విశాఖ డివిజన్లోనే కేకే లైన్ కొనసాగించాలి
● కేంద్ర మంత్రి అశ్విని వైష్టవ్కు ఎంపీ తనూజరాణి వినతి
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కు వినతిపత్రం అందజేస్తున్న అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి
సాక్షి, పాడేరు : కేకే లైన్ను విశాఖ డివిజన్లోనే కొనసాగించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి వినతి పత్రం అందజేశారు. పార్లమెంట్ భవన్లో కేంద్ర మంత్రిని ఎంపీ మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను వివరించారు. విశాఖ పర్యాటక భూ భాగంలో అరకులోయ ఉందని.. కేకే లైన్ను విశాఖ రైల్వే డివిజన్లో ఉంచడం వల్ల అరకులోయ, కిరండూల్ రైల్వే లైన్లు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయ ని వివరించారు. తల్లిలాంటి వాల్తేరు డివిజన్ నుంచి కేకే లైన్ను వేరే చేయడం అంటే తల్లి నుంచి బిడ్డను వేరుచేయడమేనని వాపోయారు. రాయగడ డివిజన్లో కేకే లైన్ను విలీనం చేసే చర్యలను పునఃపరిశీలించాలని కేంద్ర మంత్రికి ఎంపీ విన్నవించారు. ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి చొరవతో అరకులోయలో రైల్వే రిక్వెస్టు స్టాప్ సమస్య పరిష్కారమైంది. కేంద్ర మంత్రికి ఈ సమస్య గురించి కూడా అరకు ఎంపీ సమగ్రంగా వివరించారు. దీంతో కేంద్ర మంత్రి సంబంధిత రైల్వే అధికారులతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment