వైఎస్సార్‌సీపీలో భారీగా చేరికలు | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో భారీగా చేరికలు

Published Mon, May 6 2024 9:00 AM

వైఎస్సార్‌సీపీలో భారీగా చేరికలు

మారేడుమిల్లి : మండలంలోని టీడీపీ, జనసేన, కాంగ్రెస్‌ పార్టీల నేతలు, కార్యకర్తలు ఆదివారం వైఎస్సార్‌సీపీలో భారీగా చేరారు. కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు డాక్టర్‌ పి.హరికృష్ణ, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు నల్లమిల్లి రామారెడ్డి, టీడీపీ సీ నియర్‌ నేత గురుకు వెంకటేశ్వరరావు, ఆ పార్టీకి చెందిన వార్డు మెంబర్లు బోరగా విజయలక్ష్మి, నల్లమిల్లి సూబ్బారెడ్డి, మాజీ వార్డు మెంబర్‌ దయామణి, నాయకులు లక్కొండ లాభాన్‌, పల్లాల విజయ, లక్కొండ పరమయ్య, మైనారిటీ సెల్‌ నాని, జనసేనకు చెందిన గడే ధర్మతేజ, మల్లెల హరిబాబు తదితరులు సుమారు వంద మందితో వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్సీ అనంతబాబు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గొర్లె బాలాజీ బాబు, పార్టీ మండల కన్వీనర్‌ సత్తి సత్యనారాయణ రెడ్డి, వైస్‌ ఎంపీపీ లక్కొండ రవికుమార్‌, కోఆప్షన్‌ సభ్యుడు గురుకు ధర్మరాజు, జేసీఎస్‌ మండల కన్వీనర్‌ గొర్లె అనిల్‌ ప్రసాద్‌ (బాబీ), ఉపసర్పంచ్‌ వీరబాబు, ఏఎంసీ డైరెక్టర్‌ దూడ స్మిత్‌, విక్టర్‌ బన్ను, కే. సురేష్‌, బి.సురేష్‌, సతీష్‌, అనిదీప్‌ కుమార్‌ పాల్గొన్నారు.

టీడీపీ, జనసేన, కాంగ్రెస్‌ పార్టీల నేతలకు కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్సీ అనంతబాబు

Advertisement
 
Advertisement