కృష్ణలంక(విజయవాడతూర్పు): నగరంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో నవంబర్ 15 నుంచి 17వ తేదీ వరకు అమరావతి బాల్సోతవం 7వ పిల్లల పండుగ నిర్వహిస్తున్నట్లు బాలోత్సవం అధ్యక్షుడు ఎస్.పి.రామరాజు పేర్కొన్నారు. రాఘవయ్య పార్కు సమీపంలోని బాల్సోతవ భవన్లో శుక్రవారం ‘పిల్లల పండుగ’ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ విద్యార్థుల మానసిక వికాసానికి, సర్వతోముఖాభివృద్ధికి అమరావతి బాలోత్సవం 2017 నుంచి పిల్లల పండుగను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి సారి ఒక థీమ్ను ఎంపిక చేసుకొని ఆ అంశంపై విద్యార్థుల్లో చైతన్యం కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ సంవత్సరం ప్రగతికి మార్గం–సైన్స్ విజ్ఞానం అనే అంశం థీమ్గా పండుగ నిర్వహిస్తున్నామన్నారు. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ మూడు విభాగాలుగా 43 అకడమిక్, 18 కల్చరల్ అంశాలలో పోటీలు జరుగుతాయన్నారు. మూడు రోజులు జరిగే పిల్లల పండుగలో 200 స్కూళ్ల నుంచి 10 వేల మంది విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లోని 500 స్కూళ్లకు బ్రోచర్స్ అందిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో బాలోత్సవం గౌరవాధ్యక్షుడు చలవాది మల్లికార్జునరావు, ప్రధాన కార్యదర్శి ఆర్.కొండలరావు, ఆఫీస్ బేరర్స్ గుమ్మా సాంబశివరావు, ఎన్.విద్యాకన్నా, వై.సుబ్బారావు, నరసింహారావు, జి.రవీంద్ర, పి.ఐజాక్, యు.వి.రామరాజు పాల్గొన్నారు.
బాలోత్సవం అధ్యక్షుడు ఎస్.పి.రామరాజు
Comments
Please login to add a commentAdd a comment