రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు

Published Sat, Aug 24 2024 12:22 AM | Last Updated on Sat, Aug 24 2024 12:22 AM

రోడ్డ

● ఒకరి పరిస్థితి విషమం

లక్ష్మణచాంద: మండలంలోని నర్సాపూర్‌–ఒడ్డెపెల్లి గ్రామాల మధ్య ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం మామడ నుంచి నిర్మల్‌ వైపు వెళ్తున్న కారు నర్సాపూర్‌–ఒడ్డెపెల్లి గ్రామాల మధ్య జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న ఆటోను, రోడ్డు పక్కన ఉన్న వ్యక్తులను ఢీకొట్టింది. ఎస్సై సుమలత తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నర్సాపూర్‌–ఒడ్డెపెల్లి గ్రామాల మధ్య నర్సాపూర్‌ గ్రామానికి చెందిన పోషన్న మొక్కజొన్న కంకులు అమ్ముతుండగా కడెం నుండి నిర్మల్‌ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన కూలీలు అక్కడ ఆగి కంకులు కొనుగోలు చేస్తున్నారు. అదే సమయంలో భైంసా నుండి మామడ వైపునకు దగడే ప్రకాష్‌ ఆటోలో సామానుతో వెళ్తున్నాడు. ఇదే సమయంలో మామడ నుండి నిర్మల్‌ వైపు కారులో వచ్చిన సారంగాపూర్‌ మండలంలోని వంజర్‌ గ్రామానికి చెందిన దంసం రాంరెడ్డి ముందుగా మొక్కజొన్న కంకులు అమ్మే పోషన్నను, కంకులు కొనుగోలు చేస్తున్న గోవింద్‌ను ఢీకొట్టిన అనంతరం ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టాడు. దీంతో ఆటో డ్రైవర్‌ ప్ర కాష్‌, గోవింధ్‌, పోశన్న కు తీవ్ర గాయాలయ్యా యి, గమనించిన స్థాని కులు 108కు సమాచా రం ఇవ్వడంతో ముందుగా నిర్మల్‌ ఏరియా ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌కు తరలించించారు. గోవింద్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. అజాగ్రత్తగా కారు నడిపి ముగ్గుర్ని గాయపర్చిన రాంరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు 1
1/2

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు 2
2/2

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement