డ్రైవర్లు, కండక్టర్లతో పాటు ఇతర ఉద్యోగుల సమష్టి కృషితో దసరా పండగ రోజుల్లో రీజియన్కు మెరుగైన ఆదాయం వచ్చిందని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వి.శ్రీదేవి తెలిపారు. శుక్రవారం ఆమె రీజినల్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా ప్ర యాణికుల సౌకర్యార్థం అదనపు బస్సులు నడిపామని తెలిపారు. ముఖ్యమైన కేంద్రాల్లో ఆయా విభాగాల ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించి ప్రయాణికులు గమ్యస్థానాల్లో చేర్చేలా చూశామని తెలిపారు. ప్రజలు ఆర్టీసీని ఆదరించడం వల్ల మంచి ఆదాయాన్ని సాధించి నట్లు చెప్పారు. శబరిమలై కోసం రీజియన్లోని అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతామని, అయ్య ప్పస్వాములు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఎలాంటి డిపాజిట్ లేకుండా ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకోవచ్చని తెలిపారు. దసరా పండుగను పురస్కరించుకొని ప్రత్యేక బస్సులకు 25 శాతం అదనపు చార్జీలు వసూలు చేసినట్లు చెప్పారు. హైదరాబాద్కు వెళ్లే ప్రత్యేక బస్సులకే మాత్రమే చార్జీలు పెంచామన్నారు. పండగ వేళల్లో వన్ వే ట్రాఫిక్ ఉంటుందని, రెండో వేలో ఉండదని, అందువల్లే కొంచెం నామమాత్రపు చార్జీలు పెంచి తీసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్లు లక్ష్మి ధర్మ, శ్యామల, డిపో మేనేజర్ సుజాత పాల్గొన్నారు.
సమష్టి కృషితో మెరుగైన ఆదాయం : ఆర్ఎం
Comments
Please login to add a commentAdd a comment