రక్తదానం ప్రాణదానంతో సమానం | - | Sakshi
Sakshi News home page

రక్తదానం ప్రాణదానంతో సమానం

Published Mon, Sep 30 2024 12:22 AM | Last Updated on Mon, Sep 30 2024 12:22 AM

రక్తదానం ప్రాణదానంతో సమానం

జయపురం: అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ఎవరూ మరణించకూడదని, ప్రతిఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని రాష్ట్ర ఎస్టీ, ఎస్సీ, దళిత సమాజ్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు మనస్విని టకిరి పిలుపునిచ్చారు. ఆదివారం జయపురం సమితి జయంతగిరి, అంబాగుడ పంచాయతీల పరిధిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ సంఘాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ శిబిరంలో ఆమె మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. అంతకుముందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా 25 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. రక్తదాతలకు ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జయంతిగిరి సర్పంచ్‌ భద్ర పూజారి, త్రినాథ కంఠ, మంగళ తురుక్‌, ఆశారాణి పాత్ర, బాసు నాయిక్‌, గొణి ముదులి, జయ ముదులి, బిశి ముదులి, దిలీప్‌కుమార్‌ హను తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement