పిట్లం: మండలంలోని పారేడ్పల్లి గ్రామానికి చెందిన కత్తిగామ సాయిలు అనే వ్యక్తి అదృశ్యమైనట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సాయిలు సెప్టెంబర్ 29న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. సాయిలు భార్య చంద్రవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రాజీవ్నగర్లో..
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ కాలనీలో నివాసం ఉండే ఏలేటి అచ్యుత్ కుమార్ అనే వ్యక్తి అదృశ్యమైనట్లు పట్టణ ఎస్హెచ్వో చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. కూలీ పని చేసుకుంటూ జీవించే అతను ఈ నెల 3న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అతని భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో పేర్కొన్నారు.
నకిలీ పాస్పోర్ట్ కేసులో ఇద్దరి అరెస్ట్
కామారెడ్డి క్రైం: నకిలీ పాస్పోర్ట్ కేసులో రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన ఇద్దరిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. రెడ్డిపేటకు చెందిన వాహబ్ మహమ్మద్ తన పేరును హసన్ అబ్దుల్గా మార్చుకుని తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించాడు. వాటితో పాస్పోర్ట్ పొంది కొన్ని రోజుల క్రితం కువైట్ వెళ్లాడు. అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు నకిలీ పాస్పోర్టుగా గుర్తించి విమానంలో అతడిని తిరిగి ఢిల్లీకి పంపించారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగగానే వాహబ్ మహమ్మద్ను ఇక్కడి ఇమిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు. తప్పుడు ధ్రువపత్రాలతో పాస్పోర్ట్ తయారు చేయడంలో రెడ్డిపేటకు చెందిన మరో ఇద్దరు వ్యక్తులు మహమ్మద్కు సహకరించినట్లుగా ఢిల్లీ పోలీసుల విచారణలో తేలింది. వారిని కూడా అరెస్ట్ చేయడానికి రెండు రోజుల క్రితం ఢిల్లీ నుంచి పోలీసులు రెడ్డిపేటకు వచ్చారు. ఈ కేసులో రెడ్డిపేటకు చెందిన శంకర్ నాయక్ను అరెస్ట్ చేయగా మరో జిరాక్స్ సెంటర్ యజమాని పరారీలో ఉన్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment