ఓ భారీ నాగుపాము మరో నాగు పామును అమాంతంగా మింగేసిన ఘటన పలాస రైల్వే కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. రైల్వే కాలనీలో ఎస్సీ, ఎస్టీ కార్యాలయం గేటు దగ్గర రెండు పాముల మధ్య భీకరమైన పోరు జరుగుతున్నట్లు రైల్వే పారిశుద్ధ్య కార్మికులు, స్థానికులు గుర్తించారు. వాటిని దగ్గర నుంచి పరిశీలించగా ఒక పామును మరో భారీ నాగుపాము నోట కరిచి మింగేస్తోంది. ఈ దృశ్యం వారికి గగుర్పాటును కలిగించింది. భారీ నాగుపాము అక్కడే తిష్ట వేయడంతో అటవీ శాఖాధికారులకు స్థానికులు సమాచారమిచ్చారు. కాశీబుగ్గ అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ ఎ.మురళీ కృష్ణమనాయుడు ఆదేశాల మేరకు ఈస్టర్న్ గార్డ్ వైల్డ్ లైఫ్ సొసైటీకి చెందిన స్నేక్ క్యాచర్ ఓంకార్ త్యాడీ భారీ నాగుపామును పట్టుకుని కోసంగిపురం సమీపంలోని అటవీప్రాంతంలో విడిచి పెట్టారు. కోబ్రా జాతి సంతతికి చెందిన సర్పాల మధ్య ఆహార అన్వేషణలో చిన్న పాము పెద్దపాముకు ఆహారం అవడం సాధారణమని అన్నారు. – కాశీబుగ్గ
Comments
Please login to add a commentAdd a comment