కాంగ్రెస్ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి, నాగర్కర్నూల్ అభ్యర్థి మల్లురవికి మద్దతుగా టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. రేవంత్ సొంత జిల్లా కావడంతో వీరి గెలుపు బాధ్యతలను ఆయన తన భుజాలపై వేసుకున్నారు. ఈ మేరకు కొడంగల్, కోస్గి, మద్దూరు, మహబూబ్నగర్, నారాయణపేట, బిజినేపల్లిలో రోడ్ షోలు, కార్నర్ మీటింగులు, బహిరంగసభల్లో పాల్గొన్నారు. తాజాగా శనివారం ఆయన మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధి దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కొత్తకోటకు రానున్నారు. రోడ్ షోతో పాటు కార్నర్ మీటింగ్లో మాట్లాడనున్నారు. వచ్చే వారం మక్తల్ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment