నంద్యాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల లబ్ధిదారులకు విరివిగా రుణాలిచ్చి ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి బ్యాంకర్లు, అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రభుత్వ పథక రుణాల మంజూరుపై జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్తో కలిసి బ్యాంకర్లు, అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. యూనియన్ బ్యాంక్ రీజినల్ మేనేజర్ నరసింహారావు, ఏపీజీబీ రీజినల్ మేనేజర్ వెంకటరమణ, ఫైనాన్స్ లిటరసీ ప్రతినిధి ఆంజనేయులు, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, ఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఇల్లు పరిశ్రమ కావాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమన్నారు. పీఎంఎఫ్ఎంఈ, ముద్ర లోన్లు, చేనేత కార్మికులు, స్వయం సహాయక సంఘాలు, పీఎంఈజీపీ, పశుపోషణ తదితర రుణాలకు సంబంధించి కేటాయించిన లక్ష్యాలను సాధించలేక పోవడానికి కారణాలను విశ్లేషించాలన్నారు. రుణాలు మంజూరులో జాప్యంపై బ్యాంకర్లను ప్రశ్నిస్తూ బ్యాంకుల వారీగా కేటాయించిన లక్ష్యాల పురోగతిపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని లబ్ధిదారులకు రుణాలు మంజూరులో జిల్లాను టాప్ 5లో ఉంచాలన్నారు. కౌలు రైతులకు, పారిశ్రామిక రంగాలకు, పశుపోషణకు, చేపల ఉత్పత్తిదారులకు లక్ష్యానికి మించి రుణాలు అందజేయాలన్నారు. బ్యాంకుల వారీగా లకా్ష్య్ల ప్రగతిపై ప్రతి 15 రోజులకోసారి నివేదికలు అందజేయాలన్నారు. నవంబర్ రెండో వారంలో జరిగే సమావేశానికి 50 శాతం లక్ష్యం పూర్తి కావాలన్నారు.
జిల్లా కలెక్టర్ రాజకుమారి
Comments
Please login to add a commentAdd a comment