పార్టీ విజయానికి పాటుపడాలి | Sakshi
Sakshi News home page

పార్టీ విజయానికి పాటుపడాలి

Published Fri, Apr 19 2024 1:50 AM

రాయికల్‌: జీవన్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన ఆర్‌ఎంపీలు - Sakshi

రాయికల్‌/సారంగాపూర్‌/మెట్‌పల్లి: కాంగ్రెస్‌ అభ్యర్థి అయిన తన గెలుపునకు కార్యకర్తలు అండగా ఉండాలని నిజామాబాద్‌ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. రాయికల్‌ పట్టణ ఆర్‌ఎంపీలు జీవన్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించాలన్నారు. ఆర్‌ఎంపీలు అస్లాం, దాసరి గోవర్దన్‌, బైరి సుకేశ్‌, సద్దుల సంతోష్‌, దాసరి విద్యాసాగర్‌, పట్టణ అధ్యక్షుడు మ్యాకల రమేశ్‌ పాల్గొన్నారు. సారంగాపూర్‌ మండలం రేచపల్లి మాజీ సర్పంచ్‌ ఎడమల జయ, లక్ష్మారెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఈనెల 22న నామినేషన్‌ కార్యక్రమానికి భారీగా జన సమీకరణ చేయాలన్నారు. విండో చైర్మన్‌ ఏలేటి నర్సింహ్మారెడ్డి, మాజీ జెడ్పీటీసీ భూక్య సరళ, ఎడమల శైలేందర్‌రెడ్డి, బేర మహేశ్‌ పాల్గొన్నారు, మెట్‌పల్లిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ బర్ల సాయన్న తన అనుచరులతో కాంగ్రెస్‌లో చేరగా జీవన్‌రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం చెప్పినా బీఆర్‌ఎస్‌, బీజేపీ రాద్ధాంతం చేస్తున్నాయన్నారు.

Advertisement
Advertisement