నవ వివాహిత మృతి
యశవంతపుర: భర్తతో కలిసి బైక్పై వెళ్తున్న నవ వివాహిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ ఘటన ఉడుపి జిల్లా కార్కళ తాలూకా తెల్లారు వద్ద జరిగింది. తెల్లారు గ్రామానికి చెందిన నీక్ష అనే యువతికి రెండు నెలల క్రితం విశాల్ అనే యువకుడితో వివాహమైంది.
దంపతులు బైక్పై వెళ్తుండగా గ్రామ సమీపంలో హొస్మారు వంతెన వద్ద హఠాత్తుగా రోడ్డుకు అడ్డంగా కుక్క వచ్చింది. దానిని తప్పించే యత్నంలో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కలో కిందపడ్డారు. ప్రమాదంలో నీక్షా తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. విశాల్కు చిన్నపాటి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment