లక్డీకాపూల్: హైదరాబాద్ను చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దడానికి జీహెచ్ఎంసీ విశేష కృషి చేస్తోంది. ఈ మేరకు నగరంలో గుట్టలుగా పడిఉన్న లెగసీ వేస్ట్ (పేరుకుపోయిన చెత్త) తొలగింపునకు 21 రోజుల కార్యాచరణను జీహెచ్ఎంసీ రూపొందించింది. తొలిగా బుధవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 8వ తేదీ వరకు కొనసాగుతుంది. నగరంలో చెత్త రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, జీహెచ్ఎంసీ వినూత్న ఆలోచనలతో పరిశుభ్రమైన నగరాన్ని తయారు చేసేందుకు చర్యలు చేపడుతోంది. ప్రస్తుత ప్రణాళికల్లో లెగసీ వేస్ట్ తొలగింపుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
నగరంలోని రహదారులు, డ్రైన్లు, పార్కులు, వాటర్ వర్క్స్, విద్యుత్ శాఖ పనుల కారణంగా పేరుకుపోయిన చెత్తను సక్రమంగా తొలగించేందుకు సర్కిల్ స్థాయిలో ఈ డ్రైవ్ను చేపడుతున్నారు. ఈ క్రమంలో లేగసీ వేస్ట్తో పాటు భవన నిర్మాణ వ్యర్థాలను కూడా తొలగించేందుకు సర్కిల్ స్థాయిలో జేసీబీలు, తరలింపు వాహనాలు, మానవ వనరులను వినియోగిస్తారు. ఈ ప్రక్రియను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసేందుకు అధికారులు జీపీఎస్ సిస్టంను ఉపయోగించాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment