జగన్‌ హయాంలో 39.34 లక్షల ఇళ్లకు కొళాయిలు | 39. 34 lakh households in rural Andhra Pradesh to get tap connection in ys jagna govt | Sakshi
Sakshi News home page

జగన్‌ హయాంలో 39.34 లక్షల ఇళ్లకు కొళాయిలు

Published Mon, Feb 10 2025 3:39 AM | Last Updated on Mon, Feb 10 2025 7:39 AM

39. 34 lakh households in rural Andhra Pradesh to get tap connection in ys jagna govt

లోక్‌సభకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం ఇళ్లు  95,53,169

2019 ఆగస్టు 15కు ముందు కొళాయిలు ఉన్న ఇళ్లు  30,74,310

2019 ఆగస్టు 15–2024 మే మధ్య కొత్తగా నీటి కొళాయిలు ఏర్పాటైన ఇళ్లు  39,34,705

కూటమి ప్రభుత్వం వచ్చాక కొళాయిలు ఏర్పాటైన ఇళ్లు 36,210

ఇంకా కొళాయిలు ఏర్పాటు చేయాల్సిన ఇళ్లు  25,07,944

సాక్షి, అమరావతి: తాగు నీటి(Drinking water) కోసం గ్రామీణ ప్రాంతాల ప్రజలు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. దూర­ంలోని బావులు, చెరువుల నుంచి తోడి తెచ్చుకొంటుంటారు. అవీ ఎండితే నీరే దొరకని పరిస్థితి. గ్రామీణ ప్రజల దుస్థితిని అర్ధం చేసు­కున్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి(YS Jaganmohan Reddy).. నీటి కోసం ఇల్లు దాటి వెళ్లే అవసరం లేకుండా ఇంటింటికీ తాగు నీటి కొళాయి ఏర్పాటు చేయించారు. గ్రామీణ ప్రజల నీటి వెత­లను తీర్చారు. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఈ విషయాన్ని లోక్‌సభకు తెలిపింది.

కేంద్ర జల శక్తి శాఖకు చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ అండ్‌ శానిటేషన్‌ లోక్‌సభకు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 95.53 లక్షల ఇళ్ల ఉన్నాయి. 2019 ఆగస్టు 15 వరకు.. అంటే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 72 సంవత్సరాల వరకు రాష్ట్రంలోని ప్రస్తుత 26 జిల్లాల పరిధిలో 30.74 లక్షల ఇళ్లకు మాత్రమే అప్పటి ప్రభు­త్వాలు తాగు నీటి కొళా­యిలు ఏర్పాటు చేశాయి.

 2019లో వైఎస్‌ జగన్‌­ ప్రభు­త్వం వచ్చిన తర్వాత ఐదేళ్లలో కొత్తగా మరో 39.34 లక్షల ఇళ్లకు తాగు నీటి కొళాయిలు అందుబాటులోకి వచ్చినట్టు పేర్కొంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా 25.08 లక్షల ఇళ్లకు మాత్రమే కొళాయిలు ఏర్పాటు చేయా­ల్సి ఉందని పేర్కొంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 8 నెలల్లో కేవలం 36 వేల ఇళ్లకే కొళాయిలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం
ఇంటింటికీ తాగు నీటి కొళాయి ఏర్పాటు చేస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మంజూరు చేసిన వేల కోట్ల రూపాయల విలువైన రక్షత మంచి నీటి పనులను రద్దు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇంటింటికీ తాగునీటి కొళాయి ఏర్పాటు చేసే లక్ష్యంతో వైఎస్‌ జగన్‌ ప్రభు­త్వం మంజూరు చేసిన రూ. 11,400 కోట్ల రక్షిత తాగునీటి పథకాల పనులను రద్దు చేసింది. ఇదే­మని అడిగితే కొత్త అంచనాలు తయారు చేసి మళ్లీ టెండర్లు పిలుస్తామంటూ సాకులు చెబుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement