విశాఖ డివిజన్‌లోనే కేకే లైన్‌ కొనసాగించాలి | - | Sakshi
Sakshi News home page

విశాఖ డివిజన్‌లోనే కేకే లైన్‌ కొనసాగించాలి

Published Fri, Feb 7 2025 1:57 AM | Last Updated on Fri, Feb 7 2025 1:56 AM

విశాఖ డివిజన్‌లోనే కేకే లైన్‌ కొనసాగించాలి

విశాఖ డివిజన్‌లోనే కేకే లైన్‌ కొనసాగించాలి

కేంద్ర మంత్రి అశ్విని వైష్టవ్‌కు ఎంపీ తనూజ రాణి వినతి

సాక్షి, పాడేరు: కేకే లైన్‌ను విశాఖ డివిజన్‌లోనే కొనసాగించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు అరకు ఎంపీ డాక్టర్‌ గుమ్మా తనూజరాణి వినతి పత్రం అందజేశారు. పార్లమెంట్‌ భవన్‌లో కేంద్ర మంత్రిని ఎంపీ మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను వివరించారు. విశాఖ పర్యాటక భూభాగంలో అరకులోయ ఉందని.. కేకే లైన్‌ను విశాఖ రైల్వే డివిజన్‌లో ఉంచడం వల్ల అరకులోయ, కిరండూల్‌ రైల్వే లైన్లు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు. తల్లిలాంటి వాల్తేరు డివిజన్‌ నుంచి కేకే లైన్‌ను వేరే చేయడం అంటే తల్లి నుంచి బిడ్డను వేరుచేయడమేనని అన్నారు. రాయగడ డివిజన్‌లో కేకే లైన్‌ను విలీనం చేసే చర్యలను పునఃపరిశీలించాలని కేంద్ర మంత్రికి ఎంపీ విన్నవించారు.

అరకులోయలో రిక్వెస్ట్‌ స్టాప్‌ సమస్య పరిష్కారం

ఎంపీ డాక్టర్‌ గుమ్మా తనూజరాణి చొరవతో అరకులోయలో రైల్వే రిక్వెస్టు స్టాప్‌ సమస్య పరిష్కారమైంది. కేంద్ర మంత్రికి ఈ సమస్య గురించి కూడా అరకు ఎంపీ సమగ్రంగా వివరించారు. దీంతో కేంద్ర మంత్రి సంబంధిత రైల్వే అధికారులతో మాట్లాడారు. అరకులోయలో రిక్వస్ట్‌స్టాప్‌ను త్వరితగతిన ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి వైష్ణవ్‌ ఫోన్‌లో అధికారులను ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement