విద్యుత్‌ సిబ్బందికి శిక్షణ | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సిబ్బందికి శిక్షణ

Published Sat, Apr 20 2024 1:20 AM

-

ఏటూరునాగారం: నాణ్యమైన విద్యుత్‌ సరఫరా, సమస్యల నివారణపై విద్యుత్‌ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ మన్సూర్‌ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జేఎల్‌ఎం, ఏఎల్‌ఎం, లైన్‌మెన్‌, లైన్‌ ఇన్స్‌పెక్టర్‌, సీనియర్‌ లైన్‌మెన్‌, ఫోర్‌మెన్‌లకు శిక్షణ, అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వినియోగదారులతో మర్యాదగా మట్లాడుతూ విధులు, బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఈ నాగేశ్వరరావు, ఏడీఈ సుధాకర్‌, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement