బాన్సువాడ రూరల్ : మండలంలోని బోర్లంక్యాంపుతండా జీపీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం పద్మపాణి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పశుపోషణ, యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయానికి అనుబంధంగా పశుపోషణను కొనసాగించి, ఆర్థికాభివృద్ది సాధించాలన్నారు. పశువులకు వచ్చే గాలికుంటు, గర్భకోశ వ్యాధుల నివారణకు ఎప్పటికప్పుడు నివారణ టీకాలు ఇప్పించాలన్నారు. పాలదిగుబడి పెరగడానికి నాణ్యమైన గ్రాసం ఎంతో ముఖ్యం కాబట్టి, దీనికోసం లూజర్న్, అజోల్ల, సూపర్నెయర్ మిక్సర్లను పశువులకు అందించాలన్నారు. సంస్థ ప్రతినిధులు భూపతి, రైతులు సంజీవ్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, రాంచందర్, దత్తురాం, పవన్, వినయ్, జీపీ కార్యదర్శి పరిపూర్ణ, అంగన్వాడీ టీచర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
పరిసరాలను శుభ్రంగా ఉంచాలి
బాన్సువాడ రూరల్ : ప్రతి శుక్రవారం తమ ఇళ్లలోని పాత్రలు, వాటర్ట్యాంకులు, కుండీల్లో నిల్వనీటిని పారబోసి శుభ్రపర్చాలని ఎంపీడీవో బషీరుద్దీన్ అన్నారు. ఫ్రైడే డ్రైడేలో భాగంగా కొల్లూర్, నాగారం గ్రామాల్లో పర్యటించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కార్యదర్శులు నవీన్, సృజన్రెడ్డి, ఎంపీవో సత్యనారాయణరెడ్డి, అంగన్వాడీ, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
మంచినీటి సహాయకులకు శిక్షణ
లింగంపేట(ఎల్లారెడ్డి) : గ్రామ మంచినీటి సహాయకులకు నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం డీఎల్పీవో సురేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. 4 రోజుల పాటు జీపీ సిబ్బందికి శిక్షణ ఇస్తామన్నారు. ఎంపీడీవో నరేశ్, ఎంపీవో మలహరి, ఆర్డబ్ల్యూస్ డీఈ తదితరులున్నారు.
ప్రభుత్వ సలహాదారును కలిసిన ‘రైస్ మిల్లర్స్’
కామారెడ్డి క్రైం : జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రతినిధులు శుక్రవారం జిల్లాకేంద్రంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిశారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, సెక్రెటరీ సంతో
ష్, కోశాధికారి సుదర్శన్, వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణ్, మిల్లర్స్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment