ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా తగ్గని మంచు
● కొనసాగుతున్న చలి తీవ్రత
చింతపల్లి: మన్యంలో ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నా మంచు తీవ్రత మాత్రం తగ్గడం లేదు. చలి ప్రభావం కొనసాగుతోంది. శనివారం జి.మాడుగులలో 9.8 డిగ్రీలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. పాడేరు డివిజన్ పరిధిలోని గూడెంకొత్తవీధిలో 10.5 ,అరకువేలీలో 11.1, చింతపల్లిలో 11.5, డుంబ్రిగుడలో 12.3, హుకుంపేటలో 12.5, పాడేరులో 12.6, పెదబయలులో 13.3, ముంచంగిపుట్టులో 14.0, అనంతగిరిలో 14.5, కొయ్యూరులో 15.4 డిగ్రీలు నమోదు అయినట్టు ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment