తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి | - | Sakshi
Sakshi News home page

తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి

Published Sat, Aug 24 2024 12:22 AM | Last Updated on Sat, Aug 24 2024 12:22 AM

-

చెన్నూర్‌రూరల్‌: మండలంలోని సుబ్బరాంపల్లిలో తాటిచెట్టు పైనుంచి కిందపడి ముక్కెర సత్యనారాయణగౌడ్‌ (38) అనే గీత కార్మికుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బావురావుపేట గ్రామ పంచాయతీ పరిధిలోని గుండాయిపల్లెకు చెందిన ముక్కెర రాజుబాయి, మధునయ్య దంపతుల కుమారుడు సత్యనారాయణగౌడ్‌ శుక్రవారం తాటికల్లు తీసేందుకు చెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు జారి కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య కనకలక్ష్మి ఉంది. సంఘటనా స్థలాన్ని చెన్నూర్‌ ఎస్సై శ్వేత పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.

మిల్లు యాజమాన్యంపై ఫిర్యాదు

కాగజ్‌నగర్‌ రూరల్‌: ఆరు సంవత్సరాలుగా సిర్పూర్‌ పేపర్‌ మిల్లు యాజమాన్యం మిల్లులో ఎన్నికలు నిర్వహించడంలేదని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో శుక్రవారం లేబర్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని కార్మికశాఖ కార్యాలయంలో కమిషనర్‌ను కలిసి చర్చలు జరిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌సీఎల్‌టీ ఆర్డర్‌ ఇంప్లిమెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. స్థానిక కార్మికులను పర్మినెంట్‌ ఉద్యోగులుగా నియమించాలన్నారు. ఈవిషయమై కమిషనర్‌ సానుకూలంగా స్పందించినట్లు ఆర్‌ఎస్‌పీ పేర్కొన్నారు. ఆయన వెంట నాయకులు లెండుగురె శ్యాంరావు, అంబాల ఓదెలు, నక్క మనోహర్‌, పేపర్‌ మిల్లు యూనియన్‌ నాయకులు ఈర్ల సతీశ్‌, రహీం, శ్రీనివాస్‌, తదితరులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement