నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని దీక్ష జూనియర్ కళాశాలలో అఖిల భారతీయ అయ్యప్ప సేవా ట్రస్ట్, సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 25న మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు బద్రి శ్రీనివాస్, విగ్నేశ్ తెలిపా రు. శుక్రవారం నిర్మల్ ప్రెస్క్లబ్లో వారు విలేకరులతో మాట్లాడారు. దాదాపు 50 కంపెనీలకు పైగా 1,500 పైచిలుకు ఉద్యోగాలతో జాబ్మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 10వ తరగతి నుంచి ఉన్నత విద్య చదివిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంటర్వ్యూకు హాజర య్యే అభ్యర్థులు ధ్రువపత్రాలు వెంట తీసుకురావాలని చెప్పారు. ట్రస్ట్, సేవాసమితి సభ్యు లు జాప ప్రకాశ్, వస్త్రాల శివప్రసాద్, శ్రీనివా స్, కుంటాల సాయినాథ్, అరుణ్కుమార్, అడప నవీన్, మారుతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment