పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించాలి | - | Sakshi
Sakshi News home page

పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించాలి

Published Fri, Oct 4 2024 1:34 AM | Last Updated on Fri, Oct 4 2024 1:34 AM

పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించాలి

కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజా మాబాద్‌, మెదక్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా తనను గెలిపించాలని మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ కోరారు. ఈ మేరకు గురువారం ఉదయం ఆయన కరీంనగర్‌లోని అంబేడ్కర్‌ స్టేడియంలో ప్రచారం నిర్వహించారు. అంబేడ్కర్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులను కలవగా వారు మద్దతు ప్రకటించారు. ఆయనకు నామినేషన్‌ వేసేందుకు రూ.10,116 విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా రవీందర్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీగా గెలిస్తే అంబేడ్కర్‌ స్టేడియం అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. ప్రతీ పట్టభద్రుడికి ఒక్క రూపాయికే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పథకాన్ని అమలు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు. 2021 నవంబర్‌లోపు డిగ్రీ పూర్తి చేసుకున్నవారు ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. మాజీ కార్పొరేటర్‌ సాదవేణి శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్‌, కెమసారం తిరుపతి, రమణారెడ్డి, పెంచాల కిషన్‌రావు, ఒల్లాల శ్రీనివాస్‌, సర్దార్‌ బిషన్‌ సింగ్‌, కొత్తకొండ శ్రవణ్‌ తదితరులు పాల్గొన్నారు.

మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌

మద్దతు ప్రకటించిన వాకర్స్‌

నామినేషన్‌కు రూ.10 వేల విరాళం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement