అలంపూర్: ఉత్తమ సేవలతోనే గుర్తింపు దక్కుతుందని, ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదోన్నతులు, బదిలీలు సర్వసాధారణమని పలువురు జడ్జీలు, న్యాయవాదులు అన్నారు. అలంపూర్ నుంచి వనపర్తికి పదోన్నతితో కూడిన బదిలీపై వెళ్తున్న జూనియర్ సివిల్ కోర్టు జడ్జి కమలాపురం కవితకు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సురేష్ కుమార్ అధ్వర్యంలో శుక్రవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. జడ్జిని న్యాయవాదులు శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా జడ్జి కమలాపురం కవిత మాట్లాడుతూ.. అలంపూర్లో విధులు నిర్వహించే సమయంలో పదోన్నతి పొందడం సంతోషంగా ఉందన్నారు. అలంపూర్ను ఎప్పటికి మర్చిపోలేనని పేర్కొన్నారు. అలాగే, గద్వాల మొదటి అదనపు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఉదయ్నాయక్కు అలంపూర్ జూనియర్ సివిల్ కోర్టు ఇన్చార్జ్ జడ్జిగా బాధ్యతలు అప్పగించగా.. ఆయనను న్యాయవాదులు శాలువాతో సత్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కుమార్ మాట్లాడుతూ.. పదోన్నతి బదిలీపై వెళుతున్న న్యాయ మూర్తి మూడేళ్లుగా అలంపూర్ కోర్టులో అనేక కేసులు పరిష్కరించి సేవలందించారని కొనియాడారు. కార్యక్మరంలో ఏజీపీ మధు, మాజీ ఏజీపీ నర్సింహులు, న్యాయవాదులు నారాయణ రెడ్డి, యుదుర్ బాష, తిమ్మారెడ్డి, నాగరాజు యాదవ్, శ్రీనివాసులు, ఆంజనేయులు, గజేందర్ గౌడ్, వెంకటేష్ తదితరులు ఉన్నారు.
జడ్జి బదిలీ కార్యక్రమంలో న్యాయవాదులు
Comments
Please login to add a commentAdd a comment