● కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్చైన్గేట్: డిజిటల్ కుటుంబ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ కోసం పైలట్ ప్రాజెక్టు కింద నిర్మల్ పట్టణం 42వ వార్డు(చింతకుంట వాడ)లో కొనసాగుతున్న సర్వే ను శుక్రవారం పరిశీలించారు. ముందుగా ఇంటింటి సర్వే ఎన్ని బృందాలతో చేపడుతున్నారని, సర్వే నమోదులో ఏమైనా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయా అని సిబ్బందిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కుటుంబాల ఆధారంగా సర్వే జరుగుతోందని, కొత్త కుటుంబాల వివరాలను ఆధార్ కార్డు ద్వారా నమోదు చేస్తున్నట్లు సర్వే బృందం కలెక్టర్కు తెలిపింది. కుటుంబంలో పెద్ద వయసు కలిగిన మహిళ ఉంటే ఆమె పేరునే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. ఎలాంటి తప్పులు లేకుండా సర్వే చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పైలట్ కింద ఎంపికై న గ్రామాలు, వార్డులో ప్రతీ కుటుంబాన్ని సర్వే చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్అహ్మద్, ఆర్డీ వో రత్నకళ్యాణి, మున్సిపల్ కమిషనర్ రాజు, మెప్మా పీడీ సుభాష్, అధికారులు, పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment