శాంతినగర్: కొందరు బ్యాంకు అధికారులు, మధ్యవర్తులు కుమ్మకై ్క రైతుల నుంచి లంచం తీసుకొని రుణాలు ఇస్తున్నారని, మధ్యవర్తుల ద్వారా లంచం ఇచ్చిన వారికి మాత్రమే రుణాలు ఇస్తూ మిగతా వారికి మొండిచేయి చూపుతున్నారని ఇదేం పద్ధతి అని రైతులు ఆందోళనకు దిగారు. గురువారం శాంతినగర్ ఏపీబీవీబీ బ్యాంకు ఎదుట వడ్డేపల్లి మండలంలోని జూలెకల్ రైతులు ధర్నా చేపట్టారు. పలువురు మాట్లాడుతూ.. వడ్డేపల్లి మండలంలోని జూలెకల్ గ్రామస్తులకు ఏపీజీవీబీ ద్వారా క్రాప్లోన్లు ఇవ్వాల్సి వుంటుందని, లోన్కొరకు నేరుగా బ్యాంకుకు వెళ్లిన రైతులకు రుణాలు ఇవ్వకుండా ఆయా గ్రామాలకు చెందిన బ్రోకర్ల ద్వారా తీసుకువెళ్లిన ఫైళ్లకు మాత్రమే రుణాలు ఇస్తున్నారని, క్రాప్లోన్లకు కూడా లంచం ఇచ్చి రుణాలు తీసుకునే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈవిషయమై బ్యాంక్ మేనేజర్కు వినతిపత్రం సమర్పించిన రైతులు బ్యాంకు ఎదుట ధర్నా చేపట్టారు. బ్యాంకుకు వచ్చే రైతులకు అన్ని డాక్యుమెంట్లు చూసి అర్హులైన వారందరికి నేరుగా రుణాలు ఇవ్వాలని, లేని పక్షంలో అన్ని గ్రామాల రైతులతో కలిసి ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు వెంకటేష్, జూలెకల్ రైతులతోపాటు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
బ్యాంకు ఎదుట రైతుల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment