● పూర్ణాహుతితో ఘనంగా ముగిసిన
అహోబిల పవిత్రోత్సవాలు
ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రం దిగువ అహోబిలంలో వెలసిన ప్రహ్లాదవరదస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు శనివారం తెల్లవారుజామున పూర్ణాహుతితో ముగిశాయి. శుక్రవారం తెల్లవారుజామున మూలమూర్తులు ప్రహ్లాదవదస్వామి, అమృతవల్లీ అమ్మవార్లను శుప్రభాతసేవతో మేలుకొలిపి దివ్యదర్శనం అనంతరం నిత్యపూజలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదులను యాగశాలలో కొలువుంచి నవకళస్థాపన, అభిషేకం నిర్వహించి నూతన పట్టు పీతాంబరాలతో అలంకరించి కొలువుంచి పవిత్ర హోమం నిర్వహించారు. సాయంత్రం గ్రామోత్సవం, రాత్రి నిత్యపూజ అనంతరం శాంతి హోమాలు నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి, అర్ధరాత్రి అనంతరం ఉత్సవ మూర్తులైన స్వామి అమ్మవార్లకు తిరుమంజనం, సంప్రోక్షణం, శనివారం తెల్లవారుజామున శాత్తుమురై గోష్టితో పవిత్రోత్సవాన్ని ముగించారు. కార్యక్రమాలను అహోబిలం ప్రధానార్చకులు శ్రీమాన్ శఠకోప వేణుగోపాలన్, మణియార్ సౌమ్యానారయన్ ఆధ్వర్యంలో వివిధ ప్రదేశాల నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన వేద పాఠశాలల పండితులు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment