గాంధీ ఆసుపత్రి: గాంధీ ఆస్పత్రి నుంచి పసికందు( 2 రోజులు) ఆపహరణకు గురి కావడం సంచలనం సృష్టించింది. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యహరించి శిశువు కిడ్నాప్ను కొద్ది గంటల్లోనే ఛేదించి చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. చిలకలగూడ ఇన్స్పెక్టర్ అనుదీప్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రమేష్ గౌడ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నల్గొండ జిల్లా, గుండాల మండలం, మోత్కూర్ గ్రామానికి చెందిన సుభాన్, షాహినా దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మూడోసారి గర్భం దాల్చిన షాహినాకు నొప్పులు రావడంతో ఈ నెల 24న ఉదయం గాంధీ ఆసుపత్రి లోని మాతా శిశు సంరక్షణ కేంద్రం ( ఎంసీహెచ్) లో అడ్మిట్ చేశారు. అదే రోజు ఉదయం ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది. బుధవారం ఉదయం షాహినాకు కొన్ని పరీక్షలు చేయాల్సి ఉండడంతో చిన్నారిని అక్కడే వదిలేసి వెళ్లింది. ఆమె తిరిగి వచ్చే సరికి బాబు కనిపించక పోవడంతో ఆసుపత్రి వర్గాల సహాయంతో అవుట్ పోస్టులో ఫిర్యాదు చేశారు. రంగం లోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ఒక మహిళ బాబును అపహరించినట్లు గుర్తించారు. ఫొటో ఆధారంగా ఆమెను నాచారంలో నివసిస్తున్న బీహార్కు చెందిన పూజాదేవిగా గుర్తించిన పోలీసులు నేరుగా ఆమె ఇంటికి వెళ్లి నిందితురాలని ఆదుపులోకి తీసుకోవడంతో పాటు చిన్నారిని గాంధీ ఆసుపత్రిలో ఉన్న తల్లిదండ్రులకు అప్పగించారు. ఈస్ట్జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య పర్యవేక్షణలో చిలకలగూడ ఏసీపీ జైపాల్ రెడ్డి, ఇన్స్పెక్టర్ అనుదీప్, డీఐ రమేష్ గౌడ్, ఎస్ఐలు బాలరాజ్, కిషోర్, మహిళా కానిస్టేబుళ్లు మేఘమాల, ధనలక్ష్మి చాకచక్యంగా వ్యహరించి కొద్ది గంటల్లోనే కేసును చేధించినందుకు ఉన్నతాధికారులు అభినందించారు.
గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు
మహిళ అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment