ఆర్‌ఈసీఎస్‌ ఎండీగా ప్రసాద్‌ | - | Sakshi
Sakshi News home page

ఆర్‌ఈసీఎస్‌ ఎండీగా ప్రసాద్‌

Published Fri, Feb 7 2025 2:00 AM | Last Updated on Fri, Feb 7 2025 1:59 AM

ఆర్‌ఈసీఎస్‌ ఎండీగా ప్రసాద్‌

ఆర్‌ఈసీఎస్‌ ఎండీగా ప్రసాద్‌

కశింకోట: కశింకోటలోని గ్రామీణ విద్యుత్‌ సహకార సంఘం (ఆర్‌ఈసీఎస్‌) ఎండీగా ఏపీఈపీడీసీఎల్‌ అనకాపల్లి సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు. ఆర్‌ఈసీఎస్‌కు పర్సన్‌ ఇన్‌చార్జిగా ప్రస్తుతం జిల్లా కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ వ్యవహరిస్తున్నారు. ఆమె ఆదేశాల మేరకు పూర్తి ఆర్‌ఈసీఎస్‌ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రసాద్‌ నియమితులయ్యారు. జిల్లా కలెక్టర్‌ పర్సన్‌ ఇన్‌చార్జిగా నియామకం కాక ముందు సహకార శాఖకు చెందిన శ్యామల పర్సన్‌ ఇన్‌ఛార్జి, ఎండీలుగా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు ఏపీఈపీడీసీఎల్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ను ఎండీగా నియమించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement