని, దీంతో సంస్థ నిర్వాహకులు వాడపల్లి పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేయగా మూడు కేసులు నమోదు చేసి ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి నిందితులు ప్లాంట్ ప్రాంతంలో రహస్యంగా సమావేశమైనట్లు అందిన సమాచారం మేరకు అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. చోరీ చేసిన జీఐ వైర్లను తుక్కుగా మార్చి హైదరాబాద్లోని ముషిరాబాద్కు చెందిన షర్పోద్దీన్కు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన నిందితులు.. మిర్యాలగూడలోని ఎన్ఎస్పీ క్యాంపుకు చెందిన షేక్ మహ్మద్, షేక్ మునీర్, దామరచర్ల మండలం ఇర్కిగూడెంకు చెందిన కంబాల అశోక్, వీర్లపాలెం గ్రామానికి చెందిన మందా శ్రీను, మందా నాగేంద్రబాబు, మిర్యాలగూడలోని తాళ్లగడ్డకు చెందిన షేక్ రజాక్, శాంతినగర్కు చెందిన మహ్మద్జాని, గాంధీనగర్ బాలికల హైస్కూల్ ప్రాంతానికి చెందిన మంద మహేష్, వాడపల్లి కేంద్రానికి చెందిన మహ్మద్ అప్రోజ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మావు జిల్లాలోని పుర గ్రామానికి చెందిన అమిత్కుమార్ భరద్వాజ్, బలియా జిల్లాలోని కొరావులి గ్రామానికి చెందిన రవీంద్రప్రసాద్ ఉన్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని మరికొందరు నిందితులు దొరికే అవకాశం ఉందని విచారించి అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు. కేసు చేధించిన పోలీసులను ఈ సందర్భంగా ఆమె అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ రాములునాయక్, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్రాజు, మిర్యాలగూడ రూరల్ సీఐ వీరబాబు, వాడపల్లి ఎస్ఐ రవి, వేములపల్లి ఎస్ఐ విజయ్కుమార్, మాడ్గులపల్లి ఎస్ఐ శోభన్బాబు, సీసీఎస్ హెడ్కానిస్టేబుల్ విష్ణు ఉన్నారు. ఫ రూ.కోటి 49లక్షల విలువైన సొత్తు స్వాధీనం ఫ ఏడాదిరన్న కాలంగా చోరీలకు పాల్పడుతున్న దుండగులు ఫ కేసు వివరాలు వెల్లడించిన నల్లగొండ ఎస్పీ చందనా దీప్తి -
అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య
కేతేపల్లి : అప్పుల బాధ తాళలేక ఓ యువ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన మండలంలోని భీమారం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అవిరెండ్ల ఉపేందర్ (30) తనకున్న ఎకరం పొలంతో పాటు మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని పంట సాగు చేశాడు. పంట ఆశించిన దిగుబడి రాకపోవడంతో పెట్టుబడి, కుటుంబ అవసరాలకు తెచ్చిన అప్పులు అధికమయ్యాయి. దీంతో కొంతకాలంగా తీవ్ర మనోవేదనలో ఉన్న ఉపేందర్ గురువారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని కుటుంబీకులు చికిత్స నిమిత్తం హుటాహుటిన సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నకిలీ సర్టిఫికెట్తో వైద్యం చేస్తున్న వ్యక్తి అరెస్ట్
కోదాడ రూరల్: నకిలీ సర్టిఫికెట్ సృష్టించి ఆస్పత్రి ఏర్పాటు చేసి వైద్యం చేస్తున్న ఓ డాక్టర్పై కోదాడ పట్టణ పోలీస్స్టేషన్లో శుక్రవారం కేసు నమోదైంది. స్థానిక సీఐ రాము తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన వన్నా యశ్వంత్కుమార్ ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ చదివాడు. అయితే అతడు రాష్ట్రంలో వైద్యం చేయాలంటే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే వైద్యం చేయాల్సి ఉంటుంది. కానీ అతడు పలుమార్లు ఆ పరీక్షను రాసిన ఉత్తీర్ణత సాధించలేక పోయాడు. రాష్ట్రంలో ఎలాగైనా అస్పత్రిని ఏర్పాటు చేయాలని భావించి స్టేట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందెందుకు సంబంధిత మోడల్పత్రాలను డౌన్లోడ్ చేసుకున్నాడు. దానిలో వివరాలను మార్చి ఫోర్జరీ చేసి నకిలీ సర్టిఫికెట్ను తయారు చేశాడు. ఆ సర్టిఫికెట్లతో కోదాడ పట్టణంలోని హుజూర్నగర్రోడ్లో ఓ ఆస్పత్రిని ఏర్పాటు చేసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే అతడు ఆ ఫోర్జరీ సర్టిఫికెట్స్తో డీఎంహెచ్ఓకు ఆస్పత్రి రిజిస్టేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. వాటిని తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వైబ్సైట్లో పరిశీలించగా ఆ సర్టిఫికెట్స్ రిజిస్ట్రేషన్ నంబర్లు జి.యశ్వంత్కుమార్, చల్మెడ ఆనందరావు పేరుతో ఆయా యూనివర్సిటీల పేర్లు చూపిస్తున్నాయి. దీంతో అతను తప్పుడు ధృవీకరణ పత్రాలను సృష్టించి ఆస్పత్రి నడుపుతున్నాడని డీఎంహెచ్ఓ కోటాచలం కోదాడ పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో సదరు డాక్టర్పై ఫోర్జరీ, చీటింగ్ కేసు నమోదుచేసి అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. -
అంబులెన్స్ లేక.. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మహిళ మృతి
డిండి : సరైన సమయంలో వైద్యం అందక ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన శుక్రవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. డిండి పట్టణానికి చెందిన తాటికొండ పార్వతమ్మ(42)కు గురువారం సాయంత్రం కడుపునొప్పి రావడంతో స్థానికంగా ఓ ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించుకుంది. అతడు మెరుగైన చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించాడు. అప్పటికే పార్వతమ్మకు కడుపునొప్పి తీవ్రమై సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో ఆందోళనకు గురైన భర్త దామోదర్ మెరుగైన చికిత్స నిమిత్తం దాదాపు 40కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని ఓప్రైవేట్ ఆస్పత్రికి తరలించేందుకు 108అంబులెన్స్ను ఆశ్రయించాడు. కాని మండలంలో ఇప్పటి వరకు 108అంబులెన్స్ లేకపోగా ఆశ్రయించిన ప్యాసింజర్ ఆటో కూడా అందుబాటులో లేక ఆలస్యమైంది. చాలా సేపటి తర్వాత ఆటోలో పార్వతమ్మను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. చేసేదేమి లేక భర్త దామోదర్ అదే ఆటోలో తిరిగి తన భార్య మృతదేహాన్ని ఇంటికి తీసుకవచ్చిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టిచింది. మండల కేంద్రంలోని పీహెచ్సీలో 108అంబులెన్స్ ఏర్పాటు చేయాలని 10సంవత్సరాల నుంచి పలుమార్లు ప్రజాప్రతినిధులు, సంబంధిత జిల్లా ఉన్నతాధికారులకు వినతులు అందించినా అంబులెన్స్ సౌకర్యం కల్పించకపోవడంతో ఎంతో మంది నిరుపేదల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని 108అంబులెన్స్ను డిండికి అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. హత్య కేసులో వ్యక్తి రిమాండ్చిట్యాల : మంత్రాల నేపంతో వృద్ధుడిని ఇటీవల హత్య చేసిన ఘటనలో ఓ వ్యక్తిని గుర్తించి శుక్రవారం రిమాండ్ చేసినట్లు నార్కట్పల్లి సీఐ నాగరాజు, చిట్యాల ఎస్ఐ సైదాబాబు తెలిపారు. వివరాల ప్రకారం.. మండలంలోని గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన జవ్వాజీ సాయిలు(75) మంత్రాలు చేస్తుండటంతోనే తనకు కలిసి రావడం లేదని వరుసకు మనవడు అయిన జవ్వాజీ శ్యాం అనుమానిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో శ్యాం అనుమానం పెంచుకుని గురువారం వ్యవసాయ బావి వద్ద ఉన్న సాయిలు తలపై గొడ్డలితో నరికి హత్య చేశాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో విచారణ చేపట్టి సాక్ష్యాలను విచారించిన ఆనంతరం శ్యాంను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ చేసినట్లు వారు వెల్లడించారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
చౌటుప్పల్ : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని తూప్రాన్పేట గ్రామశివారులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని ఎల్బీనగర్ మన్సూరాబాద్కు చెందిన బత్తుల కృష్ణారెడ్డి(32) తన పనినిమిత్తం ద్విచక్రవాహనంపై గురువారం చౌటుప్పల్కు వచ్చాడు. పని ముగించుకుని అదే రోజు రాత్రి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో తూప్రాన్పేట గ్రామ శివారులో తనద్విచక్రవాహనాన్ని నిలిపి ఓ హోటల్లో టీ తాగేందుకు రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ వైపు నుంచి వేగంగా వచ్చిన ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిని కృష్ణారెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తల్లి రమాదేవి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్రెడ్డి తెలిపారు. లారీ ఢీకొని.. భువనగిరి క్రైం : లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన పట్టణంలోని నల్లగొండ–భువనగిరి రోడ్డుపై గల బైపాస్ సమీపంలో చోటు చేసుకుంది. పట్టణ ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన పొత్తంశెట్టి వీరస్వామి (39) రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా నల్లగొండ నుంచి వస్తున్న ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టణ ఎస్ఐ నాగరాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
జీవ నియంత్రణ పద్ధతులతో చీడపీడల నివారణ
వైరస్ ఆధారిత జీవరసాయనాలు : పొగాకు లద్దె పురుగు, శనగపచ్చ పురుగు నివారణకు వైరస్ ద్రావణం సమర్థంగా నివారిస్తుంది. పత్తి, శనగలో ఆశించే శనగపచ్చ పురుగు నివారణ కోసం ఎకరాకు 250ఎల్ఈ కందిలో 500 ఎల్ఈ వాడాలి. లద్దె పురుగు నివారణకై ఎకరాకు 100నుంచి 200 ఎల్ఈ లద్దె పురుగు ఎన్పీవీ వాడుకోవాలి. నిమటోడ్ ఆధారిత జీవరసాయనాలు : వాటిని చెరుకు, ఇతర పంటల్లో వేరు పురుగు, శనగపచ్చ పురుగు, కొబ్బరిలో ముక్కు పురుగు నివారణకు వాడతారు. హెక్టారుకు 250–750కోట్ల నిమటోడ్ బీజాలు ఉండే పొడి(ఒక కిలో) కానీ ద్రావణం(ఒక లీటరు) కానీ వాడుకొని పురుగులను సమర్థంగా తగ్గించుకోవచ్చు ఈ మందును వాడేటప్పుడు నెలలో తగినంత తేమ శాతం ఉండేలా చూసుకోవాలి. గరిడేపల్లి : ప్రకృతిలో పరాన్నజీవులు, బదనికలు, కొన్ని రకాల వైరల్, బాక్టీరియల్, ఫంగల్ వ్యాధులు పంటలపై వచ్చే చీడపీడల ఉధృతిని తగ్గించుకోవడాన్ని జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా సస్యరక్షణ చేసుకోవడం అని చెప్పవచ్చు. గరిష్ట విషప్రభావం కలిగిన పురుగు మందులను విచక్షణా రహితంగా పిచికారీ చేయడంతో పర్యావరణంలో ఉన్న పరాన్నజీవులు, బదినికలు పూర్తిగా నాశనమవుతున్నాయి. చీడపురుగులు ఈ మందులకు తట్టుకొనే శక్తిని సంతరించుకొని వాటిని అదుపు చేసే శత్రు పురుగులు పంట పొలాల్లో నాశనం అవడంతో తిరిగి విజృంభిస్తున్నాయి, కాబట్టి చీడపురుగులను అదుపులో ఉంచడానికి తక్కువ విషప్రభావం గల మందులను అవసరాన్ని బట్టి వినియోగిస్తే కొంత వరకు ఈ పరాన్నజీవులు, బదనికలను కాపాడుకుంటూ వాటి ద్వారా వచ్చే లాభాన్ని కూడా పొందవచ్చని సూచనలు చేస్తున్నారు కేవీకే శాస్త్రవేత్త ఆదర్శ్. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే... జీవ నియంత్రణను సమగ్ర సస్యరక్షణలో ఒక ముఖ్యమైన సాధనంగా వాడుకోవచ్చని, పురుగు మందుల అవశేషాలు లేకుండా సేంద్రియ పద్ధతుల ద్వారా పండించిన ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ దృశ్యా ఇటీవల కాలంలో జీవ నియంత్రణ పద్ధతుల ప్రాముఖ్యత మరింత పెరిగిందనే చెప్పవచ్చు. జీవ నియంత్రణ పద్ధతులను రసాయనిక పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా వాడటంతో పర్యావరణ సమతుల్యత కూడా పాటించబడుతూ రైతులకు పురుగు మందుల అవశేషాలు లేని నాణ్యత గల ఉత్పత్తులను సాధింవచ్చన్నారు. జీవనియంత్రణ ఉత్పత్తుల వాడకంతో వాతావరణ కాలుష్యం తగ్గడమే కాకుండా పంటల పెట్టుబడులు తగ్గి వ్యవసాయ ఉత్పత్తుల్లో పురుగు మందుల అవశేషాలు కూడా తగ్గుతాయి. జీవనియంత్రణ సాధనాలు, ఉత్పత్తుల వివరాలు, వాడకం ఈ క్రింది విధంగా ఉంటుంది. గుడ్డు పరాన్నజీవులు : ఇవి శత్రుపురుగుల గుడ్లను ఆశించి, వాటిని నాశనం చేసి తద్వారా అభివృద్ధి చెందుతాయి. వీటిని ట్రైకోకార్డు రూపంలో పొలంలో వాడుకోవచ్చు. కార్డులను ఆకు అడుగు భాగంలో పిన్నుతో అమర్చుకోవాలి. ట్రైకోకార్డులతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● పొలంలో కార్డులు పెట్టే ఒక వారం ముందు, వారం తరువాత రసాయనిక పురుగు మందులు పిచికారీ చేయరాదు, కార్డుల మధ్య దూరం 5మీ.ఉండేలా చూసుకోడాలి. ● లార్వా పరాన్నజీవులు, ప్యూపా పరాన్నజీవులు కూడా సహజంగా పొలంలో ఉంటాయి. కానీ కృత్రిమంగా ప్రయోగశాలలో పెంపొందించి వాడడం అన్నది ప్రాచుర్యంలో లేదు. ప్రకృతిలో సహజంగా జీవనియంత్రణ ప్రక్రియ జరుగుతూ ఉంటే హానికారక పురుగులు అదుపులో ఉంటాయి. రసాయన క్రిమిసంహారక మందులను విచక్షణారహితంగా లేదా మోతాదుకు మంచి వాడిన మిత్రపురుగుల సంఖ్య క్రమేపి తగ్గడంతో చీడపీడల ఉధృతి పెరిగి, పంటలకు అపార నష్టం కలుగుతుంది. వాతావరణ సమత్యులత కూడా దెబ్బతింటుంది. మిత్ర పురుగుల సంఖ్య, వైవిధ్యత పెంపొందించాలంటే రసాయనేతర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఉదా : రెక్కల పురుగుల ఉధృతి తెలుసుకోవడానికి ఎకరాకు 4–5 లింగాకర్షక బుట్టలు అమర్చుకోవాలి. ఆ తర్వాత సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. రసం పీల్చే పురుగుల నివారణ కోసం ఎకరాకు 30జిగురు అట్టలు అమర్చుకోవాలి. వేపనూనె 1500 పీపీఎం ఎకరాకు లీటరు పిచికారీ చేసుకుంటే లార్వా దశలు, రసంపీల్చే పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. అంతేకాదు పొలంలో అంతర పంటలు సరిహద్దు పంటలు ఎర పంటలు వేసుకొని పంటల వైవిధ్యాన్ని పెంచుకోవాలి. బవేరియా బాసియానా : ఇది శనగపచ్చ పురుగు, లద్దె పురుగు, తెల్లదోమ, పేను, వరిలో సుడిదోమ నివారణకు ఉపయోగపడుతుంది. లైకానిసిలీయం లెకాని : రసం పీల్చే పురుగులు అనగా పేనుబంక, పచ్చదోమ, తెల్లదోమ, తామర పురుగు, నల్లి, పిండినల్లి నివారణకు ఉపయోగపడుతుంది. మెటారైజియం అనైసోషియే : మొక్కజొన్నలో కత్తెర పురుగు, మిడతలు, చెరుకు మరియు ఇతర పంటల్లో వేరుపురుగు, కొబ్బరిలో కొమ్ము పురుగులను సమర్థవంతంగా నివారిస్తుంది. బాక్టీరియా ఆధారిత జీవరసాయనాలు : బాసిల్లస్ తురింజెనిసిస్ అన్న ఈ జీవకీటక నాశిని రెక్కల పురుగుల లార్వా దశలను నాశనం చేస్తుంది. (ఉదా : లద్దెపురుగు, శనగపచ్చ పురుగు, నామాల పురుగు, డైమండ్ బాక్మాత్, కత్తెర పురుగు, బెండ, వంగలో కాయ తొలిచే పురుగు) పొడి రూపంలో ఉండే ఈ మందులను ఎకరాకు 400గ్రామ లేదా ధ్రవ రూపంలో లభ్యమయ్యే మందును 400మి.లీ వాడుకోవాలి. ఫ రైతులకు అవగాహన కల్పిస్తున్న కేవీకే శాస్త్రవేత్త ఆదర్శ్ జీవ రసాయనాలు : హానికార పురుగుల నాశించే సూక్ష్మజీవులను కృత్రిమంగా ప్రయోగశాలలో తయారు చేసి పొడి రూపంలో అమ్ముతారు. వాటిని సరైన మోతాదులో నీటిలో కలిపి పొలంలో పిచికారీ చేసుకొని హానికారక పురుగుల నివారించుకోవచ్చు. వాటిని పొలంలో సాయంత్రం సమయంలోనే పిచికారీ చేయాలి. వాటిలో పలు రకాలున్నాయి. శిలీంధ్ర ఆధారిత జీవరసాయనాలు : శత్రు పురుగులను ఆశించి, నాశనం చేసే గుణం కలవి, పొడిరూపంలో లభ్యమయ్యే వీటిని లీటరు నీటికి 5గ్రా (ఎకరాకు కిలో) చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. -
నిబద్దతతో పనిచేసిన అధికారి కొండల్రావు
నల్లగొండ టౌన్ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా నిబద్దత, అంకితభావంతో పని చేసి వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమాలను విజయవంతం చేయడం ద్వారా డాక్టర్ అనిమళ్ల కొండల్రావు గుర్తింపు పొందారని కలెక్టర్ దాసరి హరిచందన పేర్కొన్నారు. శుక్రవారం నల్లగొండలో నిర్వహించిన ఉద్యోగ విరమణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని కొండల్రావు దంపతులను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఉద్యోగ విరమణ తర్వాత కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యంతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. డైరెక్టర్ ఆఫ్ హెల్డ్ డాక్టర్ రవీందర్నాయక్ మాట్లాడుతూ కొండల్రావు పలు జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేసి మంచి గుర్తింపు పొందారని పేర్కొన్నారు. వైద్య విధాన పరిషత్ రాష్ట్ర కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ మాట్లాడుతూ కొండల్రావు జిల్లా అధికారిగా సిబ్బంది ప్రజలతో మమేకమై వారి సమస్యలపై, ప్రజారోగ్య సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి పేరు ప్రఖ్యాతులను పొందారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఎంహెచ్ఓ కళ్యాణచక్రవర్తి, డీసీఎస్హెచ్ డాక్టర్ మాతృ, ప్రోగ్రాం అధికారులు అరుంధతి, వేణుగోపాల్రెడ్డి, హరికృష్ణ, కేశ రవి, పద్మ, గీతావాణి, నాగిల్ల మురళి, జె.శేఖర్రెడ్డి, శ్రవణ్కమార్, ముజీబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ దాసరి హరిచందన -
పలువురికి బీఆర్ అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డు
హాలియా : హాలియా పట్టణానికి చెందిన అనుముల ప్రాథమిక పాఠశాల ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం జటావత్ చంద్రుడునాయక్ జాతీయస్థాయి బీఆర్ అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపికయ్యాడు. సమాజంలో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న సేవకులకు కల్చరర్, సోషల్ ఆర్గనైజేషన్ (కళానిలయం) తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సమర్పణ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురష్కరించుకొని ఈ అవార్డు అందజేసినట్లు ఆయన శుక్రవారం వెల్లడించారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా గురుకుల కోచింగ్ శిక్షణ ఇవ్వడం, దాతల సహకారంతో పాఠశాల్లో మౌలిక వసతులు కల్పించడం, పాఠశాల్లో ఎన్రోల్మెంట్ పెంచడం వంటి తదితర సేవలకు గుర్తింపుగా చంద్రుడునాయక్కు ఈ అవార్డును అందజేశారు. హైదరాబాద్లోని చిక్కడపల్లిలో శ్రీ త్యాగరాయగాన సభలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు తెలంగాణ కొంకటి లక్ష్మీనారాయణ, కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యులు డాక్టర్ ఎస్సీ భారతి, డైరెక్టర్ శివ కంఠమనేని, జబర్దస్త్ కమెడియన్ సహతేజ్, కళానిలయం సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు పుష్పలత, సురేందర్ చేతుల మీదుగా చంద్రుడునాయక్ ఈ అ వార్డు అందుకున్నాడు. చంద్రుడునాయక్కు అవార్డు రావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అభినందించారు. ‘మిర్యాల’ విద్యార్థులకు అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డు మిర్యాలగూడ టౌన్ : హైదరాబాద్లోని చిక్కడపల్లి త్యాగరాజ గానభలో ఈనెల 30న కళానిలయం కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 133 కళాకారులచే తెలుగుబుక్ ఆఫ్ రికార్డు కోసం నిర్వహించిన కార్యక్రమంలో మిర్యాలగూడలోని విజయ్ డ్రాయింగ్ క్లాసెస్కు చెందిన 12మంది విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా వారికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డులు లభించినట్లు చిత్రకారుడు యినుగుర్తి దుర్గాప్రసాద్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. అవార్డు అందజేసిన వారిలో ప్రముఖులు దైవజ్ఞాశర్మ, మెంబర్ సెంట్రల్ గేట్ సంగీత నాటక ఆకాడమి డాక్టర్ ఎస్పీ భారతీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ, నిర్వాహకులు సురేందర్ తదితరులు పాల్గొన్నట్లు వెల్లడించారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
రామగిరి(నల్లగొండ) : తాళం వేసిన ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం తిప్పర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు ప్రకారం.. చిన్నాయిగూడెం గ్రామానికి చెందిన బైరగోని శ్రీను వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడు బంధువు అంత్యక్రియలకు ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం వెళ్లాడు. ఈ క్రమంలో సోదరి భాగ్యమ్మ శుక్రవారం ఇంటిని శుభ్రం చేసేందుకు వచ్చి చూసే సరికి తాళం పగలగొట్టి ఉంది. వెంటనే ఆమె శ్రీనుకు సమాచారం ఇవ్వగా ఇంటికి వచ్చి చూసే సరికి బీరుగా తాళం పగలగొట్టి, బట్టలు చిందరవందరగా పడివేసి ఉండడాన్ని గుర్తించి బీరువాలో చూడగా ఐదున్నర తులాల బంగారం, 15తులాల వెండి, రూ.56వేలు, భూమి పాస్ పుస్తకాలు, బ్యాంక్ పాస్ పుస్తకాలు, పాస్పోర్టుతో సహా చోరీ జరిగినట్లు గుర్తించాడు. వెంటనే మండల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్లూస్ టీం సభ్యులు ఇంటిని పరిశీలించి వివరాల సేకరించి కేసు నమోదు చేశారు. -
శాలిగౌరారం ఎస్ఐపై ఎస్పీ, డీజీపీకి ఫిర్యాదు
శాలిగౌరారం : మండల ఎస్ఐ ప్రవీణ్కుమార్ను విధుల నుంచి తొలగించడంతో పాటు అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మండలంలోని ఊట్కూరు గ్రామానికి చెందిన యంపల్ల పురుషోత్తంరెడ్డి, రైతు యానాల మల్లారెడ్డి శుక్రవారం వేర్వేరుగా ఎస్పీ చందనాదీప్తి, డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను రిజిస్టర్ పోస్టులో పంపించినట్లు వారు తెలిపారు. ఈ విషయంపై పురుషోత్తంరెడ్డి మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఈనెల 23న మండల కేంద్రంలో ఓ ఇంటర్నెట్ షాప్ వద్ద తన వ్యక్తిగత పనులను చేసుకొంటుండగా గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నాపై హత్యాయత్నం చేశారని, తనపై జరిగిన సంఘటనపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటూ ఫిర్యాదులో మార్పులు చేయాలని, ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలని ఎస్ఐ బెదిరింపులకు పాల్పడుతున్నారని వెల్లడించారు. ఫిర్యాదు చేసి పదిరోజులు గడిచినా నేటికి కేసు నమోదు చేయకపోగా పోలీస్స్టేషన్కు రావద్దని బెదిరించినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా ఊట్కూరు గ్రామానికి చెందిన యానాల మల్లారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు పట్ల కేసు నమోదు చేయకుండా నేరస్తులతో కుమ్మకై ్క అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఫిర్యాదుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఫిర్యాదులను పట్టించుకోని ఎస్ఐను విధుల నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ఫిర్యాదులో విన్నవించినట్లు వారు తెలిపారు. -
తప్పిపోయిన చిన్నారిని కుటుంబ సభ్యులకు అప్పగింత
బీబీనగర్ : పక్కింట్లోకి ఆడుకోవడానికి వెళ్లిన ఓ చిన్నారి గురువారం తప్పిపోయింది. ఈ ఘటన మండలంలోని వెంకిర్యాల గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మహామ్మద్ అజిత్ కూతురు మహమ్మద్ ముస్కాన్ (3) తన ఇంట్లో నుంచి పక్క ఇంట్లోకి ఆడుకోవడానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చుట్టు పక్కలా వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు శుక్రవారం మండల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీస్ సిబ్బంది, చిన్నారి బంధువులు కలిసి వెతుకుతుండగా ఇంటికి కొద్ది దూరంలోని గల పాడిగేదెల షెడ్ వద్ద ఉన్న పనిమనుషుల వద్ద ఆడుతూ కనిపించడంతో గమనించిన పోలీస్లు ముస్కాన్ను తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. దీంతో విషయం తెలుసుకున్న డీసీపీ రాజేష్చంద్ర స్టేషన్కు చేరుకొని ముస్కాన్ కుటుంబ సభ్యులను పిలిపించగా చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. -
రాష్ట్రంలో వడదెబ్బకు 8 మంది మృతి
చిట్యాల/ హాలియా/కాసిపేట/చొప్పదండి/ములుగు/మహబూబాబాద్/వరంగల్/మునుగోడు: రాష్ట్రంలో వడదెబ్బకు గురై వేర్వేరు ప్రాంతాల్లో శుక్ర వారం ఒక్కరోజే ఎనిమిది మంది మృతి చెందారు. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగ్గురు మృతి చెందగా నల్లగొండ జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. నల్లగొండ జిల్లాలోని అనుముల మండలంలోని కొత్తపల్లికి చెందిన బచ్చు ముకుందరెడ్డి(55) బైక్పై వ్యవసాయ పనిముట్ల కోసం ఉదయం నల్ల గొండ పట్టణానికి వెళ్లి పనిచూసుకుని ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలో వడదెబ్బకు గురయ్యాడు.చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా..మార్గమధ్యంలోనే అతడు మృతి చెందాడు. ఇదే జిల్లాలో ఏపీలోని పశి్చమగోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన కర్రి రాజు(40), భార్య దీనమ్మ తమ ముగ్గురు పిల్లలతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మధ్యాహ్నం నల్లగొండ జిల్లా చిట్యాల బస్టాండ్లో రామన్నపేటకు వెళ్లేందుకు రాజు బస్సుకోసం ఎదురుచూస్తుండగా వడదెబ్బకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు ఇదే జిల్లాకు చెందిన మునుగోడు మండలం ఊకొండి గ్రామానికి చెందిన కమ్మలపల్లి మమత (28) ఉపాధి పనుల నిమిత్తం కూలీ పనులకు వెళ్లి వడదెబ్బకు గురై సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే తోటి కూలీలు 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందింది. మంచినీళ్ల కోసమని కిందికి దిగి... కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలోని బసంత్ నగర్లో నివాసం ఉండే మధ్యప్రదేశ్కు చెందిన జాకీర్ హు స్సేన్(60) అనే లారీ డ్రైవర్ చొప్పదండికి సిమెంట్ లోడ్తో వచ్చాడు. ప్రధాన రహదారిపై ఓ హోటల్ సమీపంలో లారీని ఆపి మంచినీళ్ల కోసమని కిందికి దిగాడు. ఈ క్రమంలో అతడు వడదెబ్బ తగిలి సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే 108 సిబ్బందికి స్థానికులు సమాచారం అందించగా వారు వచ్చి హుస్సేన్ను ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ఇక మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రానికి చెందిన వ్యవసాయ కూలీ దుర్గం భీమయ్య(55) వడదెబ్బతో మృతి చెందాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగ్గురు... మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని ఎస్సీకాలనీకి చెందిన జన్ను ఎల్లమ్మ (50), ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేటకు చెందిన దామెర రాంబాబు(48) వడదెబ్బకు గురై మృతి చెందారు. అదేవిధంగా వరంగల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన పల్లకొండ ఐలయ్య(74) రోజువారీగా పందులు మేపడానికి వెళ్లి ఎండ తీవ్రతతో వడదెబ్బ తగిలి మృతిచెందాడు. -
అమెరికా స్పెల్లింగ్ బీ విజేతగా తెలుగు విద్యార్థి
అగ్రరాజ్యం అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ 'స్పెల్లింగ్ బీ' పోటీల్లో ఈ ఏడాది కూడా భారత సంతతి విద్యార్థుల హవానే కొనసాగింది. ఈ ఏడాది జరిగిన 96వ స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీలో ఏడుగురు ఫైనలిస్టులను ఓడించి విజేతగా నిలిచాడు భారత సంతతి విద్యార్థి బృహత్ సోమ. కేవలం 90 సెకన్లలో అబ్సెయిల్ సహా 29 పదాలను అలవోకగా తప్పుల్లేకుండా చెప్పి..కప్ తోపాటు 50 వేల డాల నగదు బహుమతిని కూడా గెలుచుకున్నాడు. ఫ్లోరిడాకు చెందిన 12 ఏళ్ల బృహత్ సోమ ప్రస్తుతం ఏడో గ్రేడ్ చదువుతున్నాడు. అతడి తండ్రి శ్రీనివాస్ సోమ నల్గొండకు చెందినవారు. ఈ ఏడాది స్పెల్లింగ్ బీ పోటీల్లో దాదాపు 240 మందికి పైగా పాల్గొన్నారు. అందులో ఏడుగురు గురువారం రాత్రికి ఫైనల్కు చేరుకున్నారు. ఇక వారిలో బృహత్ సోమకి, టెక్సాస్కు చెందిన పైజాన్ జాకీ మధ్య టై ఏర్పడింది. దీంతో ఇద్దరికీ మరో రౌండ్ పోటీ నిర్వహించి 90 సెకన్ల సమయాన్ని కేటాయించారు నిర్వాహకులు. ఈ పోటీలో జాకీ 90 సెకన్లలో 20 పదాలు చెప్పగా, బృహత్ ఏకంగా 29 పదాలు చెప్పి టైటిల్ని సొంతం చేసుకున్నాడు. 2022లో జరిగిన పోటీల్లో భారత సంతతికి చెందిన హరిణి లోగాన్ 90 సెకన్లలో 22 పదాల స్పెల్లింగ్లు చెప్పగా, ఆ రికార్డును బృహత్ బ్రేక్ చేశాడని నిర్వాహకులు తెలిపారు. అంతేగాదు బృహత్ గతంలో 2022లో స్పెల్లింగ్ బీలో 163వ స్థానానికి చేరురోగా, 2023లో 74వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. కానీ ఈ ఏడాది మాత్రం బృహత్ టైటిల్తో సత్తా చాటాడు. ఇక రన్నరప్గా నిలిచిన జాకీ 25 వేల డాలర్ల ప్రైజ్మనీని అందుకున్నాడు. ఇక ఈ పోటీల్లో శ్రేయ్ పరీఖ్ రెండోవ స్థానంలో నిలవగా, అనన్య రావు మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక అమెరికా ఈ స్పెల్లింగ్ బీ పోటీలను 1925 నుంచి నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు ఈ పోటీల్లో 29 మంది భారత సంతతి విద్యార్థులు ఛాంపియన్లుగా నిలిచారు. (చదవండి: US: పోర్ట్ ఆఫ్ ఎంట్రీ.. ఒక విషమ పరీక్షే!) -
చెరువు శిఖం ఆక్రమిస్తే చర్యలు తప్పవు
ఫ హద్దులు నిర్ణయించేందుకు మూడు టీంల ఏర్పాటు ఫ సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ మిర్యాలగూడ: చెరువు శిఖం భూములను ఆక్రమించినట్లయితే చర్యలు తప్పవని సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ హెచ్చరించారు. మిర్యాలగూడ పరిధిలో చెరువు శిఖం భూములు కాజేస్తున్నారని ‘చెరువుల చదును!’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పందించారు. మిర్యాలగూడ పట్టణ శివారులోని యాద్గార్పల్లి పందిర్లపల్లి చెరువును గురువారం సర్వే అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే ల్యాండ్ రికార్డ్స్ ప్రకారం హద్దులు నిర్ణయించేందుకు ఇరిగేషన్ అధికారులతో కలిసి మూడు టీంలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పందిర్లపల్లి చెరువును పూర్తిగా సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తామని చెప్పారు. ఆయన వెంట డీఐ బాలాజీ, సర్వేయర్ ఖాద్రి, ఆర్ఐలు సత్యనారాయణ, రామకృష్ణ తదితరులు ఉన్నారు.
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
బీచ్ ఒడ్డున చెత్త ఎత్తిన హీరోయిన్ పూజా హెగ్డే
రెండేళ్లలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం.. ఇక ముందు: దీపక్ చహర్ భావోద్వేగం (ఫొటోలు)
బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎఫ్డీ.. వడ్డీ ఎంతంటే?
Ind vs Ban: ఇలాంటి పిచ్లకు అలవాటు పడాలి: రోహిత్ శర్మ
12 ఏళ్ల క్రితం.. చెప్పులేసుకుని ఇక్కడ నిలబడ్డా.. వెయ్యి రూపాయలతో..
జగన్ సీఎం కాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు..
‘ప్రజా తీర్పు’ అంటే టీడీపీకి ఎందుకు భయం?: రావెల
అందం ఆరోగ్యం కలగలిపిన సిరి : కలబంద
‘జట్టును సర్వనాశనం చేశారు.. వాళ్లను విడదీశారు’
‘గం..గం..గణేశా’తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే..?
Advertisement