గిట్టని వ్యక్తిని పోలీసులకు పట్టించాలని పథకం | - | Sakshi
Sakshi News home page

గిట్టని వ్యక్తిని పోలీసులకు పట్టించాలని పథకం

Published Fri, Feb 7 2025 12:08 AM | Last Updated on Fri, Feb 7 2025 12:08 AM

గిట్టని వ్యక్తిని పోలీసులకు పట్టించాలని పథకం

గిట్టని వ్యక్తిని పోలీసులకు పట్టించాలని పథకం

ఏన్కూరు: ఎవరిపైన అయినా కోపం ఉంటే గొడవ పెట్టుకోవడం, ఘర్షణ పడేవారిని మనం చూస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం జిలెటిన్‌ స్టిక్స్‌ను సదరు వ్యక్తి ఇంట్లో పెట్టి పోలీసులకు పట్టించాలని పథకం పన్నగా.. స్టిక్స్‌ తీసుకెళ్తున్న వ్యక్తే పోలీసులకు చిక్కాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొత్తమేడేపల్లికి చెందిన కొరసం రమేష్‌కు గ్రామానికే చెందిన గంగరాజుతో గొడవలు ఉన్నాయి. దీంతో గంగరాజును పోలీసులకు పట్టించాలని నిర్ణయించుకున్న రమేష్‌ జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లను ఆయన ఇంట్లో పెట్టేందుకు సిద్ధమయ్యాడు. వీటిని కొనుగోలు చేసి ద్విచక్రవాహనంపై వస్తుండగా మండలంలోని జన్నారం క్రాస్‌ వద్ద వద్ద గురువారం చేపట్టిన తనిఖీల్లో పోలీసులు గుర్తించారు. ఈమేరకు రమేష్‌ను విచారించగా విషయం చెప్పడంతో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని ఆయనను రిమాండ్‌ తరలించారు. తనిఖీల్లో ఎస్‌ఐ రఽఫీ, హెడ్‌ కానిస్టేబుల్‌ కొండయ్య, ఉద్యోగులు రవి, సైదా పాల్గొన్నారు.

జిలెటిన్‌ స్టిక్స్‌తో వెళ్తుండగా అరెస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement