నిర్మల్చైన్గేట్: రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు లేకుండా అర్హులైన రైతులందరి పంట రుణాలు మాఫీ చేయాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎంపీ న గేశ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కా ర్యాలయం ఎదుట శుక్రవారం రైతుధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతు ల పక్షాన పోరాడి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి అర్హులందరికీ రుణమాఫీ జరిగేలా చూస్తామని చె ప్పారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ నాయకులు పదవులకు రాజీ నామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్రావు పటేల్, నాయకుడు భూమయ్య తదితరులు పాల్గొన్నారు.
బీజేఎల్పీ నేత ఏలేటి, ఎంపీ నగేశ్
నిర్మల్లో ఒక్కరోజు రైతు ధర్నా
Comments
Please login to add a commentAdd a comment