వందేళ్ల ఆలయంలో నేడు పునఃప్రతిష్ఠాపన | - | Sakshi
Sakshi News home page

వందేళ్ల ఆలయంలో నేడు పునఃప్రతిష్ఠాపన

Published Fri, Feb 7 2025 12:08 AM | Last Updated on Fri, Feb 7 2025 12:08 AM

వందేళ

వందేళ్ల ఆలయంలో నేడు పునఃప్రతిష్ఠాపన

సత్తుపల్లిటౌన్‌: కోటప్పకొండ రాళ్లు, మైలవరం నుంచి తెప్పించిన ధ్వజస్తంభం, తమిళనాడులోని కుంభకోణంలో రూపొందించిన ఉత్సవ విగ్రహాలు, మహాబలిపురంలో చేయించిన శ్రీ సీతారాముల విగ్రహాలతో సత్తుపల్లిలోని అయ్యగారిపేట రామాలయం కొత్తశోభ సంతరించుకోనుంది. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని ఇటీవల పునర్నిర్మించారు. ఆలయ నిర్వహణకు పూర్వీకులు ఇచ్చిన భూమిని అమ్మగా వచ్చిన నగదుతో పాటు స్థానికుల విరాళాలు కలిపి మొత్తంగా రూ.1.20కోట్లు వెచ్చించారు. ఈ ఆలయంలో శుక్రవారం విగ్రహాల ప్రతిష్ఠాపనకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ బాధ్యులు చల్లగుండ్ల కృష్ణయ్య, నాగళ్ల ప్రసాద్‌, బొంతు చంద్రశేఖర్‌ తెలిపారు.

రూ.1.20 కోట్లతో శ్రీసీతారాముల ఆలయ నిర్మాణం

No comments yet. Be the first to comment!
Add a comment
వందేళ్ల ఆలయంలో నేడు పునఃప్రతిష్ఠాపన1
1/1

వందేళ్ల ఆలయంలో నేడు పునఃప్రతిష్ఠాపన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement