బాసర: నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీజ్ఞానసరస్వతీ అమ్మవారి ఆలయానికి శ్రావణ శోభ సంతరించుకుంది. శ్రావణంలో మూడో శుక్రవారం కావడంతో అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ఆ వరణలో సౌభాగ్యలక్ష్మీ వ్రతం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వేకువజామున మహా లక్ష్మీ, సరస్వతీ, మహాకాళీ అమ్మవార్లకు వేద మంత్రోచ్ఛారణల మ ధ్య అభిషేకం, అ ర్చన, విశేష గణపతిపూజ ఘనంగా నిర్వహించారు. భ క్తులు ముందుగా పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలాచరించారు. క్యూలో బారులు తీరి అమ్మవారి ని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి రెండుగంటల సమయపట్టింది. ప్రత్యేక అక్షరాభ్యాస మండపంలో చిన్నారులతో అక్షర శ్రీకార పూజలు చేయి ంచారు. తెలంగాణ నుంచే కాకుండా మహా రాష్ట్ర, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు అధికసంఖ్యలో వచ్చి అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి విజయరామారావు తెలిపారు.
పాల్గొన్న మహిళలు
బాసరకు తరలివచ్చిన భక్తజనం
Comments
Please login to add a commentAdd a comment