● కక్కలపల్లి మండీలో
కిలో రూ.132 పలికిన వైనం
అనంతపురం అగ్రికల్చర్: సామాన్యులకు అందకుండా కొండెక్కి కూర్చున్న టమాట దిగిరానంటోంది. గురువారం అనంతపురం శివారు కక్కలపల్లి మండీలో కిలో టమాట గరిష్ట ధర రూ.132 మేర పలికినట్లు రాప్తాడు మార్కెట్ కమిటీ సెక్రటరీ రామ్ప్రసాద్ తెలిపారు. మార్కెట్కు 105 టన్నుల కాయలు అమ్మకానికి రాగా వాటిని వేలం వేశామన్నారు. అందులో కిలో గరిష్టంగా రూ.132, కనిష్టంగా రూ.100, సరాసరిన రూ.116 ప్రకారం క్రయ విక్రయాలు జరిగాయని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment