వేములవాడ: పంచభూతాలను కాపాడుకునేది బ హుజనులని, కబళించేవి బహుళజాతి కంపెనీ లనీ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్పర్సన్ విమలక్క అన్నారు. వేములవాడలో మంగళవారం జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకలకు హాజరయ్యా రు. మాజీ సర్పంచ్ నరాల సత్తమ్మ–పోశెట్టి నివా సంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ పేర్చారు. అనంతరం తన మెట్టినింటి ప్రాంత యువతులు, మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. మూలవాగులోని బతుకమ్మ తెప్ప వద్దకు చేరుకుని నిమజ్జనోత్సవంలో పాల్గొన్నారు. విమలక్క పాట ను మహిళలు, పురవాసులు ఆసక్తిగా విన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ ఈనెల 2 నుంచి 10 వరకు ఊరూరా ఉద్యమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రకృతిని, వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. రాష్ట్రం మాఫియాల చేతుల్లోకి వెళ్లిపో యి అప్పుల రాష్ట్రంగా మిగులుతుందన్నారు. జనం ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య
చైర్పర్సన్ విమలక్క
వేములవాడలో బతుకమ్మ వేడుకలు
Comments
Please login to add a commentAdd a comment