సాక్షి ప్రతినిధి, విజయవాడ: మద్యం దుకాణం ఏర్పాటు చేయాలంటే అక్కడ ఉన్న ప్రజాప్రతి నిధితో మాట్లాడాల్సిందే. దీంతో మద్యం షాపు పెట్టడానికి భయపడాల్సిన పరిస్థితి సెంట్రల్ నియోజకవర్గంలో ఎదురవుతోంది. ఇలా విజయవాడ సెంట్రల్ టీడీపీ ప్రజాప్రతినిధి బెదిరింపులకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. ఇప్పటికే తన అనుయాయుల ద్వారా ఏక పక్షంగా దరఖాస్తులు చేయించి, అత్యధిక షాపులు దక్కించుకున్నారు. ఇది చాలదన్నట్టు మిగతా వారికి వచ్చిన షాపులను తమ గుప్పెట్లో పెట్టుకొనేందుకు వారిని నయానో, భయానో దారికి తెచ్చుకునేందుకే పావులు కదుపుతున్నారు. మాట విననివారిని ఎకై ్సజ్ అధికారుల ద్వారా షాపు పెట్టొదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీకు ఎన్వోసీ రాదు, ప్రజాప్రతినిధితో మాట్లాడుకోండి, ఆయన షాపులు ఉన్న ఏరియాలో మీరు పెట్టడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేస్తున్నారు. లేదా షాపు పెట్టుకోవాలంటే , పెట్టుబడి లేకుండా 25 శాతం వాటా ఇవ్వండి అంటూ గదమాయిస్తున్నారు. సొంత పార్టీకే చెందిన వ్యక్తికి ఓషాపు వస్తే దానికి కూడా ప్రజాప్రతినిధి తిరకాసు పెట్టడం ఏంటని పలువురు వాపోతున్నారు. సొంతస్థలంలో షాపు పెట్టుకున్నా ఇబ్బందే.
చక్రం తిప్పుతున్న సిండికేట్..
టీడీపీ ప్రజాప్రతినిధి అండతో మద్యం సిండికేట్ చక్రం తిప్పుతోంది. తన సొంత సామాజిక వర్గానికే పెద్ద పీట వేస్తున్నారు.24 గంటలూ మద్యం వ్యాపారం, పక్క వ్యాపారుల మీద తప్పుడు కేసులు, ఫిర్యాదు పెట్టి నిత్యం తోటి వ్యాపారులను వేధించడంలో ‘కీర్తి’ గడించిన వ్యక్తికి ప్రజాప్రతినిధి అండదండలు పుష్కలంగా ఉండటంతో ఆయన చెలరేగిపోతున్నారు. కొత్తగా లాటరీలో లైసెన్స్ దక్కించుకొన్న వ్యక్తులు వీరికి లొంగకపోతే అద్దెకు ఇచ్చిన వారిని బెదిరిస్తున్నారు.
మద్యం షాపు పెట్టాలంటే.. మాట్లాడాల్సిందే
పెట్టుబడి లేకుండా 25% వాటా ఇవ్వాలి
ఎకై ్సజ్ అధికారుల ద్వారా టీడీపీ సెంట్రల్ ప్రజాప్రతినిధి బెదిరింపు! సొంత షాపులో పెట్టుకుంటున్నా అడ్డంకులే
Comments
Please login to add a commentAdd a comment