భైంసారూరల్: మండలంలోని వానల్పాడ్, పేండ్పెల్లి, తిమ్మాపూర్ గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం అరగంటపాటు భారీ వర్షం కురిసింది. దీంతో కల్లాల్లో ఆరబెట్టిన సోయా పంట తడిసింది. పొద్దంతా ఎండగా ఉండడంతో రైతులు సోయా ఆరబెట్టారు. ఒక్కసారిగా వచ్చిన వానతో పంట పూర్తిగా తడిసింద. కల్లాల్లో నీరు నిలిచింది.
కుంటాలలో..
కుంటాల: మండలంలోని కల్లూరు, అందకూర్, వేంకూర్, పెంచికల్పాడ్ తదితర గ్రామాల్లోనూ భారీ వర్షం కురిసింది. కల్లూరులో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కల్లూరు 61వ జాతీయ రహదారిపై వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అందకూర్, వేంకూర్ గ్రామాల్లో నూర్పిడికి సిద్ధంగా ఉన్న మొక్కజొన్న, సోయా పంటలు తడిశాయి.
Comments
Please login to add a commentAdd a comment