క్రీడలతో మానసికోల్లాసం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో మానసికోల్లాసం

Published Sat, Aug 24 2024 12:26 AM | Last Updated on Sat, Aug 24 2024 12:26 AM

క్రీడ

నిర్మల్‌టౌన్‌: పోలీస్‌ సిబ్బంది ఎప్పుడూ శాంతిభద్రతల విధుల్లో బిజీగా ఉంటారని, వారికి మానసికోల్లాసం కలిగించేందుకు ఆటలు ఎంతో దోహదపడుతాయని ఎస్పీ జానకీ షర్మిల పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి టైగర్స్‌ ట్రోఫీ–2024 క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. పోటీలు రెండు రోజులపాటు కొనసాగనున్నాయి. ఇందులో జిల్లాలోని ఐదు పోలీస్‌ సర్కిల్స్‌ టీంలు, ఒక ని ర్మల్‌ టౌన్‌, ఒక హెడ్‌ క్వార్టర్స్‌ టీం, రెండు బెటా లియన్‌ టీంలు పాల్గొంటున్నాయి. పోటీలను ఎస్పీ ప్రారంభించారు. అనంతరం కాసేపు బ్యాటింగ్‌ చేసి అందరినీ ఆకర్షించారు. టోర్నమెంట్‌ను భైంసా ఏఎస్పీ అవినాష్‌కుమార్‌, నిర్మల్‌ డీఎస్పీ గంగారెడ్డి ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లాలోని ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
క్రీడలతో మానసికోల్లాసం 1
1/1

క్రీడలతో మానసికోల్లాసం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement