భద్రాచలంటౌన్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న జీపీఎస్ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖ ప్రైమరీ స్కూళ్లలో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టిన మౌలిక వసతుల పనుల ప్రగతిపై డీఈలు, ఏఈలతో శుక్రవారం పీఓ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలల్లో తాగునీరు, మైనర్ రిపేర్లు, ఫ్లోరింగ్, ప్లాస్టరింగ్ పనులు పూర్తిచేయాలని, పిల్లల సంఖ్యకు తగిన టాయిలెట్స్, బాత్రూంలు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. దసరా సెలవులు ముగిసేలోగా పనులన్నీ పూర్తి చేయాలన్నారు. భద్రాద్రి జిల్లాలో ఈ నెల 14 వరకు పనులు పూర్తి చేసి, బిల్లులు ఈ నెల 31 లోగా, ఖమ్మం జిల్లాలో జరుగుతున్న పనులు ఈ నెల 31 వరకు పూర్తి చేసి, నవంబర్ 10 లోగా బిల్లులు చెల్లించాలన్నారు. పనుల్లో జాప్యం జరిగితే ఏఈలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధానమంత్రి ఆది ఆవాస్ యోజన కింద జరుగుతున్న పనుల్లో కూడా జాప్యం లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ తానాజీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్
Comments
Please login to add a commentAdd a comment